హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ కొత్త చౌక ప్రయాణాన్ని అందిస్తోంది. అది కూడా ఏసీ సౌకర్యంతో కూడిన జర్నీని ఈ సంస్థ మనకు అందించనుంది. ఈ సర్వీసులను తెలంగాణ రవాణా సఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసులు మూడు నుంచి నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. …
Read More »అక్రమ వలసల విషయంలో భారత్ స్టాండ్ ఏంటి?
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వం భారతీయులను వెనక్కి పంపడం ఇప్పుడు మొదటిసారి కాదని, ఇది గతంలో కూడా కొనసాగిన ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. ఏటా ఎన్నో దేశాల నుండి అక్రమంగా ప్రవేశించిన వలసదారులను అమెరికా తమ దేశాలకు తిరిగి పంపిస్తూనే ఉందని తెలిపారు. ఇదే …
Read More »డిపోర్ట్ గాదలు.. యూస్ వెళ్లిన విషయం కూడా తెలియదట!
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక ఆర్మీ విమానంలో వీరిని తరలించారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారే. అయితే, వీరిలో కొందరి కుటుంబ సభ్యులు అసలు తమ వాళ్లు అమెరికా వెళ్లిన సంగతే తెలియదని చెబుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికారులకు కూడా ఈ విషయమై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుజరాత్కు …
Read More »ఆస్ట్రేలియాకు మరో షాక్.. ఆల్ రౌండర్ హల్క్ రిటైర్మెంట్
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే గాయాలతో మిచెల్ మార్ష్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో వెబ్ స్టర్ను ఎంపిక చేసే అవకాశముంది. అలాగే, కీలక బౌలర్లు జోష్ హేజిల్వుడ్, పాట్ కమీన్స్ గాయాలతో కోలుకుంటూ ఉండటంతో వారి ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు స్టార్ …
Read More »40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం గురించి విన్నోళ్లంతా ‘వావ్’ అనకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు.. భర్తను రక్షించేందుకు పెద్ద సాహసమే చేసిందా భార్య. ఇంతకూ ఆమె వయసు ఎంతో తెలుసా? అక్షరాల 56 ఏళ్లను. భర్త కోసం సదరు భార్య పడిన తపన.. అందుకోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా చేసిన ప్రయత్నం గురించి …
Read More »స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి అయితే హైదరాబాద్ పోలీసులు అయితే చలానాలు వేయటం, లేదంటే పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారుల్ని ఆపి.. వారి చేత ఫైన్లను క్లియర్ చేస్తుంటారు. కానీ.. బెంగళూరు పోలీసులు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఒక స్కూటర్ మీద ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీగా ట్రాఫిక్ నిబంధనల్ని …
Read More »చాట్ జీపీటీ-డీప్ సీక్లకు దూరం: కేంద్రం ఆదేశాలు!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కొన్ని అయితే.. ఇప్పటికే ఆ సేవలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలావుంటే.. నిన్న మొన్నటి వరకు చాట్ జీపీటీ అందరికీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీనిని కొన్నాళ్లుగా వినియోగిస్తున్నారు కూడా. అయితే.. దీనికి పోటీగా చైనా తీసుకువచ్చిన డీప్-సీక్ ఇప్పుడు మరింత …
Read More »ట్రంప్ న్యూ ట్విస్ట్: గాజా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలిచిన ట్రంప్, తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యపై సంచలన ప్రకటన చేశారు. గాజాను తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించిన అనంతరం గాజాపై నియంత్రణ సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో …
Read More »ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…
ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే 1.5 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ …
Read More »దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..
బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే దొంగను ఇటీవల మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన అతడు తన చిన్నతనం నుంచే దొంగతనాలు చేస్తూ బడా క్రిమినల్గా మారాడు. అయితే అతడి కేసులో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అతడు తన ప్రేయసి కోసం ఏకంగా రూ.3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించడం. అంతేకాకుండా, …
Read More »‘2000 నోట్లు’ దాచేశారు.. లెక్కలు తీస్తున్న ఐటీ!
దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగి ఈ ఏడాది జూన్ – జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్రమాలు, లంచాలు, ఎన్నికల్లో ఓటర్ల కొనుగోలు ప్రక్రియలు వంటివాటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో 2016 లో మోడీ ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత.. వాటి స్థానంలో మరింత పెద్ద నోట్లను తీసుకు వచ్చారు. అదే 2000 నోటు. వీటిపై తీవ్ర విమర్శలు రావడంతోపాటు.. అవినీతిమరింత పెరిగిందన్న నిఘా విభాగాల …
Read More »బ్రెజిల్లో రూ.40 కోట్లకు ఒంగోలు ఆవు
బ్రెజిల్లో జరిగిన ఓ అద్భుతమైన వేలం బహుళ దేశాల్లో చర్చనీయాంశమైంది. వేలంలో భారతీయ మూలాలున్న నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ఊహించని రీతిలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. మినాస్ గెరైస్లో నిర్వహించిన ఈ వేలంలో, వియాటినా-19 అనే ఆవును ఏకంగా 4.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.40 కోట్లు) ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ ఘనతతో ఈ ఆవు గిన్నిస్ రికార్డుల పుటల్లో చోటు సంపాదించింది. వియాటినా-19 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates