Political News

8 రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్.. ఏం చేస్తున్నారు?

ఔను! ఇప్పుడు ఇదే ప్ర‌శ్న తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి ఎనిమిది రోజులైంది.(గురువార‌మే ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు) వాస్త‌వానికి ఆయ‌న సెప్టెంబ‌రు 1న ఢిల్లీకి వ‌చ్చారు. త‌ర్వాత 8 రోజులు ఢిల్లీలో నే ఉన్నారు. ఈ ఎనిమిది రోజుల్లో ఆయన హడావుడిగా పాల్గొన్న కార్యక్రమాలేవీ పెద్దగా కనిపించలేదు. ఢిల్లీకి చేరుకున్న రెండు రోజులు మాత్ర‌మే …

Read More »

మ‌ళ్లీ అదే డిమాండ్‌.. రాహుల్ గాంధీ ఈ సారైనా!

మోడీ ప్ర‌భ‌తో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు మొద‌లు కేంద్రంలో అధికారం కోల్పోయి రాష్ట్రాల్లో ప‌ట్టు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ ద‌య‌నీయంగా మారుతోంది. ఆ పార్టీని స‌మ‌ర్థంగా న‌డిపించే నాయ‌కుడే లేడు. ఇప్ప‌టికీ ఆ పార్టీకి అధ్య‌క్షుడూ లేడు. కానీ తాజాగా మ‌రోసారి రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌డిని చేయాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌డంలో ప‌దును పెంచడంతో పాటు పార్ల‌మెంట్‌లో విప‌క్షాల‌ను ఏకం …

Read More »

సీబీఐ తో కేసీఆర్ సర్కార్ కి రేవంత్ రెడ్డి షాక్..!

కేసీఆర్ సర్కార్ ని ఇరకాటంలో పెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. కేసీఆర్ సర్కార్ పై సీబీఐ కి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని…ఈ కుంభకోణం పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తన ఫిర్యాదు లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కుంభకోణా ల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల …

Read More »

స‌జ్జ‌ల బాధ్య‌త‌లేంటీ.. ఆయ‌న చేస్తున్న‌దేంటి.. -రఘురామ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి న‌ర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సొంత పార్టీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జ‌గ‌న్‌పై పాల‌న వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ త‌రచూ ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌లా మారార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి రెబ‌ల్‌గా మారిన ఈ ఎంపీ ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్, ఎంపీ విజ‌య సాయిరెడ్డి …

Read More »

వాళ్ల‌పై బాబు క‌న్నేశారా?

రెండు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం.. ఒక‌టికి రెండు సార్లు అధికారాన్ని చేప‌ట్టిన సామ‌ర్థ్యం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంతం. కానీ గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న నిల‌బ‌డ‌లేక‌పోయారు. ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ ఆ త‌ర్వాత ఢీలా ప‌డిపోయింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి మునుప‌టి వైభ‌వాన్ని క‌ట్ట‌బెట్టేందుకు బాబు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్నార‌ని …

Read More »

చిన్నమ్మకు ఎదురు దెబ్బ..100కోట్ల ఆస్తులు జప్తు..!

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చిన్నమ్మకు చెందిన దాదాపు రూ.100కోట్ల ఆస్తులను బినామీ చట్టం కింద ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. శ‌శిక‌ళ‌కు చెందిన ఆస్తుల‌ను ఆదాయ ప‌న్ను శాఖ బుధ‌వారం బినామీ లావాదేవీల నిషేధిత చ‌ట్టం కింద‌ అటాచ్ చేసింది. చెన్నై శివార్ల‌లోని ప‌య్య‌నుర్ గ్రామంలోని ఆస్తుల‌ను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. …

Read More »

మంత్రులుగా మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదులు

తాజాగా ఏర్పాటైన ఆఫ్ఘనిస్ధాన్ మంత్రివర్గాన్ని చూసి యావత్ ప్రపంచం భయపడిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే మంత్రులుగా నియమితులైన 33 మందిలో 14 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులే. వివిధ దేశాల్లో అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడి, వందలాది మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిలో 14 మంది ఇప్పుడు ఆప్ఘన్ మంత్రివర్గంలో మంత్రులు గా చలామణి అవబోతున్నారు. అంటే ఆప్ఘన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఏ దేశమైనా గుర్తేస్తే అలా …

Read More »

ఏపీ మంత్రుల్లో వీరి రూటు స‌ప‌రేటు!

YS Jagan Mohan Reddy

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రివ‌ర్గంలో ఉన్న కొంద‌రు చేస్తున్న వ్య‌వ‌హారం.. ప్ర‌బుత్వానికి త‌ల‌నొప్పి గా మారింది. వీరంతా సీనియ‌ర్లు కావ‌డం.. చేస్తున్న ప‌నులు విమ‌ర్శ‌ల‌కు దారితీయ‌డం.. తాజాగా మ‌రోసారి మంత్రుల‌పై చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌స్తుతం రాష్ట్రం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. క‌రోనా త‌ర్వాత‌.. ఆర్థిక ప‌రిస్థితి కూడా భారంగా మారింది. మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డంలో ఆల‌స్యం వంటివి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ స‌మ‌యం …

Read More »

చ‌వితి వేడుక‌ల‌కు హైకోర్టు ఓకే.. కానీ…!

రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించుకునే వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మండపాలు కట్టినా, గణపతి విగ్రహాలు పెట్టినా, నిమజ్జనం చేసినా కరోనా ప్రబలుతుంద‌ని పేర్కొంటూ.. ప్ర‌భుత్వం.. ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను బ‌హిరంగంగా నిర్వ‌హించుకునే అంశంపై నిషేధం విధించింది. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే ఏపీలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహం తరహాలో ఒకేచోట …

Read More »

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్ అసంతృప్తి..!

కీలకమైన హుజురాబాద్‌ ఉప ఎన్నికల హీట్ నడుస్తున్న సమయంలో.. కాంగ్రెస్ నుంచి అధికారిక టీఆర్ఎస్ కి జంప్ చేసిన నేత కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్ నుంచి హుజురాబాద్ అభ్యర్థిగా ఎంపిక అవుతాననే నమ్మకంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్లారు. కానీ.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా.. ఆ వెంటనే కొద్దిరోజుల్లోనే గవర్నర్‌ కోటాలో కౌశిక్‌ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్‌.. దీనిపై ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకున్న …

Read More »

ఆమెను దూరం పెట్టి.. ఆయ‌న‌ను ద‌గ్గ‌రికి తీసి!

క‌ర్నూలులో భూమా కుటుంబానికి ఎంతో పేరుంది. రాజ‌కీయంగా చూస్తే నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ కుటుంబానికి బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. కానీ ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే టీడీపీ భూమా కుటుంబాన్ని దూరం పెట్టే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌ను మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది. అఖిల ప్రియ‌ను దూరం పెట్టి ఏవీ సుబ్బారెడ్డిని ద‌గ్గ‌రికి తీసేందుకు బాబు …

Read More »

దిల్లీ ప‌ర్య‌ట‌న వెన‌క కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌

ఏ ప్ర‌యోజ‌నం లేనిదే రాజ‌కీయ నాయ‌కులు ఏం చేయ‌ర‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌గ్గ‌ర నుంచి అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం వ‌ర‌కూ ప్ర‌తి సంద‌ర్భంలోనూ త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మే నాయ‌కులు వ్యూహాలు ర‌చిస్తారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ ప‌ర్య‌ట‌న వెన‌క కూడా ఇలాంటి ప్ర‌ణాళికే దాగి ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అక్క‌డ గెలుపు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్‌ను …

Read More »