కరోనా సమయంలో రవాణా సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు మండలం రమణక్కపేటకు చెందిన దుర్గ అనే గర్భిణీ రవాణా సౌకర్యం లేని కారణంగా రోడ్డుమీదే ప్రసవించింది. ఆమె తిరువూరులోని తన సోదరి ఇంటికి వచ్చింది. మంగళవారం పురిటి నొప్పులు రావడంతో 108కి ఫోన్ చేశారు. ఓవైపు చాలాసేపటి వరకు రాకపోవడం, మరోవైపు ప్రయివేటు వాహనాలు లేకపోవడంతో ఆసుపత్రికి నడుస్తూ బయలుదేరింది. …
Read More »జగన్ కీలక నిర్ణయం.. మోపిదేవి సీటు పెన్మత్సకు
ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ బరికి వైసీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఈ నెల 24న జరగనున్న ఈ ఎన్నికలో వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, సోమవారం కన్నుమూసిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు పెన్మత్స సురేశ్ బాబు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు మంగళవారం జగన్.. పెన్మత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. విజయనగరం జిల్లాకు …
Read More »హైదరాబాద్ కాకుండా అమరావతికే ఆ చాన్స్ ఉందట!
కొద్దికాలం కిందటి వరకు హాట్ హాట్గా జరిగిన చర్చ ప్రస్తుతం మళ్లీ తెరమీదకు వచ్చింది. దేశానికి రెండో రాజధాని చేయాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని అందులో ముఖ్యంగా హైదరాబాద్ను సీరియస్గా గమనిస్తోందనేది ఆ ప్రచారం సారాంశం. అయితే, ఎంత వైరల్ అయిందో అంతే వేగంగా తెరమరుగు అయిపోయింది. అయితే, మళ్లీ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఓ నాయకురాలి డిమాండ్ రూపంలో మాత్రమే. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు …
Read More »మోడీ ఇమేజ్ ను తమ ఖాతాలో వేసుకుంటున్న 11 రాష్ట్రాలు
రాజకీయాన్ని చదరంగంగా పోల్చేవారెందరో. ఇక్కడ ఎవరికి ఎవరి మీదా ప్రత్యేకమైన అభిమానాలు.. ప్రేమలు ఉండవు. అలా ఉన్నట్లు కనిపిస్తే.. అదంతా మాయనే. ఒకవిధంగా చెబితే.. అదే అసలుసిసలు రాజకీయంగా చెప్పాలి. రాజకీయాల్లో ఒకరి క్రెడిట్ ను మరొకరు తమ ఖాతాలో వేసుకోవటం మామూలే. కేంద్రం అమలు చేసే పథకాల్ని తమ ఖాతాలో వేసుకోవటం.. తరచూరాష్ట్రాలు చేసేవే. తాజాగా ఆ విషయం మీదన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కు కోపం వచ్చింది. …
Read More »బిగ్ బ్రేకింగ్ – రాజధాని తరలింపు వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కల మరోసారి వాయిదా పడింది. కోర్టుల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో మరీ ఈ 16వ తేదీ కి విశాఖపట్నంలో రాజధాని పనులు ప్రారంభించడం గాని, తరలించడం గాని దాదాపు అసాధ్యం అని నిశ్చయించుకున్న ఏపీ సర్కారు దీనిపై ఒకడుగు వెనక్కు వేసింది. విశాఖలో పరిపాలన రాజధాని శంకుస్థాపన అధికారికంగా వాయిదా పడింది. సుప్రీం, హైకోర్టుల్లో కేసులుండటం… వాటిలోవాదోపవాదాలు, వాయిదాల నేపథ్యంలో అనుకున్నంత …
Read More »రేవంత్కు కాంగ్రెస్లో అసలైన ప్రత్యర్థి ఈయనే
జగ్గారెడ్డి… సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ నేతగా ముద్రపడిన నాయకుడు. తనదైన శైలిలో దూకుడు రాజకీయానికి పెట్టింది పేరయిన జగ్గారెడ్డి దాదాపు గత ఏడాదిగా…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎప్పుడు విరుచుకుపడతారో…ఎప్పుడు విమర్శలు పక్కన పెట్టి ప్రశంసలు కురిపిస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలనే పేర్కొంటూ ఒకవేళ అలా చేయకపోతే రైతుబంధు పథకం వర్తించబోదని కీలక ప్రకటన చేసిన అనంతరం..అప్పటివరకు కేసీఆర్ను …
Read More »ఏపీ ప్రభుత్వంపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య నీటి వాటా పంపకాలు, ప్రాజెక్టుల విషయంలో కయ్యం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడుకుండా చెయ్యాల్సిందేదో చేసుకుపోతుంటే.. దీనిపై కోర్టులను ఆశ్రయించడమే కాక నేరుగా ఘాటు విమర్శలకూ సిద్ధమయ్యారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. జగన్ తనకు మిత్రుడే కానీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే రాజీ పడేది లేదంటూ తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక …
Read More »మళ్లీ వైసీపీలోకి చలమలశెట్టి.. ఈ సారైనా పని జరిగేనా?
చలమలశెట్టి సునీల్… విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తగా తెలుగు ప్రజలకు సుపరిచితులే. వ్యాపారంలో రారాజుగా ఎదిగినా… రాజకీయాల్లో మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. ఎంపీ కావాలన్న తన చిరకాల వాంఛ 15 ఏళ్లకుపైగానే వాయిదా పడుతూనే వస్తోంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడికి మల్లే చలమలశెట్టి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్టీ ఏదన్న విషయాన్ని పక్కనపెట్టేసిన చలమలశెట్టి… ఎంపీ కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే చాలా అడుగులు వేశారు. …
Read More »మూడు రాజధానులపై జగన్ స్పీడ్.. సుప్రీంకు లేఖ
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఇకపై ఏమాత్రం ఆలస్యం వద్దన్న రీతిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు కదులుతోంది. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే.. వాటిపై రాజపత్రాలను జారీ చేసిన జగన్ సర్కారు… కోర్టుల్లో పిటిషన్ల వల్ల కొనసాగుతున్న జాప్యానికి చెక్ పెట్టేలా చర్యలు షురూ చేసింది. ఇందులో భాగంగా వికేంద్రీకరణపై హైకోర్టు విధించిన స్టేటస్ …
Read More »ఇండియన్ కరోనాను జగన్ ఎదుర్కోగలరు: బీజేపీపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్య
ఏపీ మంత్రి కొడాలి నాని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీని కూడా కరోనాతో పోలిస్తూ విమర్శలు గుప్పించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా తీవ్రంగానే స్పందించింది. మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు ఆదరించారని, అందుకే ఓ చోట …
Read More »మార్గదర్శి కేసు ముగియలేదు… రామోజీకి సుప్రీం నోటీసులు
మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. రామోజీతో పాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకు, మాజీ ఐజీ కృష్ణంరాజులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వెరసి గతంలో రామోజీని నానా ఇబ్బందులు పెట్టిన ఈ కేసు అప్పుడే ముగియలేదన్న …
Read More »ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్
నందమూరి అభిమానులందు ఎన్టీఆర్ అభిమానులు వేరు. ఒకప్పుడు అంతా ఒక్కటే అన్నట్లుండేది కానీ.. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2009లో ఎన్నికల్లో ఎన్టీఆర్ ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఆ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని అతడి మీద ఒక నెగెటివ్ ముద్ర వేసి పక్కన పెట్టేశారు. ఇక అప్పట్నుంచి ఇటు బాలయ్యకు, అటు చంద్రబాబుకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు. వాళ్లూ ఇతణ్ని పక్కన పెడుతున్నారు. రెండు …
Read More »