మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచనలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ ఎస్ ఉంటుందని.. ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పార్టీలో అస్థిరత కనిపిస్తోందని చెప్పారు. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ వ్యవహార శైలి ఆ పార్టీలో నేతలకు ఎవరికీ నచ్చడం లేదని కడియం చెప్పారు. అందుకే సొంత చెల్లి కూడా బయట కు వచ్చేసిందన్నారు. పరిస్థితులు …
Read More »‘చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు భూములు ఇచ్చారు’
కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉందన్నారు. అమరావతి రాజధానిలో ఒకే విడత 15 బ్యాంకులు, ఇతర బీమా కంపెనీలకు చెందిన కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాజధాని …
Read More »పంచాయతీల కోసం బరిలోకి దిగనున్న సీఎం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 11, 14, 19 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. వాస్తవానికి ఇది పార్టీలు, అజెండా, జెండాల ప్రాతిపదికన జరిగే ఎన్నిక కాదు. అయినా.. ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీలు ముందుగానే అలెర్ట్ అయ్యాయి. బీఆర్ ఎస్ నాయకులు ఇప్పటికే గ్రామ పర్యటనలు చేపట్టి రైతుల సమస్యలను, పంటల …
Read More »నేపాల్ రూ 100 నోటులో భారత ప్రదేశాలు?
భారత్, నేపాల్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, సరిహద్దు గొడవలు అప్పుడప్పుడు రాజుకుంటూనే ఉంటాయి. ఇన్నాళ్లు కేవలం మాటల యుద్ధంగా, రాజకీయ మ్యాపులకే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు ప్రజల జేబుల్లోకి కూడా వచ్చేసింది. నేపాల్ తీసుకున్న తాజా నిర్ణయం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వేడిని పెంచేలా ఉంది. ఒక చిన్న కాగితం ముక్క ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ దేశమైనా తమ కరెన్సీ నోట్ల …
Read More »సర్పంచ్ పదవికి వేలం: 20 లక్షలు పలికిన పదవి!
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే పదువులు సొంతం అవుతాయి. ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసి వారి ఆదరణను నాయకులు చూరగొనాలి. ఎంపీ నుంచి ఎమ్మెల్యే వరకు, కార్పొరేటర్ నుంచి వార్డు సభ్యుడి దాకా అంతా ఎన్నికల ప్రక్రియపైనే ఆధారపడి ఉంటుంది. అయితే.. తాజాగా తెలంగాణలో కొత్త సంస్కృతి పురుడు పోసుకుంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు ఇక్కడ రంగం కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వచ్చే …
Read More »జగన్ కడప టూర్ – హిట్ ఆర్ ఫ్లాప్??
మూడు రోజలు పాటు వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లా కడపలో పర్యటించారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులను సరైన మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతో ఆయన ఈ పర్యట పెట్టుకున్నారు. అయితే.. వర్షాలు.. వరదల కారణంగా దెబ్బతిన్న అరటి రైతులకు తమ పార్టీ తరఫున పరిహారం అందిస్తామని వాగ్దానం చేశారు. ఈ నేపథ్యం కూడా.. తాజాగా పర్యటనలో కీలకంగా మారింది. దీంతో అరటి రైతులను కూడా జగన్ పరామర్శించారు. …
Read More »నేనే తప్పుచేసి… నేనే కోర్టుకెళ్లానా?: సుబ్బారెడ్డి
“నేనే తప్పు చేసి.. నేనే కోర్టుకువెళ్తానా?“ అని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ప్రతి విషయాన్నీ రాజకీయంగా చూస్తున్నారని విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటనపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పరకామణి దొంగతనం కేసు విషయంలో విచారణ నిమిత్తం విజయవాడకు వచ్చిన సుబ్బారెడ్డి .. అధికారుల ముందు హాజరయ్యారు. అనంతరం.. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. …
Read More »కష్టకాలంలో లంకకు అండగా భారత్
శ్రీలంకను ‘దిత్వ’ తుఫాను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 56 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వేలాది ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 44 వేల మందిని స్కూళ్లు, షెల్టర్లకు తరలించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రాజధాని కొలంబోలో స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా పనిచేయలేదు. రైళ్లు నిలిచిపోయాయి. కష్టకాలంలో …
Read More »మోదీతో మరోసారి పుతిన్.. అందరి కళ్లు భారత్ వైపే
ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు భారత్ వైపే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖతో పాటు రష్యా క్రెమ్లిన్ వర్గాలు కూడా అధికారికంగా ధృవీకరించాయి. ఇది కేవలం సాధారణ పర్యటన కాదు. భారత్ …
Read More »ఏపీపై ప్రధాని మోడీకి ఎనలేని ప్రేమ
భవిష్యత్తులో ఎక్కడైనా రాజధాని నిర్మాణం చేపట్టాలని అనుకునేవారికి అమరావతి రాజధాని నిర్మాణం ఒక ఉదాహరణగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల ప్రధాన భవనాలకు ఆమె శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. అమరావతి దేశ భవిష్యత్తు రాజధానులకు తలమానికంగా నిలుస్తుందన్నారు. రాజధాని అమరావతిని తిరిగి ప్రారంభించడం సంతోషించదగిన …
Read More »కూటమి గ్రాఫ్ చంద్రబాబు డెసిషన్ చూశారా…!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల నాటికి మరోసారి గెలుపు గుర్రం ఎక్కడానికి మార్చుకోవాల్సిన విధానాలు వంటి కీలక అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. తాజాగా అధికారులు, మంత్రులతో నిర్వహించిన పలు సమీక్షల్లో ఈ విషయాలను ఆరా తీశారు. గ్రాఫ్ ఇప్పుడున్నట్టుగా ఉంటే కుదరదని స్పష్టం చేశారు. వాస్తవానికి గత పది నెలల్లో పలు మార్లు …
Read More »ప్రపంచంలోనే ఎత్తైన రాముడు… మోదీ గ్రాండ్ ఎంట్రీ!
గోవా వేదికగా మరో ఆధ్యాత్మిక అద్భుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దక్షిణ గోవాలోని ప్రసిద్ధ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన ఈ 77 అడుగుల కాంస్య విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుజరాత్లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) చెక్కిన ప్రముఖ శిల్పి రామ్ సుతార్ చేతుల మీదుగానే ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates