రాజ్యాంగం భావస్వేచ్ఛ ఇచ్చింది. కానీ.. ఎవరి మీద పడితే వారి మీద మనసుకు తోచింది అనేందుకు కాదు. వ్యవస్థల మీద సహజసిద్ధంగా ఉండాల్సిన గౌరవ మర్యాదలు మిస్ కావటం ఆందోళన కలిగించే అంశం. సగటు రాజకీయ పార్టీల మీద ఏ రీతిలో అయితే రాజకీయ ఎదురుదాడులు ఉంటాయో.. అదే తీరులో న్యాయవ్యవస్థ మీద మండిపడటం.. అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం మంచిది కాదు. ఈ విషయాన్ని మర్చిపోతున్నప్పుడు.. పెద్ద …
Read More »ఏడాదిలో మొదటిసారి సీఎం జగన్ వెనుకడుగు!
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయ అంశం జగన్కు భారీ వ్యతిరేకతను తీసుకు వచ్చింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. జగన్పై హిందూ వ్యతిరేకి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ ఆస్తుల అంశంపై బీజేపీ, జనసేన సహా భక్తులు గళమెత్తారు. సోషల్ మీడియాలో పెద్దఎత్తున జగన్కు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భూములను విక్రయించాలని ఇంకా నిర్ణయించలేదని, …
Read More »హైటెక్ బాబు: 14 వేల మందితో ఆన్లైన్ మహానాడు
చంద్రబాబు అంటే టెక్నాలజీ గుర్తుకు వస్తుంది. టెక్నాలజీని అందుకోవడంలో టీడీపీ అధినేత ముందుంటారు. తెలుగుదేశం పార్టీకి మహానాడు ఈ పార్టీకి పెద్ద పండుగ. ఎన్టీఆర్ జయంతి మే 28 కలిసి వచ్చేలా ప్రతి ఏడాది మూడు రోజులు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈసారి బుధ, గురువారం నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతంలో వలే భారీ సభలు ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. దీంతో పార్టీ చరిత్రలో తొలిసారి వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నారు. …
Read More »మారటోరియం, మళ్లీ వడ్డీనా..
కరోనా-లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయం, పని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడ్డ నేపథ్యంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో మారటోరియంకు అవకాశమిచ్చింది రిజర్వ్ బ్యాంకు. మూడు నెలల పాటు ఈఎంఐలు వాయిదా పడ్డాయని సంతోషించారు జనాలు. కానీ ఈ మూడు నెలల ఈఎంఐని అసలులోకి కలిపేసి దాని మీద వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించడం.. చివర్లో అదనంగా మూడు నెలలు కాకుండా ఏడెనిమిది నెలల …
Read More »మళ్లీ భయానకం… హైదరాబాదు దాటిన కరోనా!
తెలంగాణ మొత్తం విజృంభించిన కరోనాను ప్రభుత్వం సమర్థంగా కంట్రోల్ చేసి రూరల్ తెలంగాణ నుంచి నిర్మూలించగలిగింది అని అందరూ అనుకున్నారు. అది జరిగి ఉండొచ్చు కూడా. అయితే, తెలంగాణ మొత్తం ప్రయాణాలకు అనుమతి ఇచ్చినపుడు హైదరాబాదులో ఉన్న కరోనా జిల్లాలకు వ్యాపించకుండా ఉండే అవకాశమే లేదు. అదే నిజమైంది. రెండో దశలో ఈరోజు కరోనా జిల్లాలకు వ్యాపించింది. మెల్లగా తగ్గుతూ వచ్చి ఇంతకాలం హైదరాబాదులో మాత్రమే నమోదైన కేసులు ఈ …
Read More »హైకోర్టుపై ఆరోపణలు, సుమోటోగా స్వీకరించి 49 మందికి నోటీసులు
హైకోర్టును, హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈకేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు49 మందికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో వైసీపీ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. వరుసగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు కావడంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు కోర్టు తీర్పులను తప్పుపట్టారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ …
Read More »రాహుల్ గాంధీ.. మరోసారి నోరు జారాడా
ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇండియా మొత్తంలో లక్షా 50 వేల దాకా కేసులుంటే.. 50 వేల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అక్కడ కొన్నాళ్లుగా రోజూ వంద మందికి తక్కువ కాకుండా చనిపోతున్నారు. లాక్ డౌన్ను సమర్థంగా అమలు చేయడంలో, ప్రజల్ని జాగృతం చేయడంలో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని పక్కాగా అనుసరించడంలో శివసేన-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించడం …
Read More »సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్కు షాక్
తమ సంస్థకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు చుక్కెదురైంది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని.. విచారణ హైకోర్టు, ఎన్జీటీలే చూసుకుంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టెరీన్ గ్యాస్ లీక్ కారణంగా ఇద్దరు పిల్లలు సహా 12 మంది …
Read More »హెచ్ 1బీ వీసా జారీలో మార్పులకు కొత్త బిల్లు.. ఏమవుతుంది?
దేశం ఏదైనా కానీ రాజకీయం మాత్రం ఒక్కటే. అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీలు పని చేస్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలోకి విదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించే కన్నా.. దేశంలోని వారికే ఎక్కువగా ఛాన్సులు ఉండాలన్న వాదన బలపడుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్ 1బీ.. ఎల్ 1 వీసా జారీ విధానంలో మార్పులు కోరుతూ తాజాగా ఒక బిల్లును చట్టసభల్లోకి తీసుకొచ్చారు. అమెరికాలోని …
Read More »భయం గొల్పుతున్న ముంబయి హాస్పిటల్ ఫొటో
లాక్ డౌన్ సడలింపులు వచ్చేశాయి. జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ప్రయాణాలు సాగిపోతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు తిరిగేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా ప్రభావం బాగా తగ్గిపోయిందని అనుకోవాలి. కానీ ఆ మహమ్మారి అత్యంత ప్రభావం చూపిస్తున్నది ఇప్పుడే. రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాల స్థాయికి భారత్ వచ్చేసింది. నిన్నట్నుంచి 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఆరు వేలకు పైగా కేసులు, 150 దాకా …
Read More »ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ ?
ఏపీలో మళ్లీ రాజకీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈరోజు రేపట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా? సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఇద్దరు టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. వారు వైసీపీలో చేరకపోయినా… కండువా కప్పుకోకపోయినా మానసికంగా వైసీపీలో చేరిపోయారు. ప్రభుత్వానికి అన్నింటా మద్దతు పలుకుతున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. పరుచూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె …
Read More »శ్రీవారి లడ్డూ ప్రసాదానికి యమా క్రేజ్, గంటల్లో లక్షల విక్రయం
తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాగా కేవలం మూడు గంటల్లో 2.4 లక్షల లడ్డూల విక్రయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడేవారు ఎంతోమంది. వారందరి కోసం ఈ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే గుంటూరు టీటీడీ కళ్యాణ మండపం రెడ్ జోన్లో ఉండటంతో అక్కడ మినహా మిగతా పన్నెండు జిల్లాల్లో విక్రయాలు జరిగాయి. గుంటూరులో …
Read More »