Political News

హైదరాబాదీయులకు సూపర్ న్యూస్

సుమారు మూడు నెలల తర్వాత హైదరాబాదు రోడ్లపై సిటీ బస్సులు పరుగెట్టనున్నాయి. ఇప్పటికే రెండున్నర నెలలుగా సిటీ బస్సులు ఆగిపోయాయి. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇక ప్రజారవాణాను ప్రారంభించడానికే తెలంగాణ సిద్ధమైంది. జూన్ 8 నుంచి హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అయితే మునుపటి లాంటి ప్రయాణం ఉండదు. రద్దీగా తిరిగే బస్సులు కనపడవు. సీట్ల వరకే మనుషులు పరిమితం. ఒకప్పుడు కిక్కిరిసి తిరిగిన బస్సులు ఇప్పట్లో అలా కానరావు. …

Read More »

వైసీపీ నేతల నుంచి రంగుల ఖర్చు రాబట్టాలి: చంద్రబాబు

ప్రభుత్వ భవనాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. నాలుగు వారాల్లోపు ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాలని, లేదంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్తులకు వైసీపీ జెండా రంగులు వేయడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వానికి …

Read More »

రంగులపై ఏపీకి సుప్రీంకోర్టు వార్నింగ్, డెడ్ లైన్

YSRCP

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగుల కల ఎక్కడికి పోయినా నెరవేరడం లేదు. తాజాగా చివరాఖరికి ఈ కేసులో సుప్రీం కోర్టు ఏపీ సర్కారుకు గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా 4 వారాల్లోపు ఎట్టి పరిస్తితుల్లో పంచాయతీ భవనాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఒకవేళ డెడ్ లైన్ లోపు ఈ పనిచేకపోతే ఏపీ సర్కారు మీద కోర్టు ధిక్కరణ కేసుల పెడతామని …

Read More »

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు తప్పక చదవాలి

Travel pass

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఒక ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు.. తప్పనిసరిగా పాసులు తీసుకొని మాత్రమే ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అంతర్ రాష్ట్ర రవాణా విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని చెప్పారు. కానీ.. కొన్ని రాష్ట్రాలు తాము …

Read More »

జగన్ ఢిల్లీ టూరు రద్దు వెనుక అంత జరిగిందా?

Jagan Amith

యావత్ దేశం ఇప్పుడు కరోనా మీద.. దాని నియంత్రణ మీద ఫోకస్ పెట్టటం తెలిసిందే. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారికి ఎలా చెక్ పెట్టాలన్న సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఫోకస్ పెట్టాయి. ఇలాంటివేళలో.. ఊహించని రీతిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు.. మరో ఇద్దరు కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వటంతో ఆయన మంగళవారం ఉదయం …

Read More »

ఇసుక పాలసీ చండాలం – వైసీపీ ఎమ్మెల్యే

MLA YSRCP

ఇసుక ఆంధ్రప్రదేశ్ లో బంగారమైపోతోంది. ఆన్ లైన్లో ఎవరికి వారే బుక్ చేసుకునే సులువైన పద్ధతి అయితే ప్రభుత్వం తెచ్చింది. అదే టెక్నాలజీ వాడుకుని ఇసుకను పక్కదారి పట్టిస్తుండటంతో ప్రజలు ఇసుక దొరక్క తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది తెలుగుదేశం ఆరోపణ కాదు. స్వయంగా ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చెప్పిన పచ్చి నిజం ఇది. ఈరోజు జరిగిన జెడ్పీ సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుకపై …

Read More »

యూట్యూబ్ లో పద్యం పాడిన జొన్నవిత్తుల మీద కేసు నమోదు

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై తాజాగా కేసు నమోదైంది. సాత్వికుడిగా పేరున్న ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ కావటం సంచలనంగా మారింది. ఇంతకీ ఆయన చేసిన తప్పేమిటన్న విషయంలోకి వెళితే.. యూట్యూబ్ లో పద్యం పాడటమే నేరమైందన్న మాట వినిపిస్తోంది. ఏంటి? యూట్యూబ్ లో పద్యం పాడి.. అప్ లోడ్ చేసినందుకే కేసు పెడతారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇక్కడ జరిగింది …

Read More »

హైకోర్టు ఈసారి జ‌గ‌న్ స‌ర్కారుకు ఝ‌ల‌క్ ఇవ్వ‌లేదు

YS-Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టు షాక్.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు మ‌రో ఝ‌ల‌క్.. ఇలా గ‌త ఏడాది కాలంలో ఎన్ని వార్త‌లు చూశామో. ఏడాది వ్య‌వ‌ధిలో 60 సార్ల‌కు పైగా హైకోర్టులో జ‌గ‌న్ స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను పున‌ర్నియ‌మించాల‌ని, ఆయ‌న్ని తొల‌గించేందుకు తీసుకొచ్చిన ఆర్డిన‌న్స్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని హైకోర్టు తీర్పిస్తూ ఏపీ ప్ర‌భుత్వానికి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వానికి …

Read More »

జగన్‌ ఆయనొక్కడి మాటే వింటాడంటున్న జేసీ

ఆంధ్రప్రదేశ్ మీడియా వాళ్లు, జనాలు చాలా ఆసక్తిగా ఏం మాట్లాడతారా అని చూసే నాయకుల్లో జేసీ దివాకర్ రెడ్డి ముందుంటారు. స్వపక్షం, విపక్షం అని లేకుండా పెద్ద నాయకులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలుగుదేశంలో ఉంటూ చంద్రబాబును వేదిక మీద పెట్టుకుని ఆయన్ని విమర్శించడం జేసీకే చెల్లింది. ఇప్పుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌పై, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన తరచుగా వాగ్బాణాలు విసురుతున్నారు. తాజాగా జగన్‌ను మరోసారి …

Read More »

గ్రేట్ న్యూస్ – తెలంగాణకు ఇక నో పాస్

KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో 30 వరకు లాక్ డౌన్ పొడగించారు. అదే సమయంలో కేంద్రం ఇచ్చిన అన్ని సడలింపులు ఇచ్చారు. తెలంగాణలోకి ఎవరైనా రావచ్చు. ఎవరైనా ఇక్కడి నుంచి పోవచ్చు. కేంద్రం ఆయా రాష్ట్రాల సరిహద్దులను తెరిచే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి అందరికీ వెల్ కం చెప్పారు. ఇతర రాష్ట్రాలకు …

Read More »

తెలంగాణ‌లో క‌రోనా రికార్డ్ డే

క‌రోనా వైర‌స్‌ను ప్ర‌భుత్వాలు, జ‌నాలు ఎంత లైట్ తీసుకుంటే అది అంత‌గా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వంద‌లు, వేల‌ల్లో కేసులు న‌మోద‌వుతున్న‌పుడు రోజూ ప‌దుల సంఖ్య‌లో కేసుల‌తో తెలంగాణ‌లో అదుపులోనే ఉన్న‌ట్లు క‌నిపించిన వైర‌స్.. కొన్ని రోజులుగా త‌న ఉద్ధృతి చూపిస్తోంది. ఇటీవ‌లే ఒక్క రోజులో 169 కేసుల‌తో హైయెస్ట్ సింగిల్ డే రికార్డ్ న‌మోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డు బ‌ద్ద‌లైంది. శ‌నివారం సాయంత్రం నుంచి …

Read More »

శ్రీవారి దర్శనానికి డేట్ ఫిక్సయింది

Tirumala

ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలన్నీ తెరుచుకోబోతున్నాయి. జూన్ 8 నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే మిగతా వాటి కంటే దేశంలో అత్యధికంగా ఎదురు చూస్తున్నది తిరుమల శ్రీవారి దర్శనం కోసమే. రోజూ లక్ష మందికి పైనే దర్శించే శ్రీవారి ఆలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలకు పైగా మూత పడి ఉంది. ఐతే ఎప్పుడు పున:ప్రారంభించినా …

Read More »