Political News

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. పార్టీ అధినేతలు పొత్తు ధర్మం అనుసరించి నడుచుకుంటూ ఉంటే… నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నేతలు మాత్రం తమ తమ మాటలు నెగ్గలేదంటూ ఒకరిపై మరొకరు విరుచకుపడిపోతున్నారు. ఈ తరహా ఘటనలతో పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ, జనసేనల మధ్య ఇలాంటి ఘటనలే …

Read More »

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు తెలుగువారి మధ్య విభేదాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, పార్లమెంట్ ఆమోదంతోనే ఇది అమల్లోకి వచ్చిందని …

Read More »

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన ముఖం, పెదాల రంగుల్లో వ్యత్యాసం కనిపించిందంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో సాయంత్రం సమయంలో తీసిన వీడియోలో ఒక విధంగా కనిపించిన మోదీ, తమిళనాడులోని కోయంబత్తూరులో మధ్యాహ్నం చిత్రీకరించిన మరో వీడియోలో భిన్నంగా కనిపిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. రెండు గంటల వ్యవధిలోనే ఈ మార్పు ఎలా సాధ్యమైందన్న …

Read More »

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ నియామకాల వల్ల సాధారణ నియామకాల అవకాశాలు తగ్గి, నిరుద్యోగ యువతకు నష్టం జరుగుతోందని స్పష్టం చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 20,801 ఉద్యోగాలు కారుణ్య కోటాలో భర్తీ అయినట్లు కోర్టు గుర్తించింది. ఏటా సగటున రెండు వేల నియామకాలు జరుగుతున్నాయని, ఇది సాధారణ నియామకాల కంటే …

Read More »

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో మధ్య మధ్యలో తమిళ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగించారు. “అనైవరుక్కుం వణక్కం… ఎన్ అన్బాన తమిళ్ నాడు మక్కళే…” అంటూ సభను ప్రారంభించిన ఆయన, తన పుట్టినరోజు రోజున తమిళనాడులో ప్రజల మధ్య ఉండటం ప్రత్యేక ఆనందంగా ఉందని తమిళంలోనే చెప్పారు. ప్రారంభం నుంచే స్థానిక …

Read More »

జీవన్ రెడ్డిపై కేసీఆర్ వరాల జల్లు!

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మలి దశ ఓ రేంజిలో ఉంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి.. సోమవారం తన సొంతూరు జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా …

Read More »

కేసీఆర్ ఆటలు సాగవు

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను మేడిగ‌డ్డ ప‌రిశీల‌నకు వెళ్తున్నాన‌ని తెలిసే.. కేసీఆర్ జ‌గిత్యాల‌లో స‌భ పెట్టుకున్నార‌ని వ్యాఖ్యానించారు. మేడిగ‌డ్డ‌ను ప‌రిశీలించి.. ప్ర‌జ‌ల‌కు నిజాల‌ను చెబుతాన‌న్న భ‌యం ఉంద‌ని.. అంద‌కే కేసీఆర్ డబుల్ స్టాండ‌ర్డ్ రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌ని విమ‌ర్శించారు. మేడిగడ్డ‌ను నంజుకుతిన్నార‌ని.. ల‌క్షా 50 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు ద్వారా రైతుల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని వ్యాఖ్యానించారు. …

Read More »

100 కోట్ల తేడా.. పోలింగ్‌కు ముందు విజ‌య్‌కు చిక్కులు!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరుకు రెడీ అయిన‌.. ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు ఆదిలోనే చిక్కులు ఎదుర‌వుతున్నాయి. ఒక‌వైపు స‌తీమ‌ణి విడాకుల కేసు విచార‌ణ కొన‌సాగుతుండ‌గా.. మ‌రోవైపు క‌రూర్ తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న కేసు కూడా.. ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు సాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా విజ‌య్ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లో తేడా ఉంద‌ని పేర్కొంటూ.. మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దాదాపు 100 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే లెక్క‌లు తేడా చూపించార‌ని.. చెన్నైకి చెందిన విఘ్నేశ‌న్ అనే …

Read More »

శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయిన వెంకట్రామిరెడ్డి

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా కొనసాగుతున్న ఈ రెడ్డి గారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయనను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సాధారణ పరిపాలనా శాఖ జీవో ఎంఎస్ నెం:43 పేరిట ఉత్తర్వులను జారీ చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడం చాలా …

Read More »

తమిళుల మనసు గెలుచుకున్న బాబు

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అందులో భాగంగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలోకి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం దిగిపోయారు. సోమవారం తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్న చంద్రబాబు… ఎన్డీఏ పెద్దల వినతి మేరకు ఉదయాన్నే జన్మదిన వేడుకలను ముగించుకున్న చంద్రబాబు నేరుగా తమిళనాడులో వాలిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరులో అడుగుపెట్టిన చంద్రబాబు అక్కడి ఓటర్లు ఎన్డీఏ వైపునకు తిరిగేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. …

Read More »

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు ఉన్న అట‌వీ ప్రాంతంలో ఒక‌ప్పుడు వీర‌ప్ప‌న్ ప్ర‌త్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్ర‌భుత్వాల‌ను సైతం గ‌డ‌గ‌డ‌లాడించిన ఆయ‌న‌ను ఎన్ కౌంట‌ర్‌లో పోలీసులు హ‌త‌మార్చారు. అయితే.. వీర‌ప్ప‌న్ పేరు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంటుంది. ఆయ‌న కుమార్తె, భార్య కూడా.. త‌ర‌చుగా మీడియాలో క‌నిపిస్తూ ఉంటారు. తాజా ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ మొద‌టి …

Read More »

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ అయ్యేలా ఆయ‌న రాజ‌కీయ వ్యూహాలు.. అడుగులు ఉంటాయి. దాదాపు ప‌న్నెండు ఏళ్ల త‌ర్వాత‌.. ఆయ‌న ఇలాంటి రాజ‌కీయ అడుగులు వేశారు. అదికూడా కీల‌క‌మైన ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని బీజేపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఏం చేశారంటే.. ప్ర‌ధాన మంత్రి మోడీ.. …

Read More »