Political News

ఛైర్మన్ కుర్చీకోసం మూడు ముక్కలాట

సుప్రపిద్ధ తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి కోసం పార్టీలో ముగ్గురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఇద్దరుంటే మరొకరు బీసీ సామాజికవర్గం. నిజానికి వైసీపీలో ఎవరు ఏ స్ధానానికీ ప్రయత్నాలు చేసుకునేది అంటు ఉండదు. పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇష్టప్రకారమే జరుగుతుంది. మొహమాటానికి వెళ్ళి, ఒత్తిళ్ళకు గురై జగన్ ఏ పోస్టును ఎవరికీ ఇవ్వరన్న విషయం ఇప్పటికే …

Read More »

పార్లమెంటులో ‘ఇండియా’ రెచ్చిపోవటం ఖాయమా ?

పార్లమెంటులో ఇండియా కూటమి రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మణిపూర్లో రెండురోజుల పాటు ఇండియా కూటమి తరపున 21 మంది ఎంపీలు పర్యటించి ఢిల్లీకి చేరుకున్నారు. తమ పర్యటనలో ఎంపీల బృందం ఇటు కుకీలు అటు మొయితీ తెగల నేతలతో సమావేశమయ్యారు. రెండు తెగల వాదనలు విన్నారు. మధ్యే మార్గంగా సమస్యల పరిష్కారానికి ఎంపీలు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. తర్వాత తమ పర్యటనలో తాము చూసింది, గ్రహించింది, సమస్యలు, …

Read More »

సీట్లిస్తామ‌న్నా క‌ద‌ల‌డం లేదుగా… త‌మ్ముళ్ల‌లో మౌనం ఎందుకో?!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ సారి వ‌చ్చే ఎన్నికల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తాన‌ని చెబుతున్నారు. ముందు 30 శాతం.. త‌ర్వాత ఈ ఏడాది మేలో జ‌రిగిన మ‌హానాడులో 40 శాతం మేర‌కు..యువ‌త‌కు టికెట్లు ఇస్తామ‌ని.. అంతేశాతం పార్టీలోనూ ప‌ద‌వులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. యువ‌త పెద్ద ఎత్తున స్పందించి.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయాల‌ని …

Read More »

ఉత్త‌మ్‌.. రేవంత్‌ను వాడుకుంటున్నారా?

మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్‌లో ముస‌లం మొద‌లైంది. తాను కాంగ్రెస్‌లోనే ఉంటున్న‌ప్ప‌టికీ పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం చేస్తున్నారని కీల‌క నేత‌, న‌ల్గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తాజాగా ప్ర‌క‌టించారు. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలోని ఓ కీల‌క నాయ‌కుడే ఇదంతా చేస్తున్నార‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. ఆ కీల‌క నాయ‌కుడు ఎవ‌ర‌నే పేరు ఉత్త‌మ్ చెప్ప‌న‌ప్ప‌టికీ.. అది టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో మ‌ళ్లీ …

Read More »

భీమిలిని బాబు వ‌దులుకుంటారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో పార్టీల‌న్నీ వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు, క‌స‌ర‌త్తుల‌పై దృష్టి సారించాయి. త‌మ‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, గెలిచే అవ‌కాశం ఉన్న ప్రాంతాలు.. ఇలా పార్టీల అధినేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని జ‌న‌సేన చూస్తోంది. మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇదే స్థానంపై దృష్టి పెట్టార‌ని తెలిసింది. …

Read More »

“నా మీద న‌మ్మ‌కం లేదా..” మ‌హిళ‌కు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్‌

క‌ర్నూలు జిల్లాకు చెందిన మైనారిటీ నాయ‌కుడు, వైసీపీ ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న ఓ మ‌హిళ‌తో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఆడియోలో ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ ఓ మ‌హిళ‌తో మాట్లాడుతూ.. ‘‘నా మీద నీకు నమ్మకం లేదా? బిజినెస్‌లో షేర్‌ ఇస్తాం కదా! ఎంత పెట్టుకోగలవు’’ అని అన్నారు. దీనికి స‌ద‌రు మ‌హిళ ‘‘3 వరకు …

Read More »

మ‌రింత ముదిరిన పొంగూరు ప్రియ వ్య‌వ‌హారం..

టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారాయ‌ణ త‌మ్ముడి భార్య పొంగూరు కృష్ణ ప్రియ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింది. తాజాగా ఆమె నారాయ‌ణ‌పై చ‌ర్య‌లు కోరుతూ.. రాయ‌దుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం… తనను వేధిస్తూ… బెదిరింపులకు గురిచేస్తున్నా రని ఆమె ఆరోపించారు. ఈ మేర‌కు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పాటు.. ఆమె మ‌రో సెల్ఫీ వీడియో …

Read More »

బండి ప‌రుగులు.. ఇక ఏపీలోనా?

తెలంగాణ‌లో బీజేపీకి జోష్ పెంచిన నేత‌గా బండి సంజ‌య్‌ను చెప్పుకోవ‌చ్చు. 2020 మార్చిలో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించినప్ప‌టి నుంచి త‌న మాట‌ల్లో, చేత‌ల్లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ పార్టీని ప‌రుగులు పెట్టించారు. రాష్ట్రంలో పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాలు చేశారు. గ్రామ స్థాయి నుంచి క్యాడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డంలో కాస్త స‌ఫ‌ల‌మ‌య్యారు. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో బండి సంజ‌య్ ఉంటే ప‌ని కాద‌ని అనుకున్న బీజేపీ …

Read More »

వైసీపీ ఎంపీలు భ‌య‌ప‌డుతున్నారు!: ఉండ‌వ‌ల్లి హాట్ కామెంట్స్‌

మాజీ ఎంపీ, రాజ‌కీయ విశ్లేష‌కులు.. ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌.. వైసీపీ ఎంపీల‌పై షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష కూట‌మి ఇండియా అవిశ్వాస తీర్మానం ఇచ్చింద‌ని.. కానీ, దీనిని 36 మంది వైసీపీ ఎంపీలు వ్య‌తిరేకిస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? కేంద్రానికి వైసీపీ ఎంపీలు భ‌య‌ప‌డుతున్నారా? ఇలా చేస్తుంటే.. వారు భ‌య‌ప‌డుతున్నార‌నే అనుకుంటాం అని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఎవ‌రికి ఎన్ని సొంత ప‌నులు ఉన్నా.. …

Read More »

వైసీపీ ఫస్ట్ జాబితా రెడీ !

రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీలో మొదటి జాబితా రెడీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా పండుగ తర్వాత జాబితా ప్రకటన ఉంటుందని నేతలు అంటున్నారు. మొదటి జాబితాను 72 మందితో జగన్ రెడీచేశారట. ఇందులో 50 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలు, మిగిలిన 22 మంది కొత్తముఖాలట. ఏ ఏ నియోజకవర్గాలతో మొదటి జాబితా రెడీ అయ్యిందనే విషయం తెలియకపోయినా మొత్తం మీద సంఖ్య, పాత, కొత్త ముఖాలతో రెడీ …

Read More »

ఏపీని సరిగా అర్థం చేసుకోని మోడీ

ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిని నియమించినా, కార్యవర్గాన్ని మార్చినా, జాతీయ స్థాయిలో ఏపీ ఇన్చార్జిలను మార్చినా ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే మార్చాల్సింది నేతలను కాదన్న విషయాన్ని కేంద్ర నాయకత్వం గమనించటం లేదు. అసలు మారాల్సిందే నరేంద్ర మోడీ వైఖరి. ఏపీ విషయంలో మోడీ వైఖరి మారనంత వరకు అధ్యక్ష స్థానంలో ఎవరున్నా, ఎన్ని కార్యవర్గాలను మార్చినా, ఇన్చార్జిలుగా ఎవరిని నియమించినా ఎలాంటి ఉపయోగముండదు. చేయాల్సిన డ్యామేజంతా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతు …

Read More »

బీజేపీకి 6 ఎంపీ సీట్లా ?

తాజాగా ఇండియా టు డే-సీఎన్ఎక్స్ సంస్ధ తెలంగాణాకు సంబంధించి విడుదల చేసిన ప్రీ పోల్ సర్వే వివరాలు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ కు 8 వస్తాయట. ఇపుడు తొమ్మిది మంది ఎంపీలున్నారు. అంటే ఒక సీటు మైనస్ అవుతుందని తేలింది. ఇక బీజేపీకి ఆరుసీట్లు వస్తాయని సర్వే ద్వారా తేలింది. ఇపుడు నాలుగు ఎంపీ స్ధానాలు మాత్రమే ఉన్నాయి. అంటే రెండు …

Read More »