సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి గాలిపటాలు ఎగరేయడంలో వచ్చే కిక్కే వేరు. అయితే, గాలిపటం ఎగరేసేందుకు దారాన్ని ఉపయోగిస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, చైనా మాంజాతో గాలిపటం ఎగరేస్తే మాత్రం మన వినోదం మరొకరికి ప్రాణ సంకటం కావొచ్చు. చైనా మాంజాపై నిషేధం ఉన్నా, వాడొద్దని ఎంత మొత్తుకుంటున్నా చాలామంది …
Read More »హమ్మయ్య… కోనసీమ మంటలు చల్లారాయి
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన బ్లోఅవుట్ ఘటన ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో చెలరేగిన మంటలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందాలు అహోరాత్రులు శ్రమించి పూర్తిగా ఆర్పివేశాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా తొలుత బావి చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకుని, గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దేశంలోని …
Read More »షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అతని చివరి మ్యాచ్ అయ్యేలా ఉంది. అద్భుతమైన ఫామ్ లో ఉన్నా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాలు చూస్తుంటే అతనికి మళ్ళీ అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్లకు ఇచ్చిన ప్రాధాన్యత షమీకి దక్కడం లేదు. ముఖ్యంగా …
Read More »ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఒక మహిళ అర్ధరాత్రి పూట మూడు ఎలుకల మందు ప్యాకెట్లను ఆర్డర్ చేయగా.. అక్కడికి వచ్చిన బ్లింకిట్ రైడర్ మాత్రం ఆమెకు అవి ఇవ్వడానికి నిరాకరించాడు. అసలు అతను అలా ఎందుకు చేశాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న అర్ధరాత్రి ఆ …
Read More »‘వ్యూస్’ కోసం పిల్లలతో అలా చేయించే వీడ్నేం చేయాలి?
వ్యూస్ వస్తే డబ్బులొస్తాయి. ఆ పైసల కోసం చేసే పాడు పనులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఒక దుర్మార్గుడు కూడా ఇలాంటి పనులే చేస్తుంటాడు. వాడి మీద తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశాడు. వీడి దారుణ చేష్టల గురించి తెలిస్తే.. ఇలాంటోడి మీద పోక్సో కేసు కూడా తక్కువే అన్న భావన కలుగక మానదు. ఇంతకూ …
Read More »వైభవ్ ఇండియా టీమ్ లోకి వస్తే ఎవరికి ఎఫెక్ట్?
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా, టీమ్ ఇండియాకు ఒక పవర్ఫుల్ వెపన్లా మారిపోయాడు. వైభవ్ వస్తున్నాడంటే అది కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే కాదు, అతని కన్సిస్టెన్సీ చూస్తుంటే సీనియర్ టీ20 టీమ్లోకి ఎంట్రీ చాలా దగ్గరలోనే ఉందనిపిస్తోంది. వైభవ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అండర్ 19 ఆసియా కప్లో …
Read More »గిల్ ను చూసి అభిషేక్ ఏం నేర్చుకోవాలి?
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. వీరిద్దరూ తన కళ్ల ముందే స్టార్ ప్లేయర్లుగా ఎదిగినా ఒకరిలో ఉన్న కసి మాత్రం వేరే లెవల్ అని యువీ చెప్పారు. ముఖ్యంగా గిల్ ఆటలో ఉన్న ఆ డెడికేషన్ అతన్ని అందరికంటే ముందు నిలబెట్టిందని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. …
Read More »పండగ తరువాత జగన్ను వెంటాడాలి: టీడీపీ నిర్ణయం!
వైసీపీ అధినేత జగన్పై విమర్శల జోరు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నా, గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, ప్రజలపై నిర్బంధాలు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన ఆగడాలను మరోసారి ప్రజలకు గుర్తు చేయాలని భావిస్తోంది. జనవరి 15 నుంచి ప్రజల మధ్యకు టీడీపీ నేతలు వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో, దీనిపై …
Read More »జోమాటో బాస్ తలకి ఉన్న ఆ ‘క్లిప్’ అసలు కథ
జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల రాజ్ షమనీ పాడ్కాస్ట్లో కనిపించినప్పుడు, ఆయన తలకి ఒక చిన్న మెటాలిక్ క్లిప్ ఉండటం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. కొందరేమో అది చూయింగ్ గమ్ అని, మరికొందరు ఛార్జింగ్ ప్యాడ్ అని రకరకాల మీమ్స్ చేశారు. కానీ అది ఒక సీరియస్ హెల్త్ గ్యాడ్జెట్ అని, దాని పేరు ‘టెంపుల్’ అని తర్వాత తెలిసింది. ఈ ‘టెంపుల్’ పరికరం మెదడుకు వెళ్లే రక్త …
Read More »ముస్తఫిజుర్ ఎఫెక్ట్: ఐపీఎల్ ప్రసారాలు బంద్
ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే పెద్ద దుమారం రేగింది. కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను తప్పించడం ఇప్పుడు అంతర్జాతీయ వివాదంగా మారింది. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు టీవీల్లో గానీ, ఆన్ …
Read More »ఫాక్ట్ చెక్… ఆలయ గోపురం ఎక్కి అతనేం చేశాడు?
తిరుమల–తిరుపతికి సంబంధించిన తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని టీటీడీ తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకుండా, అధికారిక టీటీడీ ప్రకటనలనే విశ్వసించాలని భక్తులకు సూచించింది. నిన్న రాత్రి ఒక వ్యక్తి లోనికి ప్రవేశించారు. ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్ కొయ్యల ద్వారా నడిమి గోపురం పైకి ఎక్కడం జరిగింది. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది. నిన్న రాత్రి నిజామాబాద్కు చెందిన కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతి …
Read More »వెనక కూర్చున్నా… హెల్మెట్ ఉండాల్సిందే
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విషయంలో విశాఖ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించకపోయినా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ లేకపోతే సెల్ఫోన్లో ఫొటో తీసి ఈ-చలాన్ జారీ చేస్తున్నారు. దీంతో వాహనదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates