ఒడిదుడుకులతో ఇబ్బందులు పడుతున్న ఇండియా కూటమికి పాజిటివ్ సంకేతాలు కనబడుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కూటమిలో ఇంతకాలం కీలకంగా వ్యవహరించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే పార్లమెంటు సీట్లను కాంగ్రెస్ తో పంచుకోవటానికి ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్), తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించేదిలేదని తేల్చిచెప్పేశాయి. దాంతో కూటమంతా గందరగోళంగా తయారైంది. ఇవన్నీ చూసిన తర్వాతే నితీష్ ఇండియా కూటమికి హ్యాండిచ్చి ఎన్డీయేలోకి మారిపోయింది. అయితే …
Read More »టార్గెట్ 12: బీఆర్ఎస్ పక్కా స్కెచ్..
సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాకముందే.. హైదరాబద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి.. జల వివాదాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందని కూడా సమాచారం. గోదావరి, కృష్ణా జలాలపై బీఆర్ఎస్ నీటిపోరు యాత్ర …
Read More »AP : బీజేపీ కావాలనే జాప్యం చేస్తోందా ?
బీజేపీ వైఖరి ఏమిటో అర్ధం కావడం లేదు. ఏపీలోని టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలు పంపించిన పార్టీ ఆ దిశగా కసరత్తును చేస్తున్నట్లు మాత్రం కనబడటం లేదు. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు చేసుకుంటున్న సమయంలో సడెన్ గా పొత్తుకు సిద్ధమనే సంకేతాలను బీజేపీ పంపింది. చంద్రబాబునాయుడును ఢిల్లీకి వచ్చి కలవాలని కబరుచేసింది. దాంతో చంద్రబాబు ఈనెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ …
Read More »జగన్ సిద్ధం.. రెండు హెలికాప్టర్లు రెడీ…!
వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం దక్కించుకునేందుకు శతథా ప్రయత్నాలు చేస్తున్న సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఆదిశగా మరో కీలక అడుగు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని తన భుజాలపైనే వేసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీకి ప్రత్యేకంగా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఎవరూ లేరు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున జగన్ సోదరి షర్మిల, మాతృమూర్తి విజయమ్మలు ప్రచారం చేశారు. కానీ, వీరిద్దరూ ఇప్పుడు దూరంగా …
Read More »కూటమి అభ్యర్ధిగా నల్లారి ?
జనజీవన స్రవంతి నుండి దాదాపు పదేళ్ళుగా దూరంగా ఉంటున్న నేతలు కూడా రాబోయే ఎన్నికల పుణ్యమాని వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకళ్ళు. ఇపుడు విషయం ఏమిటంటే టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరబోతోందనే ప్రచారం అందరికీ తెలుసింది. పొత్తు చర్చల్లో సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలే కీలకం. ఇదిగనుక సెట్ అయ్యిందంటే చంద్రబాబునాయుడు ఎన్డీయేలో పార్టనర్ అవుతారు. …
Read More »బొత్సపై బాబు గంటాను దింపుతారా?
మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్లేనా ? అవుననే పార్టీలో సమాధానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే గంటా మీడియాతో మాట్లాడుతు తాను రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేస్తానని చెప్పారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టంగా ప్రకటించారు. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయమని చంద్రబాబునాయుడు ఆదేశించారు. అయితే అక్కడ పోటీ …
Read More »షాక్: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి
హైదరాబాద్ నగర శివారులో షాకింగ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యువ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) దుర్మరణం పాలయ్యారు. కారు ప్రమాదంలో ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్ చెర్వు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది. దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె పీఏ …
Read More »టార్గెట్ @14 : రేవంత్ మరిన్ని నిర్ణయాలు
పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నా రు. వచ్చే ఎన్నికల్లో 17 స్థానాలకు గాను.. 14 చోట్ల విజయం దక్కించుకుని తీరాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్.. దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో మరో రెండు హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ …
Read More »ఔను.. మమ్మల్ని వాళ్లే పిలిచారు: టీడీపీ క్లారిటీ
వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న టీడీపీ ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ అదినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. అయితే..తర్వాత దీనిపై ఏం జరిగిందనేది మాత్రం బయటకు చెప్పలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తిగా మౌనం దాల్చారు. మరోవైపు బీజేపీ కూడా కేంద్రం పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము నడుస్తామని చెప్పిందే తప్ప.. …
Read More »జగన్ ఇంటి ముట్టడి- షర్మిల మరో పిలుపు
ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా మరో పిలుపునిచ్చారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ ఇంటిని ముట్టడిస్తామని ఆమె తెలిపారు. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ నిరంకుశ ధోరణిని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. మెగా డీఎస్సీ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులను పట్టించుకోకుండా.. వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో …
Read More »టీడీపీలో జీఎస్.. వైసీపీకి భారీ దెబ్బేనా…!
ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో జంపింగులు కామన్గా మారిపోయాయి. టికెట్లు దక్కని వారు.. తమకు నచ్చని సీటును ఇవ్వలేదని భావిస్తున్నవారు.. పార్టీలు మారుతున్నారు. ఈ జంపింగులకు ఎవరూ అతీతులు కాకుండా పోయారు. ఇదిలావుంటే.. వైసీపీకి ఇప్పటి వరకు అన్ని విధాలా అండగా ఉన్న గెదెల శ్రీను.. ఉరఫ్ జీఎస్గా పిలుచుకునే యువ పారిశ్రామిక వేత్త.. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్టు తెలిసింది. ఉత్తరాంధ్రకు చెందిన జీఎస్.. ఇటీవల శంఖారావం సభకు వచ్చిన …
Read More »ఈ ఈక్వేషన్లను నాగబాబు దాటుతారా?
మిగిలిన పార్లమెంట్ సీట్ల సంగతిని పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభకు నాగబాబు పోటీ చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయం నాగబాబు ప్రకటనల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. అయితే జనసేన నేతల్లో మొదలైన ప్రశ్న ఏమిటంటే నాగబాబు అనకాపల్లిలో గెలవగలరా ? అని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నన్ని కులాలు ఇంకెక్కడా ఉండవు. మిగిలిన నియోజకవర్గాలను వదిలేసినా అనకాపల్లిలో తూర్పుకాపులు, కొప్పుల వెలమలు చాలా బలమైన సామాజికవర్గాలు. ఈ రెండు …
Read More »