ఒకప్పుడు పాకిస్తాన్ జట్టులో స్టార్ స్పిన్నర్గా వెలుగొందిన దానిష్ కనేరియా, ఇప్పుడు తన మాటలతో స్వదేశంలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పాక్ తరఫున 2000 నుంచి 2010మధ్యలో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ తన కెరీర్లో 261 టెస్టు వికెట్లు సాధించాడు. కానీ ఇప్పుడు క్రికెట్ కన్నా వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉత్కంఠ …
Read More »దగ్గుమందుతో మరణాలు.. సర్కార్ సీరియస్ స్టెప్!
మధ్యప్రదేశ్లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సదరు మందును సూచించిన పీడియాట్రిషన్ డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ తన ప్రైవేట్ క్లినిక్లో పిల్లలకు ఈ కఫ్ సిరప్ వాడమని సూచించినట్లు …
Read More »2.21 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తోకచుక్క
ఆకాశం వైపు చూస్తే క్షణాల్లో మెరిపించి మాయం అయ్యే తోకచుక్కలు ఆసక్తి రేపుతాయి. తాజాగా ‘3ఐ/అట్లాస్’ అనే కొత్త తోకచుక్క ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. గంటకు 2.21 లక్షల కిలోమీటర్ల వేగంతో ఇది మన సౌరవ్యవస్థ వైపు దూసుకొస్తోంది. కానీ ఆందోళన అవసరం లేదని నాసా చెబుతోంది. ఈ తోకచుక్క మన సౌరవ్యవస్థకు బయటి నుంచి వచ్చింది. అందుకే దీని పేరులోని ‘ఐ’ అంటే ఇంటర్స్టెల్లార్ అని, అంటే …
Read More »ఓడినా ఎలివేషన్స్ తగ్గట్లేదు.. నక్వీకి గోల్డ్ మెడలట
ఆసియా కప్ 2025లో భారత్పై వివాదాస్పద వైఖరితో నిలిచిన పాక్ మంత్రి మోసిన్ నక్వీకి ఇప్పుడు స్వదేశంలో గౌరవం దక్కబోతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్గానూ, పాక్ ఇంటీరియర్ మినిస్టర్గానూ ఉన్న నక్వీకి దేశ ప్రభుత్వమే బంగారు పతకం ప్రదానం చేయాలని నిర్ణయించిందని పాక్ మీడియా వెల్లడించింది. ఈ నిర్ణయం భారత్లో విమర్శలకు గురవుతున్నా, పాక్లో ఆయనను “జాతీయ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు”గా ప్రశంసలు కురుస్తున్నాయి. కరాచీలో జరిగే …
Read More »సాఫ్ట్ వెర్ ఇంజనీర్లకు మళ్ళీ వ్యవసాయమే దిక్కా..?
ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో జరుగుతున్న పరిణామాలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు రీస్కిల్లింగ్ పేరుతో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. అక్సెంచర్ ఇటీవలే 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, పుణేలో మాత్రమే టీసీఎస్ దాదాపు 2,500 మందిని రాజీనామా చేయించిందనే వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితులు ఐటీ రంగంలోని స్థిరత్వంపై ప్రశ్నలు రేపుతున్నాయి. ఫలితంగా, ఇప్పటికే కొంతమంది ఐటీ ఉద్యోగులు వ్యవసాయ రంగంలోకి మళ్లిపోతుండగా, రానున్న రోజుల్లో …
Read More »వైన్ షాపులు బంద్.. అయినా రికార్డు
ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఒక రేంజిలో జరుగుతాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే మద్యం ఏరులై పారుతుంది. మిగతా పండుగలన్నీ ఒకెత్తయితే.. దసరా ఇంకో ఎత్తు. మందుతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని భావిస్తారు ఇక్కడి జనాలు. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి దసరాకు. ఈ ఏడాది ఒక నంబర్ చూసి ఆశ్చర్యపోతే.. తర్వాతి …
Read More »జుబిన్ గార్గ్ను చంపేశారా? కొత్త అనుమానాలు
దక్షిణాదిలో ప్రముఖ సంగీత సమ్రాట్, గానగంధర్వుడు ఎసపీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన సమయంలో అనేక సందేహాలు తెరమీదికి వచ్చాయి. కానీ, ఆయన కుమారుడు వాటిని తిప్పికొట్టి అధికారిక ప్రకటన చేసే వరకు అవి కొనసాగాయి. ఇప్పుడు అదే తరహా చర్చలు ఈశాన్య రాష్ట్రం అస్సాంనుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు జుబిన్ గార్గ్ (53) మరణం చుట్టూ జరుగుతున్నాయి. జుబిన్ గార్గ్ అస్సాంలో జన్మించి, తన గాత్ర …
Read More »షాకింగ్… వన్డే కెప్టెన్గా రోహిత్ ఔట్
భారత క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన శుభ్మన్ గిల్.. ఇప్పుడు వన్డే జట్టు సారథిగానూ నియమితుడయ్యాడు. కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. అతణ్ని వన్డే కెప్టెన్గా నియమించారు సెలక్టర్లు. ఇప్పటిదాకా వన్డే జట్టును నడిపించిన రోహిత్ శర్మ.. ఇకపై జట్టు సభ్యుడిగా మాత్రమే కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియాతో ఈ నెల 19 నుంచి జరిగే వన్డే సిరీస్కు జట్టును …
Read More »మెట్రోలో ఇంత డబ్బుతో ట్రావెల్ చేయకండి!
హైదరాబాద్ మెట్రోలో ఒక ప్రయాణికుడికి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్లో భద్రతా సిబ్బంది తనిఖీల సమయంలో ఆయన వద్ద రూ.3.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే నగదుతో ప్రయాణం అనుమతిస్తారని సిబ్బంది తెలియజేయడంతో, ఆ వ్యక్తి నగదుతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. సాధారణంగా జనాలకు ఇలాంటి విషయాల్లో అవగాహన తక్కువే. చాలా …
Read More »తోక ముడిచిన నఖ్వి.. ఆసియా కప్ ట్రోఫీ ఇండియాకే
ఇటీవల ఆసియా కప్ టీ20 టోర్నీమెంట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. తొలి మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ చేయకపోవడంతో మొదలైన గొడవ.. ఫైనల్లో గెలిచిన భారత జట్టు ట్రోఫీ లేకుండా ఇంటికి రావడం వరకు కొనసాగింది. టోర్నీలో పాక్తో తలపడ్డ మూడుసార్లూ విజయం సాధించిన భారత్.. ఆ జట్టుకు ఘోర అవమానాన్ని మిగిల్చింది. ఐతే పాకిస్థాన్ …
Read More »పసిడి ధర.. పర్సులు పిసికేస్తోంది.. రీజనేంటి?
పసిడి.. బంగారం.. స్వర్ణం.. పేర్లు ఏవైనా.. ప్రతి ఒక్కరూ పండుగల సీజన్లో అంతో ఇంతో కొనుగోలు చేయాలని భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు అత్తమామలు.. పుట్టింటివారు కూడా కానుకగా స్వర్ణాభరణాలనే ఇవ్వాలని తలపోస్తారు. ఇక, ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా పసిడి ఆభరణాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అలాంటిది.. తాజాగా పసిడి ధర అమాంతం పైపైకి పెరిగిపోయింది. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర ధరలు దిగి వచ్చినా.. అదేసమయంలో కీలకమైన …
Read More »ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం 2 నిమిషాల్లో
చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. గుయిజౌ ప్రావిన్స్లో హుజియాంగ్ గ్రాండ్ క్యానియన్ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 625 మీటర్ల ఎత్తులో నిలిచిన ఈ వంతెన ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది. రెండు గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం రెండు నిమిషాలకు తగ్గించడం దీని గొప్పతనం. సెప్టెంబర్ 28న అధికారికంగా ప్రారంభమైన ఈ వంతెన ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజలు, ఇంజినీర్లు, అధికారులు భారీగా హాజరయ్యారు. మొత్తం 2,900 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates