Political News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అంతా బాగుంది కానీ

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు రాజకీయం బాగానే వంట పడుతోందని ఈ మధ్య ఆయన తీరు చూస్తుంటే అర్థమవుతోంది. ఒకప్పుడు ఆవేశం తప్ప ఆలోచన లేదని పవన్‌ను వియర్శించేవారు. ఆ తర్వాతేమో మరీ దూకుడు తగ్గించేసి మర్యాదరామన్న తరహాలోకి మారిపోవడం అభిమానులకు అసలే నచ్చలేదు. ఐతే ఇటీవల పవన్ తీరు మార్చారు. ఆవేశానికి ఆలోచన జోడించి సూటిగా, సుత్తి లేకుండా తానేం చెప్పాలనుకున్నది చెబుతున్నాడు జనసేనాని. తరచుగా పార్టీలో అంతర్గత సమావేశాలు …

Read More »

వెంకట్రామిరెడ్డికి కోర్టు షాక్‌!

ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆనందంలో ఉన్న మాజీ క‌లెక్ట‌ర్‌గా తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న‌కు కోర్టు నోటీసులు పంపించింది. సిద్ధిపేట క‌లెక్ట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. “వ‌రి సాగు చేయ‌వ‌ద్దు. విత్త‌నాల‌ను విక్ర‌యించ‌రాదు. ఒక‌వేళ విక్ర‌యిస్తే జైలుకు పంపుతా. కోర్టుల‌కెళ్లి ఉత్త‌ర్వులు తెచ్చుకున్నా దుకాణం తెర‌వ‌నీయ‌ను” అని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చాయి. దీనిపై కొంత‌మంది కోర్టును …

Read More »

ఆ నలుగురు వైసీపీ నేతలకు అదనపు భద్రత

కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. అంబటి రాంబాబు.. ఈ మధ్య వార్తల్లో నిలిచిన వైకాపా నేతలు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న ఎపిసోడ్లో వీళ్లది కీలక పాత్ర. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా దారుణ వ్యాఖ్యలు చేసింది ఈ నలుగురే అన్నది ఆరోపణ. ఈ ఎపిసోడ్లో ముందుగా అంబటి రాంబాబు మాట్లాడబోతుంటే.. అరగంట చాలా అంటూ తెలుగు దేశం …

Read More »

కొండ‌ప‌ల్లి కొట్లాట‌కు తెర‌.. ముగిసిన చైర్మ‌న్ ఎన్నిక‌

మూడు రోజులుగా తీవ్ర‌ ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్‌ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చైర్మన్‌ ఎన్నిక వివరాలను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం హైకోర్టుకు అందజేయనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించిన అధికారులు.. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. హైకోర్టు అనుమతి మేరకు విజ‌య‌వాడ పార్ల‌మెంటు స‌భ్యులు కేశినేని శ్రీనివాస్‌ ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. చెన్నుబోయిన చిట్టిబాబును తెలుగు దేశం పార్టీ.. చైర్మన్‌ …

Read More »

కేటీఆర్ బృందం 4 గంటలు వెయిటింగ్ లో పీయూష్?

తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ అన్న మాట తరచూ చెబుతుంటారు. అదే మాటను గొప్పగా చెబుతారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. గులాబీ నేతలు సైతం ఇదే విషయాన్ని మా గొప్పగా చెబుతారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ అన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తారు ఎవరైనా. ఒకవిధంగా చెప్పాలంటే.. సీఎం హాజరు కావాల్సిన చాలా కార్యక్రమాలకు …

Read More »

‘అమెజాన్ గంజాయి’.. లింకులు ఏపీలోనే!

అమెజాన్

ఇటీవ‌ల గుజ‌రాత్‌లోని బంద్రా ఎయిర్‌పోర్టులో ల‌భించిన 1000 కోట్ల రూపాయ‌ల విలువైన మాద‌క ద్ర‌వ్యాల కేరాఫ్ ఏపీ. తెలంగాణ‌లో గంజాయి అక్ర‌మ రావాణాకు కేరాఫ్‌. మ‌హారాష్ట్ర‌లో మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాకు కేరాఫ్ ఏపీ. ఇప్పుడు.. తాజాగా ఎక్క‌డో ఆన్‌లైన్‌లో వ్యాపారంచేసుకునే అమెజాన్‌లో జ‌రుగుతున్న గంజాయి ర‌వాణాకు కూడా కేరాఫ్ ఏపీ.. దేశంలో ఎక్క‌డ ఎలాంటి మాద‌క ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డినా.. కేరాఫ్ ఏపీ అనే మాట వినిపిస్తోంది. ఎక్క‌డెక్క‌డి నుంచో పోలీసులు …

Read More »

ఓడిన చోట గెల‌వాల‌ని

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాల‌ని పెద్ద‌లు చెప్తుంటారు. అదే రాజ‌కీయాల‌కు అన్వ‌యిస్తే.. ఓడిన చోటే గెల‌వాల‌ని నాయ‌కులు చూస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా అదే సూత్రాన్ని పాటించేందుకు ముందుకు సాగుతున్నారు. అందుకే రాజ్య‌స‌భ అవ‌కాశాన్ని కూడా వ‌దిలేసుకున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌లో పోటీ చేసి తిరిగి విజ‌య బావుటా ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆమె ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా..తెలంగాణ‌లో …

Read More »

కొడాలి నాని మాటలు.. తారక్ కు డ్యామేజ్ చేసేలా ఉన్నాయా

నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం. మర్యాదల్ని వదిలేయటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఈ మధ్యన రాజకీయాల్లో ఎక్కువైంది. ఎవరెంత కసిగా మాట్లాడితే అంత పోటుగాడన్నట్లుగా తెలుగు రాజకీయాలు మారిపోయాయి. వయసును పట్టించుకోకుండా..అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తానున్న పదవికి తగ్గట్లుగా మాట్లాడాలన్న ఆలోచన లేని నేతలు ఎక్కువ అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ నేత అన్నంతనే ఏపీ అధికార పక్షంలో బోలెడంత మంది ముందుకు వస్తారు. వీరిలో చంద్రబాబును.. ఆయన …

Read More »

ఇంత రాద్దాంతం అవసరమా వైసీపీ?

ఒక చిన్న మున్సిపాలిటి విషయంలో ప్రభుత్వం, అధికారపార్టీ అనవసరంగా గబ్బుపడుతోంది. కృష్ణాజిల్లాలోని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ పదవిని అందుకునే విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానం ఎంతమాత్రం సరికాదు. 29 వార్డులున్న కొండపల్లి మున్సిపాలిటిలో వైసీపీ-టీడీపీలకు చెరో 14 వార్డులు దక్కాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన ఒక కౌన్సిలర్ టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఇదికాకుండా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా కొండపల్లి మున్సిపాలిటిలో …

Read More »

శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలనుకుంటున్న బీజేపీ

గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం అమ్మటంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలను ప్రభుత్వం తీసుకున్నది అని కాకుండా స్ధానిక సంస్ధలు తీసుకున్నాయనే కలరింగ్ ఇస్తోంది బీజేపీ. ఇంతకీ విషయం ఏమిటంటే గుజనాత్ లో కొద్దిరోజులుగా మాంసాహారంపై స్ధానికంగా గొడవలు మొదలయ్యాయి. మాంసాహార వంటలను, స్నాక్స్ ను అమ్మే రోడ్డుపక్క బండ్లు, షాపులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే గుజరాత్ మొత్తాన్ని శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలన్న అధికార పార్టీ ఆలోచనే …

Read More »

జ‌గ‌న్ ఆయ‌న్ను బాగా వాడుతున్నారుగా… న్యాయం జ‌రిగేనా..?

Peddi Reddy

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి గురించి వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. షార్ప్ షూట‌ర్‌గా ఆయ‌న అనేక విజ‌యాలు సాధించారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో  వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. స‌త్తాతో పార్టీ విజ‌యం సాధించింది. ఎక్క‌డిక‌క్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. ఆ ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. దీంతో పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బ‌డ్డా విజ‌యం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్‌పై సింప‌తీ కావొచ్చు.. ఏదైనా కావొచ్చు.. పార్టీ …

Read More »

అయితే.. ఈ సారి మంత్రి వ‌ర్గంలోనూ మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట‌..!

YS Jagan Mohan Reddy

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రాధాన్యాలు మారుతున్నాయా ?  ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచింది ఒక ఎత్తు.. ఇక నుంచి గ‌డిచేది మ‌రో ఎత్తు..! అనే వ్యూహంతో జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారా ? అంటే.. అవున‌నే అంటున్నారు అత్యంత విశ్వ‌స‌నీయులైన నాయ‌కులు.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ చేసిన రాజ‌కీయ పోరు ఒక ఎత్తు. అయితే.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఎదుర్కొనబోయే ముఖ చిత్రం మ‌రో ఎత్తుగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. …

Read More »