ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహం క్షీణించడంతో కృష్ణా డెల్టా సాగుపై అనిశ్చితి నెలకొంది. పులిచింతల జలాశయంలో ఉన్న 32 …
Read More »అభిమానం తోడుతో… ఇంటికి చేరిన పవన్ కల్యాణ్!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. బుధవారం మధ్యాహ్నం.. హైదరాబాద్లోని నివాసానికి చేరుకున్నారు. గత నాలుగు రోజుల కిందట ఆయన కుడి భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడిన ఆయన.. కొద్దిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అభిమానుల కోలాహలం.. పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ …
Read More »ఇంత అహంకారమెందుకు అంబటి
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను కడసారి చూసుకునేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగానే ఒకింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంటే… సాయంత్రానికి ఆయన అంత్యక్రియల్లోనూ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తలచగా… అందుకు ముద్రగడ అభిమానులు ససేమిరా అన్నారు. ముద్రగడ అభిమానుల కంటే కూడా అక్కడ చేరిన …
Read More »వివేకాను చంపించింది జగనే: లోకేశ్
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాబాయిని జగన్ మోహన్ రెడ్డే చంపించాడు అంటూ లోకేశ్ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వివేకా హత్య కేసులో జగన్ పాత్రపై పలుమార్లు పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసిన లోకేశ్ తొలిసారిగా నేరుగా వివేకాను జగన్ చంపించాడు అంటూ వ్యాఖ్యలు చేయడం …
Read More »బాబు ప్రభుత్వాన్ని దున్నపోతు తో పోల్చిన జగన్
సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు మార్లు చంద్రబాబు వ్యక్తిత్వ హననానికి జగన్ పాల్పడ్డ వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా సరే జగన్ తీరు ఏ మాత్రం మారలేదు. చంద్రబాబు చర్మం మందం అంటూ జగన్ తాజాగా …
Read More »ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున నిర్ణయించారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పద్మనాభం అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ఆయన కుటుంబం తిరస్కరించింది. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు …
Read More »చాలా రోజుల తర్వాత జగన్ ను అలా చూసి…
రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా అలాంటి ప్రత్యేక శైలి ఉంది. చాలా రోజుల తర్వాత అదే మేనరిజాన్ని మళ్లీ ప్రదర్శించడంతో వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు ప్రతి ఎన్నికల సభలో జగన్ ప్రసంగం …
Read More »వాసిరెడ్డికి లైన్ క్లియర్ అయినట్టేనా?
వైసీపీ నుంచి బయటకు వచ్చిన మహిళా నాయకురాలు.. వాసిరెడ్డి పద్మకు పొలిటికల్గా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రి నారా లోకేష్తో ఆమె భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే ఆమె టీడీపీ కండువా కప్పుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ దూకుడుగా ఉండే వాసిరెడ్డి పద్మ దాదాపు 20 ఏళ్లకుపైగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా.. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. …
Read More »ముద్రగడ నివాసంలో రాజకీయమెందుకు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం అవుతున్న ముద్రగడ… కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భౌతికకాయాన్ని ఆయన సొంతూరు కిర్లంపూడికి తరలించగా… మంగళవారం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ మరణంపైనా రాజకీయాలేమిటన్న దిశగా పలువురు చర్చించుకుంటున్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ …
Read More »‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. రా ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించగానే కలకలం రేగింది. తమిళనాట విజయ్ సైతం ఇలాగే అభిమానులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జనాలకు చేరువయ్యాడని.. తారక్ కూడా ఇదే బాటలో సాగుతున్నాడనే విశ్లేషణలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఐతే ఈ కార్యక్రమంతో …
Read More »రాయలసీమకు మరో పేరు
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ పెట్టుబడికి రెడీ అయింది. 3000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో రాయలసీమలో ప్లాంటు పెట్టేందుకు సిద్ధమైంది. కడపలో దీనిని స్థాపించనున్నారు. మంత్రి నారా లోకేష్.. దీనికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇటీవల కాలంలో కడప సహా కర్నూలు, అనంత పురంపై కూటమి సర్కారు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సోలార్, విండ్, …
Read More »పనికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్ను సంస్కరించుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్(తిరిగి రాయడం) చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, రాష్ట్రంలో యూరియా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates