శ్రీరాముడి పేరుతో ఎన్నికల మాయ చేస్తున్న మోడీ… తాజాగా పెట్రోలు ధరలతో మరో మాయ మొదలుపెట్టారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఒక విషయం వైరల్ అవుతోంది. అదేమిటంటే పెట్రోల్, డీజల్ ధరలను కేంద్రప్రభుత్వం బారీగా తగ్గించబోతోందని. ధరలు తగ్గించాలని చమురు కంపెనీలు మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపిందట. మంత్రిత్వశాఖ కూడా ఈ విషయమై సానుకూలంగా స్పందించి, కసరత్తు చేసి నరేంద్రమోడీకి ధరల తగ్గింపుపై సిఫారసు చేసినట్లు ఢిల్లీ నుండే వార్తలు …
Read More »తెలంగాణా బీజేపీకి షాక్ తప్పదా?
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు తెలంగాణా బీజేపీకి షాక్ తప్పేట్లులేదు. పార్టీలోని ముగ్గురు కీలకమైన నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగానే జరుగుతున్న ప్రచారాన్ని చూడాల్సుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో ప్రముఖ నేత కూడా బీజేపీకి తొందరలో రాజీనామాలు చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. కాంగ్రెస్ లో చేరబోయే ముగ్గురు నేతలు కూడా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటం …
Read More »జంపింగ్ నేత పట్టు.. జగన్ బెట్టు..?
ఆయన జంపింగ్ నాయకుడు. గత టీడీపీ హయాంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. పైగా ప్రముఖ వ్యాపారి, కాంట్రాక్టరుగా కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రశిద్ధుడు కూడా. అయితే.. గత ఎన్నికల్లో ఓడిపోయిన దరిమిలా.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఆయన పదవుల కోసం వేచి చూశారు. కొన్ని రోజులు రాజ్యసభ అన్నారు. మరికొన్ని రోజులు ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇస్తారని భావించారు. కానీ, ఇవేవీ …
Read More »చంద్రబాబుకు భలే ఛాన్స్
టీడీపీ అధినేత చంద్రబాబుకు భలే ఛాన్స్ చిక్కిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నిక ల్లో ఎక్కడ ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలి? అధికార పార్టీతో ఉన్న పోటీని తట్టుకుని నిలబడగలిగే నాయ కులను ఎవరిని ఎంపిక చేయాలి? అనే విషయాలు.. ఆయనకు ఇక, చాలా వరకు తేలిక అవుతుందని చెబుతున్నారు. దీనికి కారణం.. నువ్వు ముందా? నేను ముందా? అన్నట్టుగా ఉన్న అభ్యర్థుల ఎంపికలో వైసీపీ ముందేనని తేలిపోయింది. దీంతో …
Read More »ఆ.. సైలెంట్ ఎమ్మెల్యేకు చెక్ పెడుతున్నారా?
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ఎమ్మిగనూరు. ఇది రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ స్థానం. ఈ నియోజకవర్గం నుంచి 1978లో జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పార్టీ ఏదైనా రెడ్డి నాయకుడికే చోటు దక్కుతోంది. ఇతర సామాజిక వర్గాలకు చోటు ఇవ్వడమే లేదు. ఈ క్రమంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కె. చెన్నకేశవ రెడ్డి కూడా.. చాలా సీనియర్ నాయకుడు. అయితే, 80 +కు చేరుకోవడంతో …
Read More »జగన్… రాజకీయాలకు అనర్హుడు: చంద్రబాబు
తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ మండలాల్లో ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా పర్యటిస్తూ.. సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా శాంతిపురం మండలంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. జగన్ లాంటి పాలకుడు రాజకీయాలకు అనర్హుడని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేయడానికి కాదని విమర్శలు …
Read More »నాకేమన్నా అయితే జగన్, భారతిలదే బాధ్యత: బీటెక్ రవి
సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలో టీడీపీ నేత, పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై బీటెక్ రవి పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఓ కేసులో బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక, తాజాగా బీటెక్ రవికి జగన్ సర్కారు గన్ మెన్ లను తొలగించింది. ఈ …
Read More »సీఎం చెప్పిన గంటలో 9 మందికి ఆర్థిక సాయం
సీఎం జగన్ శుక్రవారం నాడు భీమవరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను జగన్ కు విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే వారి సమస్యలను విన్న జగన్ సానుకూలంగా స్పందించారు. వారికి తక్షణ సాయం అందించి ఆదుకోవాలని …
Read More »జగన్ ముందు బలప్రదర్శన.. దారిలోకి తెచ్చేసుకుందామనేనా?!
సాధారణంగా నాయకులు తమ పంతం నెరవేరకపోయినా.. తాము అనుకున్నది జరగకపోయినా.. వెంటనే బలప్రదర్శనకు దిగుతుంటారు. కొన్నాళ్లుగా పాలిటిక్స్లో ఇది కామన్ అయిపోయింది. ఇలాంటి బల ప్రదర్శనలు చేయడం ద్వారా పార్టీలు.. పార్టీల నాయకులు దిగివచ్చి తమ కోరికలు నెరవేరుస్తారని అనుకుంటారు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నా యి. అయితే.. ఇవి అందరి దగ్గరాకాదు. పైగా.. వైసీపీ అధినేత జగన్ దగ్గర ఇలాంటి బల ప్రదర్శన రాజకీయాలు అసలే …
Read More »వర్మా.. దమ్ముంటే ఈ సినిమాలు తీ: లోకేష్ సవాల్
టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. తన యువగళం పాదయాత్రలో ‘రెడ్బుక్’ను చేత్తో పట్టుకుని ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత కాలంలో ఈ రెడ్ బుక్ చుట్టూ అనే వివాదాలు.. విమర్శలు.. చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ కేసులో ఏపీ సీఐడీ ఏకంగా.. రెడ్ బుక్ విషయాన్ని నేరుగా హైకోర్టులోనే ప్రస్తావించింది. రెడ్ బుక్ పేరుతో అధికారులను నారా లోకేష్ బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపింది. ఇలా.. ఇటీవల …
Read More »జనసేనకు కూడా వ్యూహకర్త కావాలా…!
ప్రస్తుతం వ్యూహకర్తల హవా రాజకీయాల్లో ఎలా ఉందో తెలిసిందే. ఏపీ విషయానికి వస్తే.. ప్రతి ప్రధాన పార్టీకీ ఒక వ్యూహకర్త ఉన్నాడు. కాంగ్రెస్కు సునీల్ కనుగోలు ఉన్నట్టుగానే.. టీడీపీకి ప్రస్తుతం రాబిన్ శర్మ ఉన్నారు. భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ వస్తాడా? రాడా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం రాబిన్ శర్మ నేతృత్వంలోనే టీడీపీ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక, వైసీపీకి ఐప్యాక్ ఉండనే ఉంది. అంటే మొత్తంగా ప్రధాన పార్టీలకు వ్యూహకర్తలు …
Read More »మరింత పట్టు బిగిస్తేనే జేసీ గెలుపు… !
వచ్చే ఎన్నికల్లో పార్టీల వ్యూహాలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉన్న లెక్క వేరు. వారసత్వాన్ని చూసి.. లేదా.. యువ నాయకుడు అనే సానుభూతి చూపి ప్రజలు గెలిపించిన పరిస్తితి ఉంది. కానీ, ఇప్పుడు వైసీపీ వేస్తున్న అడుగులు.. వీటికి భిన్నంగా ఉన్నాయి. ప్రజలను మరింతగా మెస్మరైజ్ చేసేలా ఆ పార్టీ వ్యూహాలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నాయకులు.. ముఖ్యంగా గెలుపు గుర్రంపై ఆశలు పెట్టుకున్నవారు మరింతగా కష్టపడాలనేది పరిశీలకుల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates