సమాజాన్ని సరైన దారిలో పెట్టాల్సిన పోలీసులే.. దారి తప్పుతున్నారు. బయట ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నంలో వారి కుటుంబాలు గాడి తప్పుతున్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఏపీలోనూ.. తెలంగాణలోనూ.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఏఎస్ఐ కుమారుడికి ఉగ్రవాదులతో లింకులు ఉన్న విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇది మరుపునకు రాకముందే.. విశాఖ జిల్లాకు చెందిన ఓ …
Read More »1993 ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవారా?
1993, మార్చి 12…ముంబై బాంబు పేలుళ్ల ఘటన జరిగి దాదాపు 32 ఏళ్లు కావస్తోంది. అయినా సరే, ఆ పేలుళ్ల గురించి వార్తల్లో వింటే చాలు ఆ పేలుళ్ల బాధితులు, పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు. ఒక్క రోజులోనే ముంబైలోని 12 ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో మొత్తం 257 మంది చనిపోగా..1400 మంది గాయపడ్డారు. అయితే, వేలాదిమందికి పీడకలగా మిగిలిన …
Read More »బ్రేకింగ్: నిమిష ఉరిశిక్ష వాయిదా
మిడిల్ ఈస్ట్ దేశాలలో హత్య వంటి నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ క్రమంలోనే యెమెన్ లో ఓ యెమెన్ జాతీయుడిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియకు అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ఆమెను కాపాడేందుకు బ్లడ్ మనీ రూపంలో ఆమె కుటుంబం చేసిన ప్రయత్నాలు దాదాపుగా విఫలమయ్యాయి. నిమిషకు ఉరిశిక్ష రద్దు చేయాలని …
Read More »లార్డ్స్ టెస్టు.. చేతులారా చేజార్చుకున్న టీమిండియా
చేతివరకు వచ్చిన మ్యాచ్ ను చివరలో చేజార్చుకుంది టీమిండియా. చివరి నిమిషాల్లో ఒక్క చిన్న తప్పిదం ఓ టెస్టు మ్యాచ్ను ఎలా మార్చేస్తుందో లార్డ్స్ టెస్టు మరోసారి రుజువు చేసింది. ఐదు టెస్టుల సిరీస్లో ఇది మూడో మ్యాచ్. భారత్కు ఈ గేమ్ చాలా కీలకమైనది. కానీ జడేజా చివరలో పోరాటం చేసినా ఫలించలేదు. గెలుపు దగ్గరకి వచ్చి చేజార్చుకోవడం అందరికీ బాధ కలిగించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 387 …
Read More »15 వేళ మందిని తొలగించిన మైక్రోసాఫ్ట్.. ఇది మరో హెచ్చరిక
ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయని చాలామందికి భయం. ఇప్పుడు అదే నిజం చేస్తూ మైక్రోసాఫ్ట్ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. కేవలం ఈ ఏడాదిలోనే 15 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించిన ఈ టెక్ దిగ్గజం… మిగిలిన ఉద్యోగులకు కూడా ఒక్క క్లియర్ సూచన ఇచ్చింది “AI లో నైపుణ్యం పెంచుకోండి, లేదంటే బయటకు వెళ్లండి.” 2025 నాటికి కంపెనీ ఏఐ కోసం 80 బిలియన్ డాలర్లు …
Read More »వచ్చింది హాలిడే ట్రిప్కు కాదు.. దేశం కోసం – గంభీర్
విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం పై వచ్చిన విమర్శల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల కొంతమంది ఆటగాళ్లపై దృష్టిసారించింది. ఈ అంశంపై ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించగా, అతని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశం తరపున ఆడేందుకు వచ్చాం కానీ హాలిడే టూర్కు కాదని గంభీర్ తేల్చిచెప్పారు. తాజాగా చటేశ్వర్ పుజారాతో జరిగిన ముఖాముఖి …
Read More »ఈ బ్యాగ్ 65 కోట్లు!
పాతది, వాడినదే అయినా.. దానికి ధర మాత్రం ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ జేన్ బిర్కిన్ కోసం 1984లో ప్రత్యేకంగా తయారు చేసిన హెర్మెస్ బ్యాగ్ ఇటీవల ఊహించని ధరకు అమ్ముడై ఓ చరిత్ర సృష్టించింది. మచ్చలు నిండిన పురాతన శైలితో ఉన్న ఈ బ్లాక్ లెదర్ బ్యాగ్ చివరకు దాదాపు ₹65 కోట్లకు విక్రయమై చరిత్రలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్బ్యాగ్గా గుర్తింపు పొందింది. పారిస్లో …
Read More »సిగాచీ విషాదం.. ఇది అన్నింటికంటే ఘోరం
హైదరాబాద్ శివార్లలోని పాశమైలారం ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అగ్నికి ఆహుతి అయ్యారు. అందులో ఇప్పటిదాకా 44 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఆ మృతదేహాలు ఏవీ కూడా ఒక ఆకారంతో ఉన్నవి, గుర్తు పట్టేవి కావు. ఎముకలు కూడా బూడిదైపోయి.. చిన్న చిన్న ఆనవాళ్లు దొరికితే వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు …
Read More »యెమెన్ చట్టానికి బలైన ఒక కేరళ నర్సు కథ !
ఒక హత్య కేసులో కేరళకు చెందిన నర్సు ఒకరు దోషిగా తేలటమే కాదు.. ఆమెకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పునకు సంబంధించి అమలు తేదీని తాజాగా ఖరారు చేశారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ నెల 16న ఆమెకు ఊరిశిక్ష అమలు చేయనున్నారు. దేశం కాని దేశంలో ఆమె హత్య చేయటానికి కారణమేంటి? ఆమెను ఊరిశిక్ష నుంచి తప్పించేందుకు ఇప్పటివరకు జరిగిన పరిణామాల్ని చూస్తే..కేరళకు చెందిన నిమిషా ప్రియ …
Read More »ఈసారి వేలంలో సెహ్వాగ్, కోహ్లీ వారసులు
డిల్లీలో నిర్వహించనున్న DPL 2025 టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఈసారి స్టార్ ఆటగాళ్ల కన్నా ఎక్కువగా చర్చకు వస్తున్న వారసుల పేర్లు కూడా ఉన్నాయి. అందులో ఇద్దరు యువ ఆటగాళ్లు వేలంలో ప్రత్యేకంగా నిలిచారు. వీరిలో ఒకరు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు కాగా, మరొకరు విరాట్ కోహ్లీ అన్న కుమారుడు. ఇద్దరూ చిన్నతనంలో నుంచే క్రికెట్లో రాటు దేలుతూ ఇప్పుడు ప్రొఫెషనల్ …
Read More »‘మస్క్ జీవితంలో ఇదే అతిపెద్ద తప్పు’
అమెరికాలో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇటీవల ‘అమెరికా పార్టీ’ అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించడంతో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. మూడో పార్టీ ఏర్పాటు అమెరికాలో అసాధ్యం అని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇది మస్క్ జీవితంలో తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయమని, ఆయన నియంత్రణ కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ ఈ విషయాన్ని తన …
Read More »వానలతో కొట్టుకొచ్చిన రూ.50 లక్షల గంజాయి గుట్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానల కారణంగా ఒక పెద్ద గంజాయి రహస్యాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. అశ్వారావుపేట – దమ్మపేట మండలాల మధ్య ఉన్న ఓ ఆయిల్ ఫామ్ తోటలో దాచిన గంజాయి వరద నీటిలో బయటపడటం స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల తోటలోని మట్టితో కప్పిన గంజాయి ప్యాకెట్లు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చెత్త, మట్టితో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates