Political News

మంత్రి రోజాకు సెగ‌.. సొంత మ‌నుషుల నుంచే!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి రోజాకు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో నిర‌స‌న సెగ భారీగా త‌గులుతోంది. న‌గరి నియోజక వర్గంలో ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంతో మంత్రి రోజా, ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మా భిక్షతోనే మంత్రి రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని …

Read More »

‘మీ ఫ్యామిలీ అంటే విశాఖకు నచ్చదు’

“ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సిగ్గులేదు” అని మాజీ మంత్రి, టీడీపీ నేత‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శ‌లు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో ఏర్పాటు చేయాల్సిన విశాఖ విజ‌న్‌ సదస్సును.. అధికారం కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చివరి రోజుల్లో విజన్ వైజాగ్ పేరుతో సద్దస్సు పెట్టారని దుయ్య‌బ‌ట్టారు. “సిగ్గుంటే విజ‌న్ విశాఖ‌పై మరోసారి అలోచించుకోవాలి …

Read More »

దేశంలోనే తొలి అండ‌ర్ వాట‌ర్‌మెట్రో రైల్‌..

దేశంలోనే తొలిసారి నిర్మించిన అండ‌ర‌వాట‌ర్ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వ‌చ్చాయి. ప‌శ్చిమ‌ బంగాల్‌లోని కోల్‌కతాలో నిర్మించిన‌ తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న‌ విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. కాగా.. ఇది దేశంలోనే మొదటి సారిగా నదీగర్భంలో నడిచే మెట్రో రైలు కావ‌డం విశేషం. కోల్‌కతా తూర్పు, ప‌శ్చిమ‌ మెట్రో కారిడార్‌లో భాగంగా హుగ్లీ నది దిగువన మొత్తం …

Read More »

హ‌త విధీ.. కేసీఆర్‌కు ఎంత క‌ష్టం!

విధి అంటే ఇలానే ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఇప్పుడు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. విది ఎంత బ‌లంగా ఉంటుందో అర్ధం అవుతుంది. “ఏ ఎస్పీ.. బీఎప్పీనా.. ఎస్పీ లేదు.. పాడు లేదు ఊకోవ‌య్యా.. గ‌ది కూడ పార్టీయేనా?.. ఎవ‌రు..? ప్ర‌వీణా? గాయ‌నెవ‌రు? ఎట్టుంట‌డు? ఏం చేస్త‌డు.. వీళ్లంతా ఆయారాం.. గ‌యారాంలే” – అని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి సీఎంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు గుర్తుండే ఉంటాయి. బీఎస్పీని, …

Read More »

‘మీ ఎఫ్ఐఆర్‌లు మ‌డిచి ఎక్క‌డ పెట్టుకుంటారో పెట్టుకోండి’

వైసీపీ ప్ర‌భుత్వం, అధికారులు త‌మ‌పై పెడుతున్న కేసులు, న‌మోదు చేస్తున్న ఎఫ్ ఐఆర్‌ల‌పై టీడీపీ యువ నాయ‌కుడు , మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. “మీ ఎఫ్ ఐఆర్‌లు మ‌డిచి ఎక్క‌డ పెట్టుకుంటారో పెట్టుకోండి” అని నారా లోకేష్ అన్నారు. అంతేకాదు.. “బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా… బీసీ అంటే బలహీనవర్గం కాదు… బలమైన వర్గం” అని అభివర్ణించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో …

Read More »

బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉంది: చంద్రబాబు

బీసీలకు రాజ్యాధికారం రావాలని కలలుగన్న విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావును స్మరించుకుంటూ జయహో బీసీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు ఇది అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం, జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాయని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పారు. బీసీల బాగు కోసం తాను, పవన్ ఇద్దరం కలిసి …

Read More »

బీసీలు శాసించే స్థాయికి రావాలి: పవన్

జయహో బీసీ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని పవన్ అన్నారు. 2019లో వైసీపీ వెన్నంటి ఉన్న బీసీలను జగన్ దెబ్బ కొట్టాడని ఆరోపించారు. బీసీల గర్జన పేరుతో ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారని, బీసీలకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని …

Read More »

మంగ‌ళ‌గిరికి నారా లోకేష్‌.. నాలుగు వాగ్దానాలు ఇవే!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌నున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి నాలుగు వాగ్దానాలు చేశారు. తాజాగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాగార్జున విశ్వ‌విద్యాల‌యం స‌మీపంలో టీడీపీ-జ‌న‌సేన పార్టీలు నిర్వ‌హించిన బీసీ డిక్ల‌రేష‌న్ స‌భ‌లో్ ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌నను గెలిపిస్తే.. మంగ‌ళ‌గిరికి ఏం చేయాల‌ని అనుకుంటున్న‌దీ నారా లోకేష్ వెల్ల‌డించారు. 1) కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే …

Read More »

బీసీలు తొక్కిపట్టి నార తీస్తారు: ఎంపీ రామ్మోహన్

మంగళగిరి సమీపంలో నాగార్జున వర్సిటీ వద్ద టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు, జనసేన నేతలు హాజరయ్యారు. ఈ సభకు లక్షలాది మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు, బీసీ సోదరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ సభా వేదికపై వైసీపీ మాజీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. జయరాంకు …

Read More »

అక్కడ వైసీపీలో వర్గపోరు పెరిగిపోతోందా ?

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు పెరిగిపోతున్నట్లుంది. ఎంఎల్ఏ తిప్పేస్వామిని కాదని జగన్మోహన్ రెడ్డి కొత్త నేతను సమన్వయకర్తగా నియమించారు. సమన్వయకర్త, ఇన్చార్జి పేరేదైనా చివరకు అభ్యర్ధనే అర్ధమొస్తుంది. అందుకనే జగన్ ప్రకటించిన ఈరల కృష్ణనే అందరు అభ్యర్థిగా అనుకుంటున్నారు. అయితే సమస్యంతా ఇక్కడే వస్తోంది. ఎలాగంటే ఈరల కృష్ణ అభ్యర్ధిత్వాన్ని ఎంఎల్ఏతో పాటు ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ఎక్కువభాగం ఎంఎల్ఏకి బదులు …

Read More »

రేవంత్ హవా.. కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు: స‌ర్వ‌ే

రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ మ‌రోసారి విజ‌య దుందుభి మోగిస్తుంద‌ని తాజాగా ఓ స‌ర్వే చాటి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని స‌ర్వే తెలిపింది. అదేవిధంగా ప్ర‌జాపాల‌న దిశ‌గా సీఎం రేవంత్ వేస్తున్న అడుగులు గ్రామీణ స్థాయి నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను మెరిపిస్తున్నాయ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 17 …

Read More »

కాంగ్రెస్ లో కొత్త పంచాయితి

తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పంచాయితీ మొదలైంది. ఈ పంచాయితీకి అడ్వర్టైజ్మెంట్లు ప్రధాన కారణం కావటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా ప్రభుత్వం జారిచేసిన కొన్ని అడ్వర్టైజ్మెంట్లలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలు మిస్సయ్యాయి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫొటో కూడా తప్పనిసరిగా కనబడుతోంది. సీఎంతో పాటు డిప్యుటి సీఎం ఫొటోను …

Read More »