ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబుతో చాలా అంశాలపై చర్చ జరిపానని… అందులో ప్రధానంగా రాజకీయ అంశాలే ఉన్నాయని బాలినేని స్వయంగా పేర్కొన్నారు. ఈ మేరకు బాబుతో తన భేటీకి సంబంధించిన ఫొటోలతో పాటు అక్కడ జరిగిన అంశాలను …
Read More »విజయ్ నుంచి చాలా నేర్చుకోవాలేమో జగన్ సర్!
తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గెలుపు గుర్రం ఎక్కడం, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విషయంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున సెల్ఫ్ గోల్ చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ తన ప్రచారంలో జగన్ ఫొటోను పట్టుకుని తిరిగిన ఘట్టాలను పదే పదే వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అయింది. మొత్తంగా విజయ్ .. విజయం వెనుక జగన్ ఉన్నారన్నది వైసీపీ వాదన. ఇది ఎలా ఉన్నప్పటికీ.. …
Read More »సీఎం వెనుక దర్శకుడి పట్టుదల
విజయ్ భవిష్యత్తుని ముందే ఊహించాడు అనడం కంటే, వెంకట్ ప్రభు దాన్ని తెర మీద పట్టుబట్టి చూపించాడు అనడం కరెక్ట్. ‘GOAT’ సినిమాలో ‘TN07 CM 2026’ నంబర్ ప్లేట్ పెట్టినప్పుడు చాలామంది నవ్వారు. హీరోని పొగడటం కామన్. ప్రతి దర్శకుడూ తన హీరోని పవర్ఫుల్గానే చూపిస్తాడు. కానీ ఏకంగా సీఎం అనేసరికి “ఇది ఓవర్” అనే కామెంట్స్ వచ్చాయి. అయినా వెంకట్ ప్రభు వెనక్కి తగ్గలేదు. యూనిట్ టాక్ …
Read More »కవిత పాదయాత్ర ఏమైంది?
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. సొంతగా పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత.. పాదయాత్ర చేస్తానని కొన్నాళ్ల కిందట ప్రకటించారు. జిల్లాలు, గ్రామాలు, మండలాలను కూడా తాను చుట్టి వస్తానని ప్రకటించారు. అప్పట్లో కొన్ని గ్రామాల్లోనూ ఆమె యాత్ర చేశారు. నిజామాబాద్ నుంచి ప్రారంభించిన యాత్ర.. అక్కడక్కడ సాగినా.. ఆ తర్వాత ఆగిపోయింది. నిజానికి అప్పటికి ఆమె పార్టీని ప్రకటించలేదు. ఇక, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీని ప్రకటించిన …
Read More »భారత్కు 2 సవాళ్లు.. తక్షణం మేల్కోవాలి!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రస్తుతం తుఫాను ముందు ప్రశాంతతగా ఉంది. కాల్పుల విరమణ పాటిస్తు న్నప్పటికీ.. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ తాజాగా చేసిన హెచ్చరిక తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు బలమైన ప్రతిదాడులు చేస్తూనే.. ఇరాన్.. తన పరిధిలోని హార్ముజ్ జలసంధిపై పట్టు బిగించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం భారత్ …
Read More »చంద్రబాబు `ఈవీ` మంత్రం..!
ఏపీ సీఎం చంద్రబాబు సమస్యలను తనదైన శైలిలో అర్థం చేసుకోవడంతోపాటు.. వాటికి పరిష్కారాలను కూడా తనదైన శైలిలోనే చూపిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన సమస్య పెరిగిపోయింది. దీంతో ఇంధనపొదుపు కోసం ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు పొదుపు బాట పడుతున్నారు. తాజాగా సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి తన కార్యాలయానికి చేరుకునేందుకు రెండు కిలో మీటర్లు నడిచి వచ్చారు. తద్వారా.. 50-60 లీటర్ల డీజిల్ను పొదుపు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »నాయకుల ఇబ్బందిని పవన్ లైట్ తీసుకున్నారా?
ఏపీలో కూటమి పార్టీ ప్రభుత్వం బలంగా ఉంది. వచ్చే 15 ఏళ్లపాటు ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని కూడా చెబుతోంది. ఉన్నతస్థాయిలో సీఎం, డిప్యూటీసీఎంగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కలివిడిని ప్రదర్శిస్తున్నారు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇక, మిత్రపక్షం బీజేపీకూడా కలివిడిగానే ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా.. ప్రభుత్వానికి అనుకూలంగా నే ఉన్నారు. అయితే.. ఈ పరిణామం.. నాణేనికి ఒకవైపు మాత్రమే!. రెండో వైపు క్షేత్రస్థాయిలో నాయకుల …
Read More »సుప్రీంకోర్టుకు వెళ్లిన `కేబీఆర్ పార్క్`.. విషయం ఏంటి?
ఎక్కడో హైదరాబాద్లో ఉన్న కేబీఆర్ పార్క్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ పార్క్కు సమీపంలో ఉన్న భారీ నుంచి అతిభారీ వృక్షాలనుఎట్టి పరిస్థితిలోనూ నరికేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. పర్యావరణ అనుకూల చట్టాలను యథాతథంగా అమలు చేయాలని నిర్దేశించింది. అంతేకాదు.. ప్రభుత్వమే చెట్లను కూల్చి వేస్తోందన్న న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారం చాలా శోచనీయమని… ప్రభుత్వమే కూల్చేస్తే.. ఇక, ప్రైవేటు వ్యక్తులను …
Read More »కవిత జైలుకెళ్తే… కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా?
పోస్కో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కొడుకు చేసిన తప్పునకు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినదిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నిరసనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఘాటుగా …
Read More »ఢిల్లీలో పసుపు జండా రెపరెప..!
దేశ రాజధాని ఢిల్లీలో తెలుగోడి ఆత్మ గౌరవానికి తూట్లు పడుతున్నాయని నాడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు ఆవేదనకు లోనయ్యారు. అలాంటి పరిస్థితులను రూపుమాపి.. ఢిల్లీ నడి వీధుల్లో తెలుగోడి పవర్ ఏమిటో చూపాలన్న కసితో సాగిన ఎన్టీఆర్… తెలుగు దేశం పార్టీ (టీడీపీ)పేరిట పార్టీని స్థాపించి సత్తా చాటారు. ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న టీడీపీ జెండా ఇప్పుడు ఢిల్లీ నడి వీధుల్లో …
Read More »అంబటి నోట ‘లవ్ క్యాష్’ మాట
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన బాట పట్టారు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న డిమాండ్ తో సోమవారం ఏపీవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్న అంబటి…టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ పై విరుచుకుపడిపోయారు. ఈ సందర్భంగా ఆయన లోకేశ్ …
Read More »కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణం, హాజరు కాని విజయ్!
కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి సతీశన్తో పాటు 20 మంది మంత్రులతో కూడిన కొత్త కేబినెట్ కూడా ఒకేసారి ప్రమాణస్వీకారం చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కేరళ రాజకీయాల్లో కొత్త …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates