క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నారు కానీ.. ఇప్పుడు ఇది రాజకీయాలకు బాగా నప్పుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. పార్టీలతో సంబంధం లేదు.. నాయకులతోనూ సంబంధం లేదు. అంతా.. ఒక మాయా రాజకీయం దేశాన్ని కమ్మేసింది. ఏపీ విషయానికి వస్తే.. వైసీపీలో పదవులు అనుభవించిన వారు కూడా.. ఇప్పుడు తిరగబడుతున్నారు. వీరితో …
Read More »ఫాపం.. బీజేపీ వీర విధేయులు…!
బీజేపీకి వీర విధేయులుగా ఉన్న చాలా మంది నాయకుల్లో కొందరి పరిస్థితి కక్కలేని, మింగలేని స్థితిలో ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. బీజేపీ కోసం ఎంతో శ్రమించిన వారు ఉన్నారు. కీలకమైన బీజేపీ సిద్ధాంతాలను కూడా ప్రచారంలో పెట్టిన వారు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో బీజేపీలోని కొందరు నాయకులు.. చాలా అంకిత భావంతో వ్యవహరించారు. నిరంతరం.. శ్రీవారి ఆలయం గురించే వారు …
Read More »సాయిరెడ్డి ఓవర్ టేక్ అవుతున్నారా..?
వి. విజయసాయిరెడ్డి. వైసీపీలో అగ్రనేత, ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కూడా. ఈయన కథ ఇక్కడితో అయిపోలేదు. కేంద్రంలోని రాజకీయ నేతలతో వైసీపీకి సత్సంబంధాలు పెంపొందించడంలోనూ.. పార్టీకి అవసరమైన ఢిల్లీ ముడిసరుకును అందించడంలోనూ.. సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గుర్తు పట్టి పిలిచి మాట్లాడేంత చనువు కూడా ఉన్న నాయకుడు కావడం మరో విశేషం. దీనికి కారణం.. వైసీపీ తరఫున ఆయన ఢిల్లీలో …
Read More »సరి కొత్త గా పవన్ దీపావళి సందేశం
దేశంలో మరే రాజకీయ పార్టీ అధినేత వ్యవహరించని రీతిలో జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహరించారు. ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు.. ఆయా వర్గాల వారికి శుభాకాంక్షలు తెలపటం.. ఈ సందర్భంగా సందేశాన్ని ఇవ్వటం చేస్తారు. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ మాత్రం కాస్తంత కొత్తగా వ్యవహరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో దీపావళిని పురస్కరించుకొని ఒక పోస్టు పెట్టారు. దీపావళి సందర్భంగా పాకిస్థాన్.. బంగ్లాదేశ్ లలో …
Read More »ఎన్వీ రమణకు ఆ పదవి రెడీ చేసిన చంద్రబాబు..?
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణకు కీలక పదవి రెడీ అయిందా? ఆయనకు ఈ సారి ఖచ్చితంగా పదవి దక్కుతుందా? అంటే.. టీడీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. ఈసారి మాత్రం చంద్రబాబు గురి తప్పదని కూడా చెబుతున్నాయి. మరి ఆ పదవి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి జస్టిస్ ఎన్ వీరమణ పదవీ విరమణ చేసిన తర్వాత.. ఏపీ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. …
Read More »సొంత పార్టీలో ఫస్ట్ టైమ్.. జగన్ వెనక్కి తగ్గారు!
రాజకీయాల్లో తనకు తిరుగులేదని భావించే వైసీపీ అధినేత జగన్.. తన సొంత పార్టీలో అంతా తానే అయి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చెప్పిందే వేదం. ఆయన చేసిందే శాసనం. అలా ఉన్న వైసీపీలో అనేక మంది ఇమడలేక.. జారిపోయారు. ఎన్నికలకు ముందు కూడా.. అనేక మంది నాయకులు జగన్ను బ్రతిమాలారు. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. టికెట్లు ఇవ్వాలని కోరారు. అయినా.. ఆయన తన పంథాను వీడలేదు. దీంతో …
Read More »సీటు చూసుకో: రేవంత్కు హరీష్రావు సంచలన సలహా!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్రావు సంచలన సలహా ఇచ్చారు. సీఎం సీటును లాక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని.. ముందు తన సీటును కాపాడుకునేందుకు రేవంత్ జాగ్రత్త పడాలని ఆయన సలహా ఇచ్చారు. రాజకీయంగా రేవంత్రెడ్డిని ఫినిష్ చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని చెప్పారని చెప్పారు. కాబట్టి.. సొంత గూటిని సరిదిద్దుకునేందుకు రేవంత్ ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి బాటలో పట్టించేందుకు కేసీఆర్ అనేక చర్యలు …
Read More »జగన్ బెయిల్ రద్దవుతుందో లేదో మా అమ్మకు తెలీదా?: షర్మిల
వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయన తనయ, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న కుట్రతోనే సరస్వతి పవర్కు సంబంధించిన షేర్లను బదలాయించుకునే కుట్ర చేస్తున్నారన్న వైసీపీ నేతల వాదనకు ఆమె గట్టిగా సమాధానం చెప్పారు. సరస్వతి షేర్లు బదలాయిస్తే.. జగన్ బెయిల్ రద్దువుతుందో.. లేదో.. మా అమ్మకు తెలీదా? అని ఆమె ప్రశ్నించారు. ఇదంతా జగన్నాటకంలో ఒక భాగమని అర్ధమవుతోందన్నారు. జగన్ …
Read More »సీఎం చంద్రబాబుతో రామ్దేవ్ బాబా భేటీ!
ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా భేటీ అయ్యారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల పైనే ఎక్కు వగా దృష్టి పెట్టే రామ్ దేవ్ బాబా.. 2016 తర్వాత.. మళ్లీ ఏపీపై ఇప్పుడే దృష్టి పెట్టారు. 2016-17 మధ్య రాజధాని అమరావతిలో ఆయన యోగా శిబిరాలు నిర్వహించారు. అప్పట్లో జూన్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించగా.. సీఎం చంద్రబాబుతో యోగా గురువు …
Read More »మీడియా అధినేతకే టీటీడీ పగ్గాలు.. 24 మందితో బోర్డు!
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ.. ఏపీలోని కూటమి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 మందితోకూడిన బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా ప్రముఖ మీడియా టీవీ-5 అధినేత బీఆర్ నాయుడుని ఎంపిక చేయడం గమనార్హం. ఈయన పేరు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మధ్యలో కొన్నాళ్లు మరికొందరి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. ఎట్టకేలకు ఈయననే పాలక మండలి …
Read More »లోకేష్ కు రాజకీయాలు వద్దన్న బ్రాహ్మణి ఎలా కన్విన్స్ అయ్యారు?
అమెరికాలోని లాస్వేగాస్లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ అలైన్స్ సినర్జీ సమ్మిట్-2024’’లో ఏపీ ఐటీ శాఖా మంత్రి మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆ తర్వాత సదస్సులో లోకేష్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తనను రాజకీయాల్లో కొనసాగవద్దు అని తన భార్య బ్రాహ్మణి తనతో చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో …
Read More »‘వైసీపీ నుంచి ప్రాణ హాని.. షర్మిలకు భద్రతకు పెంచండి!’
వైసీపీ నేతల నుంచి తమ నాయకురాలికి ప్రాణ హాని ఉందని.. ఈ నేపథ్యంలో మరింత భద్రత కల్పించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల విషయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు వారు లేఖ రాశారు. అదేవిధంగా ఈ లేఖను ప్రతినిధి బృందం డీజీపీకి అందించింది. ప్రస్తుతం షర్మిలకు పార్టీ అధ్యక్షురాలి హోదాతోపాటు.. మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా 2+2 చొప్పున …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates