ఆ మధ్య సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో త్రిషతో నటించడం గురించి అభ్యంతరకరమైన కామెంట్లు చేసి దుమారం రేపడం చూశాం. ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు చిరంజీవి, ఖుష్భూ తదితరుల మీద కేసు పెట్టి కోర్టు చేత చీవాట్లు తిన్న ఘనత కూడా ఇతనికే చెల్లింది. అభిమానులతో సహా ఈ విషయంలో ప్రేక్షకులందరూ త్రిషకు పూర్తి మద్దతు తెలిపారు. పొన్నియిన్ సెల్వన్ నుంచి వరస అవకాశాలతో త్రిష బిజీగా …
Read More »నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారం: లేడీ ఆఫ్ కరప్షన్
గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి వారి సేవలో తరించాల్సిన ఓ మహిళా అధికారి.. తన సంక్షేమం చూసు కున్నారు. అందిన కాడికి వసూలు చేసుకున్నారు. సహజంగా మహిళా అధికారులు అంటే.. లంచాలకు, ప్రలోభాలకు దూరంగా ఉంటారనే రికార్డులు ఉన్నాయి. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి మాత్రం నిఖార్సయిన లంచావతారానికి ప్రతిరూపంగా నిలిచింది. సోమవారం ఆమె కార్యాలయంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. 84 వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా …
Read More »సింహాలకు అక్బర్-సీత పేర్లు.. కోర్టుకెక్కిన వీహెచ్పీ
వీహెచ్పీ.. విశ్వహిందూపరిషత్. ఈ పేరు వింటే.. అంటే కూడా.. వివాదాలకు కేంద్రం. నచ్చకపోయినా.. ఇది నిజం. ఇప్పుడు మరోసారి ఇది నిజమైంది. సింహాలకు పేర్లు పెట్టడాన్ని.. వీహెచ్పీ నిరసిస్తోంది. అంతేకాదు.. కోర్టుకు కూడా వెళ్లింది. ఈ చిత్రమైన వివాదం.. ఫైర్బ్రాండ్ నాయకురాలు.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇదీ.. వివాదం! పశ్చిమ బెంగాల్లో అటవీ శాఖ అధికారులు రెండు సింహాలను ఎన్ క్లోజర్లో పెట్టారు. ఇది …
Read More »అప్పుడు ఉల్లి.. ఇప్పుడు వెల్లుల్లి.. పొలాలకు కెమెరాలు!
గత ఏడాది ఇదే సమయంలో ఉల్లిపాయల ధరలు ఆకాశానికి అంటాయి. కిలో 100 కు చేరుకున్నాయి. అయితే.. ఇప్పుడు నిత్యావసరాల్లోముఖ్యంగా కూరల్లో రుచి కలిగించే కీలకమైన వెల్లుల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో 550 వరకు చేరుకున్నాయి. దీంతో సాధారణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయినా.. తప్పదు కదా.. అని అంతో ఇంతో కొని.. వాడుతున్నారు. ఈ ధరలు మరో నాలుగు మాసాల వరకు అంటే.. కొత్త పంట చేతికి ఇబ్బడి …
Read More »పీచు మిఠాయి అమ్మినా, తిన్నా నేరమే !
పీచు మిఠాయి. ఈ పదార్థం గురించి తెలియనివారు ఉండరు. తిననివారు అంతకన్నా ఉండరు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా పీచు మిఠాయి వార్తల్లోకి వచ్చింది. రావడమే కాదు.. సంచలనంగా మారింది. అదేసమయంలో ప్రజల్లోనూ భయానికి కారణమైంది. దీనికి రీజన్.. పీచు మిఠాయి తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట! అంతే.. ఈ విషయం బయటకు రాగానే తమిళనాడు ప్రభుత్వం వెంటనే దీనిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిని తయారు చేసినా.. …
Read More »ఢిల్లీ రణరంగం.. కళ్లు, కాళ్లు, చెవులు పోగొట్టుకున్న రైతన్నలు!
దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారులన్నీ.. యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు, ఆధార్ కార్డుల వెరిఫికేషన్.. వాహనాల విస్తృత తనిఖీలతో పాకిస్థాన్ సరిహద్దులను దాదాపు మరిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే కనీస మద్దతు ధరలకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని.. స్వామి నాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. పంజాబ్, హరియాణ, ఢిల్లీ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రభుత్వం మాత్రం వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే …
Read More »సింహంతో సెల్ఫీ.. తర్వాత ఘోరం.. తిరుపతిలోనే!
సెల్ఫీ మోజు ఓ యువకుడుని అర్ధంతరంగా బలి తీసుకుంది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్కుకు వచ్చిన ఓ యువకుడు.. అందరితోపాటు.. జంతు ప్రదర్శన శాలలో తిరిగాడు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న జంతువులతో కొన్ని సెల్ఫీలు తీసుకున్నాడు. కానీ, చిత్రంగా ఏంటంటే.. ఆ కుర్రాడు వాటితో సంతృప్తి చెందలేదు. కొంత దూరంలో ఉన్న ‘లయన్ ఎన్ క్లోజర్’లోకి వెళ్లాడు. వాస్తవానికి లయన్ ఎన్ క్లోజర్లోకి ఎవరినీ అనుమతించరు. తాజాగా లయన్ ఎన్ క్లోజర్లోకి …
Read More »జూనియర్లకు గుండు కొట్టిన సీనియర్ వైద్య విద్యార్థులు
వారంతా వైద్య విద్యార్థులు. పట్టాలు పుచ్చుకుని రేపు సమాజానికి సేవ చేయాల్సిన బృహత్తర బాధ్యత ఉన్న భావి డాక్టర్లు. కానీ, విచక్షణ మరిచి.. పక్కా రోడ్ సైడ్ రోమియోల మాదిరిగా వ్యవహరించారు. చిన్న చితకా కాలేజీల్లో పోకిరీల మాదిరిగా వ్యవహరించారు. జూనియర్లకు గుండు కొట్టి.. సీనియర్లు చిందులు తొక్కారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణలో చర్చగా మారింది. తెలంగాణలోని రామగుండం ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి వైద్య కాలేజీలో సీనియర్లు దారుణానికి …
Read More »ఇద్దరు అసాధారణ వ్యక్తులు ఐస్ క్రీం షాపులో సాదాసీదాగా!
బెంగళూరులోని జయనగర్ కార్నర్ హౌస్ ఐస్ క్రీం షాప్ కు సాదాసీదాగా వచ్చారు ఇద్దరు అసాధారణ ప్రముఖులు. వారెవరో కాదు. ఒకరు దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అయితే.. మరొకరు బ్రిటన్ దేశ ప్రధాని సతీమణి కం నారాయణమూర్తి గారాలపట్టి అక్షత మూర్తి. వారిద్దరు పలుకుబడిలోనూ.. పవర్ లోనూ.. డబ్బులోనూ అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వారు. అయినప్పటికీ వారు ఎలాంటి హడావుడి లేకుండా ఐస్ క్రీం …
Read More »చిన్న దేశం.. పెద్ద సందేశం.. మనకు ఎంత ఉపయోగమంటే!
అది చాలా చిన్నదేశం. పైగా.. కోటి మందికంటే కూడా తక్కువ మందే జనాభా ఉన్నారు. కానీ, చూసేందు కు, జనాభా పరంగా కూడా చిన్నదేఅయినా.. ఈ దేశం ఇప్పుడు ప్రపంచ స్తాయిలో చర్చకు వచ్చింది. ప్రజాస్వామ్య దేశాలకు.. ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్న అమెరికా, భారత్ వంటి వాటికి అది ఆదర్శంగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. అదే… యూరోపియన్ యూనియన్లో ఉన్న హంగేరీ దేశం. దీని జనాభా …
Read More »శివశివా.. శ్రీశైలం ప్రసాదంలో చికెన్ ముక్కలు!
శ్రీశైలం. హిందువులు అత్యంత పరమ పవిత్రంగా భావించే కాశీ విశ్వనాథుని మందిరం తర్వాత.. ప్లేస్ దీనిదే. “సంధ్యారంభ విజృంభితం.. ” అంటూ.. పరమేశ్వరుడు.. ప్రతి రోజూ సంధ్యాకాలంలో శ్రీశైల గిరులపై తాండవం చేస్తారని ప్రతీతి. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు శివానందలహరిలోనూ పేర్కొన్నారు. అలాంటి పరమపవిత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందువుల పరితపిస్తుంటారు. ఏడాదిలో ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమంతో ఇక్కడ నిత్య కళ్యాణం అన్నట్టుగా శివయ్యకు …
Read More »కోడలిపై క్రికెటర్ రవీంద్ర తండ్రి షాకింగ్ వ్యాఖ్యలు
టీమిండియా ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన రవీంద్ర జడేజా ఇంటి పంచాయితీ రచ్చకు ఎక్కుతోంది. మధ్యతరగతికి చెందిన రవీంద్ర కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా ఎదగటం.. అతడి పెళ్లి సంపన్నురాలైన రివాబానేతో జరగటం.. ఆ తర్వాత నుంచి కుటుంబంలో సమస్యలు షురూ కావటం తెలిసిందే. తాజాగా రవీంద్ర జడేజా తండ్రి ఒక మీడియాసంస్థతో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు షాకిచ్చేలా మారాయి. తమ ఇంట్లోని గొడవలకు …
Read More »