Trends

సూది గుచ్చకుండానే బ్లడ్ టెస్ట్.. ఎలా సాద్యమంటే?

ఇకపై రక్త పరీక్ష చేయించుకోవాలంటే చేతికి సూది పొడవాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇప్పుడు అది వాస్తవం. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు రూపుదిద్దిన కొత్త టెక్నాలజీ “అమృత్ స్వస్థ్ భారత్” టూల్‌తో ఇది సాధ్యమవుతోంది. ఇది పూర్తిగా కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే హెల్త్ స్కానింగ్ పరికరం. ఇది మన ముఖాన్ని స్కాన్ చేసి, కొన్ని క్షణాల్లోనే బ్లడ్ టెస్ట్ తో పాటు …

Read More »

“నేను దొంగను కాదు అమ్మా” : 7వ తరగతి బాలుడి సూసైడ్

Suicide

ఈ మధ్య కాలంలో పాఠశాల విద్యార్థుల మానసిక స్థితిగతులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న విషయాలకే భయపడటం, అవమానానికి తట్టుకోలేకపోవడం.. ఇలా చిన్న వయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థితికి చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటన ఇదే విషయాన్ని మరొకసారి గుర్తుచేస్తోంది. పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని గోసాయిబేర్ బజార్ ప్రాంతంలో ఏడో తరగతి చదువుతున్న క్రిషెందు దాస్ అనే బాలుడు చిప్స్ …

Read More »

‘పాక్‌’ మీద కోపం మైసూర్ పాక్‌ మీద చూపిస్తున్నారు

మైసూర్ పాక్‌.. లొట్ట‌లేయిస్తూ.. మ‌రీ మ‌న‌ల్ని ఆక‌ర్షించే మిఠాయిల్లో ఈ స్వీట్ ప్ర‌త్యేక‌తే వేరు. సంప్ర‌దాయ మిఠాయిల్లో ల‌డ్డూ త‌ర్వాత‌.. స్థానం మైసూర్ పాక్‌దే. ఇప్ప‌టికీ ఎన్ని అధునాత‌న ర‌కాల స్వీట్లు అందుబాటులోకి వ‌చ్చినా.. పెళ్లిళ్లు, విందులు, గృహ ప్ర‌వేశాలు వంటివి జ‌రినిప్పుడు.. ల‌డ్డూ వెంట‌.. మైసూర్ పాక్ ఉండి తీరుతుంది. అయితే.. ఇప్పుడు తాజాగా మైసూర్ పాక్‌ లోని పాక్ అనే ప‌దాన్ని దేశ‌వ్యాప్తంగా నిషేధించాల‌ని రాజ‌స్థాన్ మిఠాయి …

Read More »

AIని డెవలప్ చేస్తే.. చివరికి దాని వల్లే మోసపోయారు!

ఈ మధ్యకాలంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత సాధారణమైపోయింది. ప్రత్యేకంగా అమెరికాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ దిగ్గజాలు తమ నైపుణ్యాన్ని గల సిబ్బందికే ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ 6,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇందులో మూడింట ఒక వంతు మంది కేవలం ఏఐ టెక్నాలజీపై పనిచేసే వారే కావడం గమనార్హం. ఇంతకీ సమస్య ఎక్కడిదంటే, సంస్థ భవిష్యత్తు కోసం రూపొందించిన కృత్రిమ మేధ వ్యవస్థలే ఉద్యోగాలకు …

Read More »

అత్యాచారం కేసులో బేయిల్.. హీరోల తరహాలో ర్యాలీ!

కర్ణాటకలో తాజాగా చోటుచేసుకున్న ఒక దుర్మార్గపు సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు యువకులు బెయిల్‌పై విడుదలైన వెంటనే వీరుల్లా ఊరేగింపులో పాల్గొనడం కలకలం రేపుతోంది. హవేరి సబ్ జైలు నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు, సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కి ఆళూరు పట్టణం వరకు కొనసాగింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలలో, ఏడుగురు నిందితులు …

Read More »

పెళ్లవ్వకపోతే చచ్చిపోవాలా?

ప్రస్తుతం యువత పెళ్లిపై భిన్న అభిప్రాయాలతో కనిపిస్తున్నారు. కొంతమంది పెళ్లికి దూరంగా ఉండటం ఇష్టపడుతున్నారు. మరికొందరు మాత్రం కుటుంబం, సమాజం ఒత్తిడితో మౌనంగా ఒప్పుకుంటున్నారు. అయితే ఈ వివాహ వ్యవస్థలోని అంచనాలు, ఒత్తిళ్లు కొంతమందిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ శివారులో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఈ సమస్యను మళ్లీ వెలుగులోకి తెచ్చింది. 32 ఏళ్ల ప్రవీణ్ గౌడ్ అనే యువకుడు పెళ్లి సంబంధాలు కుదరడం లేదన్న కారణంతో ఆత్మహత్యకు …

Read More »

2 కోట్లతో ఆర్సీబీలో కొత్త ఆటగాడు

భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల, ప్లేఆఫ్స్‌కు సమీపంలోనే కొందరు ఆటగాళ్లు తమ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం RCBతో పాటు మరికొన్ని జట్లపై కూడా పడింది. ఈ సీజన్ కోసం కొత్త రూల్ తీసుకు వచ్చారు. ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే కొత్తగా ఎవరినైనా తెచ్చుకోవచ్చని ప్రకటన చేసింది. ఇక ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ దశకు చేరుతున్న కీలక …

Read More »

RCB: ఏంట్రా.. ఇలా తగులుకున్నారు(MI)?

2025 ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్ దశకి చేరేసరికి అసలు కథ మొదలైంది. GT, RCB, PBKS ముందుగానే టాప్ స్థానాల్లోనే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ, ముంబై ఇండియన్స్ చివర్లో స్పీడ్ పెంచి టైటిల్ రేసులో కూడా టెన్షన్ పెట్టేస్తోంది. లీగ్ మొదట్లో వరుస పరాజయాలతో వెనుకబడిన ముంబై, ఆఖర్లో వరుస విజయాలతో అభిమానులకు హోప్స్ ఇచ్చింది. ఆరో సారి కూడా టైటిల్ టార్గెట్‌గా వెళ్లే ముంబైకు ఇప్పుడు పక్కా …

Read More »

అలెర్ట్.. క్రోమ్ యూజర్లకు హెచ్చరిక!

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు అనేకమంది ఆశ్రయించే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ప్రస్తుతానికి ప్రమాదకరమైన భద్రతా లోపాలు ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లలో పాత వెర్షన్‌ క్రోమ్‌ను ఉపయోగిస్తున్నవారిపై సైబర్ ముప్పు పొంచి ఉందని వివరించింది. ఎలా దాడి జరుగుతోంది?CVE-2025-4664, CVE-2025-4609 అనే రెండు బగ్స్ వల్ల క్రోమ్ లోడింగ్, మోజో …

Read More »

ఐపీఎల్‌లో మళ్ళీ మళ్ళీ అతి.. ఒక మ్యాచ్ నిషేధం

దిగ్వేష్ రాఠి.. ఈ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు దొరికిన ఆణిముత్యం. ఢిల్లికి చెందిన ఈ యువ స్పిన్నర్‌ను 30 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది లక్నో జట్టు. ఐతే ఈ స్పిన్నర్ మైదానంలో అతిగా ప్రవర్తించడం వల్ల ఇప్పటిదాకా అతడికి పడిన జరిమానా 30 లక్షల కంటే ఎక్కువే కావడం గమనార్హం. ప్రతిభకు లోటు లేకపోయినా.. ప్రవర్తనలో అతి వల్ల దిగ్వేష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నోట్ …

Read More »

పాక్ తో జ్యోతి.. లగ్జరీ లైఫ్ వెనుక అనుమానాలు?

ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కలకలం రేగింది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్‌లో పాపులర్ అయిన ఆమెపై గూఢచర్యం ఆరోపణలు వచ్చినప్పటి నుంచి, ఆమె జీవనశైలి, విదేశీ పర్యటనలు పోలీసుల దృష్టిలోకి వచ్చాయి. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చినా… ఆమె ఖర్చుల స్థాయి మాత్రం ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రతిసారీ ఫస్ట్ క్లాస్ టికెట్లు, స్టార్ హోటళ్ల బస, విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ ఆమె వెనుక …

Read More »

ధోని ముందు వైభవ్.. కిక్కిచ్చే మ్యాచ్!

ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ ఆశలు కోల్పోయినా చెన్నై, రాజస్థాన్ మధ్య నేడు జరగనున్న మ్యాచ్‌కి ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌ రిజల్ట్‌ కంటే, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ స్ట్రాటజీకి, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మాస్ బ్యాటింగ్‌కు మధ్య ఎదురుపోరే అసలైన హైలైట్. 43 ఏళ్ల ‘తల’ మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడు, ఇక 14 ఏళ్ల హిట్టింగ్ యంగ్ స్టార్ అమాయకంగా కనిపిస్తూనే బ్యాటింగ్ తో బీభత్సం …

Read More »