Political News

జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అయినా, ఆ తర్వాత అయినా మాజీ సీఎం జగన్ పై ప్రధాని మోదీ నేరుగా విమర్శలు చేయలేదు. అయితే, తాజాగా జగన్ పై కౌంటర్ అటాక్ చేయాలని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు …

Read More »

పార్లమెంటులో ఈ సిగరెట్ తాగారా?

కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు సభలో ఎంతో హుందాగా, బాధ్యతగా నడుచుకునేవారు. కాలం మారింది…కలికాలం వచ్చింది…అందుకే కాబోలు గత దశాబ్ద కాలంలో చట్ట సభల్లో కొందరు సభ్యుల తీరు వివాదాస్పదవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఎంతో కీలకమైన సభా సమయంలో మొబైల్ ఫోన్లలో నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్ …

Read More »

పంచాతీయ స్వ‌`రూపం`పై జ‌న‌సేన ఎఫెక్ట్ ..!

గ్రామ పంచాయ‌తీల‌పై జ‌న‌సేన పార్టీ ప‌ట్టు బిగించే దిశ‌గా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్న ఈ పార్టీ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తాజాగా కేంద్రం నుంచి మ‌రో 2 వేల కోట్ల రూపాయ‌లు పంచాయ‌తీల‌కు అందాయి. ఈ నిధుల‌ను మ‌రింత స‌క్ర‌మంగా వినియోగించి.. పంచాయ‌తీల్లో మౌలిక స‌దుపాయాల‌ను పెంచాల‌ని డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించారు. ఇదేస‌మ‌యంలో …

Read More »

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఆయ‌న ఎదుర్కొంటున్నారు. ఆయ‌న‌ను విచారించాల‌ని ప్రభుత్వం ఇటీవ‌ల గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీంతో సిట్ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు కూడా పంపించారు. అయితే ఇటీవ‌ల ఆయ‌న రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. కాపులు దళితులు కలిసి రాజ్యాధికారం దక్కించుకోవాలని అన్నారు. కాపులకు సీఎం పదవిని ఆఫర్ చేశారు. …

Read More »

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కున్నారు. మరికొందరు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. దీంతో నాయకులు కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై తరచుగా వైసీపీలో చర్చ జరుగుతుంది. జగన్ పట్టించుకోవడంలేదని, కనీసం తమకు న్యాయ సహాయం కూడా అందించడం లేదని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి వైసీపీ తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోల …

Read More »

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

“స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.“ తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి చెప్పిన మాట‌. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను తాజాగా ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని మ‌రోసారి తెర‌మీదికి తెచ్చారు. స‌నాత‌న ధ‌ర్మ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. స‌నాత‌న ధ‌ర్మాన్ని, దీనికి మ‌ద్ద‌తు ఇచ్చేవారిని.. అదేవిధంగా స‌నాత‌న ధ‌ర్మాన్ని పాటించేవారిని కూడా కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. …

Read More »

అనిల్ విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందా?

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం సంబంధం లేదంటూ ప్రకటన చేసిన వెంటనే..“జగనన్న నా దేవుడు… ఆయన లేకపోతే నేను ఇప్పటికీ జైలులో ఉండేవాడిని” అని అనిల్ చేసిన వ్యాఖ్యలు, గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ కోసం వైసీపీ లాయర్లు పనిచేశారని, తన వెనక వైయస్ జగన్ …

Read More »

ఆ విషయంలో బాబు – పవన్ లను దాటేసిన మంత్రులు

చంద్రబాబు గవర్నమెంట్ లో అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది… అది పక్కాగా ఉంటుంది. కేవలం నోటిమాటలు కాకుండా ప్రతిదానికి డేటా బేస్డ్ సమాచారంతో సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుంది అనేది ప్రజలు అధికారులలో ఉన్న నానుడి. అంకెలతో సహా ఆయన వివరిస్తుంటే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. నిన్నటి సమావేశంలో కూడా చంద్రబాబు మంత్రులు శాఖల వద్ద ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి డేటాను రిలీజ్ చేశారు. అందులో సీఎం …

Read More »

దేశ చరిత్రలోనే మొదటిసారి – యూనివర్సిటీకి 1000 కోట్లు!

హైద‌రాబాద్‌లోని చ‌రిత్రాత్మ‌క విశ్వ‌విద్యాల‌యం.. ఉస్మానియా యూనివ‌ర్సిటీ(ఓయూ). అనేక మంది మేధావుల‌ను మాత్ర‌మే ఈ దేశానికి అందించ‌డం కాదు.. అనేక ఉద్య‌మాల‌కు కూడా ఈ విశ్వ‌విద్యాల‌యం నిలువెత్తు సాక్ష్యం. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ సమ‌యంలో ఇక్క‌డి విద్యార్థులు కీల‌క రోల్ పోషించారు. అలాంటి విశ్వ‌విద్యాల‌యానికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల నిధుల‌ను ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఆ వెంట‌నే జీవోను కూడా జారీ చేశారు. సీఎంగా బాధ్య‌త‌లు …

Read More »

క‌డ‌ప గ‌డ్డ‌పై తొలిసారి… `టీడీపీ మేయ‌ర్‌`?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. గ‌త 2020-21 మ‌ధ్య జ‌రిగిన కడ‌ప కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యంద‌క్కించుకుంది. దీంతో ఆ పార్టీకి చెందిన సురేష్ బాబును మేయ‌ర్‌గా ఎన్నుకున్నారు. అయితే.. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవ‌డంతో గ‌త మూడేళ్ల‌లో మేయ‌ర్ పీఠాన్ని అడ్డు పెట్టుకుని సురేష్ బాబు చేసిన అక్ర‌మాలు ఇవీ.. అంటూ టీడీపీ కార్పొరేట‌ర్లు.. ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు చేశారు. …

Read More »

టీం జగన్… ప‌దే ప‌దే అవే త‌ప్పులా?

అయిన కాడికీ.. కాని కాడికీ.. రాజ‌కీయాలు చేయ‌డం వైసీపీకి వెన్న‌తో పెట్టిన విద్య‌లా మారింది. ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో చావు దెబ్బ తిని.. 11 స్థానాల‌కు ప‌రిమిత‌మై.. ప్ర‌తిప‌క్ష హోదా కూడా కోల్పోయి.. అలో ల‌క్ష్మ‌ణా అంటూ.. ప్ర‌తిప‌క్ష హోదా కోసం..కోర్టుల చుట్టూ తిరిగే ప‌రిస్థితిని తెచ్చుకున్నా.. ఇంకా మార్పు అయితే.. క‌నిపించ‌డం లేదు. 2024 ఎన్నిక‌ల‌కు ముందు ఎలా అయితే.. ఆ పార్టీ నాయ‌కులు బిహేవ్ చేశారో.. అలానే …

Read More »

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన యువకుడు. వైసీపీ అధికారం కోల్పోగానే అతని పాపం పండింది. అతనిపై దాదాపు 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి. చాలా కాలం జైలులో ఉన్నాడు. ఒక కేసులో బయటకు రాగానే మరో కేసులో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు అతను ఎవరికీ కాకుండా పోయాడు. ఇంతకాలం వైసీపీకి …

Read More »