ఉబర్.. ఫైజర్.. షెల్.. టెలినార్.. ఎలీ ఇల్లీ.. సనోఫి.. తాజాగా మైక్రోసాఫ్ట్. పేరున్న ఈ కంపెనీలే కాదు.. వేలాది కంపెనీలు ఇప్పుడు పాకిస్థాన్ కు గుడ్ బై చెబుతున్నారు. వీలైనంతగా లెక్కలు సెట్ చేసుకొని.. పాక్ దేశానికి ఒక దండం పెట్టి దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్నాయి. ఎందుకిలా? అంటే.. పాకిస్థాన్ లో వ్యాపారం చేయటం అంత సులువైన పని కాదు. అందుకోసం నానా తిప్పలు పడాలి. ఇదంతా ఒక …
Read More »బీరు తాగుతూ వాదనలు వినిపించిన లాయర్..
గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుల పని తీరులో సాంకేతిక మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. వర్చువల్ విధానంలో విచారణలు నిర్వహించడం కోర్టులకు రోజువారీ వ్యవహారంగా మారుతోంది. అయితే ఈ సౌకర్యాన్ని కొందరు న్యాయవాదులు సరిగ్గా వినియోగించకపోవడమే కాకుండా, విపరీతంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. గుజరాత్ హైకోర్టులో ఇటీవలి ఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది. ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో బీరు తాగుతూ కనిపించడం కోర్టు …
Read More »ఇండియా టూ అమెరికా.. 10,382 మంది అరెస్ట్!
అగ్రరాజ్యం అమెరికా అంటేనే ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల దేశం. మెరుగైన జీవనవేగం కోసం, సంపద కోసం, భవిష్యత్తు కోసం వేలాదిమంది అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అమెరికాలోకి నేరుగా వీసాలు లేకుండా ప్రవేశించడం నేరం. అయినా మన దేశం నుండి, ముఖ్యంగా గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విడుదలైన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ …
Read More »క్రికెటర్ షమి నుంచి భార్యకు నెలకు 4 లక్షలు
భారత క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన మహమ్మద్ షమి.. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న హసీన్ జహాన్ అనే మోడల్ను అతను 2014లో పెళ్లి చేసుకోవడం.. నాలుగేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడం.. షమితో పాటు అతడి కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ షహీన్ గృహ హింస సహా పలు కేసులు పెట్టడం తెలిసిందే. ఈ …
Read More »గుడ్ న్యూస్: టికెట్ బుకింగ్ నుంచి ఫుడ్ వరకూ ఒకే యాప్ లో
ఇప్పటి వరకూ టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ స్టేటస్ వంటి ఎన్నో రైలు సంబంధిత సేవలకు వేర్వేరు యాప్లు వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి స్వస్తి పలుకుతూ భారత రైల్వేలు సరికొత్త ‘రైల్ వన్’ అనే సూపర్ యాప్ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ఒకే చోట రైలు ప్రయాణికుల అవసరాలన్నీ తీరేలా డిజైన్ చేయబడింది. కొత్త యాప్ ద్వారా రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫాం టికెట్లు …
Read More »రాజా సింగ్.. నచ్చకపోతే అంతే
బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ప్రతిపక్ష పార్టీ అయినా..సొంత పార్టీ అయినా..చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. పార్టీ బలోపేతం కోసం, పార్టీని అధికారంలోకి తేవడం కోసం తపనతో చేస్తున్నానని చెబుతూ రాజాసింగ్ చేసే పలు కామెంట్లు ఎన్నోసార్లు కాంట్రవర్షియల్ అయ్యాయి. అయినా సరే నేనింతే అంటూ రాజా సింగ్ తనదైన శైలిలో …
Read More »సంగారెడ్డిలో భారీ పేలుడు..8 మంది మృతి
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో చాలా కాలం క్రితం కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఉదయం ఉన్నట్లుండి ఓ కెమికల్ రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పరిశ్రమల చుట్టుపక్కన ఏకంగా 6 నుంచి 7 కిలో మీటర్ల దాకా ప్రకంపనలు నమోదయ్యాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 8 …
Read More »జగన్నాథుని రథయాత్రలో వారెలా చనిపోయారు?
ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏటా ఆషాధ శుద్ధ విదియ తిథి నుంచి 12 రోజులు జరిగే ఈ రథయాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. అశేష జనంతో పూరీ కిటకిటలాడుతుంది. ఈ ఏడాది కూడా అలానే జరిగింది. అయితే.. గతంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. కొన్ని ఆంక్షలు విధించేవారు. ఈ సారి బీజేపీ సర్కారు ఎలాంటి ఆంక్షలు …
Read More »సోషల్ మీడియా దాచితే ఆ వీసా రాదట!
అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇప్పుడు ఓ-1 వీసా కొత్త ఆశగా మారింది. హెచ్-1బీ వీసాల విషయంలో లాటరీ, పరిమితులు, రిజెక్షన్ల భయంతో ఎందరో నిరుత్సాహపడుతుంటే… అసాధారణ ప్రతిభను గుర్తించి ఇచ్చే ఓ-1 వీసా మాత్రం రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. ముఖ్యంగా టెక్ రంగంలో పనిచేస్తున్నవారూ, డిజిటల్ క్రియేటర్లు, అథ్లెట్లు ఇలా వివిధ రంగాల్లో ప్రతిభావంతులు అమెరికా వెళ్లేందుకు ఈ వీసాను ఆశ్రయిస్తున్నారు. మరిన్ని అవకాశాలు, తక్కువ నిరాకరణతో ఈ వీసా …
Read More »బైక్ రైడ్ లో రొమాన్స్.. ఇదెక్కడి పిచ్చి బాబు
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో రాత్రివేళ రోడ్డుపై ఓ జంట చేసిన రొమాంటిక్ స్టంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అగ్రా-కాన్పూర్ నేషనల్ హైవేపై బైక్ మీద అతి వేగంగా ప్రయాణిస్తున్న ఈ జంట, ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించింది. మహిళ బైక్ ట్యాంక్పై పడుకుని ఉంది, పురుషుడు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. ఇది చూసిన ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో …
Read More »విమాన విషాదం తర్వాత పార్టీలా? ఎయిరిండియాలో నలుగురిపై వేటు!
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని కదిలించింది. 275 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే, ఎయిరిండియా గ్రౌండ్ సిబ్బంది కార్యాలయంలో చేసిన పార్టీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దురదృష్టకరమైన సంఘటనను మర్చిపోకుండా కుటుంబాలు ఇంకా బాధతో అలమటిస్తుండగా, కొంతమంది ఉద్యోగులు మ్యూజిక్, డాన్స్తో వేడుకల్లో పాల్గొనడం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఈ వివాదాస్పద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో …
Read More »టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్.. కారణం ఇదేనా?
శుక్రవారం రాత్రి కాస్త పొద్దు పోయిన తర్వాత షాకింగ్ ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంతో లుంగీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెకు కుమార్తె (13) ఉన్నారు. యాంకర్ గా సుపరిచితురాలు కావటమే కాదు.. జర్నలిస్టు సర్కిల్స్ తో ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపైనా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates