ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వేట మొదలైంది. గురువారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవ బాంబు పేలుడులో 170 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇంతే సంఖ్యలో జనాలు, సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడికి ఐఎస్ఐఎస్(ఐసిస్) తీవ్రవాదులే కారణమని అమెరికా అనుమానించింది. దీనికి తగ్గట్లే తామే పేలుడు జరిపినట్లు ఐసిస్-కే ప్రకటించుకుంది. దీంతో వెంటనే ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దృష్టిపెట్టింది. ఐసిస్ నేతలు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని అమెరికా అధ్యక్షుడు జో …
Read More »తగ్గేదేలే.. అంటోన్న రేవంత్
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చారనే ప్రచారాన్ని చేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ గత కొంతకాలంగా ఆ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. ఆ పార్టీ సీనియర్ నేతలూ తమ స్వరాన్ని గట్టిగా వినిపించలేకపోయారు. తమ పార్టీ వల్లే తెలంగాణ కల సాకారమైందని చెప్తున్నప్పటికీ ప్రజల ఆదరాభిమానాలను మాత్రం పొందలేకపోయారు.దీంతో గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ఇక ప్రతిపక్ష పార్టీగానూ ప్రభుత్వంపై …
Read More »చిక్కుల్లో ఏపీ హోం మంత్రి సుచరిత..!
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి సుచరిత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆమెపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.. సుచరిత ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలోనూ ఆమె అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె రిజర్వేషన్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ …
Read More »బాణం గురి తప్పిందా ?
తెలంగాణా రాజకీయాల్లో జగనన్న బాణం గురి తప్పిందనే చర్చలు పెరిగిపోతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా చెప్పుకుని వైఎస్సార్టీపీ ని పెట్టిన వైఎస్ షర్మిల పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. పార్టీ పెట్టకముందు షర్మిల గురించి అంత ఇంత అని ప్రచారం జరిగింది కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏమైందో తెలీదు కానీ అంత జావకారిపోయారు. పార్టీలో పేరున్న నేతలెవరూ చేరలేదు. ఎవరు చేరకపోగా అప్పటికే ఉన్న ప్రతాప్ రెడ్డి, …
Read More »విద్యార్ధులు.. తలా రు. 50 లక్షలు చెల్లించండి
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి ఇష్టపడని విద్యార్థుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తమిళనాడులో ఎంబీబీఎస్ చదివిన విద్యార్ధులు పీజీ అయిన తర్వాత కచ్చితంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తామంటు అండర్ టేకింగ్ ఇవ్వాలి. నిజానికి ఇలాంటి అండర్ టేకింగ్ లే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇవ్వాల్సుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తామని హామీ పత్రంపై సంతకం చేయాలి. మరికొన్ని రాష్ట్రాల్లో ఏమో రెండేళ్ళపాటు …
Read More »చంద్రబాబు తొత్తు రేవంత్..
సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే, రేవంత్ పై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డితో పాటు విపక్ష నేతల విమర్శలపై, మల్లారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా …
Read More »ఆ కామెంట్లు మన గురించేనంటావా.. వైసీపీలో గుసగుస..!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇటీవల కాలంలో ఉలికిపాటు ఎక్కువగా కనిపిస్తోంది. దేశం ఎక్కడ ఏం జరిగినా.. ఇక్కడ వైసీపీకి అంటగడుతున్న పరిస్థితి కనిపిస్తుండడంతో.. వైసీపీ నాయకులు పరస్పరం ఫోన్లు చేసుకుని .. ‘ఆ కామెంట్లు మనగురించేనంటావా?` అని గుసగుసలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓ వారం కిందట.. తెలంగాణ హైకోర్టు.. అక్కడి కేసీఆర్ సర్కారును ఒక విషయంలో నిలదీసింది. అక్కడ అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి సంబంధించి.. సరైన …
Read More »రేవంత్కు సీఎం కుర్చీ లేకుండా ఇదో మాస్టర్ స్కెచ్ ?
ఎవరికైనా ఆశ ఉంటుంది. రాజకీయ నాయకులకు అయితే అది మహా లావుగా ఉంటుంది. ఇక పీసీసీ కిరీటం తగిలించుకుని తెలంగాణా అంతా కాలికి బలపం కట్టుకుని తిరిగేస్తున్న రేవంత్ రెడ్డికి కూడా సీఎం కావాలనే ఆశ ఉంటుంది. అందులో తప్పు లేదు కూడా. లేకపోతే తెల్లారి లేస్తే కేసీఆర్ ఆయన ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తూ ఒకటికి నాలుగు తిట్లు తింటూ రేవంత్ ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. …
Read More »ఏపీలో అప్రకటిత ముఖ్యమంత్రి ఆయనేనా?
జగన్ ప్రభుత్వంలో నెంబర్ వన్ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డే.. సర్వం తానే అయి.. ప్రబుత్వాన్ని నడిపించ నున్నారా? వచ్చే ఐదార్రోజుల పాటు.. ఆయనే అప్రకటిత ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారా? అంటే.. వైసీపీ నేతలు అటు ఔనని, ఇటు కాదని నిర్దిష్టంగా చెప్పలేక పోతున్నారు. అయితే.. ఇదే విషయంపై మాత్రం వారు కూడా గుసగుసలాడు తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబంతో సహా విహార యాత్రకువెళ్లారు. 25వ పెళ్లిరోజును …
Read More »టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై స్పందించిన రేవంత్..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో.. చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వారిపై ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. పలువురికి నోటీసులు కూడా అందాయి. కాగా.. ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని… కేటీఆర్ దగ్గరి వారికి… డ్రగ్స్ నోటీసులు వచ్చాయని …
Read More »ఎన్నారైలపై మోడీ వరాల వర్షం.. ఏం చేశారంటే
విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీపికబురు అందించారు. ఇప్పటి వరకు వారు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నారైలు భారత్కు వచ్చినప్పుడు.. వారు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. దాదాపు 6 నెలలు పట్టేది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అయితే.. ఇప్పుడు మోడీ సర్కారు ఈ విషయంలో కొంత సడలింపు ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్రం ఆదేశాల మేరకు …
Read More »అంబాసిడర్గా సోనుసూద్.. కేజ్రీవాల్ వ్యూహం అదే
కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్డౌన్ సమయంలో ఎంతోమంది ప్రజల కష్టాలను తీర్చిన నటుడు సోనుసూద్ దేవుడయ్యాడు. వలస కూలీలు మొదలు అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు సాయం చేస్తూనే ఉన్నారు. రోగులకు మందులు, ఆక్సిజన్.. ఆకలితో అలమటించిన పేదలకు అన్నం.. విద్యార్థులకు పుస్తకాలు, స్మార్ట్ఫోన్లు ఇలా అవసరాల్లో ఉన్నవాళ్లందరికీ అండగా నిలిచిన సోనుసూద్ను రియల్ హీరోగా దేశమంతా కీర్తించింది. ఓ వ్యక్తిగా ఇంతటి గొప్ప పనులు చేస్తున్న ఆయన.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates