కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల అనుచిత వ్యాఖ్యల వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి వ్యక్తిత్వ హననానికి వైసీపీ నేతలు పాల్పడ్డారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అయితే, తాము భువనేశ్వరిని ఏమీ అనలేదని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము చంద్రబాబును అంటామని, భువనేశ్వరిని అనాల్సిన పనిలేదని మీడియా …
Read More »రేవంత్ నయా ప్లాన్తో టీ కాంగ్రెస్లో కలవరం..!
తెలంగాణ కాంగ్రెస్లో కలవరం మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి త్వరలో డీసీసీ అధ్యక్షులను మార్చనున్నారని.. పనిచేసే వారికే పట్టం కట్టనున్నారని గాంధీభవన్ వర్గాల సమాచారం. ఈ దిశగా ఆయన అధ్యయనం చేస్తున్నారు. కొత్త సవంతర్సం నుంచి మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉందట. ఆ నేతలకు అవకాశం ఉండేనా..?తెలంగాణ అధ్యక్ష స్థానానికి ఎవరిని నియమించాలని అనుకున్నప్పుడు అభిప్రాయ సేకరణ చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించింది. అధిష్ఠానం దూతలు రాష్ట్రానికి వచ్చి అభిప్రాయ సేకరణ …
Read More »ఈ ఎంపీలకు అంత సీనుందా ?
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీ ప్రయోజనాల కోసం డిమాండ్ చేయాలని అధికార, టీడీపీ ఎంపీలకు పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేశారు. రెండు పార్టీల ఎంపీలకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకేలాంటి ఆదేశాలివ్వటం కాస్త విచిత్రంగానే ఉంది. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రివైజ్డు అంచనాల ప్రకారం నిధులు లాంటి అంశాలు చాలా కీలకమైనవి. పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు …
Read More »కేసీఆర్ వ్యూహమేంటో చూద్దాం.. ఏపీ సర్కారు తర్జన భర్జన
“కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం. సమస్య మనకు మాత్రమే కాదు. అందరికీ ఉంది. ముందుగా ఆయన గళం విప్పారు.. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసి..మనం కూడా గళం విప్పుదాం!“ ఇదీ.. ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు.. అత్యంతకీలకంగా మారిన వరి పంట విషయంలో మంత్రులకు చేసిన సూచన. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఆరు మాసాల కిందటే.. దేశంలో వరి వేయొద్దంటూ.. తీర్మానం చేసింది. …
Read More »దారి మళ్లిన నిధులు…వైసీపీ ఎంపీపై కేంద్రం సీరియస్
ఏపీ ప్రభుత్వంపై తాజాగా కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై గతంలో పంపిన లేఖకు వివరణనివ్వడంలో జాప్యం జరగడంపై అసహనం వ్యక్తం చేసింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్…తన ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేశారన్న ఆరోపణలపై వెంటనే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శికి విడివిడిగా …
Read More »సీఎం జగన్తో మోహన్బాబు.. భేటీ! రీజనేంటి?
ఏపీ సీఎం జగన్తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు భేటీ కానున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న మోహన్ బాబు జగన్ తో భేటీకి అప్పాయింట్మెంట్ ఖరారైంది. గన్నవరం ఎయిర్ పోర్ట్కు చేరుకున్న మోహన్బాబుకు అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్బాబు సెంటిమెంటు డైలాగ్ ఒకటి విసిరారు. ‘‘నా విజయవాడకు రావడం నాకు చాలా సంతోషం’’ అని అన్నారు. ఆత్మీయులను కలిసేందుకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఆ పై …
Read More »అసెంబ్లీలో ఆ ఘటనపై ఉండవల్లి సీరియస్
కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఉండవల్లి షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబును దారుణంగా తిట్టారని, ఓ మంత్రి …
Read More »జగన్లో ఇంత ధైర్యానికి కారణం ఇదేనా..!
వైసీపీ అధినేత, సీఎం జగన్ దృష్టి ఎవరిపై ఉంది? మరో 30 ఏళ్లపాటు తానే సీఎంగా ఉంటానని ఆయన ఎందుకు అంత ధైర్యంగా చెబుతున్నారు. తొణికిసలాడుతున్న ఆత్మ విశ్వాసం వెనుక ఉన్న రీజనేంటి? ఇదీ.. ఇప్పుడు మేధావులను ఆలోచింపజేస్తున్న విషయం. ఒకటి.. తాను ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని.. ఇదే తనకు శ్రీరామరక్ష అవుతుందని.. జగన్ భావిస్తున్నారా? లేక.. తను పాటిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ తనకు అండగా …
Read More »చంద్రబాబు నిజంగా ఆ మాట అన్నాడా ?
‘‘వరదల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టం గురించి ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తూ, సహాయ చర్యలకు పురమాయిస్తూ ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడు నన్ను విమర్శిస్తూ ఉన్నారు. నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని.. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతాయని. తనను వ్యతిరేకించిన వైఎస్సార్ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయారని అంటున్నారు’’.. ఇదీ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన …
Read More »టాలీవుడ్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. జగనన్న ఇళ్లు చిన్నవిగా ఉన్నాయని, హాల్లోనే శోభనం చేసుకోవాలని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇక, అంతకుముందు పోలీసుల తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ప్రసన్న కుమార్ రెడ్డి …
Read More »ఉభయసభల్లో ఎదురేలేదు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉభయసభల్లోను ఎదురన్నదే లేదు. తాజాగా శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం 32కి పెరిగింది. 58 మంది సభ్యులున్న మండలిలో వైసీపీకి 32 మంది ఉన్నారంటే మామూలు విషయం కాదు. మొన్నటివరకు మండలిలో బిల్లుల ఆమోదంలో అధికారపార్టీ ఎంతగా ఇబ్బంది పడిందో అందరు చూసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చినా మండలిలో మైనారిటిలో ఉండటం వైసీపీ చాలా ఇబ్బందులే పడింది. …
Read More »వరద ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై జగనేమన్నాడంటే..
తన సొంత జిల్లా కడపతో పాటు.. తన మీద అపరిమిత అభిమానం చూపిస్తున్న చిత్తూరు జిల్లాలు వరదలతో అల్లాడిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు వైపు కన్నెత్తి చూడటం లేదంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక రోజు నామమాత్రంగా ఏరియల్ వ్యూకు పరిమితమైన సీఎం.. క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. 71 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎంతో కష్టపడి వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండటాన్ని.. …
Read More »