ఏఐ దిగ్గజం `మెటా` చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, `ఫేస్ బుక్` అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం తనను చంపేసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిని అధికారికంగాఅమలు చేసేందుకు కేసులు పెట్టించే ప్రయత్నాల్లో ఉందన్నారు. “అధికారికంగా నన్ను ఉరి వేసే కుట్రలు చేస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. దీనిని వారు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఇది ముమ్మాటికీ భావప్రకటనపై చేస్తున్న కుట్రగానే చెబుతున్నా“ అని …
Read More »గోదావరి టు హైదరాబాద్.. పందెం కోళ్ల పరుగు!!
ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే ‘పందెం కోళ్లు’ గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ పందేలు కామన్. ఇక, తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చిందంటే పందేలకు తిరుగులేదు. ఈ ఏడాది అయితే.. ఊరూ వాడా విచ్చలవిడిగా చెలరేగి మరీ పందేలు కాశారు. సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు కోడి పందేల్లో సొమ్ములు పారినట్టు సమాచారం. ఇక, ఇప్పుడు ఈ …
Read More »ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. వారి కోసమే స్ట్రాంగ్ రూల్స్!
మెటా సంస్థ భారతదేశంలో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం సురక్షితమైన, వయస్సుకు తగిన అనుభవాన్ని అందించడానికి ఇన్స్టాగ్రామ్ టీన్ ఖాతాలను (Teen Accounts) రూపొందించినట్లు మెటా ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని పర్యవేక్షించగలరు. ఏ కంటెంట్ను చూడవచ్చో, ఎంత సమయం గడపవచ్చో నియంత్రించేందుకు ప్రత్యేకమైన స్టెప్స్ విధించనున్నారు. ముఖ్యంగా, టీనేజ్ అకౌంట్లు ప్రైవేట్గా ఉండడం తప్పనిసరి, …
Read More »చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం… ఫైనల్ టీమ్ ఇదే!
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది. గత టీ20 వరల్డ్ కప్ లో ఓటమి అంచున ఉన్న జట్టుకు తన బౌలింగ్ తో గెలుపు తీరాలకు చేర్చాడు. అయితే అలాంటి బౌలర్ చాంపియన్స్ ట్రోఫీకి మరో ఆయుధంగా నిలుస్తాడు అని అందరూ అనుకుకున్నారు. కానీ ఊహించని విధంగా టీమ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను …
Read More »సుప్రీం తీర్పు: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణం.. రూ.9కోట్ల పరిహారం
బస్సు ఢీ కొన్న ఘటనలో మరణించిన మహిళ కుటుంబానికి రూ.9కోట్ల (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే రూ.9,64,52,220) పరిహారం ఇవ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. దీనికి సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ పేరు లక్ష్మి నాగళ్ల. ఆమె 2009 జూన్ 13న భర్త.. ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం …
Read More »కేఎల్ రాహుల్ కు అన్యాయం చేస్తున్నారా?
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను కిందిస్థానంలో పంపించడం, రిషభ్ పంత్కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోచ్ గౌతం గంభీర్ నిర్ణయాలు సమర్థనీయమా? అని ప్రశ్నించారు. రాహుల్ను అనవసరంగా నంబర్ 6, 7 స్థానాల్లోకి పంపి అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని శ్రీకాంత్ …
Read More »వైరల్ వీడియో… కోహ్లీ హగ్ ఇచ్చిన లక్కీ లేడీ ఎవరు?
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మైదానంలోనే కాదు, ప్రాక్టీస్ సెషన్లకు కూడా అభిమానులు భారీగా హాజరవుతుంటారు. తాజాగా కోహ్లీ మరోసారి తన అభిమానులతో జరిగిన ఆసక్తికర ఘటనతో వార్తల్లోకి ఎక్కారు. ఇంగ్లాండ్తో రెండో వన్డే అనంతరం భారత జట్టు అహ్మదాబాద్కు బయలుదేరే ముందు భువనేశ్వర్ విమానాశ్రయంలో కోహ్లీ అభిమానులతో ముచ్చటించారు. విమానాశ్రయంలో …
Read More »ఏం చేయాలో నాకు తెలుసు.. రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్!
ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటివరకు వరుసగా విఫలమవ్వడం జట్టుకు భారంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. ఫ్యాన్స్ తో పాటు సీనియర్ ఆటగాళ్లు సైతం పెదవివిరిచారు. అయితే ఈ ఒత్తిడిలోనే అతను బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో ల్ రోహిత్ శర్మ తన పూర్వవైభవాన్ని తలపించారు. 90 బంతుల్లో 119 పరుగులు చేసి జట్టును విజయంలోకి నడిపించడమే కాకుండా, తన …
Read More »ఇండియన్స్ కు మరో షాక్.. అమెరికా స్టైల్ లొనే బ్రిటన్..
అక్రమ వలసదారుల నియంత్రణకు ఇటీవల పలు దేశాల తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ గా అమెరికా అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయగా ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న భారతీయ రెస్టారెంట్లు, కార్ వాష్ సెంటర్లు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా …
Read More »“నరకం చూపిస్తా” : ట్రంప్ డెడ్లైన్!
ఇజ్రాయెల్ – హమాస్ ఘర్షణలో కీలక మలుపు చోటుచేసుకుంది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని పునర్నిర్మించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు. పాలస్తీనియన్లు దీనికి అంగీకరించకపోతే, మిత్రదేశాలైన జోర్దాన్, ఈజిప్ట్లకు అమెరికా ఇచ్చే సహాయాన్ని నిలిపివేస్తానని స్పష్టం చేశారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్పై హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికితోడు, బందీల విడుదలను ఆలస్యం చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు …
Read More »కుంభమేళాకు వెళ్లి వస్తూ… ఏడుగురు దుర్మరణం
మహా కుంభమేళాకు వెళ్లిన హైదరాబాదీలు ప్రమాదంలో చిక్కుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా… పలువురు గాయపడ్డారు. మృతులతో పాటుగా గాయపడ్డ వారంతా.. హైదరాబాద్ లోని నాచారం పరిధిలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్కు చెందినవారుగా గుర్తించారు. వీరంతా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్బంగా ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లోని నాచారం పరిధిలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర …
Read More »8.5 లక్షల కోట్లకు ఓపెన్ AI ని అమ్ముతారా? : మస్క్
కృత్రిమ మేధ (AI) రంగంలో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ మధ్య ఉన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. గతంలో ఓపెన్ ఏఐ సంస్థపై తీవ్ర విమర్శలు చేసిన మస్క్, తాజాగా దానిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. చాట్ GPT ఓపెన్ ఏఐని పూర్తిగా లాభాపేక్ష గల సంస్థగా మార్చేందుకు 97.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.5 లక్షల కోట్లు) చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates