Political News

రామ మందిరం సాక్షిగా.. అప్పుడు 300.. ఇప్పుడు 400?

రాజకీయాల్లో రామ‌మందిరం చేరిపోయింది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అయో ధ్య రామమందిర ప్ర‌తిష్టా ప‌నులు.. దీనికి సంబంధించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న చ‌ర్య‌లు.. ప‌డిన క‌ష్టం వంటివి ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌నీయాంశం కానున్నాయి. మెజారిటీ హిందువులు ఉన్న భార‌త దేశంలో వారి సెంటిమెంటును రెచ్చ‌గొట్ట‌డం ద్వారా.. ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌నేది ప్ర‌స్తుతం కేంద్రంలోని బీజేపీ వ్యూహం. అందుకే.. అయోధ్య రామ‌మందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్మించ‌డం.. అహ‌ర‌హం.. …

Read More »

క‌డ‌ప‌పై ష‌ర్మిల ఎఫెక్ట్ ఎంత‌..!

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌తలు చేప‌ట్టే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె.. వైఎస్ ష‌ర్మిలకు భారీ ఎత్తున బాధ్య‌త‌లు ఉన్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకురావ‌డం ఒక ఎత్త‌యితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పార్టీ సీనియ‌ర్ల‌ను తిరిగి పార్టికి సానుకూలంగా మార్చాల్సి న అవ‌స‌రం ఉంది. దీంతో పాటు.. వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి క‌డ‌ప పైనా ష‌ర్మిల ఎలా వ్య‌వ‌హరిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్ర …

Read More »

చంద్ర‌బాబు ఇలా చేసి ఉంటే.. చిక్కులు త‌ప్పేవా..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక‌వైపు అదికార పార్టీ వైసీపీ దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. అభ్య‌ర్థుల‌ను ప్ర‌జ‌ల నాడికి.. స‌ర్వేల స‌మాచారానికి అనుకూలంగా మారుస్తోంది. ఈ క్ర‌మంలో చిన్నపాటి వ్య‌తిరేక‌త‌లు వ‌చ్చినా.. పార్టీ ప్ర‌జ‌ల న‌నాడికి అనుగుణంగానే నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఎక్క‌డా ఎవ‌రి డిమాండ్ల‌కు త‌లవంచే ప‌రిస్థితి లేకుండా ముందుకు సాగుతోంది. మ‌రి ఇదే ప‌రిస్థితి టీడీపీలో లేదు. ఎటు చూసుకున్నా అంద‌రూ సీనియ‌ర్లే. పైగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో తిష్ట‌వేశారు కూడా. ఈ …

Read More »

మొదటి జాబితా ఆలస్యమవుతుందా ?

టీడీపీ-జనసేన మొదటిజాబితా విడుదల ఆలస్యమయ్యేట్లుంది. సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మొదటిజాబితాను విడుదల చేయాలని చంద్రబాబునాయుడు అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల జాబితా విడుదల ఆలస్యమయ్యేట్లుంది. దీనికి కారణం ఏమిటంటే రెండుపార్టీలతో కలిసే విషయంలో బీజేపీ ఏ సంగతి తేల్చి చెప్పకపోవటం. సీట్లు ఫైనల్ చేసి జాబితాను విడుదల చేసిన తర్వాత మళ్ళీ మార్పులు చేయాల్సొస్తే అది నెగిటివ్ ప్రభావం చూపుతుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనుకున్నారట. అలాగే …

Read More »

కారుపార్టీ ఖాళీ ఖాయమా ?

పార్లమెంటు ఎన్నికల్లోపు కారు పార్టీలోని నేతల్లో వీలైనంత మందిని లాగేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ఖాళీ చేయటం కూడా పై నుండి కాకుండా గ్రౌండ్ లెవల్ నుండి మొదలుపెట్టింది. అందుకనే ముందుగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్ లపై దృష్టిపెట్టింది. బీఆర్ఎస్ ను క్షేత్రస్ధాయిలో దెబ్బకొడితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతీయటం సులభమని కాంగ్రెస్ ముఖ్యులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకనే వీలైనన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఛైర్మన్లపై …

Read More »

ఏపీలో పార్టీల‌కు ద‌డ పుట్టిస్తోన్న విలేజ్ పాలిటిక్స్‌… !

ఏపీలో మ‌రికొన్ని వారాల్లోనే ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. దీంతో రాజ‌కీయ పార్టీలు త‌మ‌తమ వ్యూహాల‌కు ప‌దును పెట్టాయి. నాయ‌కుల‌కు టికెట్ల‌ను కూడా ఖ‌రారు చేస్తున్నాయి. అయితే.. ఓటు బ్యాంకు ప‌రంగా.. ఓట్లు వేసే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఖ‌చ్చితంగా ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకు ప్రభావం చూపించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్రాంతాల వారిగా.. ప్ర‌జ‌ల మైండ్‌సెట్ కూడా మారింద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ట్ట‌ణ ఓట‌రు.. కొంత …

Read More »

ఆ ‘ఆత్మే’ ష‌ర్మిల‌ను న‌డిపిస్తుందా?

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల‌ను ఎవ‌రు న‌డిపిస్తున్నారు? ఎన్నిక‌ల‌కు ముందు ఆమెను న‌డిపించేవారు ఎవ‌రు? అన్న అంశాల‌పై క్లారిటీ వ‌చ్చింది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత ఆప్తుడు.. ఆయ‌న‌తో అవినాభావ సంబంధాలు ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామచంద్ర‌రావే ఇప్పుడు కూడా ఆప్తుడిగా మారుతున్నార‌నేది స్ప‌ష్ట‌మైంది. ఆ ఆత్మే.. ఈ ష‌ర్మిల‌ను న‌డిపిస్తోంద‌ని, న‌డిపిస్తుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఏపీ బాధ్య‌త‌ల‌ను ష‌ర్మిల‌కు అప్ప‌గించినా.. కీల‌క …

Read More »

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఇంత దోపిడీ జరిగిందా ?

సమీక్షలు జరిగేకొద్దీ ఇరిగేషన్ శాఖలో జరిగిన దోపిడి బయటపడుతోందా ? తాజా సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా బయటపడుతున్న దోపిడీని చూసి మంత్రులే ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రెండు ప్రాజెక్టులు దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ఉన్నతాదికారులు చెప్పిన …

Read More »

రేవంత్ ప్రభుత్వానికి ‘కోటి’ కష్టాలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోటి కష్టాలు తప్పదులాగుంది. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావటమే టార్గెట్ గా సిక్స్ గ్యారెంటీస్ పదేపదే ప్రచారం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ కూడా కీలకమనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సిక్స్ గ్యారెంటీస్ అమలుచేస్తామని ఇచ్చిన హామీలే ఇపుడు పార్టీ కొంపముంచేట్లుగా ఉంది. వందరోజుల్లోనే అమలు చేయాలంటే సాధ్యంకావటంలేదు. అలాగని అమలుచేయలేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కష్టాలు తప్పవు. అందుకనే …

Read More »

అయోధ్యలో హోటల్ రూం జస్ట్ రూ.లక్షేనట

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 ఏళ్ల నాటి కల. ఇప్పుడు సాకారం అవుతున్న వేళ.. యావత్ దేశం ఒకలాంటి భావోద్వేగంతో నిండి ఉంది. అయోధ్యలో రామాలయ స్వప్నం తీరటం.. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకువీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది గంటల్లో బాలరాముడు భక్త జనానికి దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. …

Read More »

బీజేపీ కూడా రెడీ అవుతోందా ?

రాబోయే ఎన్నికలకు ఏపీ బీజేపీ కూడా రెడీ అయిపోతోంది. పార్టీ తరపున పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహుల జాబితాలను సిద్ధం చేయాలని జాతీయ నాయకత్వం నుండి పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఆదేశాలు అందాయి. వచ్చిన ఆదేశాలతో హడావుడిగా పురందేశ్వరి కమిటీలను వేశారట. ప్రతి పార్లమెంటు జిల్లాకు ముగ్గురు సీనియర్ నేతలతో కమిటీలు వేశారు. ఈ కమిటీలే తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లాల్లో విస్తృతంగా తిరుగుతాయి. అన్నీ నియోజకవర్గాల్లోని నేతలను …

Read More »

గుంటూరు వైసీపీలో సెగ స్టార్ట్ చేశారుగా…!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి సెగ త‌గులుతోంది. ఇదేదో రాజ‌ధాని అమ‌రా వ‌తి అనుకూల వ‌ర్గం నుంచి ఎదుర‌వుతున్న సెగ కాదు. సొంత పార్టీలో సొంత నేత‌ల నుంచే వ‌స్తున్న అస‌మ్మ‌తి. సిట్టింగు ఎమ్మెల్యేల‌పై ఒక‌టి రెండు చోట్ల‌… కొత్త‌గా ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులపై మ‌రోచోట‌.. ఇలా.. పార్టీలో అస‌మ్మ‌తి భారీ ఎత్తున కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. స‌త్తెన‌ప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు కు టికెట్ ఇవ్వొద్దంటూ.. సొంత నేత‌లే …

Read More »