‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా కార్యక్రమం జరిగితే ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఒక మాట చెప్పారు. రాజకీయంగా ఏదైనా నిర్ణయం బెడిసికొడితే.. దాని మీద స్టాండ్ మార్చుకోవడంలో తప్పేమీ లేదని, ఇంతకుముందు ఫలానా ఉద్దేశంతో ఆ స్టాండ్ మీద ఉన్నామని.. జనాలకు అది నచ్చలేదు కాబట్టి స్టాండ్ మార్చుకుంటున్నామని చెబితే.. జనాలు దాన్ని సానుకూలంగా తీసుకుంటారని.. …
Read More »‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని కలిపి కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు సుమారు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు ఉండగా, ఈ మూడు నగరాలను కలిపే 110 కిలోమీటర్ల జాతీయ రహదారి పరిధిని మొత్తం క్యాపిటల్ ఏరియాగా ప్రకటించాలని సూచించారు. ఈ సమగ్ర …
Read More »అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్ పెడితే చాలు ట్రోలర్లు పండగ చేసుకుంటున్నారు. జగన్ నోటి నుంచి జాలువారే ఆణిముత్యాల కోసం వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి టంగ్ స్లిప్ అయి దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా నెటిజనులకు జగన్ మరోసారి …
Read More »జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక అగ్రనేత ఇలా రెండు చోట్ల పోటీ చేయడం కొత్తేమీ కాదు, కానీ సుమారు 35 ఏళ్ల తర్వాత విజయ్ ఈ సాహసం చేస్తున్నారు. 1991లో అన్నా డీఎంకే …
Read More »హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని మహా అయితే మూడు వారాల్లో ముగించేసి.. తాను అనుకున్నది పూర్తి చేసి.. విజయాన్ని ఏకపక్షంగా ఎంజాయ్ చేద్దామనుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్ పై విజయం తర్వాత తనను తాను తిరుగులేని అధికార కేంద్రంగా మార్చుకొని.. తన ఎజెండాలో మిగిలిన అంశాల మీద ఫోకస్ చేద్దామని భావించారు. అందుకు భిన్నంగా …
Read More »భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి కావటం ఒక విశేషమైతే.. ఇప్పటివరకు దేశంలోని మరే రాష్ట్ర రాజధానికి లేని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. గతంలో ఏ రాష్ట్ర రాజధాని విషయంలోనూ శాశ్వత రాజధాని అనే పదాన్ని చట్టంలో పొందుపర్చటం జరగలేదు. అందుకు భిన్నంగా అమరావతి …
Read More »బీజేపీ బాటలో వైసీపీ ఎంపీ?
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు, పార్టీలు కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు.. ఏనాయకుడు కూడా దీనికి అతీతం కాదు. `జగనన్నే నా ప్రాణం` అన్న నాయకులు.. `టీడీపీలోనే పుట్టి పెరిగాం“.. అన్న నేతలు.. అనేక మంది రాజకీయాల్లో తమ తమ దారులు వెతుక్కున్నారు. తమ అవసరాలు.. …
Read More »ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం కనిపించడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. సమాజంలో ప్రాతమికంగా.. నాలుగు వర్గాలు ఉంటాయి. పేదలు, సాధారణ ప్రజలు, మధ్యతరగతి, ఉన్నతస్థాయి వర్గం. వీరిలో రాజకీయాలకు.. రాజకీయ నేతలకు.. పేదలు, సాధారణ ప్రజలు అత్యంత కీలకం. వీరిని సెంట్రిక్గా చేసుకునే నాయకులు, పార్టీలు కూడా వ్యవహరిస్తాయి. గతంలో వైసీపీ …
Read More »నిఘా ఏమైంది: వైసీపీ కలివిడి రాజకీయం..!
రాష్ట్రంలో ప్రభుత్వానికి పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంది. ఇక తరచుగా సీఎం చంద్రబాబు పలు అంశాలపై సర్వేలు కూడా చేయిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ వరకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దీంతో ప్రజల నాడి ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమేరకు అమలవుతున్నాయి, ఎలాంటి సంతృప్తి వ్యక్తమవుతోంది వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. …
Read More »వైసీపీ నిరసనలు పెద్ద `డ్రామా` అంటున్న దువ్వాడ
వైసీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంపై అదే పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ నేతలు చేపట్టిన నిరసనలు పెద్ద డ్రామా. వాటిని ప్రజలు నమ్మరు. కేవలం రాజకీయ పబ్బం కోసమే ఈ నిరసనలు చేపట్టారు. వీటిలో పసలేదు. ప్రజలు నమ్మొద్దు.“ అంటూ దువ్వాడ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాదు.. సొంత …
Read More »ట్యాంక్ బండ్ హీరోకు సీఎం ఆపన్న హస్తం
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ ఇచ్చాం… అమలు సంగతి తర్వాత చూద్దాం అనే ఫక్తు రాజకీయ నేతల మాదిరిగా కాకుండా చేయాలనుకున్న సాయాన్ని రేవంత్ రెడ్డి అప్పటికప్పుడే చేసేస్తున్నారు. రేవంత్ లోని ఈ తరహా వైఖరితో ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి పూర్తి స్థాయి భరోసా దక్కింది. శివ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇంటిని …
Read More »జనసేన ఎమ్మెల్యేకు బాబు కితాబు
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని కూడా సూచిస్తాయి. తద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. దీనికి భిన్నంగా కూటమిలోని మిత్రపక్షం జనసేన ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు బహిరంగ వేదికగానే ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యే పనితీరును ఆయన మెచ్చుకున్నారు. తాజాగా నాయుడుపేటలో పార్టీకార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు.. నాయకుల పనితీరు ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates