Trends

అక్కడ రూ.1000 కోట్ల అద్దె

ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ తాజాగా బెంగళూరులో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది. ఇది కేవలం సాధారణ లీజు ఒప్పందం కాదు, పదేళ్లలో యాపిల్‌ చెల్లించబోయే అద్దె మొత్తం చూసి దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం సైతం ఆశ్చర్యపోతోంది. నెలకు రూ.6.3 కోట్ల అద్దెతో మొదలయ్యే ఈ ఒప్పందం, ప్రతి ఏడాది 4.5 శాతం …

Read More »

ఎయిర్టెల్‌ డౌన్‌ అయ్యిందా?

సోమవారం మధ్యాహ్నం ఎయిర్టెల్‌ నెట్‌వర్క్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్‌ ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు కాల్స్‌ చేయలేకపోవడం, మెసేజ్‌లు పంపలేకపోవడం, మొబైల్‌ ఇంటర్నెట్‌ పనిచేయకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. డౌన్‌డిటెక్టర్‌ వెబ్‌సైట్‌లో సుమారు 3,200 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 66 శాతం నెట్‌వర్క్‌ సమస్యలు, 18 శాతం డేటా యాక్సెస్‌ సమస్యలు, 16 శాతం సిగ్నల్‌ లేకపోవడంపైగా ఉన్నాయి. యూజర్లు X (ట్విట్టర్‌)లో కూడా …

Read More »

రూ.474 కోట్ల బీమా.. దేశంలోనే సంపన్న గణపతి!

ముంబయి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది మరో రికార్డు సృష్టించాయి. మతుంగా ప్రాంతంలోని జీఎస్‌బీ సేవామండల్ వినాయక మహోత్సవానికి ఏకంగా రూ.474.46 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నారు. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరుగాంచిన ఈ మండపం, ప్రతిసారి బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించబడుతుంది. అదే కారణంగా భీమా మొత్తం ఏటా పెరుగుతూనే వస్తోంది. ఈ ఏడాది వినాయకుడికి అలంకరించనున్న బంగారం, వెండి ఆభరణాల విలువను దృష్టిలో పెట్టుకుని సుమారు రూ.67 …

Read More »

ఆసియా కప్‌ 2025: 10 సెకన్లకు రూ.16 లక్షలు

ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. సెప్టెంబర్ 10న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియా బరిలోకి దిగుతున్న ప్రతి మ్యాచ్‌కి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండటంతో, ప్రకటనల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉంటే, యాడ్ రేట్లు రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఈసారి ఆసియా కప్‌ ప్రసార హక్కులు …

Read More »

‘ఖాకీ’ రూపంలో వెంకన్న.. భక్తుడి ప్రాణం భద్రం

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై శుక్రవారం అద్భుతమే జరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో కుప్పకూలిపోగా… అది గమనించిన ఓ కానిస్టేబుల్ ఆయనకు సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ చేసి బతికించారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా వెంకన్నే కానిస్టేబుల్ రూపంలో వచ్చి… తన దర్శనం కోసం వచ్చిన భక్తుడి ప్రాణాలను కాపాడారని స్వామి వారికి గోవింద నామ స్మరణలు చేశారు. ఈ ఆసక్తికర ఘటన కాస్తంత ఆలస్యంగా …

Read More »

ధోనీ నిర్ణయంతోనే జట్టులో చోటు కోల్పోయా

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, తన కెరీర్‌లో కీలక సమయంలో జట్టులోంచి పక్కన పడటానికి అప్పటి కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ నిర్ణయమే కారణమని బహిరంగంగా చెప్పాడు. ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఇర్ఫాన్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. శ్రీలంకతో మ్యాచ్‌లో తాను, అన్న యూసఫ్ పఠాన్ కలిసి క్లిష్ట పరిస్థితుల్లో విజయాన్ని అందించినప్పటికీ, ఆ తరువాతి సిరీస్‌కే తనను పక్కన …

Read More »

రొనాల్డో ఇండియాకు వస్తాడా?

ఫుట్‌బాల్‌ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్‌ దక్కే అవకాశం ఉంది. పోర్చుగీస్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో భారత్‌లో ఆడే అవకాశం వచ్చేసింది. AFC చాంపియన్స్ లీగ్ టూ 2025 -26 డ్రాలో సౌదీ అరేబియా క్లబ్‌ అల్ నస్ర్, భారత సూపర్ లీగ్ జట్టు FC గోవా ఒకే గ్రూప్‌లోకి వచ్చాయి. ఈ గ్రూప్ Dలో ఇరాక్‌కి చెందిన అల్ జావ్రా FC, తజికిస్తాన్‌ క్లబ్ FC ఇస్తిక్లోల్ కూడా ఉన్నాయి. …

Read More »

సుదర్శన చక్రం: భారత ఆకాశానికి కొత్త కవచం

భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలపరచడానికి “సుదర్శన చక్రం” పేరుతో ఒక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ ప్రణాళికను ప్రకటించారు. ఇది కేవలం క్షిపణి రక్షణ కవచమే కాకుండా, సైబర్ దాడుల నుండి భౌతిక దాడుల వరకు విస్తృత భద్రతను కల్పించే వ్యవస్థగా ఉండనుంది. ఇజ్రాయెల్‌ ‘ఐరన్ డోమ్’, అమెరికా ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ …

Read More »

జీఎస్టీ సింప్లిఫికేషన్‌: ఇక రెండు శ్లాబు రేట్లు మాత్రమే

దేశ పన్ను విధానంలో పెద్ద మార్పు రాబోతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 5%, 12%, 18%, 28% జీఎస్టీ రేట్లను తగ్గించి, కేవలం రెండు శ్లాబులకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి నాటికి ఈ మార్పులు అమల్లోకి రావచ్చని సూచనలు ఉన్నాయి. దీని ద్వారా సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు, పరిశ్రమలపై ఉన్న పన్ను భారం తగ్గి, వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రధాని మోదీ స్వాతంత్ర్య …

Read More »

ఎక్కడివారక్కడే!…తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం!

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో గడచిన కొన్ని రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రోజుల తరబడి వర్షం కురుస్తుండగా… తాజాగా బుధవారం నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధవారం రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ప్రయాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. …

Read More »

హైద‌రాబాద్‌కు ఏమైంది ప‌ట్ట‌ప‌గ‌లు దోపిడీ కాల్పులు

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం అంటే ప్ర‌స్తుతం పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానం. రియ‌ల్ ఎస్టేట్ రంగానికి ప‌సిడి న‌గ‌రం. అదేస‌మ‌యంలో స్టార్ట‌ప్‌లు, మెట్రోలు ఇలా అనేక సంస్థ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం కూడా ఈ న‌గ‌రాన్ని ప్ర‌పంచ స్థాయికి చేర్చే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. అయితే అలాంటి న‌గ‌రంలో ప‌ట్ట‌ప‌గ‌లు దోపిడీలు పెరిగిపోతున్నాయి. 24 గంట‌ల కింద‌ట శంషాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంటులో భారీ దోపిడీ జ‌రిగింది. దీనిపై ప్ర‌భుత్వం, పోలీసులు కూడా విచార‌ణ చేప‌ట్టారు. ఈ …

Read More »

కిరాణా కొట్టు యజమానికి.. కోహ్లీ, పాటిదార్, ABD వరుస కాల్స్!

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చిన్న గ్రామంలో కిరాణా వ్యాపారి జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. వరుసగా వచ్చే ఫోన్ కాల్స్‌లో ఒక్కొక్కరు నేను విరాట్ కోహ్లీ, నేను ఏబీ డివిలియర్స్ అని చెప్పడం మొదలుపెట్టారు. మొదట ఇది ఫ్రాంక్ కాల్ అనుకున్న వ్యాపారి, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రాజత్ పాటిదార్ స్వయంగా ఫోన్ చేయడంతో కథ మలుపు తిప్పుకుంది. నిజం తెలియని ఆ వ్యక్తి “నేను సీఎస్‌కే …

Read More »