ఐపీఎల్ లో మొదటి నుంచి ఫోకస్ అవుతున్న రాజస్థాన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ముంబైతో జరిగిన మ్యాచ్ ఊహించని షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు కేవలం రెండో బంతికే డకౌట్ కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. పైగా మ్యాచ్కి ముందు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన అంచనాలే నిజమవ్వడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా …
Read More »ఏపీలో సంచలనం రేపుతున్న ‘చర్చి’ మరణం
ఈ రోజుల్లో కూడా పిల్లలు అనారోగ్యం పాలైతే మంత్రగాళ్ల దగ్గరికి వెళ్లి తాయిత్తులు కట్టించడం.. చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేయించడం లాంటివి చేసే జనాలు తక్కువేమీ కాదు. ఇక గాలి సోకిందని, దయ్యం పట్టిందని చేయించే పూజలు పునస్కారాల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి సందర్భాల్లో జనాల్లోని అమాయకత్వాన్ని వాడుకుని సొమ్ము చేసుకునే కేటుగాళ్లకు కొదవ లేదు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని జ్ఞానాపురం చర్చిలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించడం.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమై పోలీసులు రంగ …
Read More »14 ఏళ్ల వైభవ్కు సీఎం నితీశ్ సర్ప్రైజ్ గిఫ్ట్
ఐపీఎల్ 2025లో సరికొత్త సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం నుంచి భారీ గిఫ్ట్ లభించింది. గుజరాత్ టైటాన్స్పై 14 ఏళ్ల వయసులోనే అదరగొట్టిన శతక ప్రదర్శనపై రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అతని అద్భుత ప్రతిభను గుర్తించి రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్, కేవలం 38 బంతుల్లో 101 …
Read More »అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిది
అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో ఇది ఏప్రిల్ 30న రావడం విశేషం. ఈ రోజును విశేష శుభదినంగా పరిగణించి, లక్ష్మీదేవిని కృప పొందే ఒక మంచి అవకాశంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు సంపదకు సూచికగా బంగారం, వెండి కొనడం వల్ల ఐశ్వర్యం వస్తుందన్న నమ్మకంతో చాలామంది నగలు కొనడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. దీపం ప్రాముఖ్యత: …
Read More »ఐపీఎల్: 74 నుంచి 94 మ్యాచులకు స్కెచ్!
భవిష్యత్తులో ఐపీఎల్ మరింత పెద్దది కానుందా? ఇప్పుడీ చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇచ్చిన హింట్ ప్రకారం, 2028 నుంచి టోర్నమెంట్లో మ్యాచ్ల సంఖ్యను పెంచే యోచనలో బీసీసీఐ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 74 మ్యాచ్లు జరుగుతున్న ఐపీఎల్ను 94 మ్యాచ్ల వరకూ విస్తరించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయన్నారాయన. ఇప్పటి ఫార్మాట్ ప్రకారం 10 జట్లు ఉన్నాయి. గ్రూప్ పద్ధతిలో లీగ్ స్టేజ్ నిర్వహించబడుతోంది. …
Read More »ఆ రోబోలు వస్తే డాక్టర్స్ కు కష్టమే..
ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ అభివృద్ధి ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వల్ల వేలాది ఉద్యోగాలు మాయం కావడం చూశాం. ఇప్పుడు అదే ప్రభావం ఎంటర్టైన్మెంట్ రంగానికి కూడా చేరువవుతోంది. చిన్న వీడియోలు, వర్చువల్ యాక్టర్స్, ఏఐ టూల్స్ వల్ల సాధారణ సృజనాత్మక వృత్తులు తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు అదే ప్రభావం వైద్య రంగంపై పడుతున్నట్లు అనిపిస్తోంది. ఎలాన్ మస్క్ …
Read More »అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఎంత డేంజర్ అంటే..
రుచిగా ఉంటాయి. సులభంగా దొరుకుతాయి. వేడి చేసి నిమిషాల్లో తినవచ్చు. కానీ రెడీ-టు-ఈట్, రెడీ-టు-హీట్ ఆహారాల ముసుగులో మన ఆరోగ్యాన్ని మెల్లమెల్లగా మింగేస్తున్నాయి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF). ఇటీవలి ఓ ప్రపంచ స్థాయి అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఆహారాల వినియోగం అధికమైతే, అకాల మరణ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందట. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయన ఫలితాల ప్రకారం, UPFల వినియోగం 10 శాతం …
Read More »ఐపీఎల్ ఫైనల్.. ఈ రెండు జట్లపైనే అందరి ఫోకస్
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుతున్న వేళ, ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారుతోంది. అయితే అత్యద్భుత ఫామ్లో ఉన్న రెండు జట్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండూ తమ తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే, అభిమానుల కల నిజమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ టేబుల్ టాపర్గా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 10 …
Read More »IPL 2025: సెంచరీతో చుక్కలు చూపించిన 14 ఏళ్ళ వైభవ్
సూర్యవంశీ వైభవ్.. వయసు 14 సంవత్సరాల 32 రోజులు (2011 మార్చి 7).. బీహార్ కు చెందిన ప్లేయర్. అండర్ 14 ఆడాల్సిన సమయంలో అండర్ 19కి వెళ్లి హాట్ టాపిక్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని 1.1కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు IPL లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన 3వ మ్యాచ్ కే సెంచరీ పూర్తి చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు …
Read More »యుద్ధ వాతావరణంలో భారత్ పవర్ఫుల్ డీల్
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత రక్షణ వ్యూహానికి మరో భారీ బలం జతకానుంది. భారత్ సముద్ర పరిరక్షణ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్తో కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.63,000 కోట్ల విలువైన ఈ డీల్పై సోమవారం అధికారికంగా సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ …
Read More »సెలబ్రిటీ షోల మీద పెహల్గామ్ ప్రభావం
తలుచుకుంటే చాలు మనసంతా బాధతో నిండిపోయే పెహల్గామ్ దుర్ఘటన తాలూకు విషాదం ఇప్పుడప్పుడే మనల్ని వీడిపోయేలా లేదు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు నివాళిగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు జనం నుంచి మంచి మద్దతుని తీసుకొస్తున్నాయి. దీని ప్రభావం సెలబ్రిటీల షోల మీద తీవ్రంగా పడుతోంది. యుకెలో మే 4 మరియు 5 తేదీల్లో భారీ లైవ్ కన్సర్ట్ ఒకటి ప్లాన్ చేశారు. టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. సల్మాన్ ఖాన్, …
Read More »అమ్మానాన్నల పై ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ పరిధిలోని నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు చేసిన దారుణం సభ్య సమాజాన్ని భయ కంపితులను చేస్తోంది. కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చిన ఇతడిని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదు. నవ మాసాలు మోసిన తల్లి ఓ వైపు, పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుడిని చేసిన తండ్రి మరోవైపు… వారిద్దరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే… ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates