ఆసియా కప్లో పాకిస్థాన్పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మాటలతో అభిమానులను కట్టిపడేశాడు. దుబాయ్ వేదికగా ఆడిన మ్యాచ్లో అద్భుత విజయానంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం క్రికెట్కే పరిమితం కాలేదు. ఈ సారి సూర్య తన గెలుపు సంతోషాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం చేయడం విశేషంగా మారింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య, “ఇది మా కోసం మరో గేమ్ …
Read More »దేవాన్ష్ మరో రికార్డ్: బాబు హ్యాపీ
ఏపీ మంత్రి నారా లోకేష్-బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్“గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్నాడు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో దేవాన్ష్ అవార్డ్ ను దక్కించుకున్నాడు. అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని దేవాన్ష్ తాత, ఏపీ సీఎం …
Read More »పాక్ను చిత్తు చేసిన టీమిండియా
ఆసియా కప్ 2025లో భారత్ , పాక్ మ్యాచ్ గతంలో కంటే కాస్త చప్పగానే సాగింది. అయితే దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. పాకిస్థాన్ను 127 పరుగులకే పరిమితం చేసి, లక్ష్యాన్ని 16వ ఓవర్లోనే చేధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ గ్రూప్ A లో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు …
Read More »యూకే చరిత్రలో తొలిసారి.. వలసలపై వ్యతిరేకంగా లక్ష మంది
యూనైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) రాజధాని లండన్ లో అనూహ్య రీతిలో చోటు చేసుకున్న నిరసన ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. యూకే చరిత్రలోనే అతి పెద్ద నిరసనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. వలసలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో లండన్ రోడ్లపైకి 1.10 లక్షల మంది వచ్చి నిరసన తెలిపారు. దీనికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజిమ్ పేరుతో మరో నిరసన జరిగింది లండన్ లోనే. కాకుంటే.. ఈ నిరసనకు మద్దతుగా …
Read More »నేపాల్లో ‘నెపో కిడ్స్’ విలాసాలు.. విధ్వంసానికి కారణమా?
నేపాల్ రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మరింత దారుణంగా మారిపోతున్నాయి. గత వారం ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారాయి. ముఖ్యంగా జెన్ జడ్ (Gen-Z) తరం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఆందోళనలు ఇప్పటికే తీవ్రమైన పరిణామాలకు దారితీశాయి. పోలీసులు చేసిన కాల్పులు, టియర్ గ్యాస్ దాడుల్లో 31 మంది మృతి చెందగా, వెయ్యికి పైగా గాయపడ్డారు. ఈ కల్లోలం మధ్య ప్రధాని కె.పి. శర్మ ఓలి తన పదవికి …
Read More »భారత్ – పాక్.. మొదటి సారి ఓ ఫైనల్ ఫైట్ సాధ్యమేనా?
ఆసియా కప్ ఈసారి పెద్దగా సౌండ్ లేకుండానే మొదలైంది. అందులోనూ భారత్ – పాక్ పోరు ఉంటే ఒక హై వోల్టేజ్ వైబ్ ఉండేది. కానీ ఈసారి అలా కనిపించడం లేదు. సెప్టెంబర్ 14న జరగబోయే గ్రూప్ స్టేజ్ మ్యాచ్పై కూడా పెద్దగా సౌండ్ లేదు. ఇప్పటివరకు భారత్ – పాక్ ఆసియా కప్లో 19 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 10 విజయాలు సాధించగా, పాక్ 6 విజయాలు …
Read More »అమ్ముడవని ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు
ప్రత్యర్థి ఎవరైనా సరే.. భారత జట్టు మ్యాచ్ ఆడుతోందంటే క్రికెట్ ప్రపంచమంతా అటు వైపు చూస్తుంది. ఇక ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఎలా ఊగిపోతారో తెలిసిందే. అందులోనూ మల్టీ నేషన్స్ టోర్నీల్లో ఇండియా ఆడుతుంటే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ బుధవారం నాడు ఆసియా కప్ టోర్నీలో భారత తన తొలి మ్యాచ్ ఆడినట్లు చాలామంది ఇండియన్ ఫ్యాన్స్కు తెలియని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. మామూలుగా ఆసియా కప్కు అభిమానుల్లో మంచి …
Read More »ఒకేసారి 7 వేల మంది ఖైదీలు పరారీ
నేపాల్లో యువత నిరసనలతో ఇప్పటికే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ కల్లోలానికి తోడు దేశంలోని జైళ్లలోనూ అల్లర్లు చెలరేగాయి. భద్రతా సిబ్బందిపై దాడులు, నిప్పు పెట్టడం, గోడలు దాటడం వంటి ఘటనల మధ్య దాదాపు ఏడు వేల మంది ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకున్నారు. దీంతో సాధారణ ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఖాట్మాండూ, చిట్వాన్, దిల్లీబజార్, జాలేశ్వర్, కైలాలీ, నక్కూ వంటి జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఖైదీలు …
Read More »UAEని జెట్ స్పీడ్ లో మడతపెట్టేసిన టీమిండియా
ఆసియా కప్ 2025లో భారత్ దుమ్మురేపే విజయంతో ప్రారంభించింది. దుబాయ్లో జరిగిన తొలి మ్యాచ్లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. మొత్తం మ్యాచ్ రెండు గంటలకే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్కు దిగిన యూఏఈ కేవలం 57 పరుగులకే కుప్పకూలగా, భారత్ 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. యూఏఈ ఇన్నింగ్స్ పవర్ప్లేలో కొంత మెరుగ్గా ఆడినట్లు కనిపించినా, ఆరంభం తర్వాత పూర్తిగా కుప్పకూలిపోయింది. అలీషాన్ షరాఫు బౌండరీలు …
Read More »కొత్త కారుతో నిమ్మకాయ తొక్కించబోయి…
ఇదొక అరుదైన సంఘటన.. భారీ ధర పెట్టి ఒక కొత్త కారు కొని శుభప్రదమనే ఉద్దేశంతో షోరూంలో నిమ్మకాయల్ని తొక్కించబోయిన ఓ మహిళ.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కారుతో సహా వచ్చి రోడ్డు మీద పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా.. అదృష్టవశాత్తూ సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు షోరూం సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన …
Read More »నిరసన కారుల నిప్పు: మాజీ ప్రధాని భార్య సజీవ దహనం
నేపాల్లో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రారంభమైన ఆందోళనలు.. సదరు నిషేధాన్ని ఎత్తి వేసిన తర్వాత కూడా కొనసాగడమే కాకుండా.. మరింత పేట్రేగుతున్నాయి. సైన్యం కాల్పులకు తెగబడుతున్నా.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా.. ఆందోళన కారులు ముఖ్యంగా యువత ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా దేశ రాజధాని ఖఠ్మండూలోని మాజీ ప్రధాన మంత్రి ఝలనాథ్ ఖనాల్ నివాసానికి నిప్పు పెట్టారు. లీటర్ల …
Read More »అమెరికా వీసా కొత్త నియమాలు… మనకు ఇబ్బందే!
అమెరికా విదేశాంగశాఖ తాజాగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు సంబంధించిన కఠిన నిబంధన అమలు చేసింది. ఇప్పుడు దరఖాస్తుదారులు తమ స్వదేశంలో లేదా లీగల్ రెసిడెన్సీ ఉన్న ప్రదేశంలోనే వీసా ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్నట్లుగా విదేశీ దేశాల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం ఇక లేదు. ఈ మార్పు భారతీయులకు అనేక ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్లో వీసా ఇంటర్వ్యూలు పొందడానికి ఎక్కువ సమయం పడుతోంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates