నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు కాగా.. పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా… ఈ దఫా రాజధాని అమరావతికి ప్రధాని మోదీలో వస్తున్న నరేంద్ర మోదీ ఏం తీసుకురానున్నారన్న విషయంలో ఇప్పటికే ఓ ఆసక్తికర …
Read More »ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని కొన్నాళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇవి ఎవరో విపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు కావు. కాడి పట్టే.. కార్యకర్తల నుంచి మీడియా వరకు సర్కారు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అందరూ మూకుమ్మ డిగా.. ఆలయాలకు వెళ్లవద్దు.. భక్తులకు …
Read More »‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యవహారంపై బుధవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ఓ కీలక ప్రశ్నను సంధించింది. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులకు చోటు కల్పించేలా సవరణ చట్టంలో ఓ అంశాన్ని పొందుపరచిన …
Read More »సాయిరెడ్డి సీటు ఎవరికిస్తారు బాబూ?
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ సాయిరెడ్డి… కొన్నాళ్ల కిందట తన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి కూడా రిజైన్ చేశారు. అనంతరం.. ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఇది ఎమ్మెల్యే కోటా రాజ్యసభ సీటు కావడం గమనార్హం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఈ సీటును ఆయనకు రెండో సారి కేటాయించారు. అయితే.. పార్టీ ఓటమి.. …
Read More »అదే జరిగితే.. తెలంగాణ సీఎస్ను జైలుకు పంపిస్తాం: SC
తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు 1996 నాటి.. వాల్టా చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించి ఉంటే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా.. అటవీ శాఖ అధికారులను కూడా జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. దీనిపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏం జరిగింది? కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ …
Read More »బాబు ‘అమరావతి’ కల చాలా పెద్దది
ఏపీ సీఎం చంద్రబాబు విషయం గురించి చెబుతూ… మంత్రి నారాయణ ఒక మాట చెప్పారు. “మనం వచ్చే రెండు మూడేళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తామని.. కానీ, చంద్రబాబు మాత్రం వచ్చే 100 నుంచి 150 ఏళ్ల భవితవ్యాన్ని స్వప్నిస్తారు” అని అన్నారు. ఔను. ఇది నిజమే అని నిరూపించే వాదన తెరమీదికి వచ్చింది. వాస్తవానికి చంద్రబాబు స్వప్నమే సాకారమైతే.. ఇక, తెలంగాణ రాజధాని, దక్షిణాదిలో బెంగళూరు నగరంతో సరిసమానంగా పుంజుకుంటున్న …
Read More »ఏపీలో ఎన్నిక.. షెడ్యూల్ విడుదల!
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. తన రాజ్యసభ సీటుకు రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డి సీటుకే ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం.. భర్తీ కానున్న ఈ సీటుకు ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను తీసుకుంటారు. అనంతరం.. ఈ నెల …
Read More »ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డిని ఇప్పుడు కేసులు చుట్టుముట్టేలానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఓ వైపు కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ, మరోవైపు ఏపీ లిక్కర్ స్కాం.. ఇలా రెండు కీలక కేసులు సాయిరెడ్డిని నిద్ర పోనివ్వడం లేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఈ కేసుల్లో విచారణకు హాజరైన …
Read More »బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..ఢిల్లీ నుంచి విదేశీ విమానం ఎక్కనున్నారు. ఫలానా దేశం అని తెలియదు గానీ.. యూరోప్ లోని పలు దేశాల్లో చంద్రబాబు తన ఫ్యామిలీతో కలిసి దాదాపుగా ఆరు రోజులు సరదాగా గడపనున్నారు. చంద్రబాబు టూర్ పై ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. యూరోప్ పర్యటనను ముగించుకుని …
Read More »విశాఖకు మహర్దశ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధానంగా విశాఖకు మణిహారంగా భావిస్తున్న టీసీఎస్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. టీసీఎస్ సంస్థతో రెండు మాసాల కిందట సర్కారు ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ.. విశాఖలో ఏర్పాటుకు మొగ్గు చూపడంతో ఐటీ హిల్స్పై ఏర్పాటుకు సర్కారు అంగీకరించింది. దీనికిగాను 21.66 ఎకరాలను కేటాయించేందుకు పచ్చజెండా …
Read More »‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది. దాదాపుగా 3 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ పూర్తి అయిన తర్వాత..కేబినెట్ మంత్రులతో చంద్రబాబు రాజకీయ అంశాలపై కీలక చర్చను చేపట్టారు. కూటమి సర్కారును అప్రతిష్ఠ పాలు చేసేందుకు వైసీపీ వ్యవహరిస్తూనే ఉందని ఆరోపించిన చంద్రబాబు… వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే …
Read More »ట్రంప్ టారిఫ్ లను తట్టుకున్న ఏకైక మార్కెట్ మనదే..
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్గా నిలిచింది. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు అనంతరం మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన నేపథ్యంలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ 50) 2.4 శాతం లాభంతో ట్రేడయ్యింది. ఇది ఏప్రిల్ 2న ట్రంప్ ఆదేశాల తర్వాత పడిపోయిన స్థాయిని మళ్లీ చేరుకోవడం విశేషం. ట్రంప్ చర్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates