Political News

ఆటో డ్రైవర్ల సేవలో..భారమైనా మోస్తాం: పవన్

విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం అమలు చేసేందుకు 436 కోట్ల రూపాయల భారం ఖజానాపై పడుతుందని, అయినా సరే బాధ్యతతో ఆ భారాన్ని సంతోషంగా భరిస్తూ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించిందని అన్నారు. ఆటో డ్రైవర్లకు చిన్నపాటి ఊతమిచ్చినా చాలని తాము భావించామని …

Read More »

విక్ట‌రీ వెనిగండ్ల: గుడివాడకు సర్ ప్రైజ్…!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం పేరు చెబితే.. గుర్తుకు వ‌చ్చేది.. గ‌త ఏడాది కింద‌టి వ‌రకు ఘ‌ర్ష‌ణ‌లు.. గంజాయి.. పేకాట.. కేసినో వంటివే వినిపించేవి, క‌నిపించేవి కూడా! అని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించే వారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఎన్నారై, టీడీపీనాయ‌కుడు వెనిగండ్ల రాము ఇక్క‌డ విజయం ద‌క్కించుకున్నారు. దీంతో ఇక్క‌డి రూపు రేఖ‌లు స‌మూలంగా మారుతున్నాయి. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. …

Read More »

ఆటోవాలా చంద్రబాబు, పవన్, లోకేశ్

ఏపీలో స్త్రీ శక్తి పథకం ద్వారా నిర్దేశించిన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే, అదే సమయంలో ఈ పథకం అమలు నేపథ్యంలో ఆటో, క్యాబ్  డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్న …

Read More »

అమరావతి పై మలేషియా చూపు

మలేషియా దేశానికి చెందిన 12 మంది ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది. ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబు మలేషియాలో పర్యటించిన సందర్భంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నామని, ప్రపంచ స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. దీంతో మలేషియా ప్రభుత్వం 12 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపింది. …

Read More »

నోరు జారే ఎమ్మెల్యేలపై బాబుకు ఆగ్రహం

నోరు జారే ఎమ్మెల్యేల‌ను జిల్లాల‌కు చెందిన ఇంచార్జ్ మంత్రులే నియంత్రించాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న కేబినెట్ భేటీ అనంత‌రం మంత్రుల‌తో విడివిడిగా మాట్లాడారు. ఇంచార్జ్ మంత్రిగా నియ‌మించిన‌ప్పుడు ప్రత్యేక బాధ్య‌త‌లు ఉంటాయ‌ని తేల్చి చెప్పారు. వాటిని సక్ర‌మంగా నిర్వ‌ర్తించాల‌న్నారు. “ఎమ్మెల్యేలు త‌ప్పులు చేస్తున్నారంటే ఎవ‌రు నియంత్రించాలి? అన్నీ నేనే చూడ‌లేను. మీరు అన్ని విష‌యాల‌ను ప‌రిశీలించాలి. నోరు జారుతున్నార‌ని తెలిసి కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు?” అని …

Read More »

ఏపీ `పారాసైట్`.. ఇచ్చి ప‌డేసిన లోకేష్‌!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చామ‌ని, 4.7 ల‌క్ష‌ల ఉద్యోగాలు కూడా క‌ల్పించామ‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో పొరుగు ఉన్న క‌ర్ణాట‌క నుంచి ఏపీపై రాజ‌కీయ దాడులు జ‌రుగుతున్నాయి. త‌మ కంపెనీల‌ను.. త‌మ రాష్ట్రంలోని వ్యాపారాల‌ను.. ఏపీ లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని క‌ర్ణాట‌క‌లోని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా …

Read More »

మోడీ రావణుడు: కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ అభినవ రావణాసురుడు అని, ఆయన చేస్తున్న పనులు దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. అలాగే ఆర్‌ఎస్ఎస్ సిద్ధాంతాలకు, ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలకు పెద్ద తేడా లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత ఉదిత్ రాజ్ మీడియాతో మాట్లాడారు. అంతేకాదు, మోడీ ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేరని, త్వరలోనే బీజేపీ …

Read More »

బాబు కేబినెట్‌ నిర్ణయాలు.. అన్నీ మంచివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి సమావేశమైంది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధికి ఇబ్బంది ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి ఆర్థికంగా ఇబ్బందులు తొలగించేందుకు ఉద్దేశించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ఇటీవలి కాలంలో ప్రకటించారు. …

Read More »

విజయ్ కు షాక్… టీవీకే పిటిషన్ కొట్టివేత

తమిళ స్టార్ హీరో విజయ్ కు శుక్రవారం ఊహించని షాక్ ఎదురైంది. ఆయన స్థాపించిన పార్టీ తమిళ వెట్రిగ కళగం (టీవీకే) మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచి కొట్టివేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై అటు దర్యాప్తు గానీ, ఇటు విచారణ గానీ ప్రాథమిక దశలో ఉండగానే సీబీఐ దర్యాప్తును ఎలా కోరతారని కోర్టు ప్రశ్నించింది. కనీసం ఘటనపై ప్రాథమిక సమాచారం రాకుండానే …

Read More »

ఇంటిని చ‌క్క‌దిద్దే ప‌నిలో ప‌వ‌న్‌.. ఏం చేస్తున్నారంటే..!

ఏ పార్టీకైనా మార్పులు అవ‌స‌రం. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మ‌రింత ప‌ట్టును పెంచుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వర్గంపై దృష్టి పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇక్క‌డకు ఆయ‌న రావ‌డం అరుదుగా సాగుతోంది. దీంతో పిఠాపురం జ‌న‌సేన పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న …

Read More »

విధేయ‌త‌కు వీర‌తాడు: నాగ‌బాబు ప‌ద‌వి.. రామ్‌కు!

రాజ‌కీయాల్లో విధేయుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం కొత్త‌కాదు. పార్టీ ప‌ట్ల‌, పార్టీ అధినేత‌ల ప‌ట్ల విధేయంగా ఉన్న నాయ‌కుల‌కు ప‌ద‌వులు అల‌వోక‌గా వ‌రిస్తుంటాయి. ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలలో కీలకమైన జ‌న‌సేన‌లోనూ.. ఇదే త‌రహాలో ప‌ద‌వులు వ‌స్తున్నాయి. పార్టీలో న‌మ్మ‌కంగా ఉంటూ.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి కార‌ణ‌మైన రామ్ తాళ్లూరికి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కీల‌క ప‌దవిని అప్ప‌గించారు. పార్టీ సంస్థాగ‌త, అభివృద్ధి వ్య‌వ‌హారాల‌ను ఆయ‌న చేతిలో పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే జ‌నసేన …

Read More »

చంద్రబాబుకే మేధావి వర్గం మద్దతు.. కారణం ఏమిటి?

రాష్ట్రంలోని మేధావి వర్గం అంతా కూడా సీఎం చంద్రబాబు వైపు నిలబడిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అనేకమంది మేధావులు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ఛానెల్లు, యూట్యూబ్ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించారు. అదేవిధంగా కూటమి నేతలకు అనుకూలంగా కామెంట్లు చేశారు. ప్రజలను ఒకరకంగా మొబిలైజ్ చేయడంలో మేధావి వర్గం పాత్ర కూడా ఉందని అంటారు. గత …

Read More »