Political News

అంకెలు.. సంఖ్య‌లు త‌గ్గుతున్నాయే.. కాంగ్రెస్ గుస‌గుస‌!!

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందు 110.. నోటిఫికేష‌న్ వ‌చ్చాక 100.. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ స‌మ‌యానికి 90 నుంచి 100 మధ్యలో.. ప్ర‌చారం ప్రారంభించాక‌.. 90.. ఇప్పుడు 80- ఇదీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల లెక్క‌!! ఇదెవ‌రో చెప్పిన మాట కాదు.. స్వ‌యంగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి నుంచి సీనియ‌ర్ నాయ‌కులు త‌డ‌వ‌కోసారి చెబుతున్న అంకెలు.. సంఖ్య‌లు!! ఇప్పుడు ఈవిష‌య‌మే కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ చ‌ర్చ‌గా …

Read More »

ఏపీలో రౌడీల రాజ్యం.. వ‌రంగ‌ల్‌ స్పూర్తితో త‌ట్టుకుంటున్నాం: ప‌వ‌న్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 8 స్థానాల‌లో పోటీ చేస్తున్న జ‌న‌సేన అభ్య‌ర్థుల త‌ర‌ఫున తొలిసారి ఆ పార్టీ చీఫ్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మైకు ప‌ట్టారు. వ‌రంగల్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ నిర్వ‌హించిన విజ‌య‌సంక‌ల్ప యాత్ర బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో రౌడీలు రాజ్యామేలుతున్నారని, గూండాల పాలన నడుస్తోందని ప‌వ‌న్ దుయ్య‌బ‌ట్టారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేందుకు వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని …

Read More »

కాంగ్రెస్ దే అధికారమా ? లోక్ పోల్ జోస్యం

తొందరలో జరగబోతున్న తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం ఖాయమేనా ? తాజాగా వెల్లడైన లోక్ పోల్ సర్వే ఇదే విషయాన్ని చెబుతోంది. 46 శాతం ఓటింగ్ షేరుతో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని సర్వేలో బయటపడిందట. కాంగ్రెస్ కు 69-72 సీట్లు ఖాయంగా వస్తాయని సర్వే చెప్పింది. బీఆర్ఎస్ 35-39 సీట్ల మధ్యే పరిమితమవుతుందని తేలింది. బీఆర్ఎస్ 40 సీట్లు తెచ్చుకోవటం కూడా కష్టమేనని సర్వేలో తేలినట్లు లోక్ …

Read More »

ఎటుచూసినా నేరచరితులేనా ?

తెలంగాణా ఎన్నికల్లో ఇపుడొక ఆందోళనకరమైన విషయం బయటపడింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన వివరాల ప్రకారం వివిధ పార్టీల తరపున పోటీచేస్తున్న 360 మంది అభ్యర్ధుల్లో 226 మంది నేరచరితులేనట. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తరపున పోటీచేస్తున్న వారిలో అత్యధికులు నేరచరితులే అన్న విషయం బయటపడింది. అంటే వీళ్ళల్లో గెలిచిన చాలామంది రేపు మన ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో కూర్చుంటారు. చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశించకూడదన్నది మామూలు జనాల …

Read More »

వారం రోజులు అగ్ని ప‌రీక్షే..

మ‌రో వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 30న పోలింగ్‌కు స‌ర్వ‌సిద్ధ‌మైంది. దీంతో నాయ‌కులు, పార్టీలు దూకుడు పెంచాయి. కానీ.. ఇన్నాళ్ల‌యినా.. తెలంగాణ స‌మాజం నాడిని మాత్రం ప‌ట్టుకోలేక పోయారు. అధికార పార్టీ బీఆర్ఎస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌ల మ‌ధ్యే.. పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని తెలిసినా.. ఎవ‌రి వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతారో ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త రాలేదు. చిట్ట‌చివ‌రి నిముషంలో అంచ‌నాలు మారితే.. అప్పుడు …

Read More »

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు నో టిక్కెట్‌…!

అన్నా రాంబాబు. పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నాయ‌కుడు. ప్ర‌స్తుతం గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే… నిత్యం ఏదో ఒక సంచ‌ల‌న కామెంట్‌తో మీడియా ముందుకు వ‌చ్చే అన్నా.. ఇటీవ‌ల కాలంలో ఫుల్ సైలెంట్ అయిపోయారు. అంతేకాదు.. విమ‌ర్శ‌ల జోరు కూడా త‌గ్గించారు. నిజానికి స్వ‌ప‌క్షంలో విప‌క్షం అన గ‌లిగే రేంజ్‌లో అన్నా విమ‌ర్శ‌లు అంద‌రికీ తెలిసిందే. ఏ పార్టీలోనూ అన్నా సంతృప్తి చెందిన …

Read More »

‘పేడ’ కొంటాం.. రాజ‌స్థాన్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హామీ

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క‌లో ఈ ఏడాది మేలోజ‌రిగిన ఎన్నిక‌ల్లో 5 గ్యారెంటీలు ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి వీటిని 6కు పెంచింది. ఇక‌, ఇప్ప‌టికే ఎన్నిక‌లు పూర్త‌యిన మిజోరాంలో అస‌లు ఏగ్యారెంటీ కూడా ఇవ్వ‌లేదు. ఇక‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబ‌ట్టి.. …

Read More »

చంద్రబాబు బెయిల్ పై సుప్రీం కోర్టుకు సీఐడీ?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఈ ప్రకారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు ఈ నెల 28న పూర్తి కావస్తోంది. దీంతో, ఈ …

Read More »

17 సీట్లపైనే కేసీఆర్ ప్రత్యేక దృష్టి ?

ప్రత్యేక తెలంగాణా ఏర్పడినప్పటి నుండి గడచిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవని సీట్లు 17 ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వీటన్నింటిని లేకపోతే కనీసం మెజారిటీ స్ధానాల్లో అయినా గెలవాలని కేసీఆర్ మహా పట్టుదలగా ఉన్నారు. ఇందుకనే వీటిపై ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మొదటి నుండి తెలంగాణా ఉద్యమంతో ఖమ్మం జిల్లాకు సంబంధం లేకుండానే రాజకీయాలు నడిచిపోతున్నాయి. రాష్ట్రమంతా తెలంగాణా ఉద్యమం …

Read More »

కాంగ్రెస్ లోకల్ అస్త్రాన్ని ప్రయోగించబోతోందా ?

తొందరలో జరగబోతున్న తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోకల్ అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. ఇన్నిరోజుల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్ధులందరు కేసీయార్ ప్రభుత్వ వైఫల్యాలను, పార్టీ నేతల అరాచకాలను బాగా హైలైట్ చేస్తున్నారు. అయితే ప్రచారానికి ఉన్నది మరో వారంరోజులు మాత్రమే కాబట్టి కాసింత స్ట్రాటజీని మార్చాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేసీయార్ వైఫల్యాలపై ఆరోపణలు గుప్పిస్తునే ఎక్కువగా లోకల్ సమస్యలను బాగా హైలైట్ చేయబోతున్నారట. ప్రతి నియోజకవర్గంలోను ఎన్నో సమస్యలున్నాయి. అలాగే సంక్షేమపథకాల …

Read More »

విశ్వ‌రూప ద‌ర్శ‌నం ఎక్క‌డ‌?.. అమ‌లాపురం టాక్‌..!

అమ‌లాపురం ఎమ్మెల్యే.. మంత్రి పినిపే విశ్వ‌రూప్ క‌నిపించ‌డం లేదా? ఆయ‌న ఎవ‌రితోనూ క‌లివిడిగా లేరా ? అంటే.. ఔన‌నే అంటున్నారు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు. అప్పుడెప్పుడో .. కోన‌సీమ జిల్లా పేరు మార్పు స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఆయ‌న మొహం కూడా తాము చూడ‌లేద‌ని చెబుతున్నారు. అయితే.. మ‌రోవైపు మంత్రి వ‌ర్గం మాత్రం సార్ గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో బిజీబిజీగా ఉంటున్నార‌ని వెల్ల‌డిస్తున్నారు. కానీ, వాస్త‌వానికి అమ‌లాపురంలో గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం …

Read More »

మొదలవ్వబోతున్న యాత్రల జోరు

తెలుగుదేశంపార్టీలో మళ్ళీ యాత్రల జోరు మొదలవ్వబోతోంది. ఈ యాత్రలు జోరు కూడా ఈనెలలోనే మొదలయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. చంద్రబాబునాయుడుకు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వటమే కాకుండా ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో రెట్టించిన ఉత్సాహం కనబడుతోంది. మెడికల్ గ్రౌండ్స్ తో  మధ్యంతర బెయిల్ స్ధానంలో పూర్తిస్ధాయి రెగ్యులర్ బెయిల్ దొరకటం చంద్రబాబు అండ్ కో కు పెద్ద రిలీఫనే చెప్పాలి. ఇదే సమయంలో జడ్జిచేసిన కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబుతో పాటు …

Read More »