Political News

ప్రజా సమస్యలపై కలెక్టరేట్ కు వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి ప్రజల్లో చురుకుగా కనిపించారు. పలు కేసుల్లో రిమాండ్ జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించి ప్రజా సమస్యలపై పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని వంశీ …

Read More »

అంబటి ఇప్పట్లో బయటకు రారా?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటికే అంబటిపై మరో 8 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం అంబటిపై 44 కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటికి గుంటూరు …

Read More »

సీఎంపై బావాబామ్మర్దుల షాకింగ్ కామెంట్స్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పొట్టోడా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి నిన్న కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే మరోసారి రేవంత్ ను కేటీఆర్ టార్గెట్ చేశారు. కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. తిడితే తనను తిట్టాలనీ…కేసీఆర్ ను, కార్యకర్తలను తిడితే …

Read More »

డిప్యూటీ సీఎం సీటుపై కమ్మవారి కన్ను

రాజకీయంగా తమకు తగినంత న్యాయం జరగడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పటికీ సరిపడినన్ని సీట్లు తమకు కేటాయించడం లేదని వారు గుర్రుగా ఉన్నారా? ఇక, ఉప ముఖ్యమంత్రి పదవిపై కమ్మవారి కన్ను పడిందా? ఈ సారి ఎలాగైనా డిప్యూటీ సీఎం పోస్టు తమ సామాజిక వర్గానికే కావాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(కేజీఎఫ్) ఫిక్సయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. …

Read More »

అధికారులకు పవన్ క్లాస్

ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది… ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి… ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతున్నాయి… లబ్ధిదారులకు పథకాలన్నీ అందుతున్నాయి… ఇదంతా పైకి కనిపిస్తోంది. అయితే, క్షేత్ర స్థాయిలో కొన్ని గ్యాప్ లు ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నా.. కొన్నిచోట్ల గ్యాప్స్ ఉన్నాయని అధికారులకు పవన్ క్లాస్ …

Read More »

ఇవేం మాటలు మల్లన్నా?

చింతపండు నవీన్…అలియాస్ తీన్మార్ మల్లన్న..తెలంగాణ ప్రజలకు సుపరిచితుడే. తీన్మార్ మల్లన్నగా పాపులర్ అయిన నవీన్…ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫక్తు పొలిటిషన్ గా మారిపోయారు. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలతో మల్లన్న ఎక్కువ పాపులర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ ఇలా పార్టీలు మారి చివరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అని సొంతంగా పార్టీ పెట్టారు. బీసీలకు రాజ్యాధికారం కావాలి అన్న నినాదంతో ఈ పార్టీ పెట్టారు …

Read More »

మళ్లీ వేడెక్కిన తెలంగాణ రాజకీయం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎవరికి జాతిపితవురా నువ్వు అంటూ కేసీఆర్ పై రేవంత్ చేసిన షాకింగ్ కామెంట్లు కాక రేపాయి. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలకు కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్ నా…అంటూ బూతులు తిడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు …

Read More »

బిగ్ డిబేట్‌: అంబ‌టి మౌనిక పొలిటిక‌ల్ ఎంట్రీ ట్విస్ట్‌… ?

వైసీపీ నేత అంబ‌టి రాంబాబు.. సీఎం చంద్ర‌బాబుపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న జైలుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక‌, అంబ‌టి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ.. టీడీపీ ఎమ్మెల్యే గ‌ళ్లా మాధవి, ఆమె భ‌ర్త రామచంద్ర‌రావు టీడీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు. ఈ క్ర‌మంలోనే మీడియా ముందుకు వ‌చ్చిన అంబ‌టి కుమార్తె మౌనిక‌.. ఇటు స‌ర్కారు, అటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ …

Read More »

స్టేడియంలో నో విజిల్స్.. విజ‌య్ పార్టీ అంటే భ‌య‌మా?

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అంటే విజిల్స్ మోత మోగాల్సిందే. ఆ న‌గ‌రానికి చెందిన ఐపీఎల్ జ‌ట్టు చెన్నై సూప‌ర్‌కింగ్స్ నినాద‌మే.. విజిల్ పోడు. అందుకు త‌గ్గ‌ట్లే ఐపీఎల్ స‌మ‌యంలో విజిల్స్ మోత మోగిపోతుంటుంది. ఐపీఎల్ లేని స‌మ‌యంలో కూడా విజిల్స్ సంద‌డి చేస్తుంటాయి. అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు, దేశ‌వాళీ మ్యాచ్‌లు జ‌రిగిన‌పుడు కూడా స్టేడియం ముందు విజిల్స్ అమ్ముతుంటారు. అభిమానులు అవి కొనుక్కుని వ‌చ్చి స్టాండ్స్‌లో కూర్చుని విజిల్స్‌తో …

Read More »

‘బీజేపీ లేక‌పోతే.. కూట‌మి లేదు’

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న చ‌డిపిరాళ్ల ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. బీజేపీ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా ఆయన తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి నుంచి ప్రారంభించి.. కూట‌మి పార్టీల వ‌ర‌కు కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా బీజేపీ రాష్ట్ర సార‌థి పీవీఎన్ మాధ‌వ్ స‌మ‌క్షంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యాఖ్య‌లు.. కూట‌మిలో …

Read More »

వైఎస్ జగన్ తో దళపతి విజయ్.. ఇంకేముంది..!?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన ఓ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే కార్యక్రమానికి దళపతి విజయ్ రావడం, జగన్ పక్కనే ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. విజయ్–జగన్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు తమ …

Read More »

`ల‌డ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న అత్యంత కీల‌క‌మైన చ‌ర్చ శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ కావ‌డ‌మే!. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి క‌ల్తీ జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని.. ఢిల్లీలో వెల్ల‌డించిన ద‌రిమిలా.. ఇప్పుడు ప‌లు ధార్మిక సంఘాలు, మ‌ఠాలు కూడా స్పందిస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దీనిని రాజ‌కీయ కోణంలోనే చూసిన …

Read More »