అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్ల హవా నడుస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ ఫోన్లు వినియోగించే దేశాల్లో ఒకటైన అమెరికాలో భారతీయ ఫోన్లు బలంగా అడుగుపెడుతున్నాయి. 2024 మొదటి ఐదు నెలల్లో భారత్ అమెరికాకు 21.3 మిలియన్ యూనిట్ల స్మార్ట్ఫోన్లు ఎగుమతి చేసింది. అంతేకాదు, మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా ఏకంగా 36 శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయానికి ఇది కేవలం 11 శాతమే. ఇదే …
Read More »చాట్ జీపీటీతో జర భద్రం
చాట్ జీపీటీపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ చేసిన తాజా వ్యాఖ్యలుకు ప్రపంచవ్యాప్తంగా యూజర్లు షాక్కు గురవుతున్నారు. ఇప్పటివరకు ‘రహస్యంగా ఉండే’ టెక్నాలజీగా భావించబడిన చాట్ జీపీటీ వేదికపై షేర్ చేస్తున్న సమాచారాన్ని అవసరమైతే బయటపెడతామని ఆయనే స్వయంగా ప్రకటించారు. ముఖ్యంగా న్యాయపరమైన అంశాల్లో కోర్టు ఆదేశాలు వస్తే, యూజర్ల డేటాను బయటపెడతామని ఆయన స్పష్టంగా చెప్పారు. చాట్ జీపీటీ ఉపయోగిస్తున్నప్పుడు చాలా మంది వ్యక్తిగత చర్చలు, ఐడియాలు, ఫొటోలు …
Read More »దర్శన్ బెయిల్ రద్దు కాబోతోందా?
కన్నడ కథానాయకుడు దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే వ్యక్తిని తన బృందంతో కలిసి దారుణంగా హింసించి హత్య చేయించినట్లు అభియోగాలు ఎదుర్కోవడం గత ఏడాది ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కారణాలు ఏవైనా కానీ.. రేణుకస్వామిని దర్శన్ అండ్ కో హింసించిన తీరు ఘోరాతి ఘోరం. తన గాయాలు, అనుభవించిన చిత్రహింస గురించి మీడియాలో వచ్చిన వార్తలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ఈ హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో అతను జైలు …
Read More »జీఎస్టీ ఎఫెక్ట్: కర్ణాటకలో కాఫీ, టీలు బంద్!
దేశంలో అత్యధికంగా కాఫీ, టీలు విక్రయించే, వినియోగించే వారి జాబితాలో కర్ణాటక తొలిస్థానంలో ఉంది. ఇది జాతీయ గణాంకాలు చెబుతున్న లెక్క. రెండోస్థానంలో రాజస్థాన్ ఉండగా.. మూడో స్థానంలో పంజాబ్, నాలుగులో ఏపీ ఉన్నాయి. అయితే.. తాజాగా కర్ణాటకలోని అన్ని ప్రముఖ టీ, కాఫీ విక్రయాలు జరిపే.. హోటళ్లు, క్యాంటీన్లు.. వాటి విక్రయాలను నిలిపివేశాయి. ఈ మేరకు బోర్డులు కూడా పెట్టాయి. ఇక, ఆయా హోటళ్లు, కేఫ్లలో బ్లాక్ టీ …
Read More »ఇంగ్లాండ్ పర్యటన నుంచి నితీష్ ఔట్
గత ఏడాది ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. చాలా వేగంగా స్టార్ ఆటగాడైపోయాడు. ఐపీఎల్లో మెరిసిన కొన్ని నెలలకే భారత జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటిన అతను.. గత ఏడాది చివర్లో ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కావడం.. అక్కడ ఓ టెస్టులో సూపర్ సెంచరీ సాధించి సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలతో ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కూ …
Read More »భార్యకు భరణం చెల్లించలేక దొంగతనం
నెలకు రూ.6,000 భార్యకు భరణం చెల్లించలేక, ఓ వ్యక్తి చివరకు గొలుసు దొంగగా మారిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసింది. నాగ్పూర్ నగరానికి చెందిన కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే నిరుద్యోగి, కోర్టు ఆదేశాల మేరకు మాజీ భార్యకు ప్రతినెలా భరణం చెల్లించాల్సి ఉండగా, ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో చైన్ స్నాచింగ్కి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనకు …
Read More »పాముని పట్టిన సోనూ సూద్
ముంబైలో ప్రముఖ నటుడు సోనూ సూద్ తాజాగా చేసిన ఒక ధైర్యసాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల, తన సొసైటీలోకి ప్రవేశించిన పామును ఒంటి చేత్తో పట్టుకుని, ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేయడానికి చర్యలు తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లు సోనూ సూద్ని నిజమైన హీరోగా ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే, ముంబైలోని తన నివాసం వద్ద పాము ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయంతో …
Read More »నిద్రమాత్రలు పనిచేయలేదని షాట్ పెట్టి భర్తను చంపేసింది
ఢిల్లీ నగరంలోని ఉత్తమ్నగర్ ప్రాంతంలో సంచలనం రేకెత్తించిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను తొలగించేందుకు కిరాతకంగా ప్రణాళిక రచించింది. మొదట భోజనంలో నిద్రమాత్రలు కలిపి హత్య చేయాలనుకున్నారు. కానీ అది ఫెయిల్ కావడంతో, చివరకు విద్యుత్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీశారు. ఈ ఘటన నవంబర్ 13న చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తమ్నగర్కు చెందిన సుస్మితకు, భర్త …
Read More »సోషల్ మీడియా పోస్టులు.. వాటిపై కేసులు ఉండవ్!
సోషల్ మీడియాలో వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, విమర్శలు వంటివాటిపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. జైళ్లలో పెడుతున్నారు. ఏపీ విషయానికి వస్తే.. 2019 నుంచి కూడా సోషల్ మీడియా వ్యాఖ్యలు, విమర్శలపై కేసులు నమోదు కావడం.. జైళ్లలో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాను భావ ప్రకటనా స్వేచ్ఛలో కీలక భాగమని పేర్కొంది. ఆర్టికల్ 19 ప్రకారం …
Read More »ట్రంప్ పాకిస్తాన్ పర్యటన.. రెండు దశాబ్దాల తర్వాత ఇలా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్లో పాకిస్తాన్ను సందర్శించనున్నారన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ను వైట్హౌస్లో కలవడమే కాకుండా, ఆ తరువాత పాకిస్తాన్ పర్యటనను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది జరిగితే, 2006లో జార్జ్ బుష్ వచ్చిన తర్వాత పాకిస్తాన్కు వచ్చే రెండో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందుతారు. అయితే …
Read More »పోర్షే కారు కేసులో మైనర్ బాలుడిని అడల్ట్గా ఎందుకు చూడట్లేదు?
2024 పుణేలో ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న పోర్షే కారు ప్రమాదానికి కారకుడైన 17 ఏళ్ల బాలుడిపై తిరిగి చర్చ మొదలైంది. బాలుడిని పెద్దవాడిగా (అడల్ట్) శిక్షించాలన్న డిమాండ్ పెరిగినా, జువెనైల్ జస్టిస్ బోర్డు మాత్రం తేల్చేసింది. అతడిపై నమోదైన కేసులు ఏదీ ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్షను కలిగించేవి కావని పేర్కొంది. అందుకే, అతడిని మైనర్గానే విచారించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో బాలుడు మద్యం సేవించి దాదాపు 180 …
Read More »డ్రగ్స్-గంజాయి: దొరికిపోతున్న ఏఎస్పీ, డీసీపీల పిల్లలు!
సమాజాన్ని సరైన దారిలో పెట్టాల్సిన పోలీసులే.. దారి తప్పుతున్నారు. బయట ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నంలో వారి కుటుంబాలు గాడి తప్పుతున్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఏపీలోనూ.. తెలంగాణలోనూ.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఏఎస్ఐ కుమారుడికి ఉగ్రవాదులతో లింకులు ఉన్న విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇది మరుపునకు రాకముందే.. విశాఖ జిల్లాకు చెందిన ఓ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates