Trends

రోహిత్.. నెక్స్ట్ మ్యాచ్ కష్టమేనా?

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన సెమీఫైనల్ బెర్త్‌ను ఇప్పటికే ఖాయం చేసుకున్నా, లేటెస్ట్ గా ఒక విషయం జట్టును కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురైన కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో లీగ్ చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేనా? లేదా విశ్రాంతి తీసుకుంటాడా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. రెండు రోజుల విరామం అనంతరం బుధవారం భారత జట్టు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. …

Read More »

రీల్స్ కోసం మరొక యాప్.. ఇన్‌స్టాగ్రామ్ స్ట్రాటజీ ఏంటి?

సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ వీడియో ఫీచర్ ‘రీల్స్’ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త యాప్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మెటా అధినేత అడమ్ మోస్సెరి తన సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా, టిక్‌టాక్‌ భవిష్యత్తుపై అమెరికాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్‌ను మెటా ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అవకాశముంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే రీల్స్ ద్వారా టిక్‌టాక్‌కు …

Read More »

ఫైనల్‌లో ఇండియాను ఓడిస్తానన్నావ్? ఇప్పుడేమైంది?

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర పరాజయం ఎదురైంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో 8 పరుగుల తేడాతో పరాజయం పాలవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఇబ్రహీం చాడ్రాన్ 177 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం ఆఫ్ఘనిస్తాన్ విజయంలో కీలకంగా మారింది. 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 317 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో వాళ్ల …

Read More »

వీడియో: 3 సెకండ్ల వ్యవధిలో ప్రమాదాన్ని తప్పించిన పైలెట్

ఇటీవలి కాలంలో అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా గత నెల రోజుల క్రితం మూడు విమాన ప్రమాదాలు అమెరికాను షాక్ కు గురి చేసింది. ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత ప్రాణనష్టం కూడా జరిగింది. అయితే రీసెంట్ గా అమెరికాలోని చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక ప్రయాణికుల విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అనుమతి లేకుండా …

Read More »

పిల్లల సాక్ష్యం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

న్యాయపరంగా పిల్లల సాక్ష్యం ఎంత వరకు నమ్మదగినదో అనే అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన హత్య కేసులో ఏడేళ్ల బాలిక ఇచ్చిన సాక్ష్యాన్ని న్యాయస్థానం ప్రామాణికంగా గుర్తించి, నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో ముద్దాయి తన భార్యను హత్య చేసినప్పుడు చిన్నారి అక్కడే ఉండగా, ఆమె చెప్పిన వివరాలను తొలుత హైకోర్టు తోసిపుచ్చింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం చిన్నారి వాఖ్యలను పరిగణనలోకి తీసుకుని …

Read More »

భారత్‌లో ప్రమాద ఘంటికలు… టాప్-3లో స్థానం!

భారతదేశంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించిందని తాజా నివేదికల్లో వెల్లడైంది. 2024లో ఏకంగా 111 AQI స్కోర్‌తో భారత్ ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇక 140 AQIతో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉండగా, 115 AQIతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. దీనితో భారతదేశం కూడా అత్యంత కాలుష్య ప్రభావిత దేశాల జాబితాలో …

Read More »

పట్టుకుంటే ఊడిపోయే జుట్టు.. అసలు కారణమిదే..

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇటీవల ఊహించని పరిణామం సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది తల వెంట్రుకలు ఒక్కసారిగా రాలిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితి 18 గ్రామాల్లో 279 మందిని ప్రభావితం చేసింది. ఆడవారు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరూ ఈ సమస్యతో సతమతమవుతుండగా, అసలు కారణం ఏమిటో అర్థం కాక కొన్నాళ్ళు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రభావితుల తల వెంట్రుకలు, రక్త నమూనాలను …

Read More »

భూమిని ఢీకొట్టే గ్రహశకలం.. మరో క్లారిటీ ఇచ్చిన నాసా

ఇటీవల అంతరిక్ష పరిశోధకులు భూమి వైపుగా దూసుకొస్తున్న 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని గుర్తించారు. ఈ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా మొదట హెచ్చరించింది. దాని ప్రకారం, ప్రాథమిక విశ్లేషణలలో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు 3.1 శాతంగా ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. తర్వాతి రోజుల్లో నాసా మరిన్ని పరిశీలనలు చేపట్టి, ముప్పు …

Read More »

ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్: నమ్మకం తగ్గుతోందా?

సోషల్ మీడియా వేదికగా బ్రాండ్ ప్రమోషన్‌లో ప్రభంజనంలా పెరిగిన ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఇప్పుడు నెమ్మదిగా నమ్మకాన్ని కోల్పోతుంది. ఒకప్పుడు నిజమైన సిఫారసుల్లా కనిపించిన కంటెంట్ ఇప్పుడు వ్యాపార ఉద్దేశంతోనిదనే అనుమానంతో వినియోగదారులు చూడటం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటివి సాధారణ యూజర్లను ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మార్చాయి. కానీ, ఇప్పుడు అదే పద్ధతి ఇన్ఫర్మేషన్ కంటే అడ్వర్టైజింగ్‌గా మారిపోతుండటంతో ప్రేక్షకులు విసుగు చెందుతున్నారు. ఇండియాలోని మెట్రో నగరాల వినియోగదారులపై …

Read More »

ఊరించి ముంచేసిన బంగ్లాదేశ్ : పాక్ ఇక ఇంటికే!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో, పాక్ సెమీస్ కు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. గ్రూప్-ఏలో ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో ఓటమి చెందిన పాకిస్థాన్, ఇప్పుడు చివరగా బంగ్లాదేశ్ పై గెలిచినా కూడా, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. న్యూజిలాండ్ ఈరోజు బంగ్లాదేశ్ పై విజయం సాధించిన తర్వాత, గ్రూప్-ఏలో …

Read More »

ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఉగ్ర ముప్పు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతున్న వేళ, ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు కొత్త ముప్పును గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఈ మెగా ఈవెంట్‌ను టార్గెట్ చేస్తూ, మ్యాచ్‌లకు హాజరైన విదేశీయులను కిడ్నాప్ చేయాలనే పథకం వేసినట్లు సమాచారం. ముఖ్యంగా తెహ్రిక్-ఇ-తాలిబన్ (TTP), ఐసిస్, బలూచిస్థాన్ గ్రూపులు ఈ కుట్రలో భాగమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించి, స్టేడియంల వద్ద …

Read More »

హర్దిక్ వాచ్ ఇన్ని కోట్లా…

భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ ఎప్పుడూ కూడా హై వోల్టేజ్ వైబ్ తోనే ఉంటుంది. కానీ, ఈసారి దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో హార్దిక్ పాండ్యా ఆటతో మాత్రమే కాదు, తన చేతికి ఉన్న లిమిటెడ్ ఎడిషన్ వాచ్ తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వాచ్ విలువ సుమారుగా 7 కోట్లు కావడం, అది రేర్ పీస్ కావడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ …

Read More »