Trends

అమెరికా బోటు ప్రమాదంలో ఇద్దరు భారతీయ చిన్నారుల గల్లంతు

అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్న ఓ బోటు ప్రమాదంలో భారత్ కు చెందిన ఇద్దరు చిన్నారులు గల్లంతు అయ్యారు. పిల్లల తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు 15 మైళ్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా… ఏడుగురు గల్లంతు అయ్యారు. గల్లంతైన ఏడుగురిలో ఇద్దరు భారతీయ చిన్నారులు ఉన్నారు. అమెరికా, భారత కాన్సులేట్ …

Read More »

భారత్ – పాక్: యుద్ధం జరిగితే ఐరాస ఏం చేస్తుంది?

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి (ఐరాస-యునైటెడ్ నేషన్స్) తీసుకునే చర్యలు ఏమిటి అనేది హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంటుంది. మొదట ఐరాస శాంతితో ప్రాణాలను కాపాడే సంస్థగా ఈ సంక్షోభంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన లక్ష్యం సైనిక ఘర్షణను నివారించడం, శాంతిని పునరుద్ధరించడం. మొదట, ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ …

Read More »

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్: టాప్-4లోకి వచ్చేదెవరు?

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగాయి. అయితే, ఏడు జట్లు ఇంకా టాప్-4 కోసం పోరాడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రస్తుతం ఫేవరెట్‌గా కనిపిస్తోంది. RCB 11 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. రజత్ పటిదార్ నాయకత్వంలో ఈ జట్టు ఇంకొక్క …

Read More »

స్వచ్ఛందంగా వెళ్లిపోతే 1000 డాలర్లు బహుమతి!

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ విధానం ద్వారా బహిష్కరణ ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి సీబీపీ హోమ్ యాప్‌ను ఉపయోగించనుంది.  …

Read More »

AI ఎఫెక్ట్ : భారత్ లోనూ ఉద్యోగాలకు కోత పడనుందా?

ఏఐ తో పెరుగుతున్న ఆటోమేషన్ మరో హెచ్చరిక జారీ చేస్తోంది. అంటే మానవుల స్థానంలో యంత్రాలు లేదా సాఫ్ట్‌వేర్‌లు పనులను సులభంగా చేయడం. ఇది పనిని వేగవంతం చేస్తుంది, ఖర్చులను తగ్గిస్తుంది. ఉదాహరణగా, ఈ-కామర్స్ వేర్‌హౌస్‌లో గతంలో కార్మికులు పార్సెల్‌లను సార్ట్ చేసేవారు. ఇప్పుడు రోబోట్స్ లేదా కన్వేయర్ బెల్ట్‌లు ఆర్‌ఎఫ్‌ఐడీ స్కానర్‌లతో ఆ పనిని సెకన్లలో చేస్తాయి. ఈ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచినా, కొన్ని ఉద్యోగాలను తగ్గిస్తుంది. రీసెంట్ …

Read More »

మీ తీరు మార‌దా?: ‘ఈడీ’పై తొలిసారి సుప్రీంకోర్టు ఆగ్ర‌హం!

కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు చేస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మీరు తీరు మార‌దా? అని నిల‌దీసింది. అంతేకాదు.. క‌నీసం ఫిర్యాదును ప‌రిశీలించే స‌మ‌యం లేకుండా పోయిందా? అని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇలా అయితే.. ఈడీపై త‌గు చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని.. తామే ల‌క్ష్మ‌ణ రేఖ‌లు నిర్దేశించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈడీ వ్య‌వ‌స్థ‌కు ఉన్న గౌర‌వ మ‌ర్యాద‌ల‌ను కాపాడుకోవాల‌ని …

Read More »

పోలీసోళ్ల‌కూ చ‌లాన్లు ప‌డ్డాయ్‌.. 68 ల‌క్ష‌లు క‌ట్టాలె!!

“తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విష‌యంలో క‌ఠినంగా ఉంటారు. ఖ‌చ్చితంగా ఉంటారు.”- ఇదీ.. కొన్నిరోజుల కింద‌ట పోలీసు బాస్ చేసిన కామెంట్లు. చ‌లాన్ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైద‌రాబాదీలు.. వ్య‌క్తం చేసిన బాధ‌ను ఆయ‌న ప‌ట్టించుకునీ ప‌ట్టించుకోకుండా.. త‌న వారిని వెనుకేసుకువ‌చ్చిన తీరు.. పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. దీంతో అస‌లు సామాన్యులేనా.. పోలీసులు మాత్రం వాహ‌నాల డ్రైవింగ్ , ట్రాఫిక్ రూల్స్ విష‌యంలో త‌ప్పులు చేయ‌డం లేదా? అనే ప్ర‌శ్న‌లు కూడా …

Read More »

సన్‌రైజర్స్ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ?

ఈసారి ఐపీఎల్ మొదలవుతుండగా.. అందరి కళ్లూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదే నిలిచాయి. ఆ జట్టును టైటిల్‌కు హాట్ ఫేవరెట్‌గా పేర్కొన్నారు విశ్లేషకులు. అందుక్కారణం.. ఆ జట్టు గత సీజన్లో సృష్టించిన విధ్వంసాలే. పన్నెండేళ్లుగా నిలిచి ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును ఒకే సీజన్లో మూడుసార్లు బద్దలు కొట్టిన ఘనత సన్‌రైజర్స్ సొంతం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి విధ్వంసక బ్యాటర్లు …

Read More »

సన్ రైజర్స్.. ఇక ‘ప్లే ఆఫ్’ ఛాన్స్ ఉన్నట్టా? లేనట్టా??

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తుదిగా తలుపులు మూసుకుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడిన సన్‌రైజర్స్ ఈ ఓటమితో సీజన్ ప్రయాణాన్ని దాదాపు ముగించుకున్నట్లే ఈ మ్యాచ్‌లో మొదట …

Read More »

రూ.2000 నోట్లు.. RBI మరో సూచన!

నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 మే 19న ప్రారంభించింది. అప్పటికి దేశవ్యాప్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటి వరకు వాటిలో 98.24 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి చేరగా, మిగిలిన రూ.6,266 కోట్ల విలువైన నోట్లు మాత్రం ఇంకా …

Read More »

UPI పేమెంట్.. ఇక నుంచి మరింత వేగంగా..

ఆన్‌లైన్ పేమెంట్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడంలో UPI (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఒక ట్రాన్సాక్షన్ పూర్తయ్యేందుకు సగటున 30 సెకన్లు పట్టేది. అయితే, జూన్ 16 నుంచి ఈ వ్యవధిని సగానికి తగ్గిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై UPI డెబిట్, క్రెడిట్ ట్రాన్సాక్షన్లు కేవలం 15 సెకన్లలో పూర్తవుతాయని NPCI వెల్లడించింది. ఈ …

Read More »

వైభవ్‌కు గవాస్కర్ వార్నింగ్ గుర్తుండాల్సిందే!

ఐపీఎల్ లో మొదటి నుంచి ఫోకస్ అవుతున్న రాజస్థాన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ముంబైతో జరిగిన మ్యాచ్ ఊహించని షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు కేవలం రెండో బంతికే డకౌట్ కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. పైగా మ్యాచ్‌కి ముందు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన అంచనాలే నిజమవ్వడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా …

Read More »