Political News

కాంగ్రెస్‌లో చేరిపోతే.. ఇవ‌న్నీ ఆగిపోయాతా?

పాల‌మ్మినా.. పూల‌మ్మినా.. అంటూ రాజ‌కీయాలు చేసే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు, మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి భారీ షాక్ త‌గిలింది. భూమిని ఆక్రమించి రోడ్డు వేశారన్న కార‌ణంగా మ‌ల్లారెడ్డికి చెందిన కాలేజీ రోడ్డును ఇటీవ‌ల తొలగించగా.. గురువారం ఆయన అల్లుడి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. రాజ‌కీయంగా ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశం అయింది. హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన్న దామర చెరువు ఎఫ్ టీఎల్ …

Read More »

ఇంట్లో మాట్లాడి చెబుతానన్న ముద్ర‌గ‌డ

రాజ‌కీయ అరంగేట్రంపై సుదీర్ఘ చ‌ర్చ‌లు.. వాదోప‌వాదాలు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే తాను ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేర‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే.. మంచిరోజు చూసుకుని చేర‌తాన‌ని. దీనికి ముందు మీడియాకు తాను స‌మాచారం ఇస్తాన‌ని ముద్ర‌గడ పేర్కొన్నారు.దీంతో ముద్ర‌గ‌డ కుటుంబం రాజ‌కీయ ప్ర‌స్తానం తిరిగి ప్రారంభ‌మైన‌ట్ట‌యింది. ఇదిలావుంటే.. గ‌త రెండు రోజులుగా తీవ్ర …

Read More »

గ‌వ‌ర్న‌ర్ ఇలా చేసి ఉండాల్సింది కాదు

తెలంగాణలోని గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ల విష‌యంలో చోటుచేసుకున్న వివాదానికి హైకోర్టు తెర‌దించిం ది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన వారి విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును కోర్టు త‌ప్పుబ‌ట్టింది. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేసిన సిఫార‌సు మేర‌కు గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అని గ‌వ‌ర్న‌ర్‌ను ఉద్దేశించికోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలో రేవ‌త్‌రెడ్డి ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన …

Read More »

ఈ రోజు తేల్చేస్తావా బాబూ..

రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబునాయుడు పట్టుదల. బీజేపీతో పొత్తుంటేనే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయగలమన్నది చంద్రబాబు ఆలోచన. అందుకనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నది. పొత్తు విషయమై ఇంత కాలం సస్పెన్స్ గా ఉన్న చర్చలు ఇపుడు కొలిక్కి వస్తున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో చర్చించారు. అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం ఏమిటో బయటకు రాలేదు. చర్చల …

Read More »

జ‌న‌సేన‌లోకి వాసిరెడ్డి.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

వైసీపీలో సంచ‌ల‌నం చోటు చేసుకోనుందా? కీల‌క నాయ‌కురాలు.. ప్ర‌స్తుత మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌.. జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అయ్యారా? ఇప్ప‌టికే ర‌హ‌స్యంగా మంత‌నాలు కూడా పూర్తి చేసుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు పంపించారు. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. వాసిరెడ్డి ప‌ద్మ‌.. వైసీపీ …

Read More »

మోడీ ప్ర‌సంగాల‌కు ‘ఏఐ’ మెరుపులు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌సంగాల‌కు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలెన్స్‌(ఏఐ)తో మెరుపులు మెరిపించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌క్షిణాది రాష్ట్రాలే కేంద్రంగా ఈ ప్ర‌యోగానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. వాస్త‌వానికి ఏఐ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సందేహాలు, అను మానాలు.. విమ‌ర్శ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. ఏఐతో మంచి ప‌నులు కూడా చేయొచ్చ‌నేది నిర్ధార‌ణ అయిన అంశమే తాజాగా ఒత్తిడిని గుర్తించే ఏఐ టూల్ అందుబాటులోకి వ‌చ్చింది. అదేవిధంగా ఏఐని వినియోగించి …

Read More »

బీఆర్ఎస్‌కు షాకుల‌పై షాకులు

పార్లమెంట్ ఎన్నికలకు స‌మ‌యం ముంచు కొస్తోంది. ఈ క్ర‌మంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వం నుంచి పుంజుకునేం దుకు బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో పార్ల‌మెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ద‌క్కించుకుని పార్టీ ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే.. పార్టీ ఊహించింది ఒక‌టైతే.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న‌ది మ‌రొక‌టిగా ఉంది. నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ పార్టీకి దూమ‌వుతున్నారు. మ‌రికొంద‌రు పార్టీలోనే ఉన్నామంటూనే.. పోటీకి దూరంగా ఉంటున్నారు. …

Read More »

40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కఠిన నిర్ణయాలు ఇవే

మొత్తానికి ఇన్ని దశాబ్దాల రాజకీయంలో చంద్రబాబునాయుడు గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్లున్నారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో కొందరు సీనియర్ల విషయంలో కఠినంగా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని పార్టీవర్గాల సమాచారం. ఇందులో భాగంగానే కొందరు సీనియర్లకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారట. పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే పొమన్నట్లుగా చంద్రబాబు గట్టిగానే మాట్లాడుతున్నారని సమాచారం. విషయం ఏమిటంటే ఉత్తరాంధ్రలో ఇద్దరు సీనియర్ నేతలు, మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, కళా వెంకటరావుకు …

Read More »

మా జోలికొస్తే.. తొక్కి పేగులు తీసి మెడ‌లో వేసుకుంటం బిడ్డా!

“కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రో ఆరు మాసాల్లో కూలిపోతుంది” అంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ తెలంగాణ చీఫ్‌, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పేద‌లు ముఖ్య‌మంత్రి సీటులో కూర్చుంటే ఓర్వ‌లేక పోతున్నారా? అంటూ నిప్పులు చెరిగారు. “కేసీఆర్ ప‌దేళ్లు ముఖ్య‌మంత్రి సీటులో కూర్చున్న‌డు. బీజేపీ కేంద్రంలో ప‌దేళ్లు అధికారంలో ఉంది. కానీ, పేద‌ల ప్ర‌భుత్వం కాంగ్రెస్ .. ఆరు మాసాలు కూడా ఉండ‌కూడ‌దా?” అని రేవంత్ …

Read More »

‘జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టింది.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం’

ఏపీ స‌చివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టి రూ.370 కోట్లు తీసుకురావ‌డం ప‌ట్ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఇప్ప‌టికే ఒక‌సారి దీనిపై ఆయ‌న వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండె లాంటి సచివాలయాన్ని తాకట్టుపెట్టడంపై మండిపడ్డారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం ప్రభుత్వ భవనాలను కాదని…తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రం పరువు, ప్రతిష్ఠను వైసీపీ ప్రభుత్వం …

Read More »

డెత్ సర్టిఫికెట్లపై జగన్ ఫొటో..జేపీ ఫైర్

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ…కాదేదీ కవితకనర్హం అన్న శ్రీశ్రీ మాటలను వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారని, అందుకే జగనన్న ఫోటో ప్రచురించడానికి కాదేది అనర్హం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఫల్లీ చిక్కీ కవర్ మొదలు పొలం పట్టాదారు పాస్ బుక్ వరకు జగనన్న ఫోటోలు ముద్రిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే …

Read More »

నెల్లూరులో క‌ల్లోలం.. సాయిరెడ్డి స‌రిచేయ‌గ‌ల‌రా?

నెల్లూరు.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో 10 స్థానాల‌కు ప‌ది సీట్లూ వైసీపీ గెలుచుకుంది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా ఆపార్టీకి దూర‌మ‌య్యారు. ఇలాంటి క‌ల్లోల స‌మ‌యంలో పార్టీ ఇంచార్జ్‌గా ఇక్క‌డ అడుగు పెట్టారు వేణుంబాక్కం విజయసాయిరెడ్డి. మ‌రి ఆయ‌న ఈ ప‌రిస్థితుల‌ను హ్యాండిల్ చేయ‌గ‌ల‌రా? అనేది ప్ర‌శ్న‌. సాయిరెడ్డి ఎంట్రీతో నెల్లూరు రాజకీయం మరింత వేడెక్కింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ …

Read More »