ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి.. ఉగాది పూజల్లో పాల్గొన్నారు. పండితుల వేద ఆశీర్వచనం తీసుకున్నారు. నెత్తిన అక్షతలు కూడా జల్లించుకున్నారు. ఇవన్నీ పూర్తిగా హిందూ సంప్రదాయానికి చెందినవనే విషయం తెలిసిందే. అయితే.. ఆమె ఎప్పుడూ.. ఇలా హిందూపూజల్లో నేరుగా పాల్గొనలేదు. సంక్రాంతి వంటి సంబరాల్లో పాల్గొన్నా.. జగన్ ఒక్కరే పండితుల నుంచి ఆశీర్వాదం …
Read More »వలంటీర్లకు రూ.10 వేలు.. చంద్రబాబు బంపరాఫర్
ఏపీలో వలంటీర్ల వ్యవస్థ.. ఇటీవల కాలంలో రాజకీయంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. వలంటీర్లను పింఛన్ల పంపిణికీ, ప్రభుత్వ పథకాల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. అధికార పార్టీ నాయకులు.. దీనిని టీడీపీ నేతలపైకి నెట్టేశారు. దీంతో చంద్రబాబు కారణంగానే వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయడం లేదనే విషయం చర్చకు వచ్చింది. అయితే.. దీనిని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు, టీడీపీ నాయకులు చాలానే శ్రమించారు. …
Read More »128 ఇక్కడ-24 అక్కడ: ఉగాది టీడీపీ పంచాంగం!
తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ పఠనం కార్యక్రమాన్ని ని ర్వహించాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ పంచాంగ పఠనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక, సహ జంగానే పంచాంగ పఠన కర్తలు.. ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే ఆ పార్టీ పాటే పాడుతుంటారు. దీనిని ఎవరూ తప్పుబట్టరు. ఇలానే.. తాజాగా టీడీపీ …
Read More »చిరుది కేవలం డొనేషన్ కాదు
మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇవ్వడం ఈ రోజు హాట్ టాపిక్గా మారింది. తమ్ముడి పార్టీకి అన్న విరాళం ఇవ్వడంలో విశేషం ఏముంది అనిపించవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దీన్ని ఒక కీలక పరిణామంగానే చూడాలి. నిజానికి చిరు ఇచ్చింది కేవలం విరాళం కాదు.. ఒక పెద్ద స్టేట్మెంట్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా అభిమానుల్లోనే ఇప్పుడు రకరకాల వర్గాలు ఏర్పడ్డాయి. చిరు …
Read More »షర్మిల వెనుక రేవంత్!
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు చూపిస్తున్నారు. న్యాయ యాత్ర పేరుతో బస్సులో పర్యటిస్తున్న ఆమె ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కడప లోక్సభ నియోజకవర్గంలో వైసీసీ సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై విజయమే లక్ష్యంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళుతూ.. అవినాష్, సీఎం జగన్పై షర్మిల తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయితే షర్మిల జోరు వెనుక తెలంగాణ సీఎం …
Read More »బీఆర్ఎస్ ఖాళీ.. పంతం నెగ్గించుకున్న పొంగులేటి
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. శపథం నెరవేర్చుకున్నారు. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. అవును.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను ఖాళీ చేస్తానన్న ఆయన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఇప్పుడు ఖమ్మంలో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకట్రావు తాజాగా కాంగ్రెస్లో చేరిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన …
Read More »ఆర్ఆర్ఆర్ తులసి మొక్కే.. పార్లమెంటే చెప్పింది!
వైసీపీ రెబల్ ఎంపీగా దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణ రాజు.. తనను తాను.. గంజాయి వనంలో తులసి మొక్కని అని పదే పదే చెప్పుకొన్నారు. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో గెలిచిన 22 మంది ఎంపీలో తాను ఒకడిని కాదని.. తాను ప్రత్యేకమని చెప్పుకొనేవారు. అయితే.. దీనిని కొందరు యాక్సెప్ట్ చేసేవారు.. మరికొందరు తోసిపుచ్చేవారు. అయితే.. ఇప్పుడు పార్లమెంటు రికార్డులు.. ఆర్ ఆర్ ఆర్ను …
Read More »టార్గెట్ కిషన్రెడ్డి.. రేవంత్ మాస్టర్ ప్లాన్
తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీకి ఇక్కడ మెరుగైన ఫలితాలు అందించడం కోసం శ్రమిస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటూ ఆ పార్టీని దెబ్బకొడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సభతో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోటీగా భావిస్తున్న బీజేపీపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ముందుగా ఆ పార్టీలో ప్రస్తుతం పెద్ద …
Read More »ఏపీ సీఐడీ కీలక పత్రాల దహనం..!
ఏపీ సీఐడీకి చెందిన కీలక అధికారి ఒకరు స్వయంగా కొన్ని పత్రాలను దగ్గరుండి మరీ దహనం చేస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో తీవ్ర సంచలనం చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ గత నాలుగేళ్లలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కేంద్రంగానే పనిచేసిందనే విమర్శలు వున్నాయి. వారిని అరెస్టు చేసేందుకు ఏవేవో కేసులను తవ్వి తీశారని అప్పట్లో టీడీపీ …
Read More »ప్లాన్ బి : బాబు – పవన్ జంటగా సభలు
సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. షెడ్యూల్ విడులకు కొద్ది నెలల ముందే ఏపీలో రాజకీయం ఎంతలా రాజుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనంతనే అధికార.. విపక్ష అధినేతలతో సహా ముఖ్యనేతలంతా వరుస పెట్టి సభల్ని నిర్వహిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మాటలతో మరింత మంట పుట్టేలా చేస్తున్నారు. ఏపీ అధికార పక్షం ఒంటరిగా …
Read More »జగన్ ను ఎవరూ అనలేని మాటను అనేసిన షర్మిల
ఏపీలో రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. గడిచిన దశాబ్దాల్లో ఎప్పుడూ కనిపించని ఎన్నో అంశాలు తాజా ఎన్నికల్లో తెర మీదకు వస్తున్నాయి. జగనన్న విడిచిన బాణాన్ని అంటూ కొన్నేళ్ల క్రితం వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన షర్మిల.. ఇప్పుడు అదే జగన్ పై నిప్పులు కురిపిస్తున్నారు. ఏపీ పీసీసీ రథసారధిగా వ్యవహరిస్తున్న ఆమె తన సోదరుడు జగన్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇంతకాలం జగన్ …
Read More »అర్థరాత్రి వేళ క్రోసూరులో టీడీపీ ఆఫీసుకు నిప్పు
ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలకు భిన్నంగా తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వా నేనా? అన్న రీతిలో జరుగుతున్న ఈ ఎన్నికలు అధికార.. విపక్షానికి అత్యంత కీలకమైనవి కావటంతో రెండు పక్షాలు ఎక్కడా తగ్గని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా పల్నాడు జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి వేళ క్రోసూరులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates