Political News

నా సంగ‌తేంటి?.. ఢిల్లీకి కిర‌ణ్ కుమార్‌!

“నా సంగ‌తేంటి? తేల్చండి!” అంటూ.. మాజీ సీఎం, బీజేపీ నాయ‌కుడు.. న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌పై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యారా? ఆయ‌న ఈ రోజో రేపో ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్ర చివ‌రి ముఖ్యమంత్రిగా చేసిన త‌ర్వాత‌.. దాదాపు 11 సంవ‌త్స‌రాలుగా కిర‌ణ్ రాజ‌కీయాలు ఊగిస‌ల‌డుతూనే ఉన్నాయి. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వినీ ఏ పార్టీలోనూ …

Read More »

మెగాస్టార్‌కే షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. హైకోర్టుకు వివాదం!

మెగాస్టార్ చిరంజీవి అంటే.. స‌మాజంలో మంచి పేరు, ప‌లుకుబ‌డి ఉంద‌న‌డంలో సందేహం లేదు. పైగా విన‌మ్రుడు, వివాదర‌హితుడు కూడా. దీంతో ఆయ‌న ఏం చెప్పినా.. ఏం చేయాల‌ని అనుకున్నా..ప‌నులు క్ష‌ణాల్లో జ‌రిగిపోతూ ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, చిత్రంగా.. గ్రేట‌ర్‌ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు మాత్రం మెగాస్టార్‌కే షాకిచ్చారు. ‘అయితే ఏంటి?’ అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. దీంతో చిరు.. హైకోర్టు వ‌ర‌కు వెళ్లి.. అధికారుల‌ను క‌దిలించారు. ఏం జ‌రిగింది? హైదరాబాద్‌లోని …

Read More »

పేర్నినానికి పిచ్చి పట్టినట్లుంది: కందుల దుర్గేష్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని ఈ మధ్య చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చీకట్లోనే సైలెంట్ గా పని కానిచ్చేయాలని…రప్పా రప్పా అంటూ పగటి పూట రచ్చ చేయడం కాదని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా నాని చేసిన కామెంట్లు దుమారం రేపాయి. మంత్రి కందుల దుర్గేష్ ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఈ క్రమంలోనే పేర్ని …

Read More »

బ‌ట్టు తిరిగి వస్తున్నారు జగన్!

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపించి… చ‌ట్టాన్ని ప‌రిచ‌యం చేసి.. మొట్టికాయ‌లు వేసిన న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్‌. 2020 జనవరి 13 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప‌ని చేసిన ఆయ‌న 2023 ఏప్రిల్‌ 10న మద్రాస్‌ హైకోర్టుకు బ‌దిలీ అయ్యారు. వాస్త‌వానికి బ‌ట్టును బ‌దిలీ చేయించింది కూడా.. జ‌గ‌నే అనే ప్ర‌చారం ఉంది. అప్ప‌ట్లో బ‌ట్టు బ‌దిలీని వ్య‌తిరేకిస్తూ.. న్యాయ‌వాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించారు. అయితే.. …

Read More »

రప్పా రప్పా..వైసీపీ ఎమ్మెల్సీ పై కేసు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలిపిన వ్యవహారం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తాన తన మిత్రుడికి పుష్ప మద్దతిచ్చాడోగానీ…ఆ తర్వాత అటు వైసీపీకి, ఇటు అల్లు అర్జున్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ…సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో బన్నీ …

Read More »

భాగ్య‌న‌గ‌రంలో కాల్పులు… సీపీఐ నేత మృతి

ఇటీవ‌ల ద‌శాబ్ద కాలంలో ప్ర‌శాంతంగా ఉన్న భాగ్య‌న‌గ‌రంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. మార్నింగ్ వాక్ కు వచ్చిన క‌మ్యూనిస్టు నాయ‌కుడే ల‌క్ష్యంగా కొంద‌రు దుండ‌గులు.. తుపాకీల‌తో కాల్పులు జ‌రిపారు. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రం యావ‌త్తు పొద్దు పొద్దున్నే ఉలిక్కి ప‌డింది. అస‌లేం జ‌రిగిందంటూ.. అందరూ ఆరా తీశారు. వాస్త‌వానికి తెలంగాణ‌లో తుపాకీ సంస్కృతి లేదు. తుపాకులు ఉన్న నాయ‌కులు ఉన్నా.. ఎప్పుడూ వాటిని బ‌య‌ట‌కు కూడా తీసిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. …

Read More »

జ‌గ‌న్‌కు అడ్డుక‌ట్ట‌.. రెండు మాసాల్లో మాస్టర్ ప్లాన్‌.. !

జగన్‌కు అడ్డుకట్ట వేసే విషయంలో కూటమి ప్రభుత్వంలో సీనియర్ నాయకులు తర్జ‌న భ‌ర్జ‌న‌ పడుతున్నారు. ఒకవైపు నిరసనల పేరుతో జ‌గ‌న్‌ రోడ్డు మీదకు వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పెట్టుబడులకు సంబంధించి ఆయా కంపెనీలకు ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఈమెయిల్ రూపంలో సమాచారం పంపిస్తూ అడ్డుకుంటున్నారనేది కూటమి నాయకులు చెబుతున్న మాట. దాదాపు 200 ఈ-మెయిల్ లను పంపించి తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారనేది మంత్రి పయ్యావుల …

Read More »

కాపులు హ్యాపీస్‌.. విష‌యం ఏంటంటే!

కాపు సామాజిక వ‌ర్గం ఖుషీ అయ్యే వార్త ఇది!. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వీరి కోరిక‌. అందుకే త‌ర‌చుగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల్లోనూ.. ఆయ‌న ఎక్క‌డైనా పాల్గున్న‌ప్పుడు కూడా.. సీఎం-సీఎం అంటూ.. పెద్ద ఎత్తున హ‌డావుడి చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఆ ప‌ద‌వి త‌న‌కు భారమ‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. మ‌రో 15 ఏళ్ల వ‌ర‌కు కూట‌మిగానే ఉంటాన‌ని అంటున్నారు. దీంతో కాపులు ఒకింత హ‌ర్ట్ అవుతున్నారు. ఈ …

Read More »

పద‌వుల పందేరం.. లెక్క చూస్తున్న చంద్ర‌బాబు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. నామినేటెడ్ ప‌ద‌వుల‌ను నాయ‌కుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు రంగం రెడీ చేసింది. మ‌రో 15-20 రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ ద‌ఫా దాదాపు 3 వేల నామినేట‌డ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో బ‌లంగా ప‌ని చేసిన వారు, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో కొంద‌రికి ఇప్ప‌టికే చైర్మ‌న్‌లు ప‌ద వులు …

Read More »

ఆ రెండు జిల్లాల‌కు మ‌హ‌ర్ద‌శ‌..

ఏపీలో ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కూట‌మి ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంది. రాయ‌ల‌సీమ నుంచిఉత్త‌రాంధ్ర వ‌ర‌కు కూడా ప్రాంతాల‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను కూడా అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబ‌డులకు అనుకూలంగా మార్గాల‌ను సుగ‌మం చేసుకుంటోంది. తాజాగా ఏపీ స్పేస్ పాల‌సీపేరిట ప్ర‌భుత్వం ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. కేంద్రం అమ‌లు చేస్తున్న స్పేస్ మిష‌న్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఏపీలో …

Read More »

వివాదాల్లో జ‌న‌సేన నేత‌లు.. ఇలా అయితే క‌ష్ట‌మే.. !

జనసేన నాయకులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అంశాలు కూడా తెలిసిందే. నిజానికి జనసేన పార్టీ అంటే నిబద్ధతకు, ప్రజా సేవకు, ప్రశ్నించే తత్వానికి కీలకమని ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను కూడా అదే విధానాన్ని అవలంబిస్తానని ఆయన అన్నారు. అయితే అనూహ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని, పార్టీ అధినేతను కూడా ఇరుకున పడేస్తున్నాయి. …

Read More »

‘సుప‌రిపాల‌న‌’పై.. జ‌నం ఏం చెబుతున్నారంటే..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడం వంటి వాటిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారా? అనేది ప్రస్తుతం టిడిపి నాయకులు నిర్వహిస్తున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికి సుమారు 60 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తొలి విడత పూర్తి చేశారు. దీనికి …

Read More »