Political News

కాంగ్రెసోళ్లకు ఇంత క్రియేటివిటీనా?

తెలంగాణ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ఇంకో 20 రోజుల్లోనే ఎన్నికలు జరగబోతుండటంతో అన్ని ప్రధాన పార్టీలూ ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా తాము సాధించిన ఘనతల్ని చెప్పుకుంటూ.. కాంగ్రెస్ వస్తే చాలా కష్టం అనే సంకేతాలు ఇస్తూ జనాలను తమ పార్టీ వైపే నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్స్.. ఫిలిం, టీవీ సెలబ్రెటీలు రంగంలోకి …

Read More »

వైసీపీలో లీడ‌ర్ల‌కు రెస్ట్‌.. ఇక ప్ర‌చారం డ్యూటీ వాళ్ల‌దే…!

ఏపీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అలుపెర‌గ‌కుండా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న నాయ కులు.. ప్ర‌జ‌ల ఇంటింటి చుట్టూ తిరిగిన నాయ‌కులు అనేక మంది ఉన్నారు. కొంద‌రు తూతూ మంత్రంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన మిగిలిన వారు చాలా మంది మ‌న‌సు పెట్టారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ కానీ, వైనాట్ 175 కానీ.. ఇలా అనేక కార్య‌క్ర‌మాలు వైసీపీ ఎమ్మెల్యేలు చేశారు. …

Read More »

నన్ను జైలుకు పంపింది ఎర్రబెల్లి: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో బీర్ఎస్ నేతలపై కాంగ్రెస నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను జైలుకు …

Read More »

త‌న‌యుడి కోసం తండ్రి పాట్లు.. గ‌తాన్ని ఏక‌రువు పెట్టి మ‌రీ!

లాంగ్ లాంగ్ ఎగో.. అంటూ… తన కుమారుడి విజ‌యం కోసం.. గతాన్ని త‌వ్వేస్తున్నారు మాజీ మంత్రి, కాం గ్రెస్ నాయకుడు కుందూరు జానా రెడ్డి. మీ కోసం నేన‌ప్పుడు అది చేశా.. నా కోసం మీరిప్పుడు మా అబ్బాయి ని గెలిపించండి! అంటూ.. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. సాగ‌ర్ నియోజ‌క వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా జానా రెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే …

Read More »

షర్మిల ద్రోహి.. బహిష్కరించాం: గట్టు రామచంద్రరావు

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటున్నానని వైఎస్ఆర్టిపి అధినేత్రి వైయస్ షర్మిల కొద్ది రోజుల క్రితం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సొంతగానే తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన షర్మిల హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా షర్మిలపై ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »

ప్రచార రథంపై నుంచి పడిన కేటీఆర్

మరి కొద్దిరోజుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ ప్రచార రథం వ్యాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనంపై …

Read More »

చంద్రబాబుకు సుప్రీంలో దక్కని ఊరట

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించారు. అయితే, ఆ క్వాష్ పిటిషన్ కొట్టివేత వ్యవహారంపై వాదోపవాదాలు పూర్తయిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు …

Read More »

ఖైర‌తాబాద్‌లో అన్నా చెల్లెళ్ల ‘రాజ‌కీయం’

తెలంగాణ‌లో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఖైర‌తాబాద్‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ర‌కంగా.. పెద్ద‌ద‌నే చెప్పాలి. 13 మండ‌లాలు.. వీటిలో 8 మాస్ ఏరియాలు ఉన్నాయి. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకోవాలంటే మాస్ రాజ‌కీయ‌లు కావాలి. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ త‌ర‌ఫున మాజీ నేత‌, దివంగ‌త ప‌బ్బ‌తి రెడ్డి జ‌నార్ద‌న్‌రెడ్డి కుమార్తె ప‌బ్బతిరెడ్డి విజ‌య పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్ప‌టికి రెండు మూడు పార్టీలు మారిన …

Read More »

టార్గెట్ కాంగ్రెస్‌: తెలంగాణ‌పై కేంద్రం పంజా.. ఎవ‌రికి న‌ష్టం?!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌ల ఇళ్ల‌పై ముఖ్యంగా ఆ పార్టీ త‌ర‌ఫున పోటీచేస్తున్న అగ్ర‌నేత‌ల ఇళ్ల‌పై ఐటీ దాడులు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహించింది. ఖమ్మం, హైదరాబాద్‌‌లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. దీనికి ముందు.. ఖ‌మ్మం అభ్య‌ర్థి, ఇటీవలే బీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ …

Read More »

దేశాన్ని నడిపించే సామర్థ్యం మోడీకి ఉంది: ప‌వ‌న్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గురించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌న దేశాని కి మోడీ అవ‌స‌రం ఎంతో ఉంద‌ని పేర్కొన్నారు. ఆయ‌న చూపిన దిశానిర్దేశం భ‌విష్య‌త్తులో ఈ దేశాన్ని ఉన్న‌త స్థాయికి తీసుకువెళ్తుంద‌ని కూడా చెప్పారు. దేశానికి మోడీని దార్శ‌నికుడిగా ప‌వ‌న్ అభివ‌ర్ణించా రు. అంతేకాదు.. దేశం ఎదుర్కొంటున్న అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌గ‌ల స‌త్తా, ధైర్యం, సామ‌ర్థ్యం ఉన్నాయ‌ని ప్ర‌శంసించారు. “మోడీ మన దేశానికి …

Read More »

ఎవరైనా వస్తారేమోనని బీజేపీ ఎదురు చూపులు

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసేందుకు ఇంకో రెండు రోజుల సమయం కూడా లేదు. ఈ నెల పదే చివరి తేదీ. ఓ వైపు అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసింది. మరోవైపు కాంగ్రెస్ ఇంకా పూర్తి జాబితా ప్రకటించలేదు. బీజేపీది కూడా కాంగ్రెస్ లాంటి పరిస్థితే. బీజేపీ ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ …

Read More »

విచారణలో జాప్యం..జగన్ కు హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ దాదాపు గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని, ఆయనపై కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక, గతంలో ఇదే అంశంపై కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ …

Read More »