Political News

`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!

ఎర్ర‌చంద‌నం.. ఏపీలో మాత్ర‌మే.. అది కూడా తిరుప‌తి జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో మాత్ర‌మే ల‌భించే అరుదైన వృక్షాలు. అయితే.. వీటిని అక్ర‌మార్కులు తెగ‌న‌రికి పెద్ద ఎత్తున ర‌వాణా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి అమాయ‌కులైన ఏపీ, తెలంగాణ పౌరుల‌ను, కూలీల‌ను కూడా వినియోగించుకుంటున్నారు. ఇక‌, అట‌వీ శాఖ అధికారులు ఎర్ర‌చంద‌నం.. అక్ర‌మ ర‌వాణాపై ఉక్కుపాదం మోపి ప‌ట్టుకున్న దుంగ‌లు కూడా ట‌న్నుల కొద్దీ తిరుప‌తి గోడౌన్ల‌లో పేరుకుపోయాయి. వీటిని …

Read More »

అప‌ర భ‌గీర‌థుడిగా చింత‌మ‌నేని ..!

ఒక‌ప్పుడు ఆయ‌న నోరు విప్పితే వివాదాలు.. విమ‌ర్శ‌లు.. ఘ‌ర్ష‌ణ‌లు అనే పేరు ఉండేది. కానీ, గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న సంపూర్ణంగా మారిపోయారు. వివాదాల జోలికి పోవ‌డం లేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గంపై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. ఆయ‌నే దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. త‌ర‌చుగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. వారి సమ‌స్య‌ల‌పై దృష్టి పెడుతున్నారు. గ‌తంలో మాదిరి కాకుండా.. ఇప్పుడు విజ్ఞ‌త‌తో కూడిన రాజ‌కీయాలు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. …

Read More »

నా ముందు అధ్యక్షా అనలేకనే…

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి హాజరుపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని ఆయన అన్నారు. అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే ఇస్తామన్నారు. నా ముందు అధ్యక్షా అనడం ఇష్టం లేకనే జగన్‌ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఆయన మీడియా ముందు కాక అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. వైసీపీ ఎమ్యెల్యేలు జీతాలు తీసుకుంటున్నా అసెంబ్లీకి రావడం లేదన్నారు. తూర్పు …

Read More »

దేశ రాజ‌ధానిలో భారీ పేలుడు… 8 మంది మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో భారీ పేలుడు సంభ‌వించింది. కీల‌క‌మైన ప‌ర్య‌టక ప్రాంతం ఎర్ర‌కోట వ‌ద్ద ఉన్న మెట్రో రైల్వే స్టేష‌న్ గేటు 1 ద‌గ్గ‌ర పార్క్ చేసి ఉంచిన కారులో జ‌రిగిన ఈ పేలుడు రాజ‌ధానిని ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లు కార్లు కాలి పోగా.. 8 మంది మృతి చెందిన‌ట్టు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశామ‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. …

Read More »

జ‌నంలో ఉంటే.. జ‌గ‌న్‌కు తెలిసేవేమో.. !

`జగన్ అంటే జనం – జనం అంటే జగన్!` అనే మాట ఒకప్పుడు వైసీపీలో జోరుగా వినిపించేది. వచ్చాడంటే వస్తారంతే.. అంటూ భారీ ఎత్తున తరలివచ్చిన జనాలను చూపించిన వైసిపి విషయం అందరికీ తెలిసిందే. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ జనంలో విపరీతమైన ఇమేజ్ ఉందని చెప్పుకునేవారు. జగన్ వస్తున్నాడు అంటే జనం తండోపతండాలుగా తరలివస్తున్నారంటూ ప్రత్యేక కథనాలను కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉండేది. …

Read More »

పాలు వెన్న లేకుండానే నెయ్యి.. తిరుమల లడ్డు కల్తీ పై ఘోర వాస్తవాలు!

తిరుమల శ్రీవారి దర్శనం, తిరుమల పవిత్ర లడ్డు ప్రసాదం, ఈ రెండింటికోసమే అనేక వ్యయప్రయాసలను ఓర్చుకుని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు పోటెత్తుతారు. ఈ షణ్మాత్రమైనా శ్రీవారిని మనసారా దర్శించుకోవాలని, చిటికెడు పవిత్ర లడ్డు ప్రసాదాన్ని నాలికపై వేసుకోవాలని ఆశిస్తారు. అయితే ఈ రెండూ కూడా వైసీపీ హయాంలో కల్తీ అయ్యాయని బీజేపీ నాయకుడు లంకా దినకర్ వ్యాఖ్యానించారు. శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను అప్పటి కొందరు మంత్రులు, …

Read More »

అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతిస్తాం: ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)…బీజేపీ హ్యాట్రిక్ విజయాల వెనుక ఉన్న శక్తి. చాలామంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే బీజేపీ నడుస్తుందని, చాలా టికెట్లు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రికమండేషన్ పై ఫిక్సవుతుంటాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉన్న బీజేపీ…హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆర్ఎస్ఎస్ మద్దతు ఎల్లపుడూ బీజేపీకి …

Read More »

ఎమ్మెల్యేల విషయంలో బాబు కన్నా లోకేష్ సీరియస్

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు మారుపేరు అన్న సంగతి తెలిసిందే. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా తప్పులు చేసినా.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా.. ఆయన ఊరుకోరు. ఈ విషయంలో పార్టీ కార్యక్రమాల్లో, మీడియా ముందు కూడా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. హెచ్చరికలూ జారీ చేస్తుంటారు బాబు. ఐతే బాబుతో పోలిస్తే నారా లోకేష్ కొంచెం మెతక అనే అభిప్రాయం ఉంది. కానీ అవసరమైనపుడు నారా లోకేష్ …

Read More »

సునీతకు బిగ్ రిలీఫ్‌.. కూటమికి థ్యాంక్స్‌..!

వైసీపీ అధినేత జగన్‌కు సోదరి, 2019లో దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు బిగ్ రిలీఫ్ దక్కింది. తన తండ్రి దారుణ హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న సునీత అనేక మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో బాధితులుగా ఉన్న సునీతపైనే వైసీపీ హయాంలో కేసులు నమోదయ్యాయి. కారణాలు ఏవైనా, అప్పటి పోలీసులు ఆమెపైనే కేసు పెట్టారు. …

Read More »

పవన్… నాలుగు శాఖలకు న్యాయం చేస్తున్నారా?

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నాలుగు ప్రధాన మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఉన్నాయి. కీలకమైన పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అప్పజెప్పారు. వాటికి ఆయన న్యాయం చెయ్యగలరా? ఆరు శాఖలు ఆయనకి భారంగా మారవా? అంటూ కొందరు సందేహాలు లేవనెత్తారు. వాటిని పటాపంచలు చేస్తూ ఆ పదవులకే వన్నె తీసుకు …

Read More »

హరీశ్ ప్రసంగం లో పస తగ్గిందా?

ఒకప్పుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మాట్లాడితే వంక పెట్టడానికి, వేలెత్తి చూపడానికి వీలు లేని విధంగా ఆయన మాటలు ఉండేవి. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, మేధావులు సైతం మాటకు మాట అనలేని పరిస్థితి ఉండేది. అలాంటి హరీశ్ రావు తాజాగా సీఎం రేవంత్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు చాలా సింపుల్‌గా కౌంటర్లు రావడం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు, హరీశ్ రావు అనుకున్నంతగా స్క్రిప్ట్ …

Read More »

బాబు టైమిస్తున్నారు.. మరి నాయకులు?

సీఎంగా చంద్రబాబు నిరంతరం ఎంతో బిజీగా ఉంటున్నారు. ఒకవైపు పెట్టుబడుల సదస్సులు, మరోవైపు పార్టీలో ఏర్పడుతున్న సమస్యలు, ప్రభుత్వం పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఆయన కృషి చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలోని రైతులు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు కూడా చంద్రబాబు సమయం కేటాయించాల్సి వస్తోంది. అటు కేంద్రంతో సమన్వయం చేసుకోవడం, అవసరం వచ్చినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి పరిష్కార మార్గాలు …

Read More »