మాతో చ‌ర్చించాకే.. హైకోర్టు త‌ర‌లించాలి: కేంద్రం

ఏపీ హైకోర్టు మార్పుపై కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేసింది. మూడు రాజ‌ధానుల్లో భాగంగా క‌ర్నూలును న్యాయ రాజ‌ధాని చేస్తామ‌ని.. వైసీపీ త‌ర‌చుగా చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై పార్ల‌మెంటులో టీడీపీ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కేంద్రం-రాష్ట్రం క‌లిసి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. త‌మ‌తో చ‌ర్చించాకే హైకోర్టును త‌ర‌లించాల‌ని పేర్కొంది.

హైకోర్టును కర్నూల్‌కు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ఏర్పా టైందన్నారు.

రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటయిందన్నారు.

ప్రస్తుత ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదలను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయ ని కిరణ్ రిజిజు అన్నారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు రాజధాని అమరావతి నగరంలో, పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టాల్సిం దిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించిందన్నా రు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.మాతో చ‌ర్చించాకే.. హైకోర్టు త‌ర‌లించాలి: కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీ హైకోర్టు మార్పుపై కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేసింది. మూడు రాజ‌ధానుల్లో భాగంగా క‌ర్నూలును న్యాయ రాజ‌ధాని చేస్తామ‌ని.. వైసీపీ త‌ర‌చుగా చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై పార్ల‌మెంటులో టీడీపీ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కేంద్రం-రాష్ట్రం క‌లిసి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. త‌మ‌తో చ‌ర్చించాకే హైకోర్టును త‌ర‌లించాల‌ని పేర్కొంది.

హైకోర్టును కర్నూల్‌కు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానా ల పరిధిలో ఉందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ఏర్పా టైందన్నారు.

రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటయిందన్నారు.

ప్రస్తుత ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదలను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయ ని కిరణ్ రిజిజు అన్నారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు రాజధాని అమరావతి నగరంలో, పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టాల్సిం దిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించిందన్నా రు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.