ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో జరుగుతున్న పరిణామాలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు రీస్కిల్లింగ్ పేరుతో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. అక్సెంచర్ ఇటీవలే 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, పుణేలో మాత్రమే టీసీఎస్ దాదాపు 2,500 మందిని రాజీనామా చేయించిందనే వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితులు ఐటీ రంగంలోని స్థిరత్వంపై ప్రశ్నలు రేపుతున్నాయి. ఫలితంగా, ఇప్పటికే కొంతమంది ఐటీ ఉద్యోగులు వ్యవసాయ రంగంలోకి మళ్లిపోతుండగా, రానున్న రోజుల్లో …
Read More »వైన్ షాపులు బంద్.. అయినా రికార్డు
ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఒక రేంజిలో జరుగుతాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే మద్యం ఏరులై పారుతుంది. మిగతా పండుగలన్నీ ఒకెత్తయితే.. దసరా ఇంకో ఎత్తు. మందుతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని భావిస్తారు ఇక్కడి జనాలు. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి దసరాకు. ఈ ఏడాది ఒక నంబర్ చూసి ఆశ్చర్యపోతే.. తర్వాతి …
Read More »జుబిన్ గార్గ్ను చంపేశారా? కొత్త అనుమానాలు
దక్షిణాదిలో ప్రముఖ సంగీత సమ్రాట్, గానగంధర్వుడు ఎసపీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన సమయంలో అనేక సందేహాలు తెరమీదికి వచ్చాయి. కానీ, ఆయన కుమారుడు వాటిని తిప్పికొట్టి అధికారిక ప్రకటన చేసే వరకు అవి కొనసాగాయి. ఇప్పుడు అదే తరహా చర్చలు ఈశాన్య రాష్ట్రం అస్సాంనుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు జుబిన్ గార్గ్ (53) మరణం చుట్టూ జరుగుతున్నాయి. జుబిన్ గార్గ్ అస్సాంలో జన్మించి, తన గాత్ర …
Read More »షాకింగ్… వన్డే కెప్టెన్గా రోహిత్ ఔట్
భారత క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన శుభ్మన్ గిల్.. ఇప్పుడు వన్డే జట్టు సారథిగానూ నియమితుడయ్యాడు. కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. అతణ్ని వన్డే కెప్టెన్గా నియమించారు సెలక్టర్లు. ఇప్పటిదాకా వన్డే జట్టును నడిపించిన రోహిత్ శర్మ.. ఇకపై జట్టు సభ్యుడిగా మాత్రమే కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియాతో ఈ నెల 19 నుంచి జరిగే వన్డే సిరీస్కు జట్టును …
Read More »మెట్రోలో ఇంత డబ్బుతో ట్రావెల్ చేయకండి!
హైదరాబాద్ మెట్రోలో ఒక ప్రయాణికుడికి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్లో భద్రతా సిబ్బంది తనిఖీల సమయంలో ఆయన వద్ద రూ.3.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే నగదుతో ప్రయాణం అనుమతిస్తారని సిబ్బంది తెలియజేయడంతో, ఆ వ్యక్తి నగదుతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. సాధారణంగా జనాలకు ఇలాంటి విషయాల్లో అవగాహన తక్కువే. చాలా …
Read More »తోక ముడిచిన నఖ్వి.. ఆసియా కప్ ట్రోఫీ ఇండియాకే
ఇటీవల ఆసియా కప్ టీ20 టోర్నీమెంట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. తొలి మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ చేయకపోవడంతో మొదలైన గొడవ.. ఫైనల్లో గెలిచిన భారత జట్టు ట్రోఫీ లేకుండా ఇంటికి రావడం వరకు కొనసాగింది. టోర్నీలో పాక్తో తలపడ్డ మూడుసార్లూ విజయం సాధించిన భారత్.. ఆ జట్టుకు ఘోర అవమానాన్ని మిగిల్చింది. ఐతే పాకిస్థాన్ …
Read More »పసిడి ధర.. పర్సులు పిసికేస్తోంది.. రీజనేంటి?
పసిడి.. బంగారం.. స్వర్ణం.. పేర్లు ఏవైనా.. ప్రతి ఒక్కరూ పండుగల సీజన్లో అంతో ఇంతో కొనుగోలు చేయాలని భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు అత్తమామలు.. పుట్టింటివారు కూడా కానుకగా స్వర్ణాభరణాలనే ఇవ్వాలని తలపోస్తారు. ఇక, ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా పసిడి ఆభరణాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అలాంటిది.. తాజాగా పసిడి ధర అమాంతం పైపైకి పెరిగిపోయింది. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర ధరలు దిగి వచ్చినా.. అదేసమయంలో కీలకమైన …
Read More »ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం 2 నిమిషాల్లో
చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. గుయిజౌ ప్రావిన్స్లో హుజియాంగ్ గ్రాండ్ క్యానియన్ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 625 మీటర్ల ఎత్తులో నిలిచిన ఈ వంతెన ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది. రెండు గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం రెండు నిమిషాలకు తగ్గించడం దీని గొప్పతనం. సెప్టెంబర్ 28న అధికారికంగా ప్రారంభమైన ఈ వంతెన ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజలు, ఇంజినీర్లు, అధికారులు భారీగా హాజరయ్యారు. మొత్తం 2,900 …
Read More »పాక్ కెప్టెన్ అతి చూశారా?
ఆసియా కప్ టీ20 టోర్నీ సందర్భంగా ఒక క్రికెట్ మ్యాచ్లో ఎన్నడూ చూడని ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం దాడి అనంతరం పరిణామాలతో పాకిస్థాన్తో మ్యాచ్ వద్దే వద్దంటూ స్వదేశంలో నిరసనలు సాగుతున్న సమయంలో ఆ జట్టుతో తలపడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు సభ్యులతో కనీసం కరచాలనం కూడా చేయలేదు. దానికి బదులుగా తర్వాతి మ్యాచ్లో ఒక పాక్ ఆటగాడు గన్ ఫైర్ సంబరాలతో కవ్వించే ప్రయత్నం …
Read More »పాక్ కు తిలక్ పవర్ఫుల్ స్ట్రోక్.. ఆసియా కప్ మనదే!
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ మరల తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో టీమిండియా పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచి తొమ్మిదో ఆసియా కప్ను ముద్దాడింది. లక్ష్యం చేధనలో ఒక దశలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత జట్టును తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా కాపాడాడు. 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్ గా నిలిచిన …
Read More »ఒకరోజులోనే చెక్కు క్లియరెన్స్, ఎప్పటినుండో తెలుసా?
ఆర్థిక లావాదేవీల విషయంలో బ్యాంకు చెక్కులకు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం వంటి అనేక మాధ్యమాలు వచ్చినా.. వాటి ద్వారా రోజుకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ట్రాన్ష్ఫర్ అవుతాయి. కానీ, అంతకు మించి లావాదేవీలు చేసుకునేందుకు, లేదా చెల్లించేందుకు.. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సాధనం బ్యాంకు చెక్కులే. అయితే.. ఒక చెక్కును బ్యాంకులో వేసిన తర్వాత.. అది ఎప్పుడు నగదు రూపంలో …
Read More »ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఆ జెట్కు వీడ్కోలు
భారత వైమానిక దళానికి ఆరు దశాబ్దాలుగా తోడుగా నిలిచిన మిగ్ 21 జెట్కు శుక్రవారం వీడ్కోలు పలికారు. 1963లో సేవలు ప్రారంభించిన ఈ యుద్ధవిమానం ఎన్నో యుద్ధాల్లో భారత గగనతలాన్ని కాపాడింది. పాకిస్థాన్తో జరిగిన నాలుగు యుద్ధాల్లోనూ మిగ్ 21 కీలక పాత్ర పోషించింది. తన వేగం, శక్తి, చురుకుదనంతో ఇది దేశ రక్షణలో నిజమైన యోధుడిగా నిలిచింది. చండీగఢ్లో మిగ్ 21 చివరి ఫ్లైట్ నిర్వహించారు. ఎందుకంటే ఇదే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates