వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజా.. ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా తన మకాం.. తమిళనాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గత రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే.. దీనికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ఆధారాలు లభించలేదు. దీంతో ఇది నిజమో కాదో.. అన్న చర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసినట్టు …
Read More »ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు: పొద్దు పొద్దున్నే ‘హైడ్రా హడల్!
ఒకవైపు హైడ్రాపై చర్చలు జరుగుతున్న సమయంలో.. ఆ సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పొద్దు పొద్దున్నే వాలిపోతోంది. రాత్రి నిద్ర పోయిన వారుతెల్లవారి కళ్లు తెరిచేలోగానే హైడ్రా కూల్చివేతలు పూర్తి చేసేస్తోంది. నిజానికి ఈ కూల్చివేతల సమయంలో అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. న్యాయ స్థానం మెట్లు ఎక్కేందుకు చూస్తున్నారు. కానీ.. కోర్టుల్లో పిటిషన్ వేసే లోగానే హైడ్రా పని చేసేస్తోంది. దీంతో వారికి ఊరట లభించడం లేదన్న వాదన …
Read More »మాజీ ఎంపీకి.. మిథున్రెడ్డి భారీ కానుక.. ఎందుకు?
చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు రెడ్డప్పకు రాజంపేట ప్రస్తుత ఎంపీ, సీనియర్నేత మిథున్రెడ్డి భారీ కానుకనే అందించారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన కారును ఆయన బహూకరించారు. ఈ నెల తొలి వారంలో మిథున్రెడ్డి.. రెడ్డప్పను పలకరించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమ యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. అక్కడకు చేరుకున్నారు. దీంతో …
Read More »‘నిర్మలమ్మ పర్యటనకు 4 వేలు ఖర్చు పెట్టా.. ఇప్పించండి’
ఔను.. మీరు చదివింది నిజమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పర్యటన నిమిత్తం తాను రూ.4,230 ఖర్చు పెట్టానని.. ఆ సొమ్మును తిరిగిఇప్పించాలని కోరుతూ.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఓ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. తాజాగా వారధి పేరుతో బీజేపీ ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మండలం, రాయపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ కాటమనేని …
Read More »ఏఐ నగరంగా అమరావతి!
ఏపీ రాజధాని అమరావతి.. ఇక ఏఐ నగరంగా అవతరించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేంద్రం గా మారనుంది. ప్రస్తుత ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే 10 ఏళ్లలో అన్ని ప్రాంతాలు, నగరాలు, రాష్ట్రాలు కూడా.. ఏఐని అందిపు చ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా.. ఏఐలోనే లభించనున్నాయి. దీనిని ముందుగానే గుర్తించిన సీఎం చంద్రబాబు తాజాగా.. అమరావతిని …
Read More »ఏపీ లో ‘హైడ్రా’ ప్రయోగం కష్టమే
తెలంగాణలో ‘భూ’ కంపం సృష్టిస్తున్న ‘హైడ్రా'(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్- అసెట్ ప్రొటెక్షన్, అండ్ మేనేజ్మెంట్ అథారిటీ) ఏపీలోనూ తీసుకురావాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఏపీలోనూ అక్రమ నిర్మాణాలను తొలగించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో హైడ్రా తరహా వ్యవస్థను ఏపీలో కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తు న్నామని చెప్పారు. అయితే.. ఈ ప్రకటన బాగానే ఉన్నా.. అనేక మంది రాజకీయ నాయకులు.. పారిశ్రామిక …
Read More »బన్నీ పై కామెంట్స్.. శతృత్వం లేదన్న ఎమ్మెల్యే
గత కొంత కాలంగా మెగా అభిమానులకు, అల్లు అర్జున్కు మధ్య పెద్ద అగాథం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంపై మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. ఓ వైపు మెగా ఫ్యామిలీలో అందరూ జనసేనకు అండగా ఉంటే.. బన్నీ మాత్రం ఫ్రెండు అని చెప్పి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడాన్ని జనసేన మద్దతుదారులు, మెగా అభిమానులు …
Read More »ఒక మంచి పని చేసిన చంద్రబాబు
ఏపీలో సలహాదారులు కొత్తకాదు. గతంలో చంద్రబాబు హయాంలోనూ.. అనేక శాఖలకు సలహాదారులు ఉన్నారు. అయితే.. వైసీపీ హయాంలో మాత్రం లెక్కకు మించి ప్రతి ఒక్కరికీ సలహాదారులను నియమిం చారు. ఇది వివాదానికి దారితీసింది. ఏకంగా హైకోర్టు వరకు కూడా వెళ్లింది. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదా రుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ మరిన్ని వివాదాలు ముసురుకున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో హైకోర్టు సీరియస్గానే రియాక్ట్ అయింది. ఇక, అప్పటి సంగతి …
Read More »ఇలాంటోళ్లు అవసరమా బాబూ..?
వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న 11 మందిలో నలుగురు నుంచి ఐదుగురు వరకు పార్టీలు మారతారని.. కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే. అయితే.. అనుకున్నట్టుగా కాకుండా.. ఊహించని విధంగా కొందరు పార్టీ మారుతుండడం ఇప్పుడు చర్చకు వస్తోంది. వీరిలోనూ బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ,గొల్ల బాబూరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి వీరిలో బీద మస్తాన్రావు, మోపిదేవి కన్ఫర్మ్ చేశారు. గొల్ల బాబూరావు మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అయితే.. మోసిదేవితో …
Read More »చంద్రబాబు ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేదు
ఒకవైపు సీఎం చంద్రబాబు మొత్తుకుంటున్నారు. పద్ధతిగా వ్యవహరించాలని పార్టీ ఎమ్మెల్యేలకు గీతోప దేశం చేస్తున్నారు. పరువు తక్కువ పనులు చేయొద్దని కూడా చెబుతున్నారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అయితే.. చాలా సీరియస్ కామెంట్లే చేశారు. పద్దతిగా ఉండాలని.. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనులు చేయొద్దని కూడా చెప్పారు. మరి బాబు ఇంతగా చెబుతున్నా.. తమ్ముళ్లు ఎక్కడా పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. తాజాగా ఓ పేరు మోసిన రౌడీషీటర్ …
Read More »మంత్రుల పనితీరు పై ప్రోగ్రెస్ రిపోర్ట్: చంద్రబాబు
ఏపీలోని కూటమి సర్కారులో మంత్రులుగా ఉన్నవారి పనితీరును అంచనా వేస్తున్నామని.. ముఖ్యమం త్రి చంద్రబాబు చెప్పారు. అంతేకాదు.. వారి పనితీరును ఆధారంగా చేసుకుని వారికి ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమయం లో గత కొన్నాళ్లుగా వివాదంగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయా నాయకుల తీరును చంద్రబాబు ప్రస్తావించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో …
Read More »చంద్రబాబు వార్నింగ్: ఇప్పటికైనా తమ్ముళ్లు దారికొస్తారా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడిన తమ్ముళ్లే.. ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారుతున్నారు. ఎక్కడికక్కడ వివాదాలు.. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చాలా మంది తమ్ముళ్లు నిత్యం ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తున్నారు. కొన్ని ఘటనలు మెయిన్ మీడియాలో వస్తుండగా.. మరిన్ని ఘటనలపై పార్టీకి ప్రతి రోజూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇవన్నీ.. కలగలిపి చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఆయా అంశాలపై మరింత ప్రచారం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates