Trends

టీమ్ ఇండియా నిష్క్రమించడమే బెటర్!

ఎన్నెన్నో ఆశలు.. ఎన్నెన్నో అంచనాలు. అన్నీ కూలిపోయాయి. టీ20 ప్రపంచకప్‌ను గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతారనుకుంటే.. మనోళ్లు సెమీస్ గడప కూడా తొక్కేలా లేదు. సూపర్-12 దశలోనే నిష్క్రమించడం దాదాపుగా ఖాయం అయిపోయింది. వన్డేల్లో అయినా, టీ20ల్లో అయినా ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మీద ఓడిన చరిత్రే లేని ఘన రికార్డును కొనసాగిస్తూ చిరకాల ప్రత్యర్థిని మరోసారి చిత్తు చేసేస్తారనుకుంటే.. మరీ దారుణంగా 10 వికెట్ల తేడాతో ఆ జట్టు చేతిలో …

Read More »

‘మంగళసూత్ర’ యాడ్ వివాదం…దిగొచ్చిన డిజైనర్

ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని యాడ్ లలో క్రియేటివిటీ శృతిమించుతోందని విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఏదో ట్రై చేసి తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలనుకునే క్రమంలో కొన్ని కంపెనీలు కొందరి మనోభావాలను గాయపరుస్తున్నాయి. తీరా ఆ యాడ్ రిలీజైన తర్వాత వివాదం రేగడంతో సైలెంట్ గా క్షమాపణలు చెప్పి యాడ్ ను తీసేస్తున్నాయి. బహుశా ఇలా కాంట్రవర్సీ యాడ్ లు చేయడంతో ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని సదరు …

Read More »

ముఖేశ్ అంబానీ కుమార్తెకు అరుదైన గౌరవం

దేశీయంగా అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తాజాగా ఒక అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోనే ప్రతిష్ఠాత్మక స్మిత్ సోనియన్ ఆసియన్ ఆర్ట్ నేషనల్ మ్యూజియం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తాజాగా నియమితులయ్యారు. దీని ప్రత్యేకత ఏమంటే.. ప్రపంచంలో అతి పెద్దదైన మ్యూజియంగా అభివర్ణిస్తారు. విద్య.. పరిశోధనల సముదాయంగా ఉండే ఈ సంస్థలో ట్రస్టు సభ్యురాలిగా నాలుగేళ్లు వ్యవహరించనున్నారు. అంతేకాదు.. బోర్డు …

Read More »

అతి చేసిన పాక్ లెజెండ్.. క్షమాపణలు చెప్పాడు

“మ్యాచ్ సందర్భంగా హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం నన్నెంతగానో ఆకట్టుకుంది”.. ఇదీ పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనస్ ఆదివారం నాడు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ పూర్తయ్యాక చేసిన వ్యాఖ్యలు. మూడు దశాబ్దాల వ్యవధిలో వన్డే ప్రపంచకప్‌లో కానీ, టీ20 ప్రపంచకప్‌లో కానీ ఎన్నడూ పాకిస్థాన్ ఇండియాపై గెలిచిందే లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు, టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు పాక్‌ను మట్టికరిపించి ఘనమైన రికార్డుతో కొనసాగతూ వచ్చింది భారత్. …

Read More »

న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడితే..?

వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు.. టీ20 ప్రపంచకప్‌లో ఐదుసార్లు.. ఇలా చిరకాల ప్రత్యర్థితో ప్రపంచకప్‌ల్లో తలపడ్డ 12 సార్లు భారత్‌దే విజయం. 13వ పర్యాయం కూడా మనదే జయకేతనం అని చాలా ధీమాగా ఉన్నారు అభిమానులు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. మొన్నటి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో కోహ్లీ సేన మరీ చిత్తుగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. ఈ దెబ్బతో టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరే …

Read More »

ఇండియా ఓటమికి షమి బాధ్యుడా?

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. పాకిస్థాన్‌పై వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో ఎప్పుడూ ఓడిన చరిత్రే లేని భారత జట్టు.. ఆదివారం పాకిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ అనగానే ఒక ఫోబియాలో పడిపోయి.. తీవ్ర ఒత్తిడికి గురై.. భారత్‌కు మ్యాచ్ అప్పగించేయడం పాక్‌కు అలవాటు. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా జరిగింది. భారత జట్టే ఒత్తిడిలో పడింది. పాక్ చేతిలో ఓటమే తట్టుకోలేనిదంటే.. మరీ దారుణంగా 10 …

Read More »

ఒత్తిడే కొంపముంచిందా ?

ఇపుడిదే ప్రశ్న ప్రపంచంలోని భారత్ అభిమానులను పట్టి పీడిస్తోంది. టీ20 ప్రపంచ కప్ లో మొట్టమొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో భారత్ ఓడిపోవటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకోతున్నారు. ఆటలన్నాక గెలుపులోములు సహజమే. కానీ ఓటమి ఎంత గౌరవప్రదంగా ఉందనేది చాలా కీలకం. పాకిస్తాన్ పై భారత్ ఘోరంగా ఓడిపోయింది. అలా ఇలా కాదు ఇటు మొదట బ్యాటింగ్ లో తర్వాత బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది. ఒకళ్ళో ఇద్దరో కాదు మొత్తానికి …

Read More »

చైనాలో మళ్లీ కరోనా విలయం

ఫస్ట్ వేవ్‌లో కరోనా తగ్గుముఖం పట్టగానే అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇక వైరస్ కథ ముగిసినట్లే అని సాధారణ జీవనం మొదలుపెట్టేశారు. కరోనా పేరెత్తితే కామెడీగా మాట్లాడిన వాళ్లే ఎక్కువ. కానీ అనూహ్యంగా ఈ వేసవిలో కరోనా మళ్లీ విజృంభించింది ఇండియాలో. తొలి వేవ్‌కు మించి దారుణమైన నష్టం మిగిల్చి జనాలను విపరీతంగా భయపెట్టి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఇండియాలో కరోనా ప్రభావం చాలా తక్కువగానే కనిపిస్తోంది. …

Read More »

ఫేస్ బుక్ పై రూ.515 కోట్ల భారీ ఫైన్.. ఏమిటంత పెద్ద తప్పు?

సామాజిక మాధ్యమాల్లో తిరుగులేనిది ఉన్న ఫేస్ బుక్ కు భారీ షాకిచ్చింది బ్రిటన్. తాజాగా ఎఫ్ బీకి రూ.515 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ అంత భారీ మొత్తంలో జరిమానా ఎందుకు వేశారు? దీనికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటరీ ఈ భారీ ఫైన్ ను వేసింది. తాము అడిగిన వివరాల్ని ఇవ్వటంలో ప్రదర్శించిన …

Read More »

వణికిపోతున్న బ్రిటన్

మళ్ళీ బ్రిటన్ వణికిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే కరోనా వైరస్ కేసులు మళ్ళీ విజృభిస్తుండటమే. గడచిన 24 గంటల్లో ఇంగ్లాండ్ మొత్తం మీద 50 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో అర్థం కావటం లేదు. గడచిన మూడు నెలల్లో ఇన్ని వేల కేసులు నమోదవ్వటం ఇదే మొదటిసారి. చాలా దేశాలతో పోల్చుకుంటే బ్రిటన్లో వ్యాక్సినేషన్ ముందే ప్రారంభమైంది. అయితే మెల్లిగా జనాలు ముఖ్యంగా యూత్ టీకాల …

Read More »

వారంలో 4 రోజులే పని..ప్రపంచానికే మోడలవుతుందా ?

ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి పనిగంటల విషయంలో ఐస్ ల్యాండ్ ప్రపంచదేశాలకు కొత్త మోడల్ గా అవతరించబోతోందా ? మానసిక శాస్త్రవేత్తలు, నిపుణుల లెక్కల ప్రకారం అవుననే సమాధానం వినబడుతోంది. పనిగంటలు తగ్గించటం, పనిదినాల్లో మార్పులు చేసే విషయంలో ఐస్ ల్యాండ్ లో నాలుగేళ్ల పాటు జరిగిన ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో ఐస్ ల్యాండ్ లో జరిగిన ప్రయోగాలను తెలుసుకునే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. …

Read More »

వారం వ్యవధిలో జరిగిన బిగ్ సేల్ లెక్క వింటే దిమ్మ తిరగాల్సిందే

పెద్ద పండగ్గా చెప్పుకునే దసరాకు బిగ్ సేల్ పేరుతో ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్.. ఫ్లిప్ కార్ట్ లు పోటాపోటీగా నిర్వహించే స్పెషల్ సేల్ లో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. మొత్తం నెల పాటు సాగే ఫెస్టివల్ సేల్ లో మొదటి వారంలోరికార్డుస్థాయి అమ్మకాలు జరగటం విశేషం. గత ఏడాది కరోనా కారణంగా అమ్మకాలు మందకొడిగా సాగగా.. ఈసారి ఆ లోటును పూడ్చేసేలా అదిరే అంకెలతో.. అమ్మకాలు సాగినట్లుగా వివరాలు …

Read More »