ప్రతి సంవత్సరం జపాన్లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల మార్కెట్లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప కలకలం రేపింది. 276 కిలోల బరువు గల ఈ చేప మార్కెట్లో వేలానికి వెళ్లగా, భారీ ధరకు అమ్ముడైంది. ఒనోడెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ చేప కోసం ఏకంగా రూ.11 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి …
Read More »ఓయో కొత్త రూల్స్: పెళ్లికాని జంటలకు నో ఎంట్రీ!
ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ ప్లాట్ఫారంగా గుర్తింపు పొందిన ఓయో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మేజర్ వయసు ఉన్నవారెవరైనా ఐడీ ప్రూఫ్ చూపించి రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రత్యేకంగా ప్రేమజంటలకు ఇది ఫస్ట్ ఆప్షన్గా నిలిచింది. అయితే నూతన సంవత్సరంలో ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలు ప్రకారం, ఇకపై ఓయోలో రూమ్ బుక్ చేసుకునే జంటలు తమ …
Read More »వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్.. భారత్ ఆశలు ఆవిరి
టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలన్న ఆశలు తారుమారయ్యాయి. సిడ్నీలో జరిగిన ఐదో టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-3 తేడాతో ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఈ పరాజయంతో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 50 పీసీటీ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన భారత్ ఫైనల్ అవకాశాలను కోల్పోయింది. ఆస్ట్రేలియా 63.73 పీసీటీ పాయింట్లతో తొలిస్థానంలో …
Read More »ఆస్తులు తీసుకొని తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారికి సుప్రీం షాక్
ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి వారికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. గిప్ట్ డీడ్ కింద ఆస్తులు రాసి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించి.. వారి బాగోగులు చూడని బిడ్డల నుంచి ఆ ఆస్తుల్నితిరిగి పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ(పోషణ), సంక్షేమ …
Read More »పాడిపంటల పండుగ సంక్రాంతి విశిష్టత మీకు తెలుసా?
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతో మంచి పరమార్ధం దాగివుంది. ఈ పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి ప్రయాణం చేసే సమయంలో జరుపుకుంటారు. ఇది ఉత్తరాయణ కాలంలో సంభవించడంతో, ఈ పండుగ ప్రత్యేకమైనదిగా మారింది. సూర్యుని గమనం మారడం వల్ల వాతావరణం మారి, పంటలు మంచి ఫలితాన్ని ఇవ్వడం అందుకు …
Read More »సోషల్ మీడియాపై కేంద్రం కొత్త చట్టం.. నష్టం కలిగితే కఠిన చర్యలే..
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి జీవనశైలి సామాజిక మాధ్యమాలతో ముడిపడిపోయింది. చిన్నారులు సహా యువత, వృద్ధులు రోజువారీ జీవితంలో ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇది పలు ప్రయోజనాలను అందించినా, ఒకవైపు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల డేటా రక్షణ, వారిపై సోషల్ మీడియా ప్రభావం పట్ల …
Read More »చైనా మాంజా: ఇది పంతంగుల దారం కాదు యమపాశం…
సంక్రాంతి అంటేనే సందడితో కూడుకున్న పండుగ.. ప్రతి ఇంటిలో సంక్రాంతి అంటే ఇంటిముందు ముచ్చట గొలిపే రంగవల్లులే కాదు ఆకాశంలో చుక్కలను తాకుతూ ఎగిరే రంగురంగుల పతంగులు దర్శనమిస్తాయి. అందరికీ ఎంతో ఆనందాన్ని పంచాల్సిన ఈ పండుగ.. కొన్ని కారణాల వల్ల చాలా మంది జీవితాల్లో చీకటిని మిగులుస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాగే పతంగుల సందడి కారణంగా కొన్ని ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం …
Read More »ఫైనల్ గా రిటైర్మెంట్ పై నోరు విప్పిన హిట్ మాన్
సిడ్నీ టెస్టు సందర్భంగా భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా హిట్ మాన్ రోహిత్ టెస్ట్ ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు అనేక రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అలాగే వన్డే ఫార్మాట్ కు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు కూడా నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక ఫైనల్ గా రోహిత్ మౌనం వీడి వాటన్నిటిపై ఓ క్లారిటీ ఇచ్చే …
Read More »హెచ్ఎంపీవీ వైరస్పై చైనా వివరణ
చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా ఆధారరహితమని, ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, కానీ గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనాలో ప్రజలు, విదేశీయులు భద్రంగానే ఉండవచ్చని, …
Read More »ఏపీలో ఏడు విమానాశ్రయాలు.. ఎక్కడెక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య అవసరాల కోసం కీలకమైనవిగా భావిస్తున్నారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పౌరవిమానయాన శాఖ అధికారులతో సమావేశమై, ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కుప్పం విమానాశ్రయం రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో …
Read More »కొత్త ట్రెండ్: కోట్లు ఉన్నా.. కొనేది సెకండ్ హ్యాండ్ దుస్తులే
అవును.. మీరు చదివింది నిజమే. ఇలాంటి వాళ్లు ఉంటారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇప్పుడు ఇదే పెద్ద ట్రెండ్ గా మారింది. రూ.కోట్లకు కోట్లు ఆస్తులున్నప్పటికి.. వారు సాదాసీదాగా జీవించే ధోరణి ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. ఉన్నదాంట్లో విలాసవంతంగా జీవించే ధోరణికి చెక్ చెబుతూ.. కలలో కూడా ఊహించనంత సాదాసీదాగా బతికే కొత్త తీరుకు పలువురు బిలియనీర్లు ఓటేస్తున్నారు. ఓవైపు మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతి వారు …
Read More »USA: భారతీయులను భయపెడుతున్న ఓపీటీ రచ్చ
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్1బీ వీసాలు పొందేందుకు ఈ ప్రోగ్రామ్ వారికి తొలి మెట్టుగా మారింది. ప్రతీ ఏడాది ఎక్కువ సంఖ్యలో యూఎస్ కు వెళుతున్న విద్యార్థులలో భారతీయులు కూడా ఉన్నారు. అయితే అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వాడుతున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్పై విమర్శలు తీవ్రంగా పెరుగుతున్నాయి. విద్యార్థులకోసం ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates