Political News

హైదరాబాదు రోడ్డుపై స్పందించిన ట్రంప్

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’లో స్పందిస్తూ.. “హైదరాబాద్‌లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన తొలి అమెరికా అధ్యక్షుడిని నేనే. ఈ గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన …

Read More »

చంద్రబాబు… అసలైన జెన్ జీ..!

ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ వినియోగంలో నేను జెన్ జీ వర్గమే అని చెప్పుకొచ్చారు. పరిపాలనకు టెక్నాలజీలు అనుసంధానం చేసే అతికొద్ది నేతలలో చంద్రబాబు నాయుడు పేరు మొదటిగా వినిపిస్తుంది. రాజకీయాల్లో కూడా ప్రస్తుతం జెన్ జీ ట్రెండ్ నడుస్తోంది. భవిష్యత్తుని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఆయనకు …

Read More »

టీడీపీ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలు?

అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. నల్లజెండాలతో గో బ్యాక్ మావిగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్లు, కోడిగుడ్లతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసు కానిస్టేబుల్‌ ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. …

Read More »

నానాజీ వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేస‌మ‌యంలో కొన్ని కీలక వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఇటీవ‌ల కాకినాడ సిటీ ఎమ్మెల్యే, జ‌న‌సేన నాయ‌కుడు పంతం నానాజీ మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ స్పందించారు. నానాజీ చేసిన వ్యాఖ్య‌ల‌ను తాను స‌మ‌ర్థించ‌బోన‌న్న ఆయ‌న‌.. ఇదేస‌మ‌యంలో ఆ ప్రాంతానికే చెందిన వైసీపీ నాయ‌కులు నీతిమంతంగానే రాజకీయాలు చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ముఖ్యంగా …

Read More »

వైసీపీ నేతలను తగ్గొద్దంటున్న పవన్

వైసీపీ నేతల విమర్శల్లో ఉపయోగించిన భాషపై జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మీకు అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి తిట్టేసి ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా.. ? అంటూ ఆయన ప్రశ్నించారు. జనసేన పార్టీ, వైసిపి నేతల మధ్య కొంతకాలంగా ఘాటు విమర్శలు కొనసాగుతున్నాయి. తమ పార్టీ అధినేత జగన్ ను జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దూషించారంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన …

Read More »

అమరావతిలో అలజడి.. వైసీపీ అగ్గి రాజేస్తోందా?

రాజధాని అమరావతి ప్రాంతంలో చాలా కాలం తర్వాత మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతలు చేపట్టిన పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపించిన వైసీపీ, ఇప్పుడు సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో మరోసారి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని …

Read More »

మార్కెట్‌లోకి మ‌న బంగారం.. ఏపీ ముద్ర కూడా!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరిలో బంగారు గ‌నుల నుంచి త‌వ్వి తీసిన ప‌సిడి మార్కెట్‌లోకి అందు బాటులోకి వ‌చ్చింది. సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌లే ఈ గ‌నుల‌ను ద‌క్కించుకున్న ఓ ప్రైవేటు కంపెనీని ప్రారంభించారు. అప్ప‌టికే ప‌నులు ప్రారంభించిన కంపెనీ.. బంగారాన్ని వెలికి తీయ‌డంతోపాటు దానిని శుద్ధి చేసి బిస్కెట్ల రూపంలో అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ బిస్కెట్లను సీఎం చంద్ర‌బాబుకు కానుక‌గా కూడా అందించారు. తాజాగా ఈ బంగారం బిస్కెట్లు సాధార‌ణ …

Read More »

మాకు ఆంధ్రా తెలంగాణ ఉండదు: లోకేష్

ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య ప్రాంతీయ‌త‌, రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించిన వివాదాలు తీవ్రంగా సాగుతున్న స‌మ‌యంలో కీల‌క విషయం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్‌లో ఇద్ద‌రు తెలంగాణ‌కు చెందిన యువ‌తులు లీడ్ రోల్ పోషిస్తున్న విష‌యం వెలుగు చూసింది. ప్ర‌స్తుతం ఏపీ-తెలంగాణ ప‌రిధులు.. హ‌క్కుల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇద్ద‌రు తెలంగాణ బిడ్డ‌లు ఏపీలో ఉద్యోగాలు చేస్తున్న విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనిపై …

Read More »

ఎన్నిక‌ల ముంగిట బీజేపీకి అయోధ్య ఎఫెక్ట్ ఎంత‌?

బీజేపీకి అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ముందు చెల‌రేగిన అయోధ్య రామ‌మందిర వివాదం కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావ‌డం.. 80 పార్ల‌మెంటు నియోజ‌న‌క‌వ‌ర్గాలు ఉన్న ఏకైక రాష్ట్రం కావ‌డంతో ఈ స్టేట్‌పై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న యోగి ఆదిత్య‌నాథ్‌ను తీసుకువ‌చ్చి ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎంగా కూడా చేశారు. త‌ద్వారా.. రాష్ట్రంలో ప‌క్కాగా బీజేపీని బ‌లోపేతం …

Read More »

కేటీఆర్ తప్పు ఒప్పేసుకున్నట్టేగా!

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన పార్టీగా బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్)కు ఓ ప్రత్యేక గుర్తుంపు అయితే ఉంది. అయినంత మాత్రాన కొత్త తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన ఆ పార్టీ ప్రభుత్వం తప్పులేమీ చేయలేదా? అంటే.. ఎందుకు చేయలేదు. చాలానే చేసింది. తప్పులు జరిగాయి. పొరపాట్లూ జరిగాయి. ఇదేదో బీఆర్ఎస్ వ్యతిరేకులో, బీఆర్ఎస్ అంటే గిట్టని వారో చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, …

Read More »

ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు వీర‌మ‌ర‌ణం

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందిన‌ట్టు కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. దాదాపు 13 మాసాల త‌ర్వాత ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఐదుగురు సైనిక శాశ్వత అధికారులు ఉన్నారు. మ‌రొక‌రు అగ్నివీర్ ఉన్నారు. వీరి పేర్ల‌ను జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద పొందుప‌ర‌చ‌నున్నారు. అమ‌రులైంది వీరే.. 1) సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్ (10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌)2) రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ …

Read More »

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరంటే?

తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డి సర్కారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజున కొత్త సీఎస్ గా జాజు పదవీ బాధ్యతలు చేపడతారు. …

Read More »