Political News

మండలిలో తీవ్ర దుమారం రేపిన అచ్చం వ్యాఖ్యలు

శాసన మండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మండలిలో లడ్డూ ఇష్యూపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ విషయంపై చర్చిస్తున్న సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మండలి ఛైర్మన్ మోషేస్ రాజు, వైసీపీ అధినేత జగన్ క్రిస్టియన్లు అంటూ స్పీకర్ ఛైర్ ను చూపిస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అచ్చెన్న వ్యాఖ్యలను …

Read More »

సభలో ఫోన్లు ఏంటండీ…

చట్ట సభలను చాలామంది ప్రజా ప్రతినిధులు ఎంతో పవిత్రంగా..దేవాలయాలుగా భావిస్తుంటారు. తమను ఎన్నుకున్న ప్రజల కోసం చట్టాలు చేసే ఈ సభలకు వన్నెతెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. అయితే, మరికొందరు సభ్యులు మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శల పాలవుతుంటారు. ఈ క్రమంలోనే శాసన సభ జరుగుతున్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న సభ్యులపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. రాజుగారు హౌస్ లో కూడా ఫోన్ మాట్లాడితే ఎలా …

Read More »

మండలి ఛైర్మన్ పై అవిశ్వాసం? సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సభ్యులకు మోషేస్ రాజు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.  అయితే, తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని మోషేస్ రాజు …

Read More »

ఒక్క `సీటు` కోసం.. అగ్ర‌నేత‌లే అటు-ఇటు!

తెలంగాణ‌లో రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని ద‌క్కించుకునేందుకు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఖాళీ అవుతున్న సీట్ల‌లో ఒక‌టి కాంగ్రెస్ పార్టీదే. రెండోది బీఆర్ఎస్ స‌భ్యుడు సురేష్‌రెడ్డిది. కాంగ్రెస్ స‌భ్యుడు అభిషేక్ మ‌ను సింఘ్వీ తెలంగాణ త‌ర‌పునే ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఈయ‌న ప‌ద‌వీ కాలం కూడా.. ఈ ఏడాది జూన్ 16తో ముగియ‌నుంది. అయితే.. ఈ సీటును తిరిగి ఆయ‌న‌కే ఇవ్వ‌నున్నారు. …

Read More »

కవిత అరెస్ట్… అసలేం జరిగింది?

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఇటీవ‌ల ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో స్థానిక సీబీఐ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో రాష్ట్ర‌స్థాయిలో జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తాన‌ని కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన ఆమె.. త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా మూసీన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు, భారీ క‌ట్ట‌డాల‌కు వ్య‌తిరేకంగా మంగ‌ళ‌వారం అనూహ్యంగా ఆమె నిర‌స‌న‌కు …

Read More »

`శాంతి` అంటూనే మోడీ ఫోన్లు.. దేశంలో మ‌రో క‌ల‌క‌లం!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేప‌థ్యంలో ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా.. అమెరికా సైనిక స్థావ‌రాలు ఉన్న గల్ఫ్ దేశాల‌పై విరుచుకుప‌డుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి నెత‌న్యాహూ నివాసంపైనా ఇరాన్ దాడులు చేసింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు.. ఈ యుద్ధం కొన‌సాగుతుంద‌ని.. మ‌రింత భీక‌రంగా మారుతుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. వారం ప‌ది రోజులు సాగే …

Read More »

సోషల్ మీడియాలో మోడీ సరికొత్త రికార్డు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఏకైక ప్రజానాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోడీకి వెనుకబడి ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా యూట్యూబ్‌లోనూ మోడీ సరికొత్త రికార్డు …

Read More »

సీబీఎన్ వచ్చే… ఐబీఎం తెచ్చే!

వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ ఎంపీ అన్న కారణంతో గల్లా జయదేవ్ కు చెందిన అమర రాజా బ్యాటరీస్ ను పర్యావరణ అనుమతుల పేరుతో వైసీపీ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో, ఏపీలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టబడితో అమర రాజా గ్రూప్ నిర్మించ తలచిన …

Read More »

కూట‌మి స‌ర్కారులో కోవ‌ర్టులు.. బాబు ఆరా!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో వైసీపీ కోవ‌ర్టులు ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అయితే.. రాజ‌కీయంగా కాదు.. అధికారికంగా.. ప‌లువురు ఉన్న‌తాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మ‌రోసారి వీరి వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు రావ‌డం.. ఈ విష‌యం మీడియాలో పెద్ద ఎత్తున రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు అలెర్ట‌య్యారు. స‌ద‌రు అధికారుల‌పై ఆరా తీశారు. ఏం జ‌రిగింది? అనే విష‌యాల‌ను చంద్ర‌బాబు తెలుసుకుంటున్నారు. అస‌లు విష‌యం ఇదీ.. వైసీపీ …

Read More »

ఎంపీ Vs ఎమ్మెల్యే: బాబు జోక్యం అనివార్యం!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఉర‌ఫ్ చిన్ని-ఇదే నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావుల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ఆరు మాసాలుగా ఇరువురు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే స్థాయిలో వివాదాలు కొన‌సాగు తున్నాయి. అయితే.. ఎప్పుడు వివాదం వ‌చ్చినా.. స‌రిదిద్దుతూ.. ఇరువురు నేత‌ల‌ను రాజీ ప‌డేలా చేయాలని టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు మార‌తామ‌ని చెబుతున్నా.. ఇరువురు నేత‌ల …

Read More »

వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు, మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి. ఈ అంబులెన్సుల్లో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స …

Read More »

స్వామివారి చెంతనా మీ కీచులాట?

దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా నిర్వహించే పవిత్ర కార్యక్రమం. అలాంటి వేడుకల్లో రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణంలో దైవనామ స్మరణ తప్ప మరే వివాదానికీ స్థానం ఉండకూడదని పెద్దలు చెప్పే మాటలు తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో జరిగిన ఘటనతో మరోసారి చర్చకు …

Read More »