Political News

రూపాయి పతనంపై నిర్మలమ్మ మాటలో నిజమెంత?

అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ అంతకంతకూ తగ్గుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో రూపాయి జీవన కాలంలోనే అత్యంత కనిష్ఠాలను నమోదు చేస్తూ.. కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. కొద్ది నెలల క్రితం డారల్ తో రూపాయి మారకం విలువ రూ.90 దాటేయటం తెలిసిందే. చూస్తుండగానే రూ.90 కాస్తా రూ.95 దగ్గరకు వచ్చేసింది. కేవలం నెలల వ్యవధిలోనే రూ.5 పతనాన్ని చూస్తున్న పరిస్థితి. నిజానికి డాలర్ …

Read More »

కాళేశ్వ‌రంలో `ల‌క్ష కోట్లు` తిన్నారు: కేంద్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ‌లో తీవ్ర రాజ‌కీయ వివాదానికి దారి తీసిన `కాళేశ్వ‌రం` ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్ల‌డించారు. ఈక్ర‌మంలో ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను తినేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి మంత్రి చెప్పిన‌ప్ప‌టికీ.. ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. పైగా కీల‌క‌మైన‌ జ‌ల‌శ‌క్తిశాఖ‌కు మంత్రిగా ఉన్నారు. దీంతో మంత్రి ప్ర‌క‌ట‌న కేంద్రం చేసిన …

Read More »

బ్యాంకు `లాక‌ర్` సొమ్ము పోతే బాధ్య‌త ఎవ‌రిది?!

బ్యాంకుల్లోని ఖాతాల్లో సొమ్ము నిల్వ చేసుకోవ‌డం కామ‌నే. అయితే.. మ‌రింత విలువైన వ‌స్తువులు.. బంగారం, ఆస్తిప‌త్రాలు వంటివాటిని కూడా బ్యాంకుల్లో భ‌ద్ర ప‌రుచుకునేందుకు `లాక‌ర్ వ్య‌వ‌స్థ‌` అందుబాటులో ఉంది. గ‌త 55 సంవ‌త్స‌రాలుగా ఈ సేవ‌లు బ్యాంకులు అందిస్తున్నాయి. ఒక‌ప్పుడు పెద్ద‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న లాక‌ర్లు.. ఇటీవ‌ల కాలంలో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. ఓ మాదిరి వార్షిక అద్దెతో ఈ లాక‌ర్ల‌ను బ్యాంకులు సాధార‌ణ వ్య‌క్తుల‌కు …

Read More »

విల్లాల‌ను త‌ల‌పించేలా ఇళ్లు.. పేద‌ల ఇంటి క‌ల నెర‌వేర్చిన బాబు

సాధార‌ణంగా పేద‌లకు ప్ర‌భుత్వాలు క‌ట్టించి ఇచ్చే ఇళ్లు.. అన‌గానే ఎలాంటి వ‌స‌తులు ఉండ‌వ‌ని.. ఇరుకు ఇరుగ్గా ఉంటాయ‌ని భావిస్తారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు ఇలాంటి ఇళ్ల‌నే పేద‌ల‌కు క‌ట్టించి ఇస్తాయ‌న్న వాద‌న కూడా ఉంది. కానీ, ఏపీలో దీనికి భిన్నంగా తొలిసారి .. విల్లాల‌ను త‌ల‌పించేలా పేద‌ల‌కు ఇళ్ల‌ను నిర్మించారు. కేవ‌లం 18 మాసాల వ్య‌వ‌ధిలోనే తిరుప‌తిలోని పుదూరులో వీటిని నిర్మించారు. వీటిలో ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించారు. సాధార‌ణంగా …

Read More »

కలవరం పుట్టించిన రాములమ్మ గళం

రాములమ్మగా యావత్తు తెలుగు ప్రజల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి…ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఓ ఉద్యమకారిణి మాదిరిగా సోమవారం శాసనమండలిలో ఆమె చేసిన ప్రసంగం దాదాపుగా అన్ని పార్టీలనూ కలవరానికి గురి చేసిందనే చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమంలో ముందుండి నడిచి, ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారి కుటుంబాలకు చేయాల్సిన సాయం గురించి ఆమె ఓ రేంజిలో వాయిస్ ను వినిపించారు. తాను కొనసాతున్న కాంగ్రెస్ …

Read More »

కేసీఆర్ శకుని… రేవంత్ కృష్ణుడు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను క్షష్ణుడితో పోల్చుకున్న ఆయన… ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శకునితో పోల్చారు. అసలు తనకు గుర్తింపు వచ్చిందే కేసీఆర్ వల్ల అని చెప్పిన రేవంత్ మరో అడుగు ముందుకేసి… శకుని లాంటి కేసీఆర్ లేకపోతే… తన లాంటి కృష్ణుడు లేడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు …

Read More »

బాబు మాట: కార్యకర్తలకూ ఉందో రిజర్వేషన్..!

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా సాగిపోయింది. సీనియర్ల నుంచి జూనియర్ కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చారు. పసుపు పండుగను విజయవంతం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో కలిసి విందు కూడా ఆరగించారు. ఇక దీంతో కార్యక్రమం ముగిసింది. కానీ అసలు విషయం అక్కడే మొదలైంది. విందు భేటీలో చాలా మంది సీనియర్ కార్యకర్తలు టికెట్ల ప్రస్తావన చేశారు. …

Read More »

నిజమైన సైనికుడి తల్లిదండ్రుల కోరికను మన్నించాలి పవన్

మన జనాలకు సినిమా హీరోలు గుర్తున్నంతగా.. దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికులు గుర్తుండరు అన్నది కఠిన వాస్తవం. కొన్నేళ్ల ముందు గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్.. గత ఏడాది పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ లాంటి రియల్ హీరోల గురించి ఎంతమందికి తెలుసు అన్నది ప్రశ్నార్థకం. ప్రాణాలకు భరోసా లేదని తెలిసి కూడా సైన్యంలో చేరి సరిహద్దుల్లో పహరా కాసే.. దేశ …

Read More »

వైసీపీ రెడీనా: స్థానికంలో సత్తా ఎంత..!

స్థానిక ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలే ఉన్నాయి. ఎప్పుడో 2029లో జరిగే ఎన్నికలపై దృష్టి పెట్టిన వైసీపీ అధినేత జగన్.. స్థానికంలో విజయం పై మాత్రం పెద్దగా స్పందించడం లేదు. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పట్లో అధికారంలో ఉన్న కారణంగా వైసీపీ భారీ విజయం దక్కించుకుంది. కొన్నికొన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో అసలు వేరే పార్టీ నాయకులను నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారన్న చర్చ ఉంది. ఫలితంగా …

Read More »

‘కేసీఆర్‌, హ‌రీష్‌రావును జైల్లో పెట్టాక మాట్లాడండి’

కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతి, దీనికి సంబంధించి నియ‌మించిన పీసీ ఘోష్ నివేదిక అంశాల‌పై తెలంగాణ అసెంబ్లీలో నిన్న స్వ‌ల్పకాలిక చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బీజేపీ స‌హా బీఆర్ ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కాళేశ్వ‌రంలో కాసులు మేసిందెవ‌రో.. ల‌క్ష‌ల కోట్లు దండుకున్న‌దెవ‌రో నివేదిక స్ప‌ష్టం చేసింద‌న్నారు. దీనిపై సీబీసీఐడీ వేస్తామ‌ని అంటే.. బీజేపీ నాయ‌కులే(కిష‌న్ రెడ్డి) సీబీఐకి ఇస్తే.. వేగంగా విచార‌ణ పూర్త‌వుతుంద‌న్నార‌ని.. సీబీఐకి …

Read More »

ప్రభుత్వంపై అధికారిక ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, న‌ల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌రోసారి ఆగ్ర‌హానికి, ఆవేద‌న‌కు గుర‌య్యారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న‌కు కేబినెట్‌లో చోటు ద‌క్క‌లేద‌ని పెద్ద ఎత్తున స‌ర్కారుపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. ఒక వ‌ర్గానికే ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ‌న్నారు. ఒకే కుటుంబంలో ఇద్ద‌రికి ప‌ద‌వులు ఇవ్వ‌డం త‌ప్పెలా అవుతుంద‌ని గ‌తంలో ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అయినా.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. తాజాగా …

Read More »

రాకెట్ బాణంతో రాజా సింగ్… జస్ట్ మిస్

రాజా సింగ్… ఈ పేరు వింటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఈ మాజీ బీజేపీ నేత ఏం చేసినా సంచలనంగానే మారుతుంది. తాను చేసిన పనుల వల్ల బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సింగ్… నిత్యం వార్తల్లో ఉండేలా రకరకాల ఫీట్లు చేస్తుంటారు. తాజాగా శ్రీరామ నవమి నాడు ఏకంగా దీపావళి వేడుకలకు యత్నించిన ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నవమి …

Read More »