రాజకీయాల్లో చింత చచ్చినా పులుపు చావదని అన్నట్టుగా కొందరు నాయకులు వ్యవహరిస్తారు. ఇలాంటి వారిలో ఏపీ మాజీ సీఎం జగన్ ఒకరు. ఆయన పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా మార్పు రాకపోగా.. పార్టీలో ఉన్నవారిని కించపరిచేలా వ్యవహరించారన్న వాదన ఉంది. ఉంటే ఉండండి పోతే పోండి! అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో బలమైన నాయకులు పార్టీని వదిలేశారు. ఇప్పుడు.. జగన్ దారిలోనే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, …
Read More »నమ్మకం-లక్ష్యం-భవిష్యత్తు.. అదే అమరావతి
ఏపీ రాజధాని విషయంలో అనూహ్య స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వాస్తవానికి ఏ నగరం అయినా.. నిర్మాణం పూర్తి చేసుకున్నప్పుడు.. దానికి సంబంధించిన ప్రచారం లభిస్తుందని తెలిపారు. కానీ, అమరావతి విషయంలో మాత్రం నిర్మాణ దశలో ఉండగానే.. రాజధానిపై దేశవ్యాప్తంగా ఆశలు రేకెత్తుతున్నాయన్నారు. నమ్మకం-లక్ష్యం-భవిష్యత్తుకు రాజధాని అమరావతి నిలువెత్తు నిదర్శ నంగా ఉందన్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ కోసం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన …
Read More »రజినీ ‘అసూయ’ కామెంట్… కమల్ ఏమన్నారు?
ఒకప్పుడు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్కు దరిదాపుల్లో నిలిచే హీరో ఇంకొకరు కనిపించే వారు కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బిజినెస్, వసూళ్ల విషయంలో ఆయన రేంజే వేరుగా ఉండేది. కానీ విజయ్ అనే హీరో చూస్తుండగానే.. ఇంతింతై అని ఎదిగిపోయి, సూపర్ స్టార్ను దాటేశాడు. ఇది రజినీ అభిమానులకు రుచించలేదు. రజినీ సైతం విజయ్ విషయంలో అసూయ చెందుతున్నాడా అన్నట్లు ఉంటోంది ఆయన వ్యవహార శైలి. ‘జైలర్’ ఆడియో …
Read More »`సైమి` వచ్చింది… సమస్య తీరిందా?
ఇరాన్పై జరుగుతున్న యుద్ధం(ప్రస్తుతం తాత్కాలిక విరామం ప్రకటించారు) కారణంగా పశ్చిమాసియా లోని కీలక ఇంధన రవాణా మార్గం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన దరిమిలా.. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా వంట గ్యాస్ సమస్య అనేక దేశాలను ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇరాన్ ప్రతినిధులను దేశంలోకి అనుమతించింది. తద్వారా దౌత్య సంబంధాలు సడలకుండా చూసుకుంది. ఫలితంగా చమురు, గ్యాస్ రవాణా …
Read More »తనయుడి టీజర్లో తండ్రి నారా లోకేష్
రాజకీయ కుటుంబాలకు చెందిన వారసులు ప్రజల ముందుకు రావడం కొత్త విషయం కాదు. అయితే చిన్న వయసులోనే ఆసక్తికర అంశాన్ని ఎంచుకుని డిజిటల్ వేదిక ద్వారా ప్రేక్షకులను చేరుకోవడం మాత్రం కొత్త తరహా ప్రయత్నంగా కనిపిస్తోంది. నారా దేవాన్ష్ ప్రారంభించిన ‘డైనో డీట్స్’ యూట్యూబ్ ఛానల్ కూడా అలాంటి ప్రయత్నంగానే చర్చకు వస్తోంది. సాధారణంగా రాజకీయ వారసులపై ప్రజల్లో ఉండే అంచనాలకు భిన్నంగా.. డైనోసార్లు, శిలాజాలు, పురాతన ప్రపంచం వంటి …
Read More »చర్లపల్లి జైలుకు బండి భగీరథ్
ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ ఎదుట లొంగిపోయిన భగీరథ్ ను పోలీసులు మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో భగీరథ్ పై ఫేట్ …
Read More »అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఎక్కడ?
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో నిర్మించనున్నట్టు కూడా తెలిపింది. రెండో దశ భూ సమీకరణను కూడా విమానాశ్రయం కోసమే చేపట్టారు. ఇప్పుడు.. దీనిపై పక్కా క్లారిటీ ఇస్తూ.. ప్రభుత్వం మ్యాప్ను విడుదల చేసింది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. తాడికొండ మండలం రావెల సమీపంలో ప్రతిపాదించారు. ఈ విమానాశ్రయం విజయవాడకు దక్షిణ దిశలో సుమారు 35 …
Read More »ఏపీ నుంచి పెద్దల సభకు అమిత్ షా శిష్యుడు?
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో రెండు టీడీపీ ఉంచుకుని.. మిగిలిన రెండు స్థానాలను మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కేటాయించ నుంది. దీనిపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తమిళనాడుకు చెందిన అన్నామలైని పెద్దల సభకు …
Read More »పథకాలను పెంచుతానంటున్న బాబు గారు
వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారా? ప్రస్తుతం ఇస్తున్న పథకాలను మరింత పెంచనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట నియోజకవర్గంలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను ప్రస్తావించారు. వీటి వల్ల రాష్ట్రంలో మెరుగైన జీవనం కనిపిస్తోందని ముఖ్యంగా పేదల కుటుంబాలలో ఇది ప్రధానంగా మార్పును తీసుకువస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇస్తున్న తల్లికి వందనం పథకంలో …
Read More »తెలుగు హీరోలు నా దగ్గరికొచ్చి బీర్లు తాగేవారు-రేవంత్
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సినీ రంగంలో చాలామందికి సన్నిహిత సంబంధాలుండేవి. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా అవి కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక కేసీఆర్ సినీ ప్రముఖులను దగ్గరికి రానిచ్చేవారు కాదు కానీ.. ఆయన తనయుడు కేటీఆర్తో మాత్రం ఇండస్ట్రీ జనాలు క్లోజ్గా …
Read More »లెక్కలు బాగున్నా… జనాలకు ఎక్కలేదు జగన్!
వైసీపీ అధినేత జగన్.. తన సోషల్ మీడియా ఖాతాలో ప్రభుత్వ పనితీరు.. అప్పుల లెక్కలు.. పథకాలకు వెచ్చిస్తున్న సొమ్ములు.. ఇలా అనేక విషయాలను ప్రస్తావించారు. అదేసమయంలో ప్రభుత్వ పనితీరుపై ఇటీవల కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇచ్చిన నివేదికలోని అంశాలనుకూడా జగన్ ప్రస్తావించారు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికీ సంబంధం లేదని విమర్శించారు. అదేసమయంలో సొమ్ములు ఏమవుతున్నాయో కూడా తెలియడం లేదన్నారు. ఇలా.. జగన్ పలు అంశాలపై వివరణతోపాటు.. …
Read More »మూడో బిడ్డకు 30 వేలు.. నాలుగో బిడ్డకు 40 వేలు
ఏపీలో జనాభా పెరుగుదలకు కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి రథసారధి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం సంచలన ప్రకటన చేశారు. శ్రీకాకుళంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు… రాష్ట్రంలో క్రమంగా జనాభా తగ్గుతోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ ఆందోళనను తగ్గించేలా జనాభా పెరుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధిక సంఖ్యలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates