Political News

భ‌ర్త‌కు బాస‌ట‌.. మంగ‌ళ‌గిరిలో నారా బ్రాహ్మ‌ణి ప్ర‌చారం

నారా బ్రాహ్మ‌ణి. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. నంద‌మూరి కుటుంబం ఆడ‌పడుచు.. నారా వారి ఇంటి కోడ‌లు. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ స‌తీమ‌ణి. ప్ర‌స్తుతం నారా బ్రాహ్మ‌ణి.. మంగ‌ళ‌గిరిలో ప‌ర్య‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త నారా లోకేష్‌ను గెలిపించాల‌ని ఆమె కోరుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు బ్రాహ్మ‌ణి వ‌చ్చారు.ఈ సంద‌ర్భంగా ఆమె మంగ‌ళ‌గిరిలోని చేనేత‌ల‌ను క‌లుసుకున్నారు. మెజారిటీ సామాజిక …

Read More »

మాజీ ఎంఎల్ఏ సైకిలెక్కుతారా ?

ఇపుడిదే అంశం తెలుగుదేశంపార్టీతో పాటు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కొంతకాలంగా గట్టి నేతలేరు. ఎందుకంటే నియోకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎంఎల్ఏ శంకర్ యాదవ్ ఉన్నా సరిగా పనిచేయటంలేదు. సొంత వ్యాపారాల పేరుతో ఎక్కువకాలం బెంగుళూరులోనే ఉంటున్నారు. దాంతో ఏ అవసరం వచ్చినా నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణినేతలు, క్యాడర్ రాష్ట్రపార్టీ వైపు లేకపోతే పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నారు. అందుకనే అన్నీ కోణాల్లో ఆలోచించిన చంద్రబాబు …

Read More »

రెండుసీట్ల కోసం మూడుపార్టీలు పట్టు

మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు ఫైనల్ కాలేదు. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ, జనసేన మధ్యలోకి బీజేపీ సడన్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అప్పటివరకు టీడీపీ, జనసేన మధ్య జరిగిన పొత్తు చర్చలంతా పక్కకుపోయాయి. ఇపుడు విషయం ఏమిటంటే మూడు పార్టీలు కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం కోసం గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ …

Read More »

‘అందుకే పార్టీలో నుంచి బయటకు వచ్చేశా’

అధికార వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తాజా సంచలనంగా మారారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వేళ.. తాను అలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నానో చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం నరసరావుపేటలో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తనను గుంటూరుకు షిఫ్టు కావాలని కోరారని.. అందుకు తాను ససేమిరా అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.గుంటూరులో ఓటమి పాలైతే.. తనను …

Read More »

సర్వేల టెన్షన్ పెరిగిపోతోందా ?

తెలంగాణా బీజేపీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు సర్వేల్లో బీజేపీ గెలుచుకోబోయే ఎంపీల సంఖ్య ఇది అని వెల్లడవుతున్న జోస్యాలు. మరోవైపు కచ్చితంగా డబుల్ డిజిట్ టచ్ చేయాల్సిందే అన్న అగ్రనేతల ఆదేశాలు. ఈ రెండింటి మధ్యలో సమన్వయం సాధించటం ఎలాగ అన్న టెన్షన్ సీనియర్ నేతల్లో పెరిగిపోతోందని పార్టీవర్గాల సమాచారం. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో ఎట్టి పరిస్ధితుల్లోను 10 సీట్లు గెలుచుకుపోవాల్సిందే అని ఇప్పటికే జాతీయ నాయకత్వం స్పష్టంగా …

Read More »

పల్నాడులో పట్టుకోసం కొత్త స్కెచ్

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు నాయుడు కొత్త స్కెచ్ ను రెడీచేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యూహాలను రచిస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కొత్త, గట్టి అభ్యర్ధులను చంద్రబాబు పోటీలోకి దింపబోతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటుతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను టీడీపీ ఓడిపోయింది. …

Read More »

ఒక్క శాతం ఓటుకు సీఎం పోస్టా?

ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు ఎంత ఉంది? అంటే త‌డుముకోకుండా.. ఆపార్టీ నాయ‌కులే 1 శాతంలోపే అని చెబుతారు. మ‌రి అలాంటి పార్టీకి అధికారం ద‌క్క‌డం.. సాధ్య‌మేనా? ముఖ్య‌మంత్రి పీఠం ఇవ్వ‌డం స‌మంజ‌స‌మేనా? అనేది కీల‌క ప్ర‌శ్న అయితే.. ఆ పార్టీ నాయ‌కుడు.. విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి మాత్రం కావాల‌నే అంటున్నారు. ఎక్క‌డా కూడా ఒక్క‌శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీల‌కు ఎంత పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ పార్టీలు సీఎం …

Read More »

బీఆర్ఎస్‌కు ఏమైంది?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీలో పెను కుదుపులు చోటు చేసుకున్నాయి. ఒక‌రు వెంట ఒక‌రుగా.. పార్టీ నాయ‌కులు జంప్ చేసేస్తున్నారు. ముహూర్తం పెట్టుకుని మ‌రీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. వీరిలో చోటా మోటా నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడితే.. మాజీ మంత్రులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మ‌రో 20 రోజుల్లో షెడ్యూల్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఈ జంపింగులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. అయితే.. …

Read More »

సాయిరెడ్డి మంత్రం.. ద‌డ‌పుట్టిస్తున్న లోకేష్ వ్యూహం?

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి. ఇక్క‌డ నుంచి టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ప‌డిన చోట నుంచే పైకి లేవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పట్టుదలగా ఇక్క‌డ‌ పని చేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హిస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ ఓడిపోయినా..ఆయ‌న హ‌వా మాత్రం చెక్కు …

Read More »

“ఇక్క‌డే ఉంటా.. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా!”

జ‌న‌సేన నాయ‌కుడు, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం అన‌కాప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా అక్క‌డే ఉంటాన‌ని చెప్పేశారు. అంతేకాదు.. వైసీపీ ఎలా గెలుస్తుందో కూడా చూస్తాన‌ని వ్యాఖ్యానించారు. “ఇక్క‌డే ఉంటా.. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా!” అని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. రాష్ట్రంలో రాక్షస పాలన పోయే విధంగా జనసేన – టీడీపీ కూటమి ముందుకు సాగుతాయని …

Read More »

చంద్ర‌బాబు ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు యాగాలు, య‌జ్ఞాల బాట ప‌ట్టారు. గ‌త ఏడాది ఆయ‌న ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో ప్ర‌త్యేక య‌జ్ఞాలు జ‌రిపించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో జైలు నుంచి బ‌య‌ట‌కువ‌చ్చిన త‌ర్వాత‌.. పండితుల సూచ‌న‌ల మేర‌కు వీటిని నిర్వ‌హించారు. అయితే.. రాష్ట్ర‌శ్రేయస్సు కోసం నిర్వ‌హించామ‌ని.. స్వ‌యంగా చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రి దంప‌తులు వెల్ల‌డించారు. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు.. అత్యంత శ‌క్తిమాన్విత‌మ‌ని చెప్పే రాజ‌శ్యామ‌ల యాగాన్ని ప్రారంభించారు. ఈ …

Read More »

‘రాజ‌ధాని ఫైల్స్‌’కు చంద్ర‌బాబు ప్ర‌మోష‌న్‌

ఏపీ రాజ‌ధాని ‘అమ‌రావతి’ విధ్వంసం.. ఇక్క‌డి రైతుల ఆవేద‌న, ఉద్య‌మం, ఆందోళ‌న‌లు, పాద‌యాత్ర‌.. వైసీపీ స‌ర్కారు మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌ను క‌ధా వ‌స్తువుగా చేసుకుని రూపొందించిన ‘రాజ‌ధాని ఫైల్స్‌’ సినిమాను అంద‌రూ చూడాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఓ ప్రాంతంపై కక్షగట్టి.. రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారం అండతో ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశారని …

Read More »