కాపు నాయకుడు వంగవీటి రంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఏపీ ప్రభుత్వం 2+2 గన్మెన్లతో భద్రత కల్పించింది. ఇటీవల రంగా వర్ధంతి సందర్భంగా.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్య లు చేశారు. తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఈ విషయాన్ని సీఎం జగన్.. కు చేరవేశారు. ఈ నేపథ్యంలో రాధాకు భద్రత …
Read More »చెరోవైపు KCRను వాయించేస్తున్నారుగా ?
కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇద్దరికి ఇద్దరే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక ఆందోళన పేరుతో చెరో వైపు కేసీయార్ కు ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు. ఇద్దరు సోమవారం ఒకేసారి వేర్వేరు అంశాలపై ఆందోళనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం పేరుతో రేవంత్ ఎర్రవెల్లిలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. అయితే జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులకు, రేవంత్+ కాంగ్రెస్ …
Read More »బీజేపీకి బంపరాఫర్ ఇచ్చిన కొడాలి
మంత్రి కొడాలి నాని బీజేపీకి చాలా పెద్ద సవాలే విసిరారు. మంత్రి విసిరిన ఛాలెంజ్ అలాంటిలాంటి చాలెంజ్ కాదు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 నుంచి 20 సీట్లలో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటుందా ? అంటూ నిలదీశారు. నాని చెప్పినట్లు 20 శాతం సీట్లంటే మొత్తం 175 సీట్లలో 35 సీట్లు మాత్రమే. అంటే నాని చెప్పినట్లుగా బీజేపీ 35 సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు కమలం పార్టీని గొప్ప …
Read More »మంగళగిరి సీటుపై లోకేష్ ఫోకస్
టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికల్లోనే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీలో కీలక పదవిలో ఉండి.. మంత్రిగా కూడా ఉన్న లోకేష్కు తొలి ఎన్నికలే పీడకలగా మారాయి. ఆ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు లోకేష్ కూడా 6 వేల ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. వైసీపీ తనను ఓడించేందుకు ప్రత్యేకంగా పన్నిన వ్యూహంలో లోకేష్ …
Read More »జగన్ సర్కారుకు హైకోర్టులో ఊరట
ఏపీలోని వైసీపీ సర్కారుకు చాలా నాళ్ల తర్వాత.. హైకోర్టులో ఊరట లభించింది. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడం.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం.. అక్కడ హైకోర్టు ముందు ప్రభుత్వం డీలా పడుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట.. హైకోర్టును , న్యాయమూర్తులను కూడా వైసీపీ నేతలు దూషించడం.. దీనిపైనా కేసులు నమోదు కావడం.. సీబీఐ విచారణ కూడా కొనసాగుతుండడం …
Read More »జగన్ బెయిల్.. వాదనలు సమాప్తం
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వైసీపీ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ తరఫున న్యాయవాది శ్రీ వెంకటేశ్ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో జగన్కు నోటీసులు ఇవ్వాలని కోరారు. బెయిల్ రద్దు పిటిషన్పై వైఖరి ఏమిటని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ …
Read More »జగన్ ప్రభుత్వం చేస్తోంది కరెక్టే కానీ..
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు థియేటర్ల మీద ఉక్కు పాదం మోపుతోంది. ఇప్పటికే టికెట్ల రేట్ల మీద నియంత్రణ తెచ్చిన సర్కారు.. తాజాగా థియేటర్లలో నిబంధనల అమలుపై నిఘా పెట్టింది. లైసెన్సులు రెన్యువల్ చేసుకోని, సేఫ్టీ నిబంధనలు పాటించని థియేటర్లపై కొరడా ఝులిపిస్తోంది. వరుసబెట్టి థియేటర్లను సీజ్ చేస్తోంది. ఇప్పటికే ఏపీలో 170-180 మధ్య థియేటర్లు క్లోజ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఐతే ఈ విషయంలో జగన్ సర్కారుకు విమర్శలు …
Read More »రచ్చబండకు దారి బంద్: రేవంత్రెడ్డి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ రోజు చేపట్టాలని భావించిన రచ్చబండ్కు ప్రభుత్వం అనుమతించలేదు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ రోజు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమయ్యారు. వరి సాగుతో పాటు అన్నదాతల సమస్యలపై గళమెత్తాలని నిర్ణయించారు. అయితే.. దీనికి అనుమతించని పోలీసులు రేవంత్ ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. …
Read More »ఆ వైసీపీ సీనియర్కు తిప్పలు.. ముగిసినట్టేనా?
రాజకీయాల్లో ఆయన సీనియర్. మాజీ మంత్రి కూడా. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లి.. తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చి.. తర్వాత.. వైసీపీ పంచన చేరారు. అయితే.. ఇటీవల కాలంలో మాత్రం ఆయన జాడ ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు ఒక వెలుగు వెలిగిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి రాజకీయాలు ఇక ముగిసినట్టేనా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విభజన సమయంలో కాంగ్రెస్లో ఉన్న …
Read More »అనుమానం ముందు.. తర్వాతే అడుగు
రాజకీయాలు మారుతున్నాయి. ఓ పాతికేళ్ల కిందటి రాజకీయాలకు ఓ పదేళ్ల కిందటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఇక, ఇప్పు డు జరుగుతున్న సంచలన రాజకీయాలకు.. ఓ పదేళ్ల కిందటి రాజకీయాలకు మరింత తేడా ఉంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా.. నాయకులు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణా మాలు.. ప్రజానాడికి అనుగుణంగా నాయకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాహసాలు చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది తర్వాత.. ముందు …
Read More »జగన్ ఇగో కొంప ముంచుతోందా?
ఆంధ్రప్రదేశ్లో మరే సమస్యా లేనట్లు సినిమా టికెట్ల వ్యవహారాన్ని నెత్తికెత్తుకుంది అక్కడి ప్రభుత్వం. ఇటు మంత్రుల, అటు అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై పెడుతున్న శ్రద్ధ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రి కూడా ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు ఏమనుకుని ఈ వ్యవహారంలో ప్రభుత్వం వేలు పెట్టిందో కానీ.. ఇప్పుడది ప్రభుత్వం మెడకు …
Read More »బీసీలపై బాబు ఫోకస్
దూరమైన బీసీలను మళ్ళీ దగ్గరకు చేర్చుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలంతా టీడీపీతోనే ఉన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనేంతగా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంతటి ముద్ర వేసేశారు. అలాంటిది 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వ్యవహార శైలి కారణంగా బీసీల్లో చీలికొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు తమ సంఘాల నేతలతో చంద్రబాబు వ్యవహరించిన తీరుతో మండిపోయిన బీసీలకు ఒళ్ళుమండిపోయింది. చంద్రబాబు మీద కోపాన్ని బీసీలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates