గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా.. దిగుమతులు కూడా తగ్గాయి. ఇక, గ్యాస్ కష్టాలు కూడా.. అనేక దేశాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కష్టాలు మన దేశంలో కూడా కనిపించాయి. ఇప్పటికే చమురు ధరలను దేశవ్యాప్తంగా పెంచారు. గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి. దీనంతటికీ కారణం.. అమెరికా-ఇరాన్ల మధ్య జరిగిన యుద్ధం. …
Read More »‘బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో నాయకులు గద్దెనెక్కారు’
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ సమగ్రత.. సేనా దళం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలు సందర్భాల్లో మాట్లాడారు. తెలంగాణపై స్పందిస్తూ.. తాను ఈనెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ పట్టాలని చూసినట్టు తెలిపారు. దీనికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. పోనీ.. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి..వెనుదిరుగుతానని పోలీసులకు …
Read More »ఆపరేషన్ టైగర్… బీజేపీ దూకుడు!
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల దూకుడుకు మరింతగా బ్రేకులు వేయాలని భావిస్తున్నారా? అంటే .. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన.. ఐదు రాష్ట్రాల్లో కీలకమైన తమిళనాడు, పశ్చిమబెంగాల్లలో ప్రభుత్వ పార్టీలు ఓడిపోయాయి. ఈ క్రమంలో బెంగాల్లో బీజేపీ సర్కారు ఏర్పడింది. దీంతో బెంగాల్లో 80 స్థానాలు దక్కించుకున్న …
Read More »అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో అమరావతి రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో సింగపూర్ ప్రధాని …
Read More »కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేళ ఈ దాడి జరగడంతో కలకలం రేగింది. ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఒక్కసారిగా దూసుకొచ్చి అభిజిత్ దీప్కే చెంపపై కొట్టినట్లు సమాచారం. అతనితో పాటు మరికొందరు కూడా అక్కడ …
Read More »ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలుస్తారు. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. ఆయన పరపతి దారుణంగా పడిపోయింది మాత్రం ఇరాన్ తో యుద్ధం చేస్తున్నప్పుడే అని చెప్పాలి. ఎందుకంటే.. ఇరాన్ తో అమెరికా జరిపిన యుద్ధం సందర్భంగా ఆయన నోటి నుంచి …
Read More »కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీలో ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సభలకు తొలిరోజు హాజరైన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమైక్యత కోసం ఈ సభలను ఢిల్లీలో నిర్వహిస్తున్నామని పవన్ చెప్పారు. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై పవన్ విమర్శలు గుప్పించారు. జాతీయ వాదాన్ని పక్కనపెట్టి, …
Read More »దేశవ్యాప్తంగా… బొద్దింకల జోరు!
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)గా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్న ఈ పార్టీ.. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తోంది. కొన్ని రోజుల కిందట ఢిల్లీలో మహా నిరసన పేరుతో తొలి ఉద్యమాన్ని చేపట్టిన సీజేపీ దీనిని సక్సెస్ చేసింది. ఈ సందర్భంగానే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు అల్టిమేటం కూడా జారీ చేసింది. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా …
Read More »భూములిచ్చిన గౌరవం… విమానంలో రైతులు, రైతు కూలీలు
అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గౌరవం కల్పించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు, మహిళలను తొలి ప్రయాణికులుగా ఆహ్వానించి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. జేవర్ ప్రాంతానికి చెందిన 170 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు లక్నో నుంచి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తొలి ప్రయాణికుల విమానంలో ప్రయాణించారు. గౌతమ్ బుద్ధ్ నగర్ …
Read More »తెలంగాణలో విచారణల పాలిటిక్స్!!
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు మధ్య పలు కేసుల విచారణకు సంబంధించి రాజకీయం జోరుగా సాగుతోంది. బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హయాంలో జరిగిన.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిందని..దీనిని సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కానీ, దీనిపై ఇప్పటి వరకు అతీ గతీ లేదని, కేసీఆర్ను కాపాడుతున్నారని సీఎం …
Read More »అంటే.. ఇక వైసీపీని అలా పిలవచ్చా!!
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోయారు. కానీ, తాజాగా పెరుగుతున్న యాక్టివిటీతో మాటల మంటలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ అధినేత నుంచి దిగువస్థాయి నాయకుల వరకు వైసీపీని గొడ్డలి పార్టీ అని సంభోదిస్తున్నారు. దీనిని సమర్థించుకుంటున్నారు. అయితే.. వాస్తవానికి గొడ్డలి పార్టీ అనే పదం కొంత …
Read More »ఇక… జాతీయ జనసేన?
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనుకున్నట్టుగానే వైసీపి ప్రభుత్వాన్ని దింపేందుకు కూటమిగా ఏర్పడి.. ఎన్నికల్లో కలివిడిగా వ్యవహరించి విజయం దక్కించుకున్నారు. వచ్చే 15 సంవత్సరాల పాటు.. ఆయన కూటమిదే అధికారం అని కూడా తరచుగా చెబుతున్నారు. ఇవన్నీ.. ఎందుకు గుర్తుచేయాల్సి వస్తోందంటే.. పట్టుదలకు.. కృషికి.. పవన్ నిలువెత్తు నిదర్శనం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates