రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కేది అనుమానమే అన్న విషయాన్ని మంత్రి రోజా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్లున్నారు. అందుకనే మీడియాతో మాట్లాడుతు నగరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకేనే వాళ్ళ గెలుపుకు పనిచేస్తానని ప్రకటించారు. టికెట్ అయితే తనకే వస్తుందని తనకు కాకుండా ఎవరికిచ్చినా అభ్యంతరంలేదన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో మాటలకు ఇప్పటి మాటలకు చాలా తేడావచ్చేసింది. నగరిలో తాను తప్ప ఇంకెవరు పోటీచేయరని గతంలో చెప్పేవారు. …
Read More »పాత కేసులను తిరగ తోడుతున్నారా ?
సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ కు విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులకు ఏదో రకంగా డ్రగ్స్ తో గట్టి బంధముందన్న విషయం చాలాసార్లు బయటపడింది. కేసీయార్ హయాంలో టాలివుడ్-డ్రాగ్స్ బంధంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరిమీదా సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. సినిమా పరిశ్రమలోని కొందరు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలు ఎంతగా వినిపించినా అప్పట్లో కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ బాధితులుగా …
Read More »ఫిబ్రవరి 10న ముహూర్తం ఫిక్సయ్యిందా ?
సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయ్యిందా ? అవుననే అంటున్నాయి ఎన్నికల కమీషన్ వర్గాలు. ఫిబ్రవరి 10 వ తేదీన నోటిఫికేషన్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల కమీషన్ రెడీ అయినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ వర్గాలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు సమాచారం కూడా అందించిందంట. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి ఉన్నతాధికారులు రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటించబోతున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవబోతున్నట్లు …
Read More »మంగళగిరిలో ఓటమికి కారణం చెప్పిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబరు 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర పూర్తయిన తర్వాత తన భవిష్యత్ కార్యచరణపై లోకేష్ ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో తన ఓటమికి …
Read More »టికెట్ దక్కకపోతే.. ఒంటరిపోరుకు రెడీ..
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గతంలో మాదిరిగా కేవలం జెండా మోసి బతికేసే నాయకులు.. అధినేత ఏది ఇస్తే అది తీసుకుని సర్దేసుకునే నాయకులు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా.. మా కేంటి? అనే టైపులోనే రాజకీయాలు సాగుతున్నాయి. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. పాతతరం నాయకులు అయితే.. ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో వచ్చిన జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. నడుచుకుంటూ చట్ట సభలకు వెళ్లిన వారు …
Read More »కేటీఆర్ కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే అన్ని హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరింటిలో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. దీంతో, ఆ విషయాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు …
Read More »టీడీపీ-జనసేన కలిస్తే ఏమవుద్ది?
టీడీపీ-జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక, ఇప్పుడు టికెట్ల వ్యవహారం మాత్రమే తేలాల్సి ఉంది. అధికారంలోకి వచ్చాక పదవుల వ్యవహారంపై దృష్టి పెడతామని జనసేన అధినేతపవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే.. అధికార వైసీపీ ఒకింత ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు ఇరు పార్టీలు కలవకూడదని అనుకున్నా.. కలిసి పోటీకి రెండు పార్టీలూ రెడీ అయిపోయిన దరిమిలా.. వ్యూహాలు మారుస్తోంది. …
Read More »తనకు టికెట్ కన్ఫర్మ్ అంటోన్న రోజా
వైసీపీ ఎమ్మెల్యేలలో 11 మంది సిట్టింగ్ ల స్థానాలను సీఎం జగన్ మార్చిన సంగతి తెలిసిందే. దాంతోపాటు మరో 45 మందితో సెకండ్ లిస్ట్ కూడా రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే గోదావరి, గుంటూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలతో జగన్ నిన్న భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ …
Read More »20 ఏళ్ల తర్వాతైనా.. టీడీపీ అక్కడ బోణీ కొట్టేనా..!
ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 20 ఏళ్లబట్టి.. టీడీపీ ఆ నియోజకవర్గంలో పల్టీలు కొడుతోంది. రాజధాని ఇచ్చామని.. ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించామని చెప్పిన 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ పార్టీ పుంజుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా.. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుం దా? విజయం దక్కించుకుంటుందా? అనేది ఆసక్తికర చర్చగా మారింది. అదే.. గుంటూరు తూర్పు నియోజకవర్గం. 2008కి పూర్వం గుంటూరు-1 నియోజకవర్గంగా ఉన్న …
Read More »బర్రెలక్క మాటలు విన్నావా జగన్?
ఒక వేలును చూపేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్లు మన వైపు చూపిస్తాయన్న చిన్న విషయాన్ని మరిచి.. రాజకీయ శత్రుత్వంలో గీత దాటేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం బర్రెలక్క పేరును వాడేస్తూ.. పవన్ మీద వేసిన పంచ్ లు.. ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయి. బర్రెలక్కను పొగిడేస్తూ.. పవన్ ను తెగనాడే జగన్ ధోరణి ఏ మాత్రం సరికాదంటూ ఆమే …
Read More »కేసీయార్ కు ఉచ్చు బిగుస్తోందా ?
కేసీయార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే అనుమానంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజి రిజర్వేయర్ నిర్మాణ లోపాలే ఇపుడు కేసీయార్ కు శాపాలుగా మారబోతున్నాయా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది ఆధ్వర్యంలో మేడిగడ్డ రిజర్వాయర్ లోపాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజిని నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్ధ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. బయటపడిన లోపాలు, వాటి …
Read More »ప్యాలెస్ కాలింగ్…వైసీపీ ఎమ్మెల్యేస్ షివరింగ్
2024 ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సీఎం జగన్ రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎటు చూసినా సరే ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే 11 మంది సిట్టింగ్ల స్థానాలను జగన్ మార్చిన వైనం మిగతా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతోంది. మరో 45 మంది జాబితా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates