Political News

చంద్రబాబు, పవన్ కలిసి 22 సభలకు ప్లాన్!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నాహాలు మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జనవరి 5వ తేదీ నుంచి చంద్రబాబు ‘రా… కదలిరా’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘రా… కదలిరా’ పోస్టర్లలో టీడీపీ సైకిల్, జనసేన గ్లాసు గుర్తులు పక్కపక్కనే ముద్రించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు బహిరంగ సభలు …

Read More »

ఎంతెంత దూరం.. వైసీపీ బ్యాడ్ అవుతోంది ఇక్క‌డే!

ఏ నాయ‌కుడైనా.. చేజేతులా పార్టీని నాశ‌నం చేసుకుంటారా?  నాయ‌కుల‌ను వ‌దులు కుంటారా?  అంటే.. కాద‌నే చెప్పాలి. ఎందుకంటే.. పార్టీ అంటే.. జెండాలు, క‌ర్ర‌లు, నినాదాలే కాదు.. నాయ‌కులు!  కార్య‌క‌ర్త‌లు. ఈ రెండు లేకుండా ఎన్ని జెండాలు క‌ట్టినా.. ఎన్ని నినాదాలు ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేదు. ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఇలానే మారిపోయింది. నాయ‌కుల‌ను దూరం చేసుకుంటున్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను కాద‌నే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఒక‌ప్పుడు… లోట‌స్ పాండ్‌లో పార్టీ కార్యాల‌యం ఉంటే.. …

Read More »

ఏపీసీసీ చీఫ్ గా షర్మిల?

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి లేదా ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో కీలక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీగా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిలతోపాటు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాలని షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో, అదే రోజున …

Read More »

ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. రంగు ప‌డేదెవ‌ర‌కి?

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా! అన్న‌ట్టుగా మారింది వైసీపీలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప‌రిస్థితి. ఇద్ద‌రూ ఒకే పార్టీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇద్ద‌రూ ఒకే పార్ల‌మెంటు ప‌రిధిలోనూ ఉన్నారు. కానీ, ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఇది ఎంత వ‌ర‌కు వెళ్లిందంటే.. ఎన్నిక‌ల్లో ప‌ర‌స్ప‌రం ఫిర్యాదులు చేసుకునే దాకా చేరుకుంది. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌ద్ద‌ని.. ఒరంటే, కాదు, ఆయ‌నకే టికెట్ …

Read More »

మంత్రి గారి వియ్యంకుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ!

ఆయ‌న మంత్రిగారికి వేలు విడిచిన వియ్యంకుడు. చాలా దూర‌పు బంధువే.. అయినా.. రాజకీయంగా చూస్తే మాత్రం చాలా ద‌గ్గ‌ర సంబంధాలే ఉన్నాయి. దీంతో స‌ద‌రు నాయ‌కుడు.. మంత్రిగారి ప్రొద్బ‌లంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ పెడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం ట్రై కూడా చేసేస్తున్నారు. దీంతో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ కాక పెరిగిపోయింది. మ‌రి ఆ విశేషాలు.. తెలుసుకుందామా! ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చోడ‌వ‌రం. ఇక్క‌డ నుంచి …

Read More »

ఎస్టీ స్థానాల్లో లెక్క‌కు మించిపోయారుగా!

సాధార‌ణంగా ఎస్టీ అసెంబ్లీ స్థానాలను తీసుకుంటే.. అది ఏ పార్టీ అయినా.. పోటీ చేసేందుకు నాయ‌కుల సంఖ్య పెద్ద‌గా ఉండేది కాదు. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే పోటీ ప‌డేవారు. వారిలోమెరుగైన వారిని పార్టీలు ఎంపిక చేసుకుని టికెట్లు ఇచ్చేవి. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌దు కాబ‌ట్టి.. ఎస్టీల్లో నే పోటీ కూడా ఉండేది. కొన్ని క‌ట్టుబాట్లు.. కొన్ని ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా మిగిలిన నాయ‌కులు స‌ర్దుకు …

Read More »

రెండో వికెట్ పడుతోందా?

అధికారపార్టీలో జరుగుతున్న మార్పుల కారణంగా తొందరలోనే రెండో వికెట్ పడిపోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. రెండో వికెట్ ఎవరిదంటే ఎమ్మిగనూరు ఎంఎల్ఏ ఎర్రకోట చెన్నకేశవరెడ్డిదనే ప్రచారం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటం లేదని ఇదివరకే ఎంఎల్ఏ ప్రకటించారు. అయితే టికెట్ తన కొడుక్కి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని అడిగారు. అందుకు ఇపుడు జగన్ నో చెప్పారట. దాంతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. …

Read More »

బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఫిట్టింగ్ పెట్టిందా?

నీవు నేర్పిన విద్యయే అన్న పద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. అందుకనే మంత్రుల పర్యటనల్లో కావాలనే ప్రోటోకాల్ వివాదాన్ని తెస్తోంది. ప్రటోకాల్ పాటించటంపై తొందరలోనే కోర్టులో కేసులు వేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే జనగామ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు. ఆ సమీక్షలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఓడిపోయిన కాంగ్రెస్ నేతను కూడా మంత్రి వేదిక …

Read More »

అసమ్మతి నేతలపై వేటు తప్పదా ?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, జరిగిన డెవలప్మెంట్ల ఆధారంగా అసమ్మతి నేతలపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో బాగంగానే ఢిల్లీనుండి వచ్చి సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసమ్మతిపై వేటు వేయటంలో స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతిని మొగ్గలోనే తుంచేయటంలో భాగంగా ఎంతటి నేతలైనా సరే ఉపేక్షించవద్దని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అమిత్ షా స్పష్టంగా …

Read More »

నెలాఖరులోపు మరో మహాలక్ష్మి

ఈనెలాఖరులోగా మరో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తేవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. పథకం అమలుకు విధివిధానాలను రెడీచేయాలని ఉన్నతాధికారులకు రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రు. 2500 ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవటంలో భాగంగానే ఈనెలాఖరుకల్లా పథకం అమల్లోకి వచ్చేయాలన్నది రేవంత్ ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో లోక్ సభ ఎన్నికలకు …

Read More »

ఆ స్థానం నుంచి పోటీ చేయను: కేశినేని నాని

టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి కొద్ది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తన తమ్ముడు చిన్నితో విభేదాల నేపథ్యంలో…పార్టీలో చిన్నికి ప్రాధాన్యత పెరిగిన కారణంతో పార్టీకి నాని కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అడపాదడపా చంద్రబాబుతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కనిపించినప్పటికీ గతంలో ఉన్నంత యాక్టివ్ గా పార్టీలో నాని లేరన్నది బహిరంగ రహస్యమే. అయితే, తన తనయురాలు కేశినేని శ్వేతను విజయవాడ …

Read More »

మెట్రో లైన్ల ఖర్చుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో మెట్రో, ఫార్మాసిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో మార్గాన్ని తగ్గిస్తామని ఆయన వెల్లడించారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉందని, ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీ …

Read More »