Political News

ర‌ఘురామ లేని లోటు.. భీమ‌వరంలో సంద‌డేది..?

ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం.. ఏకంగా ప్ర‌ధాన మంత్రి స్వ‌యంగా వ‌స్తున్న కార్య‌క్ర‌మం.. ఎన్నో ప్ర‌య త్నాలు.. మ‌రెన్నో ప్ర‌యాస‌లు కూడా ప‌డ్డారు.. స్థానిక పార్ల‌మెంటు స‌భ్యులు.. వైసీపీ నాయ‌కులు.. క‌నుమూరి ర‌ఘురామకృష్ణ‌రాజు. పైగా.. త‌మ వాడే అయిన‌.. మ‌న్యం వీరుడు.. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హ ఏర్పాటుకు.. ప్లాన్ చేసి.. నిధులు కూడా మంజూరు చేసిన ఎంపీ. అయితే.. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న రావ‌డం లేదు. …

Read More »

ఏపీ పుణ్య‌భూమి, వీర‌భూమి.. శ్లాఘించిన మోడీ

ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోడీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి తెలుగు జాతి యుగపురుషుడు. యావత్‌ భారతావనికి స్ఫూర్తిదాయకంగా …

Read More »

పార్టీని లాక్కోవటం అంత వీజీ కాదు ?

తిరుగుబాటు లేవదీసి ముఖ్యమంత్రి కుర్చీని ఉద్థవ్ థాక్రే నుండి లాగేసుకున్నంత తేలిక కాదు పార్టీని, పార్టీ గుర్తును లాగేసుకోవటం. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కీలకమైన శివసేనలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఏక్ నాథ్ నాయకత్వంలో కొందరు ఎంఎల్ఏలు థాక్రేపై తిరుగుబాటు లేవదీశారు. అనేక మలుపులు తిరిగిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటు నేత షిండేయే చివరకు ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్నారు. ఇంతవరకు సీన్ ప్రశాంతంగానే …

Read More »

అమిత్ షా చెప్పింది ఇప్పట్లో జరిగేదేనా ?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా ఆశలు పెట్టుకున్నట్లే ఉన్నారు. మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ విస్తరణపై చేసిన తీర్మానంలో షా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఇంతవరకు ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ తర్వాత చేసిన వ్యాఖ్యలే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటంటే ఏపీ, తమిళనాడు, …

Read More »

అందరికంటే ముందే అభ్యర్ధులను వైసీపీ ప్రకటించేస్తోందా ?

పార్టీ ప్లీనరీ సమావేశాల్లోనే అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించేస్తోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని నలుగురు నేతల పేర్లను వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులుగా పార్టీ ఇన్చార్జిలు ప్రకటించేశారు. ఈ ప్రకటనలను కూడా జగన్మోహన్ రెడ్డి చెబితేనే తాము చేసినట్లు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దాంతో అభ్యర్ధుల ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొదట కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వల్లభనేని …

Read More »

AP : కార్య‌క‌ర్త‌ల‌కూ కానుకలు… ఏ రూపంలో ?

ఇప్ప‌టిదాకా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై మండిప‌డుతున్న కార్య‌క‌ర్త‌ల‌ను కూల్ చేసేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. మొన్న‌టి ఉమ్మ‌డి క‌ర్నూలు కేంద్రంగా జ‌రిగిన ప్లీన‌రీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఆదుకునేందుకు అధినాయ‌క‌త్వం సిద్ధంగానే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడిదే అంత‌టా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌నులు చేప‌ట్టి బిల్లులు రాక అవ‌స్థలు ప‌డుతున్న వారికి ఇదొక ఊర‌ట …

Read More »

పేప‌ర్ కొనుక్కుని చ‌ద‌వండి.. వ‌లంటీర్ల‌ కు నెలకు 5.32 కోట్లు ?

విప‌క్షాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త సూత్రాన్ని తెర‌పైకి తెస్తున్నారు. త‌న‌దైన శైలిలో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను క‌ట్ట‌డి చేసేందుకు, ముఖ్యంగా ప‌థ‌కాల అమ‌లులో విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు తిప్పికొట్టేందుకు ఒక కొత్త వ్యూహం రాస్తున్నారు. ఇందులో భాగంగా వలంటీర్ల‌ను ఉప‌యోగించుకోనున్నారు. ముఖ్యంగా వ‌లంటీరు వ్య‌వ‌స్థ‌కు స‌రైన అవ‌గాహ‌న, అధ్యయనం ఉండేవిధంగా చర్య‌లు చెప్పట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగానే రాష్ట్రంలో లీడింగ్ లో ఉన్న ఓ పేప‌ర్ ను …

Read More »

జగన్ ను నమ్మి అన్యాయం అయిపొయాడా?

గ‌త కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్న స‌ల‌హాదారు బొంతు రాజేశ్వ‌ర‌రావు (రాజోలు నియోజ‌క‌వ‌ర్గం) స‌ర్కారు ప‌ద‌వి వ‌ద్దేవ‌ద్ద‌ని అంటున్నారు. ఈ మేరకు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. జ‌నసేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావుతో క‌లిసి ప‌నిచేయాల‌ని చెబుతున్నార‌ని, గ‌తంలో ఆయ‌న్ను వ్య‌తిరేకించిన తామే ఇప్పుడెలా క‌లిసి ప‌నిచేయ‌గ‌లం అని వారంతా ఆవేద‌న చెందుతున్నారు. దీంతో పంచాయ‌తీ రాజ్, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా సల‌హాదారుగా ఉన్న ఆయ‌న త‌న ప‌ద‌వికి గుడ్ …

Read More »

టీఆర్ఎస్-బీజేపీ మైండ్ గేమ్

ఒకవైపు బీజేపీ మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలయ్యాయి. మరోవైపు నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశం. అంటే రెండు వైపులా ఎవరి అజెండా వాళ్ళకు స్పష్టంగా ఉంది. మరి మధ్యలో మధ్యంతర ఎన్నికల సవాళ్ళెందుకు వచ్చాయి ? కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేసీయార్ పై మైండ్ గేమ్ అప్లై చేయడానికి …

Read More »

కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదా ?

కాంగ్రెస్ పార్టీ మారుతుందని అనుకోవడం ఉత్త భ్రమలాగే ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం, డిసిప్లిన్ అంతే ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా పార్టీలోని విభేదాలు మరోసారి భగ్గుమని రోడ్డున పడ్డాయి. సిన్హా విమానాశ్రయానికి వచ్చినపుడు కేసీయార్ అండ్ కో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ …

Read More »

భీమ‌వ‌రంలో ట్రిపుల్ ఆర్ సంబ‌రాలు !

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌హా ఇత‌ర నాయ‌కులు భీమ‌వ‌రం రాక నేప‌థ్యంలో ఉత్కంఠ‌భ‌రిత వాతావర‌ణం నెల‌కొని ఉంది. ఈ నెల నాలుగున అల్లూరి సీతారామ రాజు 125 వ జ‌యంత్యుత్స‌వాల సంద‌ర్భంగా ఇక్క‌డికి ప్ర‌ధాని రానున్నారు. బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడనున్నారు. 30 అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి, దేశ ప్ర‌జల‌కు సందేశం ఇవ్వ‌నున్నారు. ఇదంతా బాగుంది మోడీ రాక నేప‌థ్యంలోనే ట్రిపుల్ ఆర్ సంబ‌రాలు జ‌ర‌గ‌నున్నాయి. అంటే సినిమా సంబ‌రాలు …

Read More »

మోడీ జగన్ ఒకే హెలికాప్టర్లో

ప్రధానమంత్రి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకే హెలికాప్టర్లో ప్రయాణం చేయబోతున్నారు. గన్నవరం నుండి భీమవరానికి 4వ తేదీ ఉదయం వీళ్ళద్దరు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తారు. మోడితో కలిసి జగన్ హెలికాప్టర్లో ప్రయాణం చేయటం బహుశా ఇదే మొదటిసారేమో. మోడీ విజయవాడకు వచ్చినా లేదా తిరుపతి పుణ్యక్షేత్రానికి వచ్చినా విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవటం మామూలే. అయితే ఒకచోట నుండి మరోచోటికి హెలికాప్టర్లో మోడితో జగన్ ప్రయాణంచేసినట్లు లేదు. కాకపోతే వీళ్ళతో …

Read More »