ఒక వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు ఎవరికి తోచినట్లు వారు భాష్యం చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన చోటా నేత/కార్యకర్త/సానుభూతిపరుడు.. అదే పార్టీకి చెందిన మరొకరు బండ బూతులు తిడుతూ.. ఇష్టారాజ్యంగా కొడుతూ.. ఆరాచకం అంటే ఎక్కడో ఉండదు.. తమ దగ్గరే ఉంటుందన్న రీతిలో వ్యవహరించిన వైనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ గా మారింది. ఇంతకీ ఎవరీ సుబ్బారావు …
Read More »ఇండియాలో డేంజర్ బెల్స్ ?
ప్రపంచదేశాల్లో లాగే ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికి అధికారికంగా నమోదైన కేసులే 170 ఉన్నాయి. ఇంకా నిర్ధారణ కానీ, పరీక్షల దశలో ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయో తెలీదు. మొత్తానికి ఒమిక్రాన్ కేసుల తీవ్రత అయితే చాలా స్పీడుగా పెరిగిపోతోందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నమోదైన కేసులన్నీ మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, కర్నాటకలోనే ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 60 …
Read More »బాబు మోహన్ ఎక్కడి వారో తెలిసింది..!
సినీ హాస్య నటుడు, అందోలు మాజీ ఎమ్మెల్యే పల్లె బాబు మోహన్ ఎక్కడి వారో తెలిసింది. అందోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచి చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన బాబు మోహన్ అందోలుకు స్థానికేతరుడే అని తేలిపోయింది. కొందరు ఆయనది ఖమ్మం జిల్లా అని చెబుతున్నాఅది వాస్తవం కాదని నిరూపితం అయింది. ఈ విషయంపై బాబు మోహనే స్పష్టత ఇచ్చారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని …
Read More »టీఆర్ఎస్ను వీడని ఖమ్మం నీడ..!
ఖమ్మం గులాబీ పార్టీలో నీలినీడలు కమ్ముకుంటున్నాయా..? నిను వీడని నీడను నేను.. తరహాలో ఒకటి కాకుంటే మరొకటి గొడవలు పార్టీని చుట్టుముడుతున్నాయా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్టీ పెద్దలు ఈ వరుస వ్యవహారాలపై ఆందోళనగా ఉన్నారట. ఈ జిల్లాలో గొడవలను సద్దుమణిగించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేయనున్నారట. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థికి ఉన్న ఓట్ల …
Read More »రాధాకు టికెట్ కన్ఫర్మ్?
వంగవీటి రాధాకృష్ణకు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడే టికెట్ కన్ఫర్మ్ చేశారా ? అవుననే పార్టీలో ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో రాధా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. రాధా దృష్టంతా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీదే ఉంది. అయితే సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం రావడం లేదు. దాంతో రాధా కూడా సమాధానపడిపోయినట్లు సమాచారం. అప్పుడెప్పుడో చాలాకాలం క్రితం సెంట్రల్ నుంచి …
Read More »టీడీపీలోకి సీనియర్ కాంగ్రెస్ నేత ?
కాంగ్రెస్ హయాంలో దాదాపు పదేళ్ళపాటు ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ టీడీపీలో చేరబోతున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. చాలాకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డి ఈమధ్యనే కాస్త యాక్టివ్ అయ్యారు. ఒకటి రెండుసార్లు అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీకి కూడా వెళ్ళివచ్చినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ లో మళ్ళీ క్రియాశీలకపాత్ర పోషించే ఉద్దేశ్యం ఈ సీనియర్ నేతకు లేదంటున్నారు. మరి యాక్టివ్ అవ్వాలని …
Read More »సంబరాలకు సై.. ఏపీలో అధికారిక ప్రకటన
ఈ నెల 21న(మంగళవారం) ముఖ్యమంత్రి జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు చేసుకునేందుకు వీలుగా.. ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిజానికి ఇప్పటి వరకు ఈ విషయంపై తర్జన భర్జన పడిన ప్రబుత్వం.. ఎట్టకేలకు సుదీర్ఘ చర్చల అనంతరం.. పార్టీ శ్రేణులు.. జగన్పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర …
Read More »జూనియర్ కిమ్ లా జగన్ పరిపాలన: CBN
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ ప్రకటనలతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. “జూనియర్ కిమ్ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారు“ అని నిప్పులు చెరిగారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. …
Read More »జగన్ పుట్టిన రోజు.. రిటర్న్ గిఫ్ట్
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో ఏటా అత్యంత ఆడంబరంగా నిర్వహించుకుం టున్న కార్యక్రమం జగన్ పుట్టిన రోజు వేడుక. ముఖ్యంగా జగన్ సీఎం అయిన తర్వాత.. ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఎక్కడ ఉన్నా.. ఆ రోజు మాత్రం తండ్రి సమక్షంలో ఉండాల్సిందే. ఇక, గత ఏడాది తల్లి విజయమ్మ కూడా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక, ఇప్పుడు ఏడాది పుట్టిన …
Read More »ప్రభుత్వం కంటే ఫాస్ట్ – బాధితులకు అండగా భువనేశ్వరి
ఈమధ్యనే గ్రేటర్ రాయలసీమ ప్రాంతమంతా భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. అప్పట్లో భారీ వర్షాలకు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల దగ్గరకు భువనేశ్వరి సోమవారం వెళ్ళబోతున్నట్లు ఎన్టీయార్ ట్రస్టు వర్గాలు చెప్పాయి. బాధిత కుటుంబాలకు ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్టు తరపున తలా లక్ష రూపాయలను భువనేశ్వరి అందించబోతున్నారట. మొత్తం 48 కుటుంబాలకు …
Read More »తల్లీ, కొడుకులు పోటీచేయటం ఖాయమేనా ?
తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంది. తాజాగా పరిటాల శ్రీరామ్ చేసిన హెచ్చరికలు విన్న తర్వాత పార్టీలో అందరూ ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఇంతకీ శ్రీరామ్ చేసిన హెచ్చరిక ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయటానికి తనకు టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుండే శాశ్వతంగా తప్పుకుంటానని ఏకంగా చంద్రబాబునాయుడుకే అల్టిమేటం జారీ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. శ్రీరామ్ ఎక్కడా చంద్రబాబు పేరెత్తలేదు. కానీ …
Read More »రేవంత్ వల్ల ప్రక్షాళన సాధ్యమేనా ?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రమంతా విస్తృతంగా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని వదిలేసిన మాజీలందరితోను భేటీ అవుతూ వాళ్ళని మళ్లీ పార్టీలోకి లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఈ పనులు చేస్తూనే మరోవైపు తనంటే మండిపోతున్న సీనియర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. …
Read More »