దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్ లో 7, ఒడిషాల్లో 5, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, …
Read More »తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని చోట్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించి ప్రారంభించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని కుదిస్తామని ప్రకటించడం కొత్త పంచాయతీలకు తెరలేపడమే అని భావిస్తున్నారు. 17 పార్లమెంటు …
Read More »మాజీ ప్రధాని మనవడి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన మాజీ ప్రధాని మనవడి కోసం బ్లూ కార్నర్ నోటీసులు సహా అరెస్టు వారెంటు జారీ చేయడం.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయనే మాజీ ప్రధాని దేవెగౌడ.. ఆయన మనవడే.. సెక్స్ ర్యాకెట్ కుంభకోణంలో చిక్కుకున్న పార్లమెంటు(హాసన్) సభ్యుడు 36 ఏళ్ల ప్రజ్వల్. తాజాగా ఈయనపై అరెస్టు వారెంటు …
Read More »జగన్.. నీరో : జేడీ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు దేశం తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నా డని.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఇలానే చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాజాగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ అనంతరం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయని.. దీంతో అసలు ఏం జరుగుతోందో కూడా …
Read More »సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు
ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సేద తీరేందుకు విదేశాలకు వెళుతున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం జగన్ మే 18న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే జూన్ 1న జగన్ తిరిగి ఏపీలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు, …
Read More »కుప్పం బాబుకు లక్ష ‘కప్పం’ చెల్లిస్తుందా ?
కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప మరో పార్టీ గెలవలేదు. 1989 నుండి వరసగా ఇప్పటి వరకు చంద్రబాబు ఏడు సార్లు గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఇక్కడ చంద్రబాబుకు లక్ష మెజారిటీ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పోరాడింది. మరి అది సాధ్యం అవుతుందా ? కాదా ? అన్న విషయంలో భారీగా బెట్టింగులు చోటు చేసుకుంటున్నట్లు …
Read More »ఏపీలో ఆ జిల్లాలకు ఒక కలెక్టర్-ముగ్గురు ఎస్పీలు !
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆయా జిల్లాలకు కొత్త అదికారులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పంపించిన పేర్ల నుంచి వారిని ఎంపిక చేసి.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. పల్నాడు జిల్లా కలెక్టర్గా ఉన్న లోతోటి శివశంకర్ను బదిలీ చేసిన …
Read More »లండన్లో జగన్… ఫస్ట్ లుక్ ఇదే!
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష, వర్షలతో కలిసి ఆయన లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ పర్యటనలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్కు బయలు దేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న విమానం లండన్కు చేరుకుంది. అక్కడే జగన్ కుటుంబం ప్రయాణించిన విమానం …
Read More »టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయమే!
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై తర్జన భర్జనలు ఉన్నా..ఎవరికి వారు అంచనాలు వేసుకున్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. 92 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందనే లెక్కలు అందుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసినా.. అభ్యర్థుల పరంగా అంచనా వేసినా.. ఈ లెక్క ఖచ్చితమనే తెలుస్తోందని టీడీపీ …
Read More »జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు ఈ నెల 14న సీబీఐ కోర్టు అనుమతించింది. నిన్న లండన్ బయలుదేరిన జగన్ తిరిగి జూన్ 1న రాష్ట్రానికి తిరిగి వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విమాన ఖర్చు వివరాలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. విస్టా జెట్ కంపెనీకి …
Read More »హర్యానా : కమలం ‘చే’జారేనా ?
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా రాష్ట్రాలలో నెలకొన్న వివిధ పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆయా వర్గాలలో గూడు కట్టుకున్న ఆవేదన, ఆగ్రహం ఈ ఎన్నికలలో తమ విజయం మీద ప్రభావం చూపుతుందేమో అన్న భయం బీజేపీ పార్టీలో నెలకొన్నది. హర్యానా రాష్ట్రంలో 2014 లోక్ …
Read More »సోనియమ్మ.. సెంటిమెంటు రాహుల్ను కాపాడుతుందా?
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు ఎగబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంటు వైపు అడుగులు వేసింది. తాజాగా ఆ పార్టీ అగ్రనాయకురాలు, మాజీ చీఫ్.. సోనియాగాంధీ కూడా సెంటిమెంటు బాంబునే పేల్చారు. ప్రస్తుతం ఆమె పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న విషయం తెలిసిందే. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates