Political News

సాయిరెడ్డి సీటు ఖాళీగానే ఉంచారే.. విష‌యం ఏంటో ..!

విజ‌య‌సాయి రెడ్డి. వైసీపీ కీల‌క నాయ‌కుడు.అయితే.. ఇప్పుడు ఆయ‌న‌ లేని లోటు వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అన్ని తానే వ్యవహరించి, పార్టీని ముందుకు నడిపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వైసిపి వ్యవహారాలను భుజాన వేసుకుని చక్కదిద్దారు. జగన్ తర్వాత వైసీపీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి పేరు బాగా వినిపించేది. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెర‌మీదకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ 2014 -19 …

Read More »

వారివ్వ‌క‌పోతే.. మ‌న‌మే ఇద్దాం: రేవంత్ రెడ్డి

తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి పెద్ద ఇబ్బందే వ‌చ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లు వ్య‌వ‌హారం.. ఎటూ తేల‌క‌పోవ‌డం, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దీనిపై ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకోవ‌డంతో దీనిపై ఏం చేయాల‌న్న విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించుకోలేక పోతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేయించిన కుల గ‌ణ‌న‌లో రాష్ట్రంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నార‌ని తేలింది. దీంతో వారికి ప్రాధాన్యం పెంచుతూ.. బీసీల‌కు 42 శాతం …

Read More »

నిజమా?.. సీతక్కకు మావోల వార్నింగ్ లెటరా?

తెలంగాణ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ధనసిరి అనసూయా అలియాస్ సీతక్కకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. నిషేధిత మావోయిస్టుల నుంచి ఆమెకు బెదిరింపుల లేఖ వచ్చిందని, అందులో ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ముందుకు సాగితే తగిన మూల్యం చెల్లించక తప్పదని మావోలు సీతక్కను హెచ్చరించారట. ఈ విషయాన్ని సీతక్క కూడా ధృవీకరించారు. తనకు మావోయిస్టుల నుంచి లేఖ వచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన …

Read More »

ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఏబీఎన్ రాధాకృష్ణ ఎం చెప్పారు?

తెలంగాణలో పెను కలకలమే రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఇలా బయటకు వస్తున్న విషయాలను చూస్తుంటే… సమాజంలోని ఏ ఒక్క వర్గాన్ని కూడా నిందితులు వదలలేదని చెప్పక తప్పదు. తాజాగా శుక్రవారం వెలుగు చూసిన అంశంలో మీడియా సంస్థల అధినేతలను కూడా నిందితులు వదలలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ మీడియా సంస్థగా కొనసాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ …

Read More »

జ‌గ‌న్ పై ఇంకా సింప‌తీ రాలేదు

వైసిపి అధినేత జ‌గ‌న్‌ చేపట్టిన రెండు కార్యక్రమాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇవి రెండూ ఈ నెలలోనే జరగడం, రెండు ఘ‌ట‌నల్లోనూ పోలీసులు స్పందించిన తీరు వంటివి చర్చకు దారి తీశాయి. ఈ నేపద్యంలో సింపతి వస్తోందని, ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని వైసీపీ చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం ఇది సింపతి కాదు, ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్న …

Read More »

అన్నింటా పెట్టుబ‌డులే.. ఏపీపై మొగ్గెందుకు?

ఏపీలో పెట్టుబ‌డుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా.. దాదాపు అన్ని రంగాల్లోనూ పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక‌వేత్త‌లే కాకుండా.. ఐటీ రంగ దిగ్గ‌జ కంపెనీలు కూడా వ‌స్తున్నాయి. 500 కోట్ల నుంచి వేల కోట్ల వ‌ర‌కు కూడా కంపెనీలు ఏపీకి క్యూ క‌డుతున్నాయి. ప్ర‌భుత్వం కోరుతున్న కంపెనీలే కాకుండా.. కూట‌మి పాల‌న‌ను చూసి.. పెట్టుబ‌డులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని గ‌మ‌నించి చాలా కంపెనీలు ఏపీపై మ‌క్కువ …

Read More »

‘క్వాష్’ చేయ‌లేం.. జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు

“జ‌రిగింది సీరియ‌స్ ఘ‌ట‌న‌. ప్రాథ‌మిక ఆధారాల‌ను బ‌ట్టి కేసు క్వాష్ చేయ‌లేం. మంగ‌ళ‌వారం నిర్ణ‌యం తీసుకుంటాం. అప్పుడు ఏం జ‌రిగిందో పూర్తిగా వింటాం.” అని వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా వైసీపీ మాజీ మంత్రులు విడ‌ద‌ల ర‌జ‌నీ, పేర్ని నాని దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్ల‌పై హైకోర్టు స్ప‌ష్టం చేసింది. వ‌చ్చే మంగ‌ళ‌వారానికి విచారణ‌ను వాయిదా వేసింది. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు పిటిష‌న‌ర్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని పోలీసుల‌ను ఆదేశించింది. …

Read More »

గ్రామీణ ఏపీలో కూట‌మి మెరుపులు.. !

ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో కూట‌మి ప్ర‌భుత్వం మెరుపులు మెరిపిస్తోంది. గ‌తానికి ఇప్ప‌టికి భిన్నంగా అనేక మార్పులు క‌నిపిస్తున్నాయి. ర‌హ‌దారుల నుంచి మౌలిక వ‌స‌తుల వ‌ర‌కు.. అనేక విధాలుగా మార్పుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేసింది. త‌ద్వారా గ్రామీణ ఏపీ ముఖ చిత్రాన్ని మార్పు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు తోడు.. రాష్ట్ర స‌ర్కారు నిధులు కూడా జోడించి… గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలుక‌ల్పించ‌నుంది. క‌ల్పిస్తోంది. 1) జ‌ల్ …

Read More »

తుని తంటా: మా ‘సార్‌’ను ప‌ట్టించుకోండ‌బ్బా.. !

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి అంతకు ముందు ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసిన ప‌రాజ‌యం పాలయ్యారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభావం, వైసీపీ వ్యతిరేకత కారణంగా దివ్య భారీ విజయం నమోదు చేశారు. అయితే ఆమె సంగతి ఎలా ఉన్నా యనమల రామకృష్ణుడు పరిస్థితి మాత్రం డోలాయమానంలో …

Read More »

వైసీపీ విష‌యంలో బాబు ‘కాన్ఫిడెంట్‌’!

ప్ర‌తిప‌క్షం వైసీపీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎన్నిక‌ల‌కు నాలుగు సంవ‌త్స‌రాల ముందు నుంచే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు టార్గెట్ పెట్టుకుంది. దీంతో ప్ర‌జ‌ల‌ను మ‌రింత చైత‌న్య ప‌రిచి.. పుంజుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డం ప్రారంభించింది. దీనిని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు గ‌ట్టి వార్నింగే ఇస్తున్నారు. ఆ భూతాన్నిపాతిపెట్టేస్తాం.. ఇక‌, ఎప్ప‌టికీ ఆ భూతం బ‌య‌ట‌కు రాద‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇంత‌గా చంద్ర‌బాబుకు కాన్ఫిడెంట్ ఎలా వ‌చ్చింద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. స‌హ‌జంగా …

Read More »

టాప్ పోస్ట్ పై జగ్గారెడ్డికీ కోరికుందట!

తూర్పు జయప్రకాశ్ రెడ్డి అంటే పెద్దగా ఎవరికీ తెలియదేమో గానీ… జగ్గారెడ్డి అంటే మాత్రం అందరి కళ్ల ముందు తెల్ల గడ్డం రెట్టి ఇట్టే ప్రత్యక్షమైపోతారు. మనసులో ఏముందో దానిని దాచుకుని అవసరం వచ్చినప్పుడు, సమయం, సందర్భం చూసుకుని దానిని బయటపెట్టడంలో ఈయనకు అస్సలు చేత కాదు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా తన మనసులో ఏముందో దానిని బయటపెట్టేస్తూ అభాసుపాలు అవుతూ ఉంటారు. సంగారెడ్ది జిల్లా కేంద్రానికి చెందిన …

Read More »

ప్రత్యర్థుల పొగడ్తలు భలే కిక్కిస్తాయబ్బా!

నిజమే… ప్రత్యర్థుల నుంచి మనపై పొగడ్తలు వెల్లువెత్తితే…అంతకుమించిన సంతోషం మరొకటి ఉందడు. ఇక రాజకీయాల్లో అయితే ఆ పొగడ్తలు అందుకున్న నేత నిజంగానే ఆకాశంలో విహరించినట్టే ఉంటుంది పరిస్థితి. గురువారం తెలంగాణ రాజకీయాల్లో ఇదే జరిగింది. బీజేపీ సీనియర్ నేత, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి… నేరుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన ముందే…బహిరంగ వేదికపై ఆకాశానికెత్తేశారు. కొండా పొగడ్తలను అలా వింటూ సాగిన రేవంత్ చివరకు నమస్కారంతో …

Read More »