వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులతో పాటుగా టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి యత్నం ఘటనలు కీలకమైనవి. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకట్టుకునేందుకు, పదవులు దక్కించుకునేందుకు చాలా మంది చాలానే చేశారు. అలాంటి వారిలో …
Read More »ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్ లో సమ్మర్ క్యాంపులో ఉన్న పవన్ కుమారుడు… అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు కాలిన గాయాలైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో కలిసి క్యాంపులో ఉన్న ఓ బాలిక చనిపోగా… మార్క్ …
Read More »కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కాకాణి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇప్పటికే 10 రోజుల పాటుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా… కనీసం నోటీసులు కూడా తీసుకోకుండా …
Read More »రెండు రాష్ట్రాలకూ ఊరట.. విభజన చట్టంపై కేంద్రం కసరత్తు!
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో.. విభజన చట్టంలోని చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉండి పోయాయి. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్రానికి పలు రూపాల్లో విన్నపాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఎట్టకేలకు.. తాజాగా కేంద్ర హోం శాఖ ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా విభజన చట్టం-2014లోని షెడ్యూల్ …
Read More »హైకోర్టుకు పోలీసులు.. జగన్పై పిటిషన్?
వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ.. అధికారుల సంఘం తాజాగా లేఖ రాసింది. అయితే..తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. అయితే.. ప్రభుత్వ పరంగా కంటే కూడా.. న్యాయ పోరాటం ద్వారానే పోలీసులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. …
Read More »ఫార్మాపై ట్రంప్ టారిఫ్ లు అమెరికాకు పిడుగుపాటే!
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటిదాకా విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న దాదాపుగా అన్ని వస్తువులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను భారీగా పెంచేశారు. ఫలితంగా అమెరికాలో ఆయా దేశాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఫార్మా రంగంపైనా కొత్త …
Read More »అమరావతి టు హైదరాబాద్ రయ్ రయ్!.. కీలక అప్డేట్!
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. రాజధాని అమరావతిని నేరుగా హైదరాబాద్తో లింకు చేస్తే.. పెట్టుబడులు, వ్యాపార వేత్తలు రాజధానికి క్యూ కట్టే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు తలపోస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘అమరావతి-హైదరాబద్’ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టాలన్నది చంద్రబాబు ఉద్దేశం. అయితే.. ఈ ప్రాజెక్టును రాష్ట్రపరిధిలో కాకుండా.. జాతీయస్థాయిలో …
Read More »వంశీకి జైలే.. తాజా తీర్పు!
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన విజయవాడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారంతో ఆయనకు గతంలో విధించిన రిమాండ్ గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆయనను బుధవారం.. విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. రిమాండ్ పొడిగించింది. దీంతో మరో 14 రోజుల …
Read More »డీసీసీలే ఇక సుప్రీం!… హస్తం పార్టీ తీర్మానం అమలయ్యేనా?
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం మొదలైన ఈ సమావేశాలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ స్థాయిలో పార్టీ అథ్యక్షుడి నేతృత్వంలోని ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా… రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇకపై ఏఐసీసీలతో …
Read More »వీడియో: అమరావతిలో బాబు సొంతిల్లు..
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు. కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణీల సమక్షంలో మనవడు నారా దేవాన్ష్ తో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 8.51 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ కార్యక్రమాన్ని …
Read More »గాయపడ్డ కొడుకును చేరిన పవన్.. తాజా పరిస్థితేంటి?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ వైపు పెద్ద కుమారుడి జన్మదినం… అదే రోజు తెల్లారి లేవగానే.. అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడికి గాయాలు… అది కూడా ఎక్కడో సుదూరాన సింగపూర్ లో ఈ ఘటన జరగడం.. నిజంగానే పవన్ ఎలా ఉగ్గబట్టుకున్నారో తెలియదు గానీ.. సాధారణ వ్యక్తులు అయితే ఈ టెన్షన్ ను తట్టుకోవడం …
Read More »అది జగన్ స్థాయికి తగదు
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. అది వారికే చీప్గా పరిణమించి.. సమాజంలో మరింత చులక న కావడం ఖాయం. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. పోలీసులను ఉద్దేశించి పదే పదే జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన హుందా తనాన్ని మరింత డౌన్ చేస్తున్నాయి. చివరకు.. ఒక స్టేషన్కు పరిమితమైన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates