ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న అమరావతి రాజధాని వ్యవహారంలో ఇటీవల కొన్నాళ్లుగా సమస్యలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అదే.. రాజధానికి అదనపు భూ సమీకరణ. ప్రస్తుతం అమరావతిలో ప్రభుత్వానికి 33 వేల ఎకరాల ల్యాండు బ్యాంకు ఉంది. అయితే.. భవిష్యత్తు అవసరాల కోసం అంటూ.. మరో 44 వేల ఎకరాలను సమీకరించేందుకు సర్కారు రెడీ అయింది. ఇదే వివాదానికి దారితీసింది. …
Read More »ఏడాది దాటింది.. జనసేన ‘రివ్యూ’ చేసిందా ..!
అధికారంలోకి వచ్చిన పార్టీకి ఎప్పటికప్పుడు రివ్యూ అవసరం. ఎందుకంటే.. తప్పులు ఎక్కడైనా జరుగుతుంటే.. వాటిని సరిదిద్దుకునేందుకు.. నాయకులను లైన్లో పెట్టుకుని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ఈ రివ్యూ దోహద పడుతుంది. అందుకే.. టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా రివ్యూలు చేస్తారు. ఐవీఆర్ఎస్ సహా.. ఇతర మాధ్యమాల్లో ప్రజల నుంచి కూడా పార్టీ నేతలపై అభిప్రాయాలు తెలుసుకుంటారు. తద్వారా తప్పులు జరిగిన చోట సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. దీనిని కొందరు …
Read More »దిగజారి బ్రతకలేనంటోన్న రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత పోరు కొత్త కాదు. అయితే, ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనప్పటి నుంచి సీనియర్ నేతలు అందరూ కాస్త గుర్రుగా ఉన్నారు. ఇక, మంత్రివర్గ విస్తరణ సమయంలో కొంతమంది సీనియర్ నేతలను, కాంగ్రెస్ వాదులను కాదని కొత్త వారికి మంత్రి పదవులివ్వడం కూడా చాలామందికి నచ్చలేదు. ఆ జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో కొంతకాలంగా …
Read More »టీడీపీ ముచ్చట: నియోజకవర్గాలకు జోష్.. !
టీడీపీ నాయకులు సంబరాలు చేసుకునే వార్త ఇది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యకు తాజాగా పార్టీ అధినే త, సీఎం చంద్రబాబు పరిష్కారం చూపించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇప్పటి వరకు కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. అయితే.. నియోజకవర్గ స్థాయిలో ప్రధాన కార్యాలయంతోపాటు.. అనుబంధంగా ప్రధాన మండలాల్లో కార్యాలయాలు నిర్మించుకోవాలని సీనియర్లు కోరుతున్నారు. ప్రస్తుతం అద్దె …
Read More »‘అమరావతి’ కోసం స్వేదం చిందిస్తారా? అద్భుత చాన్స్!
ఏపీ రాజధాని.. అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. 33 వేల ఎకరాలకు తోడు మరో 44 వేల ఎకరాలను కూడా సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు వారు తాము పుట్టిన నేలకు రుణం తీర్చుకునే అవకాశాన్ని కూడా చంద్రబాబు కల్పిస్తున్నారు. సహజంగానే చాలా మంది పుట్టి పెరిగిన నేలకు ఏమైనా చేయాలని భావిస్తారు. వారి వారి సొంత ప్రాంతాల్లో ఏదో ఒక కార్యక్ర మం ద్వారా …
Read More »‘బూతు నేతలు ఓడిపోయారు.. ఇంక రారు’
మాజీ ఉప రాష్ట్రపతి.. వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బూతులు మాట్లాడిన బూతు నేతలు.. గుండుగుత్తగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఇక, వారు మళ్లీ గెలుస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. బూతులు మాట్లాడేవారిని పోలింగ్ బూత్ల ద్వారా ప్రజలే నిలువరిస్తున్నారని చెప్పారు. తాజాగా హైదరాబాద్లో ‘విలీనం-విభజన’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయాల్లో …
Read More »మోడీతో ఢీ అంటే ఢీ అన్న.. సత్యపాల్.. కన్నుమూత
సత్యపాల్ మాలిక్.. జమ్ము కశ్మీర్ కు కొన్నాళ్ల కిందటి వరకు గవర్నర్గా పనిచేశారు. మంగళవారం అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గతంలో లోక్సభ, రాజ్యసభ సభ్యుడి గా కూడా పనిచేసిన సత్యపాల్ మాలిక్.. రెండే మూడు మాసాల కిందటి వరకు జాతీయ మీడియా లో ప్రధా న వార్తగా నిలిచారు. గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఇంట్లో రెండు వారాల కిందట సీబీఐ అధికారులు …
Read More »అమరావతికి రియల్ ఎస్టేట్ బూమ్… !
అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంది. 2014 -2019 మధ్య భారీ ఎత్తున అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భారీగానే సాగాయి. పెద్ద ఎత్తున వెంచర్లు కూడా పడ్డాయి. అంతేకాదు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేయాలని భావించారు. అలాగే వెంచర్లలో ఫ్లాట్లను కూడా కొనుగోలు చేశారు. దీంతో అప్పట్లో రియల్ ఎస్టేట్ భారీ …
Read More »బాబు ఆరా: వారు సాయం చేస్తున్నారా.. సెగరేపుతున్నారా.. ?
గత వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పుకొనే ఉన్నతాధికారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఉపశమనం కలిగింది. వారికి గత ప్రభుత్వంలో నిలిపివేసిన అనేక ప్రయోజనాలను ప్రస్తుతం అందించారు. అంతేకాదు.. వారిలో ఒకరిద్దరికి కీలక పదవులు కూడాఇచ్చారు. అయితే.. వారు సదరు పదవులు తీసుకోలేదు. పైగా.. ఒకరు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. కానీ, ఇది ప్రకటించిన తర్వాత.. సదరు అధికారి ప్రాధాన్యం కోల్పోయారు. దీంతో ఇప్పుడు …
Read More »డెవలప్మెంట్ కసి: పరుగులు పెడుతున్న ఫస్ట్టైమ్ ఎమ్మెల్యే.. !
ఆయన తొలిసారి విజయం దక్కించుకున్నారు. దీంతో పనులు పెద్దగా చేయకపోయినా.. ఎవరూ అడగరు. పైగా.. ఐదుసార్లు గతంలో గెలిచిన ఓ నాయకుడిపై తప్పులు మోపి.. తాను తప్పించుకునేందుకు అవకాశం కూడా ఉంది. అయినా.. సదరు ఎమ్మెల్యే మాత్రం చూస్తూ కూర్చోవడం లేదు. ఎదుటి వారి తప్పులు ఎంచడం కూడా తగ్గించారు. తాను పనిచేసుకుని పోతున్నారు. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆయనే.. గుడివాడ ఎమ్మెల్యే …
Read More »వైసీపీ ప్రచారం పై బాబు నివేదిక ఏమంటుందంటే
“ఔను.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ దాదాపు 99 శాతం మందికి అందింది” అని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు నివేదికలు పంపారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం, ఈ పథకం అమలైన తర్వాత 48 గంటల్లో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో అధికారులు జిల్లాల స్థాయిలో రిపోర్టులను పరిశీలించి, నివేదికను సీఎం కార్యాలయానికి పంపించారు. ఎందుకు? అన్నదాత సుఖీభవ–పీఎం …
Read More »ఆయనో లిల్లీపుట్.. ఆయన వెనక పెద్ద నేత: కవిత
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో నానాటికీ ముసురు ముదురుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం సొంత పార్టీపై… ప్రత్యేకించి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డిని లిల్లీపుట్ నేత అంటూ వ్యాఖ్యానించిన కవిత, ఆ లిల్లీపుట్ నేత కారణంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates