జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ కలుసుకున్నారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయిన వీరు.. తెలంగాణ రాజకీయాలు.. అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్టు తెలిసింది. ఈ రోజు మధ్యాహ్నం.. ప్రత్యేకంగా పవన్ ఇంటికి చేరుకున్న కిషన్రెడ్డి, లక్ష్మణ్లు.. పవన్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జనసేన-బీజేపీ పొత్తులో ఉన్న విషయం …
Read More »బరాబర్ అంటా..కవితకు అర్వింద్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వాగ్వాదం నడుస్తోంది. బతుకమ్మ పండుగ చేసుకునేందుకు వచ్చిన తన గురించి అర్వింద్ అసభ్యకరంగా, అభ్యంతరకంగా మాట్లాడారని కవిత మండిపడ్డారు. కేసీఆర్ బిడ్డను కాబట్టి, ఏది పడితే …
Read More »ఏపీలో కుల గణన? జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
వచ్చే 2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని తీరాలనే కసితో ఉన్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులాల వారీగా ఉన్న జనాభా ఎంత? వారి ఓటు బ్యాంకు ఎవరికి అనుకూలంగా ఉందనే విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఒక సర్వేను అధికారికంగా, మరో సర్వేను అనధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలో కులాల వారీగా జనాభా …
Read More »గుర్రం ఎగరా వచ్చు.. సీఎం కానూవచ్చు: జానా రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “గుర్రం ఎగరావొచ్చు.. నేను సీఎం కానూ వచ్చు.. ఎవరు మాత్రం చెప్పగలరు” అని ఆయన ఆసక్తిగా వ్యాఖ్యానించారు. సుమారు 50 ఏళ్లకుపైగా రాజకీయా ల్లో ఉన్న జానారెడ్డి తొలుత టీడీపీలో రాజకీయ పాఠాలు నేర్చారు. అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత..అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బాట పట్టారు. ఈ …
Read More »నాగం ఎదురు తిరిగారే?
నాగం జనార్ధన్ రెడ్డి. టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. 2012 ఉప ఎన్నికలతో కలిపి నాగర్ కర్నూల్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా పోటీ చేసేందుకు గాను కాంగ్రెస్ టికెట్ ఆశించారు. …
Read More »క్వాష్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీం తీర్పు
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబును శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వ్యవహారంపై తీర్పును సుప్రీం కోర్టు …
Read More »రేవంత్ కు తప్పని తిప్పలు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలనే సంకల్పంతో సాగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తిప్పలు తప్పడం లేదనే చెప్పాలి. రాష్ట్రంలో పార్టీకి ఏర్పడుతున్న సానుకూల పవనాలను ఓట్లుగా మార్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి వ్యూహాల్లో మునిగిపోయారు. పార్టీ విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు. కానీ పార్టీలోని ఇతర నేతల నుంచి ఆయనకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా …
Read More »తుమ్మలకు ఖమ్మం… పొంగులేటికి పాలేరు
పాలేరు టికెట్ కోసం పట్టుబట్టిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మధ్య సమోధ్య కుదిరిందా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. దీంతో పాలేరును వదిలేసుకున్న తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. మరోవైపు పాలేరులో విజయ దుందుభి మోగించేందుకు పొంగులేటి కసరత్తుల్లో మునిగిపోయారని …
Read More »చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా.. రీజనేంటంటే
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సర్కారు స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్లో రూ.341 కోట్ల అవినీకి పాల్పడ్డారంటూ అరెస్టు చేయడం.. జైల్లో పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో అసలు దీనిని కొట్టి వేయాలంటూ.. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై అనేక వాయిదాల తర్వాత.. తాజాగా మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా ఈ పిటిషన్పై …
Read More »బీఆర్ఎస్ కు షాక్.. బోథ్ ఎమ్మెల్యే ఔట్!
ఎన్నికల సమరంలో దూసుకెళ్తోన్న బీఆర్ఎస్ కు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో అసంత్రుప్తి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతోందని చెప్పాలి. టికెట్లు దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ను వీడే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో …
Read More »టీ-టీడీపీ : బాలయ్య సరే.. పవన్ కూడా ప్రచారం చేస్తే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరంభం పెద్ద ఎత్తున ముందుకు సాగుతుండడం.. ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయిస్తుండడం.. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో మరో ప్రధాన పార్టీ తెలుగు దేశం కూడా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయన నేరుగా ఈ కార్యకలాపాలపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. …
Read More »నందమూరి సుహాసిని.. ఈ సారి పక్కా.. టీడీపీ స్కెచ్ ఇదే!
నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచు.. నందమూరి సుహాసిని ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్డడం ఖాయమని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయకులు. ఎందుకంటే.. ఈ సారి పార్టీ వ్యూహం .. అడుగులు వేరేగా ఉన్నాయని చెబుతున్నారు. గత 2018 ఎన్నికల్లో తొలిసారి నందమూరి కుటుంబం నుంచి ఆడపడుచు రాజకీయాల్లోకి వచ్చింది (పురందేశ్వరి లైన్ వేరు). దివంగత హరికృష్ణ గారాల పట్టి అయిన సుహాసిని గురించి అప్పటి వరకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates