Trends

Video: మందేసి రైల్వే ట్రాక్ పై కారు నడిపిన మహిళ

ఇది కలికాలం…అందులోనూ వర్షా కాలం…క్లైమేట్ బాగుంది కదా అని ఓ మహిళ అరె మామా ఏక్ పెగ్ లా అంటూ ఊటుగా తాగేసింది. అంతవరకు పర్వాలేదు….కానీ, ఆమెకు లిక్కర్ ఇచ్చిన కిక్కు సరిపోలేదు. అందుకే, ధూమ్ మచాలే..ధూమ్ మచాలే..ధూమ్ అంటూ ఏకంగా రైలు పట్టాల మీద కారు నడిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ లో మందేసి ఆమె చేసిన రచ్చ వల్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. …

Read More »

జీడిమెట్లలో తల్లి హత్య.. కొత్త కోణం బయటికి

పిల్లల్ని చంపేసి ప్రియుడితో కలిసి లేచిపోయిన తల్లి.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య.. ప్రియుడి కోసం సొంత తల్లినే చంపేసిన కూతురు.. ఈ తరహా వార్తలు ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఈ సమాజం ఎటు పోతోందో.. బంధాలు ఏమైపోతున్నాయో అని ఆందోళన రేకెత్తించే పరిణామాలివి. తాజాగా తెలంగాణలో గొప్ప పోరాట యోధురాలిగా పేరున్న చాకలి ఐలమ్మ ముని మనవరాలు.. తన కూతురి చేతిలోనే హత్యకు గురైన ఉదంతం …

Read More »

శుభాంశు శుక్లా న్యూ రికార్డ్.. ఫైటర్ పాటతో రోదసిలోకి!

41 ఏళ్ల అనంతరం మరోసారి భారత్ తరఫున వ్యోమగామి రోదసిలోకి పయనించడం గర్వకారణమైన ఘట్టం. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం ఫాల్కన్-9 రాకెట్ ద్వారా రోదసికి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం 12:01కు లాంచ్ అయిన ఈ ప్రయోగంలో శుభాంశు తో పాటు హంగేరీ, పోలాండ్‌కు చెందిన వ్యోమగాములు పాల్గొన్నారు. ఫ్రాన్స్, యూరప్, అమెరికా, …

Read More »

టీమిండియా.. ఇది ఎంత చెత్త రికార్డ్ అంటే..

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు ఓ అరుదైన చెత్త రికార్డును కూడా టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినా, బౌలర్లు మాత్రం నిరాశపరిచి జట్టుకు పరాభవం మిగిల్చారు. ఈ మ్యాచ్‌లో మొదట భారత్ భారీ స్కోరు …

Read More »

కన్నప్ప రిలీజ్: ఎన్ని వేల స్క్రీన్లో తెలుసా…

మంచు వారి కలల సినిమా ‘కన్నప్ప’ విడుదలకు సమయం దగ్గర పడింది. ఈ సినిమా ఆలోచన ఎప్పుడో పదిహేనేళ్ల ముందు మొదలైంది. అన్నీ కుదిరి అది సెట్స్ మీదికి వెళ్లడానికి చాలా టైం పట్టింది. మేకింగ్ ఆలస్యమై.. రిలీజ్ కూడా రెండుమూడుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇది.  మంచు …

Read More »

రాపర్ డ్రెస్సింగ్‌పై రచ్చ రచ్చ..

హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యవహరించడం.. దుస్తులు, చెప్పుల వంటి వాటి మీద అసభ్యకరంగా హిందూ దేవుళ్ల ఫొటోలను చిత్రించడం.. విదేశాల్లో తరచూ జరిగే వ్యవహారమే. ఇలాంటి వాటి మీద ఇండియన్స్ తీవ్రంగానే స్పందిస్తున్నారు ఈ మధ్య. అయినా ఇలాంటివి ఆగట్లేదు. ఐతే మన సంస్కృతి గురించి ఏమీ తెలియని విదేశీయులు ఇలాంటివి చేశారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ భారతీయ మూలాలు ఉన్న వాళ్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డం టూమచ్. కెనడాకు చెందిన టామీ జెనెసిస్ …

Read More »

నిహారిక విడాకులపై మొదటిసారి స్పందించిన నాగబాబు

టాలీవుడ్లో ఎంతో వేడుకగా జరిగిన సెలబ్రెటీ పెళ్ళిళ్ళలో కొణిదెల నిహారిక-చైతన్యలది ఒకటి. నాగబాబు తనయురాలైన నిహారికకు, చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడికి 2020లో ఆడంబరంగా పెళ్లి చేశాయి ఇరు కుటుంబాలు. కానీ మూడేళ్లకే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇక అప్పట్నుంచి నిహారిక సింగిల్‌గానే ఉంటోంది. నిహారికది చిన్న వయసే కావడంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని శ్రేయోభిలాషులు కోరుకుంటూ ఉంటారనడంలో సందేహం లేదు.  కూతురు విడాకులు …

Read More »

హైదరాబాద్‌లోని ఆలయానికి అంబానీ భారీ విరాళం

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నుండి భారీ విరాళం అందింది. కోటి రూపాయల మొత్తాన్ని ఆమె ఆలయ అభివృద్ధి కోసం అందజేశారు. ఈ విరాళం బుధవారం ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ అయిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని చూసి భక్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ 23న నీతా …

Read More »

ఇరాన్ పై దాడి: ట్రంప్ నిర్ణయం అప్పుడే…

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. రాబోయే రెండు వారాల్లోగా ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టాలా వద్దా అన్న అంశంపై తుది నిర్ణయం వెల్లడించనున్నట్టు ట్రంప్ పేర్కొన్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నా, అవసరమైతే బలాన్ని ఉపయోగించడానికీ వెనుకాడబోనని కూడా స్పష్టం చేశారు. …

Read More »

నిత్యానంద ఏ ‘దేశంలో’ ఉన్నారో చెప్పేసిన శిష్యురాలు

వివాదాస్పద ఆధ్యాత్మిక నాయకుడు నిత్యానంద ఎక్కడున్నారనే సందేహాలకు తాజాగా ఒక సమాధానం లభించింది. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం విచారిస్తున్న కేసులో, నిత్యానంద శిష్యురాలు అర్చన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, నిత్యానంద ప్రస్తుతం ఆస్ట్రేలియా సమీపంలోని “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” అనే ప్రత్యేక దేశంలో ఉంటున్నారట. ఈ సమాచారం ధర్మాసనంలో చర్చకు దారి తీసింది. మదురై ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకుండా 2022లో …

Read More »

అమెరికాకు ఎయిరిండియా బ్లాక్‌బాక్స్‌.. ఎందుకంటే?

గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం కొద్ది నిమిషాల వ్యవధిలోనే కూలిపోవడం వల్ల 270 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోరం అందరినీ కుదిపేసింది. ఈ విషాద ఘటనకు కారణాలను వెలికితీయాలంటే బ్లాక్‌బాక్స్ కీలక ఆధారంగా మారుతుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ బ్లాక్‌బాక్స్ ప్రమాదంలో దెబ్బతిందని అధికారులు గుర్తించారు. దాంతో, …

Read More »

ఫోన్ ట్యాపింగ్.. షర్మిళకు సుబ్బారెడ్డి జవాబు

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎంతోమంది ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో సోషల్ మీడియాలో కనిపిస్తున్న జాబితా చూసి అందరూ షాకవుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిళ సైతం తన ఫోన్ ట్యాప్ …

Read More »