Trends

ర‌న్‌వేపై డిన్న‌ర్‌.. ఇండిగోకు షాక్‌

విమానాలు ప్ర‌యాణించే ర‌న్‌వేపై కాకిని సైతం వాల‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. నిత్యం ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. ర‌న్‌వేల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తారు. అత్యంత వేగంగా దూసుకువ‌చ్చే విమానాల‌కు చిన్న పాటి ఇబ్బంది కూడా లేకుండా.. క‌డిగిన ముత్యంలా ర‌న్‌వేల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. అలాంటి ర‌న్ వే పై ఏకంగా.. రాత్రి వేళ భోజ‌నాలు ఏర్పాటు చేస్తే.. ఒక‌రు కాదు ఇద్ద‌రుకాదు.. ఏకంగా 150 మంది ప్ర‌యాణికుల‌ను ర‌న్‌వే పైనే కూర్చోబెట్టి వండి వారిస్తే.. …

Read More »

ఉద్యోగాల‌కు భారీ ఎస‌రు.. `ఏఐ` కొంప ముంచేస్తుందా?

ప్ర‌పంచ వ్యాప్తంగా.. నిరుద్యోగం ముసురుకున్న విష‌యం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశం.. అని చెంద ని దేశ‌మ‌ని.. ఈ విష‌యంలో తేడా లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌దీ ఇదే ప‌రిస్థితి. ఉద్యోగాల క‌ల్ప‌న‌.. అనేది అది ప్రైవేటైనా.. ప్ర‌భుత్వ‌మైనా.. దేశాల‌కు తీవ్ర స‌వాల్‌గా ప‌రిణ‌మించింది. ఇక‌, సాఫ్ట్‌వేర్ రంగం అయితే.. చెప్పాల్పిన ప‌నిలేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఇలాంటి స‌మ‌యంలో …

Read More »

`భాగ్య‌న‌గ‌ర` విలాపం.. ప‌ల‌క‌రించేవారే లేరా?!

నిత్యం వంద‌లాది కార్లు.. ఇసుక వేసినా రాల‌నంత‌గా జ‌నాలు.. ఎటు చూసినా హ‌డావుడే.. కాలు క‌ద‌పాల న్నా.. ట్రాఫిక్ జామ్‌లే. ఇదీ.. హైద‌రాబాద్ ఉర‌ఫ్ భాగ్య‌న‌గ‌రం గురించి.. రెండు ముక్క‌ల్లో చెప్పే మాట‌. మ‌రి ఇలాంటి న‌గరం.. ఇప్పుడు ప‌ల‌క‌రించేవారు లేక బోసిపోతోంది. ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు, నియోజ‌క‌వ‌ర్గాలు, ప్రాంతాల్లో వీధుల‌న్నీ నిర్మానుష్యంగా క‌నిపిస్తున్నాయి. ఇళ్ల‌కు వేసిన తాళాలు వేసిన‌ట్టే ఉన్నాయి. ఎక్క‌డా అల‌జ‌డి లేదు… చాయ్ కొట్ల ద‌గ్గ‌ర సంద‌డి …

Read More »

టార్గెట్ 22.. ఆ రోజే పిల్ల‌ల్ని కంటాం ప్లీజ్‌!

ఇదేదో త‌మాషా విష‌యం కాదు.. నిజ‌మే. ఈ నెల 22వ తేదీనే పిల్ల‌ల్ని కంటామంటూ.. ఇప్పుడు గుజ‌రాత్ స‌హా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని గ‌ర్భిణులు ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు వంద‌ల సంఖ్య‌లో ఉన్న గ‌ర్భిణులు.. ఈ నెల 22నే తాము పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తామ‌ని తేల్చి చెబుతున్నారు. దీనికి గాను వైద్యులు ఏమైనా చేయాల‌ని వారు అభ్య‌ర్థిస్తున్నారు. ఇక‌, వ్యాపారులు కూడా.. కొత్త ప్రారంభించ‌బోయే త‌మ వ్యాపారాల‌కు ఈ నెల 22నే …

Read More »

దేశంలో అదానీ హ‌వా.. ఆయ‌న తాజా రికార్డ్ ఇదే!

దేశంలో గ‌త ఐదేళ్లుగా ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు అదానీ. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా ఆయ‌న వెలు గొందుతున్నారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ద‌న్నుతో ఆయ‌న వ్యాపారాలు విస్త‌రించుకుంటున్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. అదానీ గురించి పార్ల‌మెంటు లో ప్ర‌శ్న‌లు సంధించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎంపీ మొహువా మొయిత్రాపై ఏకంగా వేటు కూడా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇంత వివాదాస్ప‌ద స‌మ‌యంలోనూ అదానీ హ‌వా దేశంలో కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

హైదరాబాద్ లో పెట్రోల్ బంకులు బంద్.. గుర్రంపై ఫుడ్ డెలివరీ

పెట్రోల్.. డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా చేస్తున్న వేళ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని తప్పుడు వార్తలు హైదరాబాద్ మహానగరాన్ని అల్లకల్లోలం చేశాయి. వేలాదిగా వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాయి. దీంతో.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్.. డీజిల్ నిండుకొంది. పలు బంకులు మూసేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. డెలివరీ బాయిస్ పరిస్థితి ఆగమాగంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక …

Read More »

ఆర్కే బాట‌లో న‌డిచేది వీరేనా?

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే(ఇటీవ‌ల రాజీనామా చేశారు) ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఉర‌ఫ్ ఆర్కే బాట‌లో మ‌రికొంద‌రు న‌డిచేందుకు రెడీగా ఉన్నారా?  వైఎస్‌ను అభిమానించేవారు.. ఆర్కేను అనుస‌రిస్తారా?  ఈ క్ర‌మంలో తొలి అడుగు ఆర్కేతోనే మొద‌లైందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం వైఎస్ వ‌ర్గంగా ఉన్న చాలా మంది సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్నారు. వీరంతా ఒక‌ర‌కంగా చెప్పాలం టే వైసీపీలో ఉన్నారు. బొత్స‌, ధ‌ర్మాన వంటి కొంద‌రికి మాత్ర‌మే ప‌ద‌వీ భాగ్యం …

Read More »

ఒకే ఒక్క‌డు.. 9 వేల కండోమ్‌లు

ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు..అనే మాట ఆ వ్య‌క్తికి అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటే… `అంత పోటుగాడు` మ‌రి అంటున్నా నెటిజ‌న్లు. ఈ ఏడాదిలో అత‌గాడు..ఏకంగా 9940 కండోమ్‌ల‌ను వాడేశాట‌. దీంతో అత‌ని య‌వ్వార్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ఈ విష‌యం తెలిసిన వారు.. `ఎంత‌టి ర‌సికుడ‌వో.. తెలిసెరా!` అంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ఇంత హాట్ ఘైని ఎక్క‌డా చూసి ఉండ‌రని కూడా నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. విష‌యంలోకి …

Read More »

సెక‌నుకు న‌లుగురు.. నిమిషానికి 24 మంది పుడ‌తార‌ట‌!

కొన్ని కొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మే. వాటి వెనుక చాలానే రీజ‌న్లు ఉంటాయి. ప్ర‌పంచంలో జ‌నాభా పెరుగుద‌ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. అమెరికాకు చెందిన జ‌న‌గ‌ణ‌న శాఖ అధికారులు ఒక సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఏడాదిలో ప్ర‌పంచ వ్యాప్తంగా సెక‌నుకు 4 చొప్పున పిల్ల‌లు పుడ‌తార‌ని తేల్చి చెప్పారు. అంటే.. ఒక నిమిషానికి.. 24 మంది పుట్ట‌నున్నారు. వారు ఆడైనా..మ‌గైనా.. ఎవ‌రైనా కావొచ్చు.. నిముషానికి 24 మంది పుట్ట‌డం …

Read More »

గుడ్ న్యూస్‌: ద్వార‌క‌ను చూడొచ్చు!

ద్వార‌క‌.. హిందువుల‌కు ప్ర‌త్యేకమైన దివ్య ప్రాంతం. భ‌గ‌వాన్ శ్రీకృష్ణుడు నిర్మించిన భ‌వ‌నంగా ఆయ‌న నివ‌సించిన భ‌వ‌నంగా పురాణాలు చెబుతున్నాయి. అయితే.. ఇది ప్ర‌త్యక్షంగా క‌నిపించ‌దు. ఎందుకంటే.. ఇది స‌ముద్రంలో చాలా లోతున మునిగిపోయి ఉంది. దీంతో ద్వారక ప‌ర్య‌ట‌న అంటే.. కేవ‌లం స‌ద‌రు స‌ముద్ర తీరానికి వెల్లి ఓ న‌మ‌స్కారం చేసుకుని రావ‌డ‌మే. దీనినే ప‌విత్రంగా హిందు వులు భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడు స‌ముద్రంలో నిక్షిప్త‌మైన ద్వార‌క‌ను ప్ర‌త్య‌క్షంగా చూసి …

Read More »

ఘోరం: అమెరికాలో ఐదుగురు అమలాపురం వాసులు దుర్మరణం

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు వారు దుర్మరణం పాలు కావటం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించిన సమాచారం అందినంతనే అమలాపురంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. టెక్సాస్ హైవేలో జరిగిన ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోవటం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా చెబుతున్నారు. జాన్సన్ కౌంటీ వద్ద …

Read More »

బ్రహ్మచారి భక్తుడికి అయోధ్య ట్రస్టు ఆహ్వానం

అయోధ్యలో రామాలయం కోసం ఎంతమంది ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలు అనుభవించారు. భారీ శపధాలు చేశారు. అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన రవీంద్ర గుప్తా ఉదంతం ఈ కోవకే వస్తుంది. అతగాడు అయోద్యలో రాముడి గుడి కోసం భారీ శపధాన్నే తీసుకున్నాడు. అయోధ్యలో రామాలయం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోకూడదని.. బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకుతగ్గట్లే అతను పెళ్లి చేసుకోలేదు. …

Read More »