Political News

లోకేష్ ఇన్నన్నా.. కిక్కురుమ‌న‌లేదే..!!

రాజ‌కీయాల్లో నేత‌లు ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. ఒకరి పై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం కామ‌నే. పైగా వైసీపీ-టీడీపీ నేత‌ల మ‌ధ్య ఈ వివాదాలు.. కౌంట‌ర్లు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నాయి. ఇక‌, తాజాగా టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చిత్తూరు జిల్లాలో న‌డుస్తున్నారు. అయితే.. ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తే.. అక్క‌డి ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుంటున్నారు. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. …

Read More »

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. క‌విత చేసిన త‌ప్పేంటి?

ప్ర‌స్తుతం తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కురాలు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత పేరు ఊరూ వాడా మార్మోగుతోంది. ఢిల్లీలో వెలుగు చూసిన‌.. లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆమె పాత్ర ఉంద‌ని.. పేర్కొంటూ.. ఈడీ ఇప్ప‌టికే ఆమెను ఒక‌సారి విచారించింది. ఇప్పుడుమ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని పిలిచింది. ఈ విచార‌ణ త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుంది? అనేది ఉత్కంఠ‌గా మారింది. దీంతో అస‌లు క‌విత కు ఈ కేసుకు సంబంధం ఏంటి? అనేది సామాన్యుల ప్ర‌శ్న‌. …

Read More »

అమరావతి భూములు అమ్మేస్తోందా ?

రాజధానిగా అమరావతి పనికి రాదు కానీ అమ్మకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భూములు మాత్రం కావాలా ? ఇపుడిదే ప్రశ్న అమరావతి ప్రాంతం రైతుల నుండి ఎదురువుతోంది. వివిధ అవసరాల కోసం అమరావతి ప్రాంతంలోని 14 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసింది. అమరావతి ప్రాంతంలోని రెండు గ్రామాల్లో 14 ఎకరాలను ఈ వేలం పద్దతిలో అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ వేలం ద్వారా సుమారు రు. …

Read More »

ప్రతీ అడుగు, ప్రతీ మాట వ్యూహాత్మకమే…

ఆయన పార్టీ అధినేత కొడుకు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు. ఇంతకాలం తండ్రి చాటు బిడ్డడిగానే కనిపించారు. తండ్రి పై కోపంతో ప్రత్యర్థులు ఆయనకు పెట్టిన పేరు పప్పు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరేం చేసినా సహనమే సొంత ఆయుధంగా ఆయన ముందుకు సాగారు. ఇప్పుడు యువగళం పాదయాత్ర ప్రారంభించి నెల దాటిన నేపథ్యంలో నారా లోకేష్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి …

Read More »

చేసిన మంచి పనులే చిరస్థాయిగా….

పార్టీలు వస్తాయి..పోతాయి…సీఎంలు వస్తారు..పోతారు.. చాలా మంది కాలగర్భంలో కలిసిపోతారు. కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతారు. మన తన అన్న భేదం లేకుండా సహాయం చేసే వారే ఎక్కువ కాలం ప్రజల నోళ్లలో నలుగుతారు… అలాంటి వారిలో చంద్రబాబు ఒకరిని ఇటీవల జరిగిన ఘటన నిరూపిస్తోంది.. పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ ఒకప్పుడు వైసీపీకి కొమ్ముకాశారు. టీడీపీని అనరాని మాటలు అన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ …

Read More »

‘ఎమ్మెల్సీ’ ఎన్నిక‌లు జ‌గ‌న్ ఫ్యూచ‌ర్ తేల్చేస్తాయా?

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు సెమీఫైన‌ల్‌గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్‌ను ప‌క్క‌న పెడితే.. ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్పుడు వైసీపీకి ప్రాణ‌సంక‌టంగా మారాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి ఎన్నిక‌ల్లో ఆయా వ‌ర్గాలు.. అంటే టీచ‌ర్లు, ప‌ట్ట‌భ‌ద్రులు మాత్ర‌మే ప్ర‌చారం చేస్తారు. పోటీలోనూ వారే ఉంటారు. అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా …

Read More »

రాధాకు హామీ లభించిందా ?

వంగవీటి రాధాకృష్ణకు హామీ లభించిందా ? పార్టీవర్గాల్లో ఇపుడీ విషయమీదే చర్చ జరుగుతోంది. ఈనెల 14వ తేదీన జనసేనలో చేరటానికి రాధా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటిది హఠాత్తుగా మంగళవారం ఉదయం పాదయాత్రలో ఉన్న నారాలోకేష్ ను రాధా కలిశారు. ముందు పాదయాత్రలో పాల్గొన్న రాధా తర్వాత భోజన విరామ సమయంలో లోకేష్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. పార్టీవర్గాల …

Read More »

తమ్ముళ్ళపై నిఘా పెంచుతున్న చంద్రబాబు

తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన. ఇందులో భాగంగానే ఆర్ధికంగా అత్యంత పటిష్టంగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కు పార్టీ పగ్గాలను అప్పగించారు. తెలంగాణాలోని ఖమ్మంలో భారీఎత్తున బహిరంగసభ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలను అమలు చేయిస్తున్నారు. కార్యక్రమాల్లో తమ్ముళ్ళు సరిగా పాల్గొంటున్నారా లేదా కార్యక్రమాలతో జనాల్లోకి నేతలు వెళుతున్నారా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు కార్యక్రమాల అమలు, …

Read More »

కవితకు ఈడీ నోటీసులు

అనుకున్నట్లే జరుగుతోంది. కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో సీబీఐ ఆమెను ప్రశ్నిస్తే ఇప్పుడు ఈడీ ఆమె వెంట పడుతోంది. గురువారం ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తర్వాత కవితకు సమన్లు ఖాయమని భావించారు. ఇప్పుడు అదే జరిగింది. కవితకు తాను బినామీనని పిళ్లై అంగీకరించిన నేపథ్యంలో …

Read More »

కోడికత్తి కనిపించలేదట

వినటానికే విచిత్రంగా ఉంది ఈ విషయం. 2018లో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసులో కత్తే కీలకమైన సాక్ష్యం. అలాంటిది విచారణలో అసలు కత్తే కనిపించలేదని కోర్టు గుర్తించటం మరింత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ విషయం ఏమింటే జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ మంగళవారం జరిగింది. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ మొదలైనపుడు దాడికి సంబందించి …

Read More »

రామ్ మాధవ్ ఏమయ్యారు?

దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నా ప్రభుత్వ పదవులు కానీ చట్టసభల్లో స్థానం కానీ కోరుకోకుండా పనిచేసే నాయకులున్న రాజకీయ పార్టీ అంటే ఒక్క బీజేపీయే. ఆ పార్టీలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ కాకుండా… నామినేటెడ్ పోస్టులు కూడా చేపట్టకుండా కేవలం పార్టీ పదవుల్లో ఉంటూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసే నాయకులు బీజేపీలో వేలాదిమంది ఉంటారు. వారిలో జాతీయ స్థాయిలో పనిచేసేవారూ ఉంటారు. …

Read More »

యువ‌గ‌ళంలో వంగ‌వీటి రాధా

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న ఈ పాద‌యాత్ర‌కు టీడీపీ నేత‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. యువ నాయ‌కులు అంద‌రూ నారా లోకేష్‌తో క‌లిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు, టీడీపీ నేత వంగ‌వీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్‌తో పాదాలు క‌లిపారు. …

Read More »