Political News

బీఆర్ఎస్‌కు షాకుల‌పై షాకులు

పార్లమెంట్ ఎన్నికలకు స‌మ‌యం ముంచు కొస్తోంది. ఈ క్ర‌మంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వం నుంచి పుంజుకునేం దుకు బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో పార్ల‌మెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ద‌క్కించుకుని పార్టీ ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే.. పార్టీ ఊహించింది ఒక‌టైతే.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న‌ది మ‌రొక‌టిగా ఉంది. నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ పార్టీకి దూమ‌వుతున్నారు. మ‌రికొంద‌రు పార్టీలోనే ఉన్నామంటూనే.. పోటీకి దూరంగా ఉంటున్నారు. …

Read More »

40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కఠిన నిర్ణయాలు ఇవే

మొత్తానికి ఇన్ని దశాబ్దాల రాజకీయంలో చంద్రబాబునాయుడు గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్లున్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో కొందరు సీనియర్ల విషయంలో కఠినంగా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని పార్టీవర్గాల సమాచారం. ఇందులో భాగంగానే కొందరు సీనియర్లకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారట. పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే పొమన్నట్లుగా చంద్రబాబు గట్టిగానే మాట్లాడుతున్నారని సమాచారం. విషయం ఏమిటంటే ఉత్తరాంధ్రలో ఇద్దరు సీనియర్ నేతలు, మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, కళా వెంకటరావుకు …

Read More »

మా జోలికొస్తే.. తొక్కి పేగులు తీసి మెడ‌లో వేసుకుంటం బిడ్డా!

“కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రో ఆరు మాసాల్లో కూలిపోతుంది” అంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ తెలంగాణ చీఫ్‌, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పేద‌లు ముఖ్య‌మంత్రి సీటులో కూర్చుంటే ఓర్వ‌లేక పోతున్నారా? అంటూ నిప్పులు చెరిగారు. “కేసీఆర్ ప‌దేళ్లు ముఖ్య‌మంత్రి సీటులో కూర్చున్న‌డు. బీజేపీ కేంద్రంలో ప‌దేళ్లు అధికారంలో ఉంది. కానీ, పేద‌ల ప్ర‌భుత్వం కాంగ్రెస్ .. ఆరు మాసాలు కూడా ఉండ‌కూడ‌దా?” అని రేవంత్ …

Read More »

‘జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టింది.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం’

ఏపీ స‌చివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టి రూ.370 కోట్లు తీసుకురావ‌డం ప‌ట్ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఇప్ప‌టికే ఒక‌సారి దీనిపై ఆయ‌న వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండె లాంటి సచివాలయాన్ని తాకట్టుపెట్టడంపై మండిపడ్డారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం ప్రభుత్వ భవనాలను కాదని…తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రం పరువు, ప్రతిష్ఠను వైసీపీ ప్రభుత్వం …

Read More »

డెత్ సర్టిఫికెట్లపై జగన్ ఫొటో..జేపీ ఫైర్

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ…కాదేదీ కవితకనర్హం అన్న శ్రీశ్రీ మాటలను వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారని, అందుకే జగనన్న ఫోటో ప్రచురించడానికి కాదేది అనర్హం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఫల్లీ చిక్కీ కవర్ మొదలు పొలం పట్టాదారు పాస్ బుక్ వరకు జగనన్న ఫోటోలు ముద్రిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే …

Read More »

నెల్లూరులో క‌ల్లోలం.. సాయిరెడ్డి స‌రిచేయ‌గ‌ల‌రా?

నెల్లూరు.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో 10 స్థానాల‌కు ప‌ది సీట్లూ వైసీపీ గెలుచుకుంది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా ఆపార్టీకి దూర‌మ‌య్యారు. ఇలాంటి క‌ల్లోల స‌మ‌యంలో పార్టీ ఇంచార్జ్‌గా ఇక్క‌డ అడుగు పెట్టారు వేణుంబాక్కం విజయసాయిరెడ్డి. మ‌రి ఆయ‌న ఈ ప‌రిస్థితుల‌ను హ్యాండిల్ చేయ‌గ‌ల‌రా? అనేది ప్ర‌శ్న‌. సాయిరెడ్డి ఎంట్రీతో నెల్లూరు రాజకీయం మరింత వేడెక్కింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ …

Read More »

అశోక్ కు టికెట్ ఖాయమేనా ?

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ముత్తుమల అశోక్ రెడ్డి పోటీ ఖాయమైపోయిందా ? పార్టీ నుంచి అశోక్ కు ఈ మేరకు సమాచారం అందిందా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున రెడ్డి సామాజికవర్గంకు చెందిన అభ్యర్ధే పోటీ చేయబోతున్న కారణంగా టీడీపీ నుండి కూడా రెడ్డి అభ్యర్ధిని పోటీచేయిస్తేనే బాగుంటుందని చంద్రబాబునాయుడు, లోకేష్ డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల …

Read More »

ఇదేనా విజ‌న్ భ‌య్యా!: ష‌ర్మిల‌

జ‌గ‌న్‌ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఓ రేంజ్‌లో ధ్వజమెత్తారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను విక్రయించడం, భూములను మింగడం ఇదేనా విజ‌న్ భ‌య్యా అంటూ ష‌ర్మిల విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. తాజాగా మంగ‌ళ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టించిన సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తాను విశాఖ నుంచే పాల‌న ప్రారంభిస్తాన‌ని చెప్పారు. అంతేకాదు..తాను సీఎంగా ఇక్క‌డ నుంచే ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని కూడా వెల్ల‌డించారు. త‌న‌కు ఒక …

Read More »

పొత్తు విక‌టిస్తోందా.. కారు దిగిపోతున్న నేత‌లు

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాల‌ని భావించిన బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌కు షాకుల‌పై షాకులు త‌గుతున్నాయి. ముఖ్యంగా ఉన్న‌దే 17 సీట్లు కావ‌డం దీనిలోనూ హైద‌రాబాద్‌ను మిత్ర‌ప‌క్షం ఎంఐఎంకు వ‌దిలేయ‌డంతో కేవ‌లం 16 స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా నాలుగు స్థానాలు వ‌దిలేసుకుంటే ఎలా అనేది బీఆర్ఎస్ నేత‌ల మాట‌. ఈ క్ర‌మంలోనే పార్టీకి దూరంగా ఉండ‌డంతో పాటు.. …

Read More »

మంత్రి రోజాకు సెగ‌.. సొంత మ‌నుషుల నుంచే!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి రోజాకు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో నిర‌స‌న సెగ భారీగా త‌గులుతోంది. న‌గరి నియోజక వర్గంలో ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంతో మంత్రి రోజా, ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మా భిక్షతోనే మంత్రి రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని …

Read More »

‘మీ ఫ్యామిలీ అంటే విశాఖకు నచ్చదు’

“ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సిగ్గులేదు” అని మాజీ మంత్రి, టీడీపీ నేత‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శ‌లు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో ఏర్పాటు చేయాల్సిన విశాఖ విజ‌న్‌ సదస్సును.. అధికారం కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చివరి రోజుల్లో విజన్ వైజాగ్ పేరుతో సద్దస్సు పెట్టారని దుయ్య‌బ‌ట్టారు. “సిగ్గుంటే విజ‌న్ విశాఖ‌పై మరోసారి అలోచించుకోవాలి …

Read More »

దేశంలోనే తొలి అండ‌ర్ వాట‌ర్‌మెట్రో రైల్‌..

దేశంలోనే తొలిసారి నిర్మించిన అండ‌ర‌వాట‌ర్ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వ‌చ్చాయి. ప‌శ్చిమ‌ బంగాల్‌లోని కోల్‌కతాలో నిర్మించిన‌ తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న‌ విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. కాగా.. ఇది దేశంలోనే మొదటి సారిగా నదీగర్భంలో నడిచే మెట్రో రైలు కావ‌డం విశేషం. కోల్‌కతా తూర్పు, ప‌శ్చిమ‌ మెట్రో కారిడార్‌లో భాగంగా హుగ్లీ నది దిగువన మొత్తం …

Read More »